అన్వేషించండి

TDP News : వాలంటీర్ల వ్యవస్థతో ఓటర్ల జాబితాలో తీవ్ర అక్రమాలు - ఢిల్లీలో ఈసీకి ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు !

TDP News : ఏపీలో వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించుకుని భారీ ఓటర్ జాబితా అక్రమాలకు పాల్పడ్డారని టీడీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. తక్షణం చర్యలు తీసుకోవాలని ఆధారాలను కూడా సమర్పించింది.

TDP News :  ఆంధ్రప్రదేశ్‌లో ఓట్ల జాబితాలో తీవ్ర అవకతవకలు జరుగుతున్నాయని టీడీపీ నేతలు ఢిల్లీలో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నేతృత్వంలోని బృందం  ఈసీని కలిసింది. తెలుగుదేసం పార్టీ సానుభూతిపరుల ఓట్లే లక్ష్యంగా  తొలగించడంపై ఈసీకి ఫిర్యాదు చేసినట్లు అచ్చెన్నాయుడు తెలిపారు.  రాజకీయ ఒత్తిళ్లతో తప్పుడు ఓటర్ల జాబితా తయారు చేస్తున్నారని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల సంఘం  ఆదేశాలను అధికారులు పాటించడం లేదన్నారు.  దేశంలో ఏ ఎన్నికలు వచ్చినా సరే ఉపాధ్యాయుల సేవలను వినియోగించుకుంటారు కానీ ఏపీలో సీఎం జగన్‌ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు.                               

వాలంటీర్ల వ్యవస్థ, గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి  వారి కనుసన్నల్లోనే ఎన్నికలకు సంబంధించిన పనులు జరుగుతున్నాయని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు.  ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందన్నారు.  అక్టోబర్‌ 27 వరకు దేశమంతా ఓటరు వెరిఫికేషన్‌ ప్రక్రియ జరిగిందన్నారు.  కానీ ఏపీలో ఆ విధానంపూర్తిగా జరగలేదని ఆ విషయాన్ని ఆధారాలతో సహా వివరించామన్నారు.  ష్ట్రంలో దాదాపు 10 లక్షల మంది ఫారమ్‌ 6, ఫారమ్‌ 7, ఫారమ్‌ 8ని అప్లై చేశారు. వీటిపై ఎన్నికల సంఘం దృష్టి సారించలేదని అచ్చెన్నాయుడు తెలిపారు.                          

 ఏపీలో ఒక కుటుంబానికి చెందిన వ్యక్తులు ఒకే పోలింగ్‌ బూత్ పరిధిలో ఓట్లేసే వారని కానీ  ఇప్పుడు పరిస్థితి మారిందన్నారు.  కుటుంబంలో నలుగురు ఉంటే ఒక్కొక్కరికి ఒక్కో పోలింగ్‌ బూత్‌ పరిధిలో పేరు నమోదు చేశారని ఆరోపించారు.  ఇలా ఇష్టానుసారంగా చేయడంపై ఈసీ దృష్టికి తీసుకెళ్లామని..   రాష్ట్రంలో డెత్‌ సర్టిఫికెట్లతో సహా చనిపోయినవారి వివరాలు ఇచ్చామని అచ్చెన్నాయుడు తెలిపారు.  ఒకే వ్యక్తికి రెండు ఓట్లు ఉన్నట్లు ఆధారాలతో సహా చూపించామని.. కానీ  ఈ ఓట్లను ఈసీ తొలగించలేదన్నారు.  వాలంటరీ వ్యవస్థను వినియోగించి  టీడీపీ ఓట్లను సానుభూతిపరుల ఓట్లను మాత్రం ఇష్టానుసారంగా తొలగించారని..  సుమారు 160 పోలింగ్‌ స్టేషన్లు ఈసీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయన్నారు.             

 గ్రామ సచివాలయ ఉద్యోగులను బీఎల్‌వోలుగా నియమించారు. దొంగ ఓట్లు తొలగించాలని ఈసీని కోరామని అచ్చెన్నాయుడు తెలిపారు.  తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని ఈసీ అధికారులు తెలిపారని అచ్చెన్నాయుడు మీడియాకు తెలిపారు. ఏపీ ఓటర్ల జాబితా అంశంపై చాలా కాలంగా వివాదం రేగుతోంది. వైసీపీ నేతలకు డబుల్, త్రిబుల్ ఓట్లు ఉన్నా.. వెరఫికేషన్ తొలగించలేదు.కానీ ఉపాధి కోసం వేరే ప్రాంతాలకు వెళ్లిన  వారి ఓట్లు మాత్రం.. తీసేసేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇలా తమ పరిశీలనలో గుర్తించిన అంశాలన్నింటినీ టీడీపీ నేతలు ఈసీ దృష్టికి తీసుకెళ్లారు.                                         

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! ప్రత్యర్థులకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌! రెడ్‌బుక్‌లో మూడు పేజీలే ఓపెన్ చేశామని లోకేష్‌ కామెంట్‌
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! ప్రత్యర్థులకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌! రెడ్‌బుక్‌లో మూడు పేజీలే ఓపెన్ చేశామని లోకేష్‌ కామెంట్‌
T20 World Cup 2026: టి20 ప్రపంచ కప్‌ ఆడే భారత జట్టులో వీళ్లకే ఛాన్స్‌? రిషబ్ పంత్ ,యశస్వి జైస్వాల్, రింకు సింగ్‌కి తప్పని నిరాశ!
టి20 ప్రపంచ కప్‌ ఆడే భారత జట్టులో వీళ్లకే ఛాన్స్‌? రిషబ్ పంత్ ,యశస్వి జైస్వాల్, రింకు సింగ్‌కి తప్పని నిరాశ!
The Raja Saab Trailer : ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రెండో ట్రైలర్... ఫుల్ డీటెయిల్స్
ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రెండో ట్రైలర్... ఫుల్ డీటెయిల్స్
AP medical college controversy: PPP అంటే ప్రైవేటీకరణే అని వైసీపీ ఫిక్స్ - అదే రాజకీయ అస్త్రం - టీడీపీ తిప్పికొట్టలేకపోతోందా?
PPP అంటే ప్రైవేటీకరణే అని వైసీపీ ఫిక్స్ - అదే రాజకీయ అస్త్రం - టీడీపీ తిప్పికొట్టలేకపోతోందా?

వీడియోలు

Suryakumar Yadav Batting Ind vs SA Series | బ్యాటర్‌గా విఫలమయ్యానన్న సూర్యకుమార్
India vs South Africa 5th T20 Highlights | సిరీస్ సొంతం చేసుకున్న భారత్
Atha Kodalu In Sarpanch Elections Heerapur | హోరాహోరీ పోరులో కోడలిపై గెలిచిన అత్త | ABP Desam
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! ప్రత్యర్థులకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌! రెడ్‌బుక్‌లో మూడు పేజీలే ఓపెన్ చేశామని లోకేష్‌ కామెంట్‌
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! ప్రత్యర్థులకు స్ట్రాంగ్‌ వార్నింగ్‌! రెడ్‌బుక్‌లో మూడు పేజీలే ఓపెన్ చేశామని లోకేష్‌ కామెంట్‌
T20 World Cup 2026: టి20 ప్రపంచ కప్‌ ఆడే భారత జట్టులో వీళ్లకే ఛాన్స్‌? రిషబ్ పంత్ ,యశస్వి జైస్వాల్, రింకు సింగ్‌కి తప్పని నిరాశ!
టి20 ప్రపంచ కప్‌ ఆడే భారత జట్టులో వీళ్లకే ఛాన్స్‌? రిషబ్ పంత్ ,యశస్వి జైస్వాల్, రింకు సింగ్‌కి తప్పని నిరాశ!
The Raja Saab Trailer : ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రెండో ట్రైలర్... ఫుల్ డీటెయిల్స్
ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రెండో ట్రైలర్... ఫుల్ డీటెయిల్స్
AP medical college controversy: PPP అంటే ప్రైవేటీకరణే అని వైసీపీ ఫిక్స్ - అదే రాజకీయ అస్త్రం - టీడీపీ తిప్పికొట్టలేకపోతోందా?
PPP అంటే ప్రైవేటీకరణే అని వైసీపీ ఫిక్స్ - అదే రాజకీయ అస్త్రం - టీడీపీ తిప్పికొట్టలేకపోతోందా?
KTR Challenge to CM Revanth: పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
Mowgli Review : నా పేరెంట్స్ నా ఈవెంట్స్‌కు రారు - యాంకర్ సుమ కొడుకు ఎమోషనల్
నా పేరెంట్స్ నా ఈవెంట్స్‌కు రారు - యాంకర్ సుమ కొడుకు ఎమోషనల్
Adilabad News: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకుంటే తిరగబడతాం; అటవీశాఖ అధికారులకు ఆదివాసీ గిరిజనుల హెచ్చరిక
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకుంటే తిరగబడతాం; అటవీశాఖ అధికారులకు ఆదివాసీ గిరిజనుల హెచ్చరిక
Bigg Boss Telugu Latest Promo : బిగ్​బాస్ హోజ్​లోకి లయ, శివాజీ.. సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టీమ్
బిగ్​బాస్ హోజ్​లోకి లయ, శివాజీ.. సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టీమ్
Embed widget