అన్వేషించండి

Janasena Plenary: జనసేన ఆవిర్భావ సభకు వెళ్లే వారికి అలర్ట్ - మహిళలకు ప్రత్యేక గ్యాలరీలు, పోలీసుల భారీ బందోబస్తు

Janasena Formation Day : జనసేన 12 ఆవిర్భావ సభకు వచ్చే వారి కోసం నేతలు భారీగా ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్న భోజనం, మజ్జిగ, తాగునీరు కేంద్రాలున్నాయి. 1600 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Janasena Foundation Day | పిఠాపురం: జనసేన స్థాపించి 11 ఏళ్లు పూర్తి చేసుకుని 12 ఏడాదిలోకి అడుగుపెడుతోంది. గత ఎన్నికల్లో ఒక్క సీటుకే పరిమితమైన జనసేన, 2024 ఎన్నికల్లో పోటీ చేసిన 21 స్థానాల్లో నెగ్గింది. అధికార కూటమిలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan) అధ్యక్షుడిగా ఉన్న జనసేన పార్టీ నేడు ఆవిర్భావ దినోత్సవం నిర్వహిస్తోంది. నేడు (మార్చి 14న) పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడలో  50 ఎకరాల ప్రాంగణంలో 'జయ కేతనం' పేరుతో సభ నిర్వహిస్తున్నారు. తెలుగు సంస్కృతి చరిత్ర అద్దం పట్టేలా సభ (Janasena Plenary) నిర్వహణను జనసేన ప్లాన్ చేసింది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ, తాజా పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం కనిపిస్తోంది.

భోజన సదుపాయం, మజ్జిగ, చలివేంద్రాలు ఏర్పాటు

జనసేన 12వ ఆవిర్భావ సభకు విచ్చేస్తున్న ప్రజలందరికి పార్టీ నేతలు ఊరట కలిగించే విషయం చెప్పారు. సభకు వచ్చే వారికి జనసేన పార్టీ నేతలు మధ్యాహ్నం భోజనం సదుపాయం కల్పించారు. అసలే వేసవికాలం కావడంతో మజ్జిగతో పాటు చలివేంద్రాలు, తాగు నీరు సదుపాయం ఏర్పాటు చేశారు. జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులు అంతా దగ్గర ఉండి మీటింగ్ కి వచ్చేవారికి భోజన సదుపాయాలు, వడ్డన చూసుకోవాలని పార్టీ అధిష్టానం సూచించింది.  కోరుకుంటున్నాము. 

భోజనం సదుపాయం ఏర్పాటు చేసిన ప్రదేశాలు:
1 . చేబ్రోలు నుండి గొల్లప్రోలు వెళ్లే NH 216 హైవే లో చేందుర్తి జంక్షన్ లో శ్రీదుర్గమ్మ ఆలయం వద్ద
https://maps.app.goo.gl/jKZSrQ972JLvD5pm9

2 . గొల్లప్రోలు HP పెట్రోల్ బంక్ జంక్షన్ పక్కన ఉన్న స్థలంలో 
https://maps.app.goo.gl/CPWGShEQkR3kVQXS7

3 . టోల్ ప్లాజా నుండి పిఠాపురం వై జంక్షన్ మధ్యలో ఉన్న రైస్ మిల్లులో    
https://maps.app.goo.gl/QQgyihgBS8kLanya9

4 . గోపాలబాబా ఆశ్రమం ఎదురుగా ఉన్న స్థలంలో భోజనాలు
https://maps.app.goo.gl/curd9FNsP35VQi7A9 

1600 మంది పోలీసులతో భారీగా బందోబస్తు
న భూతో న భవిష్యత్ అనేలా జయకేతనం ఆవిర్భావ సభ నిర్వహిస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి జనసేన నేతలు, వీర మహిళలు, కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ మద్దతుదారుల, అభిమానులు జనసేన ప్లీనరీకి తరలి రానుండటంతో 1600 మంది పోలీసులతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్రం నలు వైపుల నుంచి వచ్చే వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అందరికీ ఆహారం, మంచినీరు అందరికీ అందేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మహిళలకు ప్రత్యేక గ్యాలరీలు, సౌకర్యాలు కల్పించారు.

సభా స్థలంలో 12 అంబులెన్సులు, మెడికల్ బృందాలు సిద్ధం చేసి అన్ని విధాలుగా జయకేతనం సభకు జనసేన సిద్ధంగా ఉంది. శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు జనసేన సభ మొదలుకానుంది. పీఏసీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ గురువారం నాడు ఆవిర్భావ సభ ఏర్పాట్లను పరిశీలించారు. తుది దశకు వచ్చిన పనులపై వివిధ కమిటీల నాయకులు, రాష్ట్ర నాయకులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. సభకు హాజరయ్యే వారికి ఏ ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని సూచించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Chandra Babu and Amit Shah: అమిత్‌షాతో చంద్రబాబు కీలక భేటీ! ఆ సమావేశంలో ఏం చర్చించారు?
అమిత్‌షాతో చంద్రబాబు కీలక భేటీ! ఆ సమావేశంలో ఏం చర్చించారు?
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తత- అట్లాంటిక్‌లో చమురు ట్యాంకర్‌ సీజ్‌- మండిపడ్డ పుతిన్
అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తత- అట్లాంటిక్‌లో చమురు ట్యాంకర్‌ సీజ్‌- మండిపడ్డ పుతిన్

వీడియోలు

Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandra Babu and Amit Shah: అమిత్‌షాతో చంద్రబాబు కీలక భేటీ! ఆ సమావేశంలో ఏం చర్చించారు?
అమిత్‌షాతో చంద్రబాబు కీలక భేటీ! ఆ సమావేశంలో ఏం చర్చించారు?
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తత- అట్లాంటిక్‌లో చమురు ట్యాంకర్‌ సీజ్‌- మండిపడ్డ పుతిన్
అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తత- అట్లాంటిక్‌లో చమురు ట్యాంకర్‌ సీజ్‌- మండిపడ్డ పుతిన్
Raja Saab Ticket Price: ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Avakai Amaravati Festival : పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని
పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని "అవకాయ్ -అమరావతి సంబరాలు", పాసులు ఎలా తీసుకోవాలి అంటే?
Jana Nayagan:విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
Embed widget