అన్వేషించండి

Breaking News Live: కరీంనగర్ లో ఇంటి మీదకు దూసుకెళ్లిన గ్రానైట్ లారీ 

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

Key Events
Telangana News live updates CM Jagan AP News Live on April 1 Friday Breaking News Live: కరీంనగర్ లో ఇంటి మీదకు దూసుకెళ్లిన గ్రానైట్ లారీ 
ప్రతీకాత్మక చిత్రం

Background

ఏపీ, తెలంగాణలో ఎండలు మరింత పెరగనున్నట్లుగా అమరావతి, హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు వెల్లడించాయి. అమరావతి వాతావరణ కేంద్రం ట్వీట్ చేసిన వివరాల ప్రకారం.. నేటి నుంచి ఏపీ వ్యాప్తంగా వాతావరణం పొడిగానే ఉంటుంది. మరోవైపు, మత్స్యకారులకు వచ్చే నాలుగు రోజులు ఎలాంటి హెచ్చరికలు లేవని అవరావతి వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. 

మరోవైపు, ఏపీలో 40 డిగ్రీలకు పైగా ఎండలు కాస్తున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్‌ వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. మార్చి నెలాఖరుకే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లోనూ సాధారణం కన్నా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. విజయనగరంలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని స్థానిక వాతావరణ కేంద్రం చెబుతోంది. రాయలసీమ జిల్లాలోనూ అదే పరిస్థితి ఉంది. మధ్యాహ్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచిస్తుంది. విజయవాడ, విశాఖలోనూ ఎండలు తీవ్రంగా ఉన్నాయి. ఇప్పటికే 40 డిగ్రీల గరిష్ట ఉష్టోగ్రతలు నమోదవుతున్నాయి.

కోస్తాంధ్ర ప్రాంతంలో కాస్త ఉష్ణోగ్రత తగ్గుదల: ఏపీ వెదర్ మ్యాన్
‘‘బలమైన సముద్రపు గాలుల వల్ల కోస్తాంధ్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టింది. మరో వైపున రాయలసీమ జిల్లాల్లో మాత్రం ప్రస్తుతానికి కూడ 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతోంది. ఇవి ఇలాగే మరో రెండు గంటల దాక కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో పక్కన ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మాత్రం ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా ఉంది. హైదరాబాద్ లో కూడ 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యింది.’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.

తెలంగాణ వెదర్ అప్‌డేట్స్..
తెలంగాణ రాష్ట్రంలో 40 డిగ్రీలకు పైగా ఎండలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా ఎండలు కాస్తున్న 6 జిల్లాలను వాతావరణ కేంద్రం గుర్తించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జ‌గిత్యాల, నిజామాబాద్, మంచిర్యాల జిల్లాల‌ల్లో తీవ్ర స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని హెచ్చరించింది. ఈ మేరకు వాతావ‌ర‌ణ శాఖ ఆ జిల్లాలకు ఆరెంజ్ అల‌ర్ట్ జారీ చేసింది. ప్రజలు ఎండ నుంచి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈ ఆరు జిల్లాలతో పాటు భ‌ద్రాద్రి కొత్తగూడెం, ఖ‌మ్మం, హైద‌రాబాద్‌లో 40 డిగ్రీల‌కు పైగా ఉష్ణోగ్రత‌లు న‌మోదు అవుతున్నాయని హెచ్చరించింది.

గడిచిన 24 గంటల్లో తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రత ఆదిలాబాద్ జిల్లాలో నమోదు కాగా, అత్యల్ప ఉష్ణోగ్రత కూడా అక్కడే నమోదైంది. అక్కడ గరిష్ఠ ఉష్ణోగ్రత 42.3 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 19.2 డిగ్రీలుగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఏప్రిల్ 4 వరకూ పూర్తిగా పొడి వాతావరణమే ఉంటుందని, ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదవుతాయని తెలిపింది.

20:49 PM (IST)  •  01 Apr 2022

కరీంనగర్ లో తప్పిన ప్రమాదం, ఇంటి మీదకు దూసుకెళ్లిన గ్రానైట్ లారీ 

కరీంనగర్ లోని శివ నగర్ ఏరియా రాంనగర్ బైపాస్ రోడ్డుపై గ్రానైట్ లారీ డివైడర్ ఢీ కొట్టి ఇంటి మీదకు దుసుకెళ్లింది. దీంతో నడిరోడ్డుపై భారీ సైజ్ గ్రానైట్ రాయి పడింది. జనాలు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. 

16:46 PM (IST)  •  01 Apr 2022

బంజారాహిల్స్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చిన్నారి మృతి, పొంతనలేని కారణాలు చెబుతున్న వైద్యులు 

హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లోని అంకుర్ ఆసుపత్రిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. 16 రోజుల పసికందు మృతి చెందాడు. ఊపిరితిత్తుల సమస్య ఉందని ఆసుపత్రి వైద్యులు గురువారం సాయంత్రం సర్జరీ చేశారు. తరువాత ముక్కులో నుంచి రక్తం వచ్చి చిన్నారి మరణించాడు. మరణానికి కారణం అడిగితే ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం చెబుతోందని చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు ఆవేదన చెందుతున్నారు. తమకు న్యాయం చేయాలని ఆసుపత్రి ముందు ధర్నాకు దిగారు. 

Load More
New Update
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget