అన్వేషించండి

TDP Leaders Protest: చంద్రబాబుకు మద్దతుగా తెలుగు రాష్ట్రాల్లో నిరసనలు

TDP Leaders Protest: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుపై తెలుగు రాష్ట్రాలు భగ్గుమంటున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ప్రజలు నిరసనలు చేపడుతున్నారు.

TDP Leaders Protest: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుపై తెలుగు రాష్ట్రాలు భగ్గుమంటున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ప్రజలు నిరసనలు చేపడుతున్నారు. శనివారం మధ్యాహ్నం గుంటూరులో మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ‘నేను సైతం-బాబు కోసం’ పేరుతో తెలుగు మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. శుభం కల్యాణ మండపం నుంచి చంద్రబాబుకు మద్దతుగా నిరసన ప్రదర్శన చేపట్టారు. నల్ల వస్త్రాలు ధరించి, నల్ల బెలూన్లు పట్టుకుని మహిళలు, వృద్ధులు, టీడీపీ కార్యకర్తలు నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. ‘బాబు తో నేను’ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా మహిళలు సీఎం జగన్‌పై మండిపడ్డారు. వేధింపుల్లో భాగంగానే చంద్రబాబును అరెస్టు చేశారని ధ్వజమెత్తారు. సైకో పోవాలి.. సైకిల్‌ రావాలి అంటూ నినాదాలు చేశారు. 

నరసరావుపేట నియోజకవర్గంలో బీసీ నాయకుల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. నరసరావుపేట నియోజకవర్గ ఇంచార్జ్ చదలవాడ అరవింద్ బాబు, నరసరావుపేట నియోజకవర్గ పరిశీలకుడు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ మోహన కృష్ణ రిలే దీక్షల్లో పాల్గొన్నారు. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో బీసీ నాయకుడు మస్తాన్ యాదవ్ ఆధ్వర్యంలో అర గుండుతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంతో మంది యువత భవిష్యత్‌కు బాటలు వేసిన చంద్రబాబును అరెస్ట్ చేయడం దారుణమన్నారు.  శ్రీకాకుళం జిల్లా పలాసలో టీడీపీ సీనియర్ నాయకుడు గౌతు శివాజీ, శిరీష, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు శాంతి యుతంగా నిరసన తెలిపారు. రిలే నిరాహార దీక్షల్లో పాల్గొన్నారు. పోలీసులు దీక్షను భగ్నం చేశారు. గౌతు శివాజీని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

చంద్రబాబుకు అండగా నిలుద్దాం 
చంద్రబాబునాయుడును వెంట‌నే విడుద‌ల చేయాలంటూ నెల్లూరు జిల్లా టీడీపీ నేతలు రిలే నిరాహార‌దీక్షలు, సంత‌కాల సేక‌ర‌ణ‌, ప్రార్థనలు చేపట్టారు. మాజీ మంత్రి పొంగూరు నారాయ‌ణ‌ నెల్లూరులోని నారాయ‌ణ మెడిక‌ల్ కాలేజీ క్యాంప్ కార్యాల‌యంలో డివిజ‌న్ ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లతో స‌మీక్షా స‌మావేశం నిర్వహించారు. త‌మ నాయ‌కుడు చంద్రబాబుకు తామంద‌రం అండ‌గా నిల‌వాల‌ని, ఆయ‌న్ని విడుద‌ల చేసేంత వ‌ర‌కు క‌లిసి క‌ట్టుగా పోరాడాల‌ని సూచించారు. ఈ స‌మావేశంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యద‌ర్శి కోటంరెడ్డి శ్రీ‌నివాసులురెడ్డి, నగర అధ్యక్షుడు మామిడాల మధు, టీడీపీ ముఖ్య నేత‌లు, కార్యక‌ర్తలు పాల్గొన్నారు.

చంద్ర బాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో గంటానాధం కార్యక్రమాన్ని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నిర్వహించారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపి, తెలుగుజాతి గౌరవాన్ని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన నారా చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ మంగళగిరి నియోజకవర్గంలోని మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్లో జరుగుతున్న దీక్షకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్ సంఘీభావం తెలిపారు. నెల్లూరు జిల్లా ఏఎస్ పేట దర్గాలో చంద్రబాబు విడుదల కావాలంటూ వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ప్రార్థనలు చేశారు.

రాష్ట్రానికి జగన్ రెడ్డి ఒక చీడపురుగుల పట్టిపీడిస్తూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని  కళ్యాణదుర్గం  నియోజకవర్గ  టీడీపీ ఇంచార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు అన్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గ ఎన్టీఆర్ భవన్ వద్ద నాలుగవ రోజు రిలే నిరాహార దీక్షలో ఆయన పాల్గొన్నారు. సీఎం జగన్ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఏ తప్పు చేయని చంద్రబాబును అక్రమ అరెస్టు చేసి జైలుకు పంపి పైశాచిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు. ప్రకాశం జిల్లా యర్రగొండ పాలెంలో నియోజకవర్గ ఇన్ చార్జి ఎరిక్షన్ బాబు రిలే దీక్షలు నిర్వహించారు.

 చంద్రబాబు నాయుడు అరెస్ట్‌కు నిరసనగా గిద్దలూరు పట్టణంలోని క్లబ్ రోడ్డులో తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు రిలే నిరాహారదీక్ష చేపట్టారు. మార్కాపురంలో మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. బాపట్ల జిల్లా పర్చూరు టీడీపీ కార్యాలయంలో టీడీపీ శ్రేణులు రిలే దీక్ష చేపట్టారు. వై జంక్షన్‌లోని ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేశారు.

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కొవ్వత్తుల ర్యాలీలు చేపట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు అధినేత అక్రమ అరెస్టను నిరసిస్తూ వివిధ జిల్లాల్లో భారీ ర్యాలీలు తీశారు. ఈ ర్యాలీల్లో మాజీ మంత్రులు, ఇతర రాష్ట్రస్థాయి లీడర్లు పాల్గొన్నారు.  చిలకలూరిపేటలో కొవ్వత్తుల ర్యాలీ నిర్వహించారు. స్థానిక కార్యకర్తలు నిర్వహించిన కార్యక్రమంలో చిలకలూరిపేట ఇన్‌ఛార్జ్‌, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లరావు పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. ప్రజలంతా జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ICC Champions Trophy 2025 Team India | అగార్కర్ తో డ్రెస్సింగ్ రూమ్ లో Gambhir డిష్యూం డిష్యూం | ABP DesamChhatrapati Sambhaji Maharaj 'Sambar' | సాంబార్ చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు | ABP DesamVicky Kaushal Bollywood Super Star | Chhava తో కొత్త సూపర్ స్టార్ పుట్టాడా.? | ABP DesamMLC Candidate Aviash Jadhav Interview | పదిహేను నా లక్కీ నెంబర్ ఎందుకంటే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Hyderabad Crime News మేడ్చల్‌లో యువకుడి దారుణహత్య, నడిరోడ్డుపై కత్తులతో దాడి కేసులో ఊహించని ట్విస్ట్
మేడ్చల్‌లో యువకుడి దారుణహత్య, నడిరోడ్డుపై కత్తులతో దాడి కేసులో ఊహించని ట్విస్ట్
First GBS Death in AP: ఏపీలో తొలి జీబీఎస్ పేషెంట్ మృతి, నిర్ధారించిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్
ఏపీలో తొలి జీబీఎస్ పేషెంట్ మృతి, నిర్ధారించిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్
WPL Result Update: గార్డెనర్ కెప్టెన్ ఇన్నింగ్స్.. డబ్ల్యూపీఎల్ లో గుజరాత్ బోణీ, 6 వికెట్లతో యూపీ చిత్తు
గార్డెనర్ కెప్టెన్ ఇన్నింగ్స్.. డబ్ల్యూపీఎల్ లో గుజరాత్ బోణీ, 6 వికెట్లతో యూపీ చిత్తు
Who Is Mastan Sai: ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.