అన్వేషించండి

Bandaru Satyanarayana Murthy: భూ ఆక్రమణలు నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటా- బండారు సత్యనారాయణ

Bandaru Satyanarayana Murthy: టీడీపీ హయాంలో ఎక్కడ భూకబ్జాలు జరిగాయో నిరూపించాలని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి నిలదీశారు. విశాఖను దోచేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని అన్నారు.

Bandaru Satyanarayana Murthy: తెలుగు దేశం పార్టీ పాలన సమయంలో తాము ఎక్కడ భూ ఆక్రమణలు చేశామో వైఎస్సార్ సీపీ పార్టీ నాయకులు నిరూపించాలని తెలుగు దేశం పార్టీ నాయకుడు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి సవాల్ విసిరారు. టీడీపీ నేతలు ఆక్రమణలు చేశారన్న విజయసాయి రెడ్డి, ఎక్కడి భూములు కబ్జా చేశారో చూపించాలని నిలదీశారు. తాను ఏ భూములు కబ్జాలు చేయలేదని విశాఖపట్నం ఈస్ట్ పాయింట్ కాలనీలోని సాయి బాబా ఆలయంలో ప్రమాణం చేసి మరీ చెప్తానని అన్నారు. విశాఖ జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి పాల్గొని మాట్లాడారు. 

"దోచేస్తే చూస్తూ ఊరుకునేది లేదు"

రేడియంట్ భూములు విషయంలో ఎంపీ వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి  విమర్శలు గుప్పించారు. "విశాఖను దోచుకుంటున్నారు. అలా దోచేస్తే చూస్తూ ఉరుకొము. మమ్మల్ని జైలుకు పంపినా పోరాటంలో వెనకడుగు వెయ్యం. స్వయంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి తమ్ముడు అనిల్ రెడ్డి తో క్యాపిటల్ ఎక్స్ ప్రొజెక్టు పేరుతో పెద్ద భూ మాయకు దిగారు. విశాఖ లో పారిశ్రామిక వేత్తలని బెదిరించి ఆస్తులు లాక్కుంటున్నారు. ఎందుకు జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీ షాను బదిలీ చేశారో చెప్పాలి. వెలగపూడి రామకృష్ణబాబు, విశాఖ తూర్పు నియోజక వర్గ శాసన సభ్యుడు మేము 5 వేల కోట్లు ఆస్తులు ఆక్రమించుకున్నామని విజయసాయి ట్వీట్ చేశారు. మేము ఎక్కడ ఆక్రమించుకున్నామో, అక్రమాలు చేశామో చెప్పాలి" అని సత్యనారాయణ మూర్తి ప్రశ్నించారు. 

"ప్రమాణం చేసి నిజం చెప్పాలి"

"నేను షిర్డీ సాయి భక్తుడను. ఈస్ట్ పాయింట్ కాలనీ సాయి బాబా గుడి దగ్గర ప్రమాణం చేస్తా. ఎక్కడ కబ్జా చేశామో వచ్చి విజయ సాయి రెడ్డి చెప్పాలి. ఆయన ఎప్పుడూ చెబితే అప్పుడు ఈస్ట్ పాయింట్ కాలనీ సాయి బాబా గుడి దగ్గరకు రావడానికి నేను సిద్ధం. మా పై భూ అక్రమాలు నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటాం. మరి అవాస్తవం అని తేలితే విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలి. విశాఖలో ప్రజలు తొందరపడి భూములకు ఏ అగ్రిమెంట్లు చేసుకొద్దు" అని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి అన్నారు. ఈ సమావేశంలో  బండారు సత్యనారాయణ మూర్తితో పాటు విశాఖ తూర్పు శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణ బాబు, విశాఖ పార్లమెంట్ ఉపాధ్యక్షులు  బైరెడ్డి పోతన రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. రేడియంట్‌ భూముల వ్యవహారంలో ఏపీ సీఎం జగన్‌ కు వరుసకు సోదరుడైన అనిల్‌రెడ్డి, సీఎం సతీమణి భారతిరెడ్డి ప్రోద్బలంతో కుంభకోణం జరిగిందని ఆరోపించారు. రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి ఇందులో హస్తం ఉందని ఆరోపించారు. రేడియంట్‌ సంస్థకు చెందిన రమేష్‌ కుమార్‌కు సర్వే నంబరు 336లో 50 ఎకరాల భూములను అప్పగించాలని, అందుకు ఆయన వీఎంఆర్‌డీఏకు రూ.93 కోట్లు చెల్లించాలని 2019లో అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. ఆర్బిట్రేషన్‌ కోర్టు ఆదేశాల మేరకు టీడీపీ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుందన్నారు. ఎన్నికల కోడ్ రావడంతో రిజిస్ట్రేషన్ జరగలేదని, ఆ తరువాత ఏపీలో ఏర్పడిన వైసీపీ ప్రభుత్వం రేడియంట్ భూములను ఆక్రమించుకోవాలని చూసిందని ఆరోపించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Anantapur TDP: అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ దహనం
అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ దహనం
Tecno Pova 6 Pro 5G: బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Why did K. Annamalai read the Quran | బీజేపీ యంగ్ లీడర్ అన్నామలై ఖురాన్ ఎందుకు చదివారు..?  | ABPKadiyam Srihari and kadiyam Kavya joins into Congress | కడియంకు రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ | ABP DesamSun Stroke  Symptoms and Treatment | వడదెబ్బ తగిలిన వ్యక్తికి ఓఆర్ఎస్ నీళ్లు ఇవ్వొచ్చా? | ABP DesamRR vs DC Highlights IPL 2024 | Avesh Khan Bowling | చివరి ఓవర్ లో 4 పరుగులే ఇచ్చిన ఆవేశ్ ఖాన్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Anantapur TDP: అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ దహనం
అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ దహనం
Tecno Pova 6 Pro 5G: బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Chandrababu Prajagalam :  టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్  -  ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్ - ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
Hindupuram Politics :   కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
Ticket For Raghurama :  ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు -  ఎన్డీఏ కూటమిలో విస్తృత చర్చ
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు - ఎన్డీఏ కూటమిలో విస్తృత చర్చ
Sreemukhi Photos: చుడిదార్‌లో శ్రీముఖి ఎంత ముద్దొస్తుందో - బుల్లితెర రాములమ్మ భలే ఉంది కదూ!
చుడిదార్‌లో శ్రీముఖి ఎంత ముద్దొస్తుందో - బుల్లితెర రాములమ్మ భలే ఉంది కదూ!
Embed widget