అన్వేషించండి

Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదంపై సిట్ దర్యాప్తునకు బ్రేక్ - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Tirumala News: తిరుమల లడ్డూ వివాదంపై సిట్ దర్యాప్తునకు బ్రేక్ పడింది. సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో విచారణను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు.

SIT Investigation Stopped In Tirumala Laddu Row: తిరుమల లడ్డూ (Tirumala Laddu) తయారీలో కల్తీ నెయ్యి వివాదంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంపై సిట్ (SIT) దర్యాప్తునకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. సుప్రీంకోర్టులో (Supreme Court) విచారణ నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాదుల సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా తదుపరి విచారణను కొనసాగిస్తామని వెల్లడించారు. కాగా, ఇప్పటికే దాదాపు 4 రోజులుగా లడ్డూ అంశంపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. సోమవారం విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ అంశంపై ప్రభుత్వ తీరును తప్పుబట్టింది.

సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి

కాగా, లడ్డూ వివాదానికి సంబంధించి విచారణ సందర్భంగా బహిరంగ ప్రకటనలపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కనీసం దేవుళ్లనైనా రాజకీయాలకు దూరంగా ఉంచుతారని భావిస్తున్నామని తెలిపింది. శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యినే వినియోగించారా.? లేదా.? అనే దానిపై ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌నే కొనసాగించాలా.? లేదా స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలా.? అని కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది. దీనిపై ఏ విషయాన్నీ గురువారం చెప్పాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సూచించింది. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన ఈ అంశంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక విచారణ జరిపించాలని.. మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి, టీటీడీ బోర్డు మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, విక్రమ్ సంపత్ అనే భక్తుడు, ఓ టీవీ ఎడిటర్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

సిట్ విచారణ సాగిందిలా

మరోవైపు, తిరుమల లడ్డూ వివాదంపై గత నాలుగు రోజులుగా సిట్ దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. సర్వశ్రేష్ట త్రిపాఠి నేతృత్వంలోని ఏర్పాటైన ఈ సిట్ మూడు రోజులుగా తిరుమలలోనే ఉంటూ దర్యాప్తు సాగిస్తోంది. మంగళవారం ఉదయాన్నే తిరుమల చేరుకున్న విచారణాధికారులు లడ్డూ తయారీ కేంద్రాన్ని సందర్శించి అక్కడ సిబ్బందిని ప్రశ్నించారు. లడ్డూ తయారీ విధానం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 3 రోజుల దర్యాప్తులో భాగంగా టీటీడీ గోదాములు, పిండిమర, ల్యాబ్‌లను అధికారులు పరిశీలించారు. నెయ్యిని నిల్వ చేసే ట్యాంకర్లనూ సిట్‌ సిబ్బంది పరిశీలించారు. నెయ్యిని ఎలా వాడుతున్నారో అడిగి తెలుసుకున్నారు. గోడౌన్లనూ క్షుణ్ణంగా పరిశీలించింది. అన్ని కోణాల్లోనూ విచారించింది సిట్  బృందం. అయితే, సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా తాత్కాలికంగా ఈ విచారణకు బ్రేక్ పడింది.

సీబీఐకు అప్పగించండి

మరోవైపు, తిరుపతి లడ్డూ వివాదంపై ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏపాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ అంశంపై సీబీఐ విచారణ జరిపించాలని.. తిరుపతిని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని కోరుతూ ఆయన పిటిషన్ వేశారు. 740 మంది క్యాథలిక్స్ కోసం వాటికన్ ప్రత్యేక దేశంగా ఉందని.. కోట్లాది మంది భక్తులు వచ్చే తిరుమల తిరుపతిని యూనియన్ టెర్రిటరీ ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. 

Also Read: APSRTC: ప్రయాణికులకు ఏపీఎస్‌ఆర్టీసీ దసరా ఆఫర్‌- ఒకేసారి బుక్ చేసుకుంటే రాయితీ!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ - తక్కువ ధరకే కందిపప్పు, చక్కెర
ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ - తక్కువ ధరకే కందిపప్పు, చక్కెర
DJ Banned: హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం - నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా
హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం - నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా
Death Penalty: తల్లిని చంపి శరీర భాగాలు వండేందుకు యత్నం - నిందితుడికి ఉరిశిక్షను సమర్థించిన బాంబే హైకోర్టు
తల్లిని చంపి శరీర భాగాలు వండేందుకు యత్నం - నిందితుడికి ఉరిశిక్షను సమర్థించిన బాంబే హైకోర్టు
Rajinikanth Health: రజనీకాంత్ హెల్త్ అప్డేట్... ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన అపోలో డాక్టర్లు - డిశ్ఛార్జి ఎప్పుడంటే?
రజనీకాంత్ హెల్త్ అప్డేట్... ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన అపోలో డాక్టర్లు - డిశ్ఛార్జి ఎప్పుడంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

IND vs BAN 2nd Test Day 5 Highlights: రెండో టెస్టులో బంగ్లాను చిత్తు చేసిన టీమిండియాSircilla Weavers: 18 లక్షల చీర చూశారా? సిరిసిల్లలోనే తయారీSrikakulam Fisherman Boats Fire: నడిసంద్రంలో అగ్ని ప్రమాదాలు, వణికిపోతున్న మత్స్యకారులుTiger in Konaseema: చిరుత కోసం డ్రోన్లతో వేట - కోనసీమ DFOతో ఫేస్ టూ ఫేస్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ - తక్కువ ధరకే కందిపప్పు, చక్కెర
ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ - తక్కువ ధరకే కందిపప్పు, చక్కెర
DJ Banned: హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం - నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా
హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం - నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా
Death Penalty: తల్లిని చంపి శరీర భాగాలు వండేందుకు యత్నం - నిందితుడికి ఉరిశిక్షను సమర్థించిన బాంబే హైకోర్టు
తల్లిని చంపి శరీర భాగాలు వండేందుకు యత్నం - నిందితుడికి ఉరిశిక్షను సమర్థించిన బాంబే హైకోర్టు
Rajinikanth Health: రజనీకాంత్ హెల్త్ అప్డేట్... ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన అపోలో డాక్టర్లు - డిశ్ఛార్జి ఎప్పుడంటే?
రజనీకాంత్ హెల్త్ అప్డేట్... ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన అపోలో డాక్టర్లు - డిశ్ఛార్జి ఎప్పుడంటే?
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్‌ న్యూస్‌ - 10 రోజులు మద్యం షాపులు బంద్
మందుబాబులకు బ్యాడ్‌ న్యూస్‌ - 10 రోజులు మద్యం షాపులు బంద్
I Phone Murder : ఐ ఫోన్ కోసం డెలివరీ బాయ్‌ను చంపేశాడు - బాబోయ్ ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా ?
ఐ ఫోన్ కోసం డెలివరీ బాయ్‌ను చంపేశాడు - బాబోయ్ ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా ?
Pawan Kalyan: 'శాశ్వత పరిష్కారం కోసం చేపట్టిన దీక్ష' - ఉన్న సమాచారాన్నే సీఎం చంద్రబాబు చెప్పారన్న పవన్ కల్యాణ్, కాలినడకన తిరుమలకు డిప్యూటీ సీఎం
'శాశ్వత పరిష్కారం కోసం చేపట్టిన దీక్ష' - ఉన్న సమాచారాన్నే సీఎం చంద్రబాబు చెప్పారన్న పవన్ కల్యాణ్, కాలినడకన తిరుమలకు డిప్యూటీ సీఎం
Kothagudem News: సింగరేణిలో ఉద్యోగాల పేరిట మోసం - దంపతులు ఆత్మహత్య, కొత్తగూడెం జిల్లాలో విషాద ఘటన
సింగరేణిలో ఉద్యోగాల పేరిట మోసం - దంపతులు ఆత్మహత్య, కొత్తగూడెం జిల్లాలో విషాద ఘటన
Embed widget