అన్వేషించండి

Rajahmundry: రాజమండ్రి వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు - నేడు రద్దు, లేట్ అయ్యే ట్రైన్స్ ఇవే

రైల్వే అధికారులు 9 రైళ్లను పూర్తిగా, రెండు రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. ప్రస్తుతం రైళ్ల రాకపోకలు ఒకే ట్రాక్‌పై కొనసాగుతున్నాయి.

Rajamundry Goods Train Derailment: ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరంలో ఓ గూడ్సు రైలు పట్టాలు తప్పింది. దీంతో ఆ మార్గంలో వెళ్లాల్సిన చాలా రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. కొన్నింటిని దక్షిణ మధ్య రైల్వే రద్దు చేయగా, మరికొన్నింటిని దారి మళ్లించింది. ఇంకా కొన్ని రైళ్లు ఆలస్యంగా నడవనున్నాయి. బుధవారం (నవంబరు 9) తెల్లవారుజామున 3 గంటలకు రాజమహేంద్రవరం స్టేషన్‌ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. గూడ్స్ రైలు బోగీలు పట్టాలపై చెల్లాచెదురుగా పడిపోయాయి. పూర్తిగా బోగీలు దెబ్బతిన్నాయి. రైలు పట్టాలు కూడా దెబ్బ తినడంతో ఒకే ట్రాక్‌ మీదుగా రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కోల్‌కతా - విశాఖపట్నం - చెన్నై రైలు మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది ట్రాక్‌ వద్దకు చేరుకొని హుటాహుటిన మరమ్మతులు చేస్తున్నారు. రైలు అధికారులు పట్టాలపై పడ్డ బోగీలను క్రేన్ల సాయంతో తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.

రైల్వే అధికారులు 9 రైళ్లను పూర్తిగా, రెండు రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. ప్రస్తుతం రైళ్ల రాకపోకలు ఒకే ట్రాక్‌పై కొనసాగుతున్నాయి. దక్షిణ మధ్య రైల్వే తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ-లింగంపల్లి రైలు 2 గంటలు ఆలస్యంగా నడవనుంది. విజయవాడ - రాజమండ్రి, కాకినాడ పోర్టు - విజయవాడ రైళ్లు పాక్షికంగా రద్దు అయ్యాయి. పూర్తిగా రద్దయిన రైళ్లలో విజయవాడ - విశాఖపట్టణం (12718), విశాఖ - విజయవాడ (12717), గుంటూరు - విశాఖ (17239), విశాఖ - గుంటూరు (17240), విశాఖ - విజయవాడ (22701), విజయవాడ - విజయవాడ (22702), విజయవాడ - గుంటూరు (07628), గుంటూరు - విజయవాడ (07864), కాకినాడ పోర్ట్ -విజయవాడ (17257) రైళ్లు ఉన్నాయి.

నవంబర్ 9న పూర్తిగా రద్దు అయిన రైళ్లు

రైలు నెంబరు   మార్గం
12718 - విజయవాడ - విశాఖపట్నం
12717 - విశాఖపట్నం - విజయవాడ
17239 - గుంటూరు - విశాఖపట్నం 
17240 - విశాఖపట్నం - గుంటూరు
22701 - విశాఖపట్నం - విజయవాడ
22702 - విజయవాడ - విజయవాడ
07628 - విజయవాడ - గుంటూరు 
07864 - గుంటూరు - విజయవాడ
17257 - కాకినాడ పోర్టు - విజయవాడ

పాక్షికంగా రద్దు అయిన రైళ్లు

17258 - కాకినాడ పోర్ట్ - విజయవాడ
07768 - విజయవాడ - రాజమండ్రి

రీషెడ్యూల్ అయిన రైలు

12805 - విజయవాడ - లింగంపల్లి - 120 నిమిషాలు ఆలస్యం

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?

వీడియోలు

Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!
Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
Reliance Foundation: రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
Nita Ambani: అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
Chandrababu on water dispute: నీళ్లపై రాజకీయాలు సరి కాదు - పోటాపోటీగా మాట్లాడొద్దు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
నీళ్లపై రాజకీయాలు సరి కాదు - పోటాపోటీగా మాట్లాడొద్దు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Embed widget