News
News
వీడియోలు ఆటలు
X

Kakinada: కాకినాడలో కరోనా కలకలం, 40 మంది విద్యార్థుల్లో లక్షణాలు - NCC క్యాంపులో 317 మంది

దేశంలో కరోనా కేసులు స్థిరంగా నమోదవుతున్నాయి. కొత్తగా 13,313 కరోనా కేసులు వచ్చాయి. 38 మంది మృతి చెందారు.

FOLLOW US: 
Share:

తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడలో ఒకేసారి 40 మంది విద్యార్థులకు కరోనా లక్షణాలు కనిపించాయి. స్థానిక ఎస్‌కేఆర్ ఉన్నత పాఠశాలలో ఈ కరోనా కలకలం వెలుగు చూసింది. స్కూలులో ఉన్న 40 మంది ఎన్‌సీసీ విద్యార్థులకు కరోనా లక్షణాలు కనిపించడంతో వారిని అధికారులు ఐసోలేషన్‌లో ఉంచారు. ఎన్‌సీసీ క్యాంప్‌లో మొత్తం 317 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ నెల 18 నుంచి ఎన్‌సీసీ క్యాంప్ ప్రారంభం అయింది. అయితే, యూనిట్ కమాండింగ్ అధికారి లక్షణాలు ఉన్న 40 మందికి కరోనా పరీక్షలు చేయించారు. వీరి కరోనా పరీక్షలకు సంబంధించి రిపోర్టులు రావాల్సి ఉంది. వచ్చే ఫలితాలను బట్టి తర్వాత క్యాంపు కొనసాగించాలా వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఏపీలో బుధవారం 340 కరోనా కేసులను గుర్తించారు. అంతకు ముందు రోజు 298 కేసులు నమోదయ్యాయి. 

దేశంలో కరోనా కేసులు స్థిరంగా నమోదవుతున్నాయి. కొత్తగా 13,313 కరోనా కేసులు వచ్చాయి. 38 మంది మృతి చెందారు. తాజాగా 10,972 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.60 శాతానికి చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్​ కేసులు 0.19 శాతం ఉన్నాయి. డైలీ పాజిటివిటీ రేటు 2.03 శాతంగా ఉంది. వీక్లీ పాజిటివిటీ రేటు 2.81గా నమోదైంది.

  • మొత్తం కరోనా కేసులు: 4,33,44,958
  • మొత్తం మరణాలు: 5,24,941
  • యాక్టివ్​ కేసులు: 83,990
  • మొత్తం రికవరీలు: 4,27,36,027

వ్యాక్సిన్ పంపిణీ ఇలా..
దేశంలో కొత్తగా 14,91,941 మందికి టీకాలు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,96,62,11,973 కోట్లకు చేరింది. మరో 6,56,410 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.

కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్రం.. రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కరోనా నిబంధనలను తప్పకుండా పాటించేలా చూడాలని తెలిపింది. కరోనా టెస్టులను పెద్ద ఎత్తున నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. మాస్కులు తప్పనిసరిగా వినియోగించాలని కోరింది.

Published at : 24 Jun 2022 01:25 PM (IST) Tags: East Godavari news Corona Symptoms Kakinada corona cases SKR High school kakinada Corona symptoms 2022 kakinada ncc camp

సంబంధిత కథనాలు

AP SSC Exams: నేటి నుంచి పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు, హాజరుకానున్న 2 లక్షలకుపైగా విద్యార్థులు!

AP SSC Exams: నేటి నుంచి పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు, హాజరుకానున్న 2 లక్షలకుపైగా విద్యార్థులు!

APPSC: త్వరలో గ్రూప్‌-1, గ్రూప్‌-2 నోటిఫికేషన్లు: ఏపీపీఎస్సీ ఛైర్మన్

APPSC: త్వరలో గ్రూప్‌-1, గ్రూప్‌-2 నోటిఫికేషన్లు: ఏపీపీఎస్సీ ఛైర్మన్

Kakinada News: ఘనంగా జేఎన్టీయూ స్నాతకోత్సవం - ప్రపంచాన్ని అధ్యయనం చేయాలన్న గవర్నర్

Kakinada News: ఘనంగా జేఎన్టీయూ స్నాతకోత్సవం - ప్రపంచాన్ని అధ్యయనం చేయాలన్న గవర్నర్

AP News: ఇంధన పొదుపు రాష్ట్రంగా ఏపీ, నాలుగేళ్లలో రూ.4 వేల కోట్లు ఆదా

AP News: ఇంధన పొదుపు రాష్ట్రంగా ఏపీ, నాలుగేళ్లలో రూ.4 వేల కోట్లు ఆదా

APFU: ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీలో డిప్లొమా ప్రోగ్రాం, ప్రవేశం ఇలా!

APFU: ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీలో డిప్లొమా ప్రోగ్రాం, ప్రవేశం ఇలా!

టాప్ స్టోరీస్

Balineni Meet Jagan : సీఎం జగన్‌తో బాలినేని భేటీ - చర్చలపై ఏం చెప్పారంటే ?

Balineni Meet Jagan :  సీఎం జగన్‌తో బాలినేని భేటీ - చర్చలపై ఏం చెప్పారంటే ?

Telangana Formation Day: తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన 12 సంఘటనలు, చారిత్రక ఘట్టాలు ఇవే!

Telangana Formation Day: తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన 12 సంఘటనలు, చారిత్రక ఘట్టాలు ఇవే!

TSRTC: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పిన సజ్జనార్, వచ్చే నెల నుంచి పండగే!

TSRTC: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పిన సజ్జనార్, వచ్చే నెల నుంచి పండగే!

Pareshan Movie Review - 'పరేషాన్' సినిమా రివ్యూ : 'మసూద' తర్వాత తిరువీర్‌కు మరో హిట్!?

Pareshan Movie Review - 'పరేషాన్' సినిమా రివ్యూ : 'మసూద' తర్వాత తిరువీర్‌కు మరో హిట్!?