అన్వేషించండి

Chandrababu: 'తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందే' - అమరావతే రాజధాని అని చంద్రబాబు స్పష్టత

AP News: ఏపీకి రాజధాని అమరావతే అని.. విశాఖను ఆర్థిక, ఆధునిక రాజధానిగా చేసుకుందామని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. తప్పు చేసిన వారికి చట్టపరంగా శిక్ష పడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

Chandrababu Comments on AP Capital And Warning: రాష్ట్రంలో ఐదేళ్లు విధ్వంసం పాలన సాగిందని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) పునరుద్ఘాటించారు. ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన అనంతరం ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన వార్నింగ్ ఇచ్చారు. పదవి వచ్చిందని విర్రవీగుతూ.. అహంకారంతో పాలన సాగిస్తే ఇలాంటి పరిస్థితే ఎదురవుతుందని అన్నారు. 'ఓటర్లు ప్రవర్తించిన తీరు రాష్ట్ర చరిత్రలో నిలుస్తుంది. తప్పు చేసిన వారిని క్షమిస్తే ఆ తప్పు అలవాటుగా మారుతుంది. అలాంటి వారికి చట్టపరంగా శిక్ష పడాల్సిన అవసరం ఉంది. విధ్వంస, కక్షా రాజకీయాలకు దూరంగా ఉండాలి. పదవి వచ్చిందని విర్రవీగకుండా వినయంతో పనిచేయాలి. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని బాధ్యతతో నిర్వర్తించాలి. పదవి పెత్తనం కోసం కాదు. ప్రజలకు సేవ చేసేందుకు ఉపయోగించాలి. నా కుటుంబానికి అవమానం జరిగింది. కౌరవ సభ అని చెప్పి బయటకు వచ్చాను. ప్రజాక్షేత్రంలో అసెంబ్లీని గౌరవ సభగా మార్చి తిరిగి అడుగు పెడతానని శపథం చేశాను. ప్రజలు నా శపథాన్ని గౌరవించారు. గౌరవించిన ప్రజలను నిలబెట్టాలి.' అని చంద్రబాబు స్పష్టం చేశారు.

'అమరావతే రాజధాని'

ఏపీకి రాజధాని అమరావతే అని చంద్రబాబు తేల్చిచెప్పారు. మూడు రాజధానులంటూ ఆటలాడే పరిస్థితి ఉండదని స్పష్టం చేశారు. 'అమరావతి రాజధానిగా ఉంటుంది. విశాఖను ఆర్థిక, ఆధునిక రాజధానిగా చేసుకుందాం.' అని పేర్కొన్నారు. '14 ఏళ్లు సీఎంగా,15 ఏళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నాను. ఎన్నో సవాళ్లు, ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుని ముందుకెళ్లాం. రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. గత ఐదేళ్లలో రాష్ట్రంలో విధ్వంస పాలన సాగింది. విధ్వంసంతోనే పాలన మొదలైంది కూడా. అన్ని రంగాలు సంక్షోభంలో కూరుకుపోయాయి. అన్ని వర్గాలు ఇబ్బందులు పడ్డాయి. పదేళ్ల తర్వాత కూడా రాజధాని ఏదంటే చెప్పుకోలేని పరిస్థితి నెలకొంది. రైతులు అప్పులపాలయ్యారు. పెట్టుబడులు రాలేదు. పరిశ్రమలు రాక నిరుద్యోగులు ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రానికి ఎన్ని అప్పులు ఉన్నాయో తెలీదు. కక్షపూరిత రాజకీయాలు కాకుండా నిర్మాణాత్మకంగా ముందుకెళ్లాలి.' అని చంద్రబాబు పిలుపునిచ్చారు.

'స్టేట్ ఫస్ట్ అనేదే నినాదం'

స్టేట్ ఫస్ట్ అనే నినాదంతో ముందుకెళ్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. 'సీఎంగా ఓ సాధారణ మనిషిగానే జనంలోకి వెళ్తాను. మిత్రుడు పవన్ తో పాటు మేమంతా సామాన్య వ్యక్తులుగానే మీ వద్దకు వస్తాం. హోదా సేవ కోసమే తప్ప.. పెత్తనం కోసం కాదు. నా కాన్వాయ్ కోసం ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దని అధికారులకు చెప్పాను. ఒక సిగ్నల్‌కు మరో సిగ్నల్‌కు గ్యాప్ పెట్టుకోండి. 5 నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు. ప్రజలకు అసౌకర్యం కలగకూడదనే స్పష్టమైన ఆదేశాలిచ్చాం. దాడుల చేసి బాధితులపైనే కేసులు పెట్టే పరిస్థితి ఉండదు. ఏ ఒక్కరి ఆత్మగౌరవానికి భంగం కలగదు. ప్రజాహితం కోసమే పని చేస్తాం. ప్రతి నిర్ణయం ప్రతి అడుగు ప్రజల కోసమే ఉంటుంది. టీడీపీ హయాంలో పోలవరం పనులు 72 శాతం పూర్తి చేస్తాం. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. కేంద్ర సహకారంతో ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తాం. నధులు అనుసంధానించి ప్రతి ఎకరానికి నీళ్లందిస్తాం.' అని చంద్రబాబు స్పష్టం చేశారు.

Also Read: Chandrababu: 'ట్రాఫిక్ ఆపడం, రోడ్లు మూసేయడం, చెట్లు కొట్టడం ఉండదు' - సామాన్యులుగా, మామూలు మనిషిగానే ప్రజల్లోకి వస్తానన్న చంద్రబాబు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Daruma doll: ప్రధాని మోదీకి డారుమా డాల్ గిఫ్టుగా ఇచ్చిన జపాన్ ఆలయ పూజారి - దీని ప్రత్యేకత ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే !
ప్రధాని మోదీకి డారుమా డాల్ గిఫ్టుగా ఇచ్చిన జపాన్ ఆలయ పూజారి - దీని ప్రత్యేకత ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే !
Double Decker Bus Vizag: వైజాగ్ బీచ్‌లో డబుల్ డెకర్ బస్సులు ప్రారంభం- టికెట్‌ ధరలు గురించి తెలుసా?
వైజాగ్ బీచ్‌లో డబుల్ డెకర్ బస్సులు ప్రారంభం- టికెట్‌ ధరలు గురించి తెలుసా?
Kuppam Krishna Water: కుప్పంలో పండుగ వాతావరణం  - కృష్ణా జలాల రాకతో సంతోషం -  శనివారం చంద్రబాబు జలహారతి
కుప్పంలో పండుగ వాతావరణం - కృష్ణా జలాల రాకతో సంతోషం - శనివారం చంద్రబాబు జలహారతి
Basara Floods: బాసరలో గోదావరి ఉగ్రరూపం - ఆలయం వద్దకు చేరుకున్న నీరు -అప్రమత్తమైన అధికారులు
బాసరలో గోదావరి ఉగ్రరూపం - ఆలయం వద్దకు చేరుకున్న నీరు -అప్రమత్తమైన అధికారులు
Advertisement

వీడియోలు

Chiranjeevi Met his Adoni Fan | తన అభిమాని పిల్లల్ని చదివిస్తానని మాటిచ్చిన చిరంజీవి | ABP Desam
Sketch on MLA Kotam Reddy Sridhar reddy | కోటంరెడ్డిని లేపేస్తే ఎమ్మెల్యే పదవి ఇస్తాం | ABP Desam
Gautam Gambhir in Asia Cup 2025 | గంభీర్ 15 ఏళ్ల కల నెరవేరుతుందా
Sanju Samson Performance as Opener | ఓపెనర్‌గా సెంచరీలు చేస్తున్న సంజూ శాంసన్
Pawan Kalyan about Sugali Preethi Case | సుగాలి ప్రీతి కేసుపై స్పందించిన పవన్ కళ్యాణ్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Daruma doll: ప్రధాని మోదీకి డారుమా డాల్ గిఫ్టుగా ఇచ్చిన జపాన్ ఆలయ పూజారి - దీని ప్రత్యేకత ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే !
ప్రధాని మోదీకి డారుమా డాల్ గిఫ్టుగా ఇచ్చిన జపాన్ ఆలయ పూజారి - దీని ప్రత్యేకత ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే !
Double Decker Bus Vizag: వైజాగ్ బీచ్‌లో డబుల్ డెకర్ బస్సులు ప్రారంభం- టికెట్‌ ధరలు గురించి తెలుసా?
వైజాగ్ బీచ్‌లో డబుల్ డెకర్ బస్సులు ప్రారంభం- టికెట్‌ ధరలు గురించి తెలుసా?
Kuppam Krishna Water: కుప్పంలో పండుగ వాతావరణం  - కృష్ణా జలాల రాకతో సంతోషం -  శనివారం చంద్రబాబు జలహారతి
కుప్పంలో పండుగ వాతావరణం - కృష్ణా జలాల రాకతో సంతోషం - శనివారం చంద్రబాబు జలహారతి
Basara Floods: బాసరలో గోదావరి ఉగ్రరూపం - ఆలయం వద్దకు చేరుకున్న నీరు -అప్రమత్తమైన అధికారులు
బాసరలో గోదావరి ఉగ్రరూపం - ఆలయం వద్దకు చేరుకున్న నీరు -అప్రమత్తమైన అధికారులు
APPSC Hall Tickets: ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ హాల్‌టికెట్స్‌ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
అభ్యర్థులకు అలర్ట్.. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ హాల్‌టికెట్స్‌ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
NH 44 Traffic Jam: కామారెడ్డి హైవేపైకి ఎక్కొద్దు ప్లీజ్.. 25 కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్.. నరకం చూస్తున్న వాహనదారులు
కామారెడ్డి హైవేపైకి ఎక్కొద్దు ప్లీజ్.. 25 కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్.. నరకం చూస్తున్న వాహనదారులు
Hansika Motwani: ఒంటరిగానే గణేష్ పూజ - విడాకుల రూమర్స్‌పై హన్సిక క్లారిటీ ఇచ్చేశారా?
ఒంటరిగానే గణేష్ పూజ - విడాకుల రూమర్స్‌పై హన్సిక క్లారిటీ ఇచ్చేశారా?
Vizag TCS: విశాఖకు టీసీఎస్ - మిలీనియం టవర్స్ లో క్యాంపస్ రెడీ - 2వేల మందితో త్వరలో స్టార్ట్
విశాఖకు టీసీఎస్ - మిలీనియం టవర్స్ లో క్యాంపస్ రెడీ - 2వేల మందితో త్వరలో స్టార్ట్
Embed widget