అన్వేషించండి

Amalapuram News: అమలాపురంలో ఆశావాహుల జోరు - మూడు పార్టీల్లోనూ టికెట్‌కు పెరిగిన పోటీ!

Amalapuram constituency: అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ నుంచి ఆశావాహుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది.

AP Politics: అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ నుంచి ఆశావాహుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది.. పార్టీలో ఇన్నాళ్లు కష్టపడ్డాం.. ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం, పార్టీ మమ్మల్ని గుర్తించాలి.. అని కొందరు అధిష్టానానికి విజ్ఞప్తులు చేస్తుంటే గెలిచే సత్తా మాకు ఉంది. ఇంతవరకు పల్లకి మోసిన నేతలు స్థానికులు కాదు.. ఇకపై వారి నాయకత్వం మాకు అక్కర్లేదు మానుంచే నాయకులు రావాలి... అందుకే స్థానికులమైన మాకు టిక్కెట్టు కేటాయించాలని మరో ప్రధాన డిమాండ్‌ వినిపిస్తోంది. దీంతో అధిష్టానం ఎటూ తేల్చుకోలేక దాదాపు చాలా నియోజకవర్గాల ఇంచార్జ్‌లను ప్రకటించినా వైసీపీ మాత్రం అమలాపురం విషయంలో ఇంకా వాయిదాలు వేసుకుంటూ వస్తుండగా కాస్త ఆలస్యంగానైనా టీడీపీ నుంచి అయితే మరికొంత మంది ముందుకు వచ్చి మేము పార్టీ కోసం చాలా కష్టపడ్డాం.. అధినాయకత్వం మమ్మల్ని గుర్తించాలి. అవకాశం కల్పించాలంటూ పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. 

నేటికీ నియోజకవర్గ ఇంచార్జ్‌ను ప్రకటించని వైసీపీ..
అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో హెడ్‌ క్వార్టర్‌ అయినటువంటి అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ ఇంచార్జ్‌గా ఎవ్వరినీ నియమించకపోవడం వెనుక ఆపార్టీలో ఆశావాహులు ఎక్కువగా ఉండడం కూడా ఒక కారణంగా తెలుస్తోంది.. అమలాపురం నియోజకవర్గం నుంచి వైసీపీ మంత్రిగా పినిపే విశ్వరూప్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. విశ్వరూప్‌తోపాటు ఆయన కుమారుడు పినిపే శ్రీకాంత్‌ కూడా యాక్టివ్‌గా ఉండడంతో సర్వే ద్వారా ఇద్దరిలో ఎవ్వరికి టిక్కెట్టు కేటాయించాలన్న సందిగ్ధంలో వైసీపీ అధిష్టానం పడిరది. ఆతరువాత తనయునికే కాదు అవకాశం కల్పిస్తే తండ్రి విశ్వరూప్‌కే ఇవ్వాలన్న ఆలోచనతో తనయుడి నో చెప్పడంతో ఆయన వెనక్కు తగ్గారు. అయితే ఇటీవలే వైసీపీ సీనియర్‌ నేత, గుడ్‌సీడ్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ కుంచే రమణారావు కూడా బలప్రదర్శనకు దిగారు. ఈయనతోపాటుమరో ఇద్దరు కూడా తమకు అవకాశం కల్పించాలని అధిష్టానానికి విజ్ఞప్తులు చేయడంతో ఈ కారణంతోనే నేటికీ అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్‌ నియామకం పూర్తిచేయలేదని తెలుస్తోంది..

టీడీపీలో తొలగని సందిగ్ధత...
అమలాపురం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్‌గా అయితాబత్తుల ఆనందరావు ఉన్నారు. అయితే ఇక్కడ టీడీపీతో పోటీగా జనసేన పార్టీ అభ్యర్ధి శెట్టిబత్తుల రాజబాబు కూడా ఇప్పటికే మహా సంకల్ప యాత్ర పేరుతో ప్రజల్లో తిరుగుతున్నారు. అయితే ఈ స్థానం నుంచి టీడీపీ పోటీచేస్తుందా లేక జనసేన నా అన్న సందిగ్ధత తొలగడం లేదు. అమలాపురం మేము పోటీచేస్తాం అంటే మేము అన్న పరిస్థితి జనసేన, టీడీపీ అభ్యర్థుల నుంచి కనిపిస్తోంది.. అయితే అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా హెడ్‌క్వార్టర్‌ అవ్వడంతో ఇక్కడ టీడీపీకే అవకాశం దక్కుతుందన్న వాదన వినిపిస్తోంది..

మూడు పార్టీల్లోనూ ఆశావాహుల జోరు..
అమలాపురం నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీల నుంచి టిక్కెట్టు ఆశిస్తున్న ఆశావాహులు ఎక్కువగా ఉన్నారు. వైసీపీ నుంచి మంత్రి విశ్వరూప్‌ ఇప్పటికే రేస్‌లో ఉండగా, గుడ్‌సీడ్‌ ఫౌండేషన్‌ అధినేత కుంచే రమణారావు కూడా నేను బరిలో ఉంటానని తేల్చిచెపుతున్నారు. ఇప్పటికే ఆయన స్వగ్రామం అయిన చల్లపల్లిలో ఆత్మీయ సమావేశం పేరిట బల ప్రదర్శన చేశారు. స్థానికులకే ఈ సారి టిక్కెట్టు ఇవ్వాలన్న డిమాండ్‌తో ముందుకు రాగా ఇన్నాళ్లు పల్లకీ మోసం ఇక చాలు మా నాయకత్వాన్ని మేము నిరూపించుకుంటామని తేల్చిచెప్పారు. ఇదే పార్టీ నుంచి మరికొందరు ద్వితీయశ్రేణి నాయకులు టిక్కెట్టు ఆశిస్తున్నారు.

టీడీపీ నుంచి నియోజకవర్గ ఇంచార్జ్‌ అయితాబత్తుల ఆనందరావు రేసులో ఉండగా మాజీ ఎమ్మెల్యే చిల్లా జగదీశ్వరి ఇప్పటికే మీడియా సమావేశం ఏర్పాటు చేసి తాను, తన భర్త గత 30 ఏళ్లుగా పార్టీకు సేవలందిస్తున్నామని, ఈసారి తమలో ఒకరికి అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఫుడ్‌కమిషన్‌ మాజీ సభ్యుడు నాగాబత్తుల శ్రీనివాసరావు, పోతుల సుభాష్‌చంద్రబోస్‌ తదితరులు కూడా టీడీపీ టిక్కెట్టు ఆశిస్తున్నవారిలో ఉన్నారు. ఇక జనసేన నియోజకవర్గ ఇంచార్జ్‌గా శెట్టిబత్తుల రాజబాబు టిక్కెట్టు ఆశిస్తుండగా ఆయనతోపాటు పార్లమెంటు నియోజకవర్గ ఇంచార్జ్‌ డీఎమ్మార్‌ శేఖర్‌ కూడా బరిలో ఉన్నానంటున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
YSRCP Assembly March: అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?
అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget