By: ABP Desam | Updated at : 04 Apr 2022 12:48 PM (IST)
హిందూపురం జిల్లాగా ప్రకటించారని కోరుతూ ధర్నా
అనంతపురం (Anantapuram)జిల్లా హిందూపురం()Hindupuramలో అఖిలపక్షం నేతలు భగ్గుమన్నారు. హిందూపురాన్ని జిల్లాగా ప్రకటించకపోవడాన్ని వాళ్లంతా తప్పుపట్టారు. ఈ ర్యాలీ సందర్భంగా అఖిలపక్ష కమిటీ ఛైర్మన్ చలపతి చేసిన ప్రసంగం ఉద్ధ్రిక్తతకు దారి తీసింది. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna)ను మూర్ఖుడని సంబోధించడం వివాదానికి దారి తీసింది.
ముగ్గురు మూర్ఖుల మాటతో వివాదం
హిందూపురాన్ని జిల్లాగా ప్రకటించకపోవడానికి ముగ్గురు మూర్ఖులు కారణమంటూ అఖిలపక్ష కమిటీ ఛైర్మన్ చలపతి కామెంట్ చేశారు. హిందూపురం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలు మూర్ఖులని వ్యాఖ్యానించడంతో వివాదం రాజుకుంది. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మూర్ఖుడని.. ఆయన చేతకానితనం వల్లే హిందూపురం జిల్లాగా గానీ జిల్లా కేంద్రంగా కానీ చేసుకోలేకపోయామన్నారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
బాలకృష్ణపై ఘాటు విమర్శలు
హిందూపురం జిల్లాగా మారకపోవడానికి బాలకృష్ణతోపాటు ఎమ్మెల్సీ ఇక్బాల్, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవన్పై కూడా చలపతి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కుటిల రాజకీయాలు మానుకుని ఎమ్మెల్యే బాలకృష్ణ, ఎమ్మెల్సీ ఇక్బాల్, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.
భగ్గుమన్న టీడీపీ
అఖిలపక్ష నేతలు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ(TDP) నేతలు. బాలకృష్ణకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన వారిపై దాడికి దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన ధర్నా కాస్త గందరగోళానికి దారి తీసింది. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని రెండు వర్గాలను చెదరగొట్టారు. బాలకృష్ణను మూర్ఖుడు అన్న అఖిలపక్ష కమిటీ ఛైర్మన్పై దాడికి యత్నించారు తెలుగుదేశం శ్రేణులు.
కోనసీమ జిల్లాలో నిరసనలు
కోనసీమ జిల్లాలో కూడా నిరసనలు హోరెత్తాయి. రాజ్యాంగ నిర్మాత బి ఆర్ అంబేద్కర్(Ambedkar) పేరు పెట్టాలని కోనసీమ కలెక్టరేట్ వద్ద దళితలు ఆందోళనలు చేపట్టారు. జిల్లా కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చేందుకు యత్నించారు. కానీ వాళ్లన పోలీసుల అడ్డుకున్నారు.
కొత్త జిల్లా ఆవిర్భావంలో భాగంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆ కార్యక్రమానికి ముందుగానే కలెక్టర్ను కలిసేందుకు ప్రయత్నించాయి దళిత సంఘాలు. దళితుల ఓట్లతో అధికారం చేపట్టిన జగన్ ఇప్పుడు వాళ్లకు అన్యాయం చేశారని నినాదాలు చేశారు.
కోనసీమను అంబేద్కర్ జిల్లాగా మార్చాలన్న డిమాండ్తో ఆందోళన చేపట్టిన నిరసనకారులు కలెక్టరేట్ ముందు బైఠాయించేందుకు యత్నించారు. పోలీసులు కలుగుచేసుకొని వారిని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. కానీ వాళ్లు మాట వినకపోయేసరికి దళిత నాయకులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ సందర్భంగా అక్కడ కాసేపు ఉద్ధ్రిక్తత వాతావరణం నెలకొంది.
Breaking News Live Updates : చిత్తూరు జిల్లాలో ఇద్దరి దారుణ హత్య
Pawan Kalyan : ఓట్లు చీలనివ్వకుండా బీజేపీని ఒప్పిస్తా, పొత్తులపై పవన్ క్లారిటీ
Petrol Diesel Price 21th May 2022 : తెలుగు రాష్ట్రాలో స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు, ఇవాళ్టి రేట్స్ ఇలా
Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో చల్లబడిన వాతావరణం, రాగల మూడు రోజుల్లో మోస్తరు వర్షాలు
Gold Silver Price Today 21th May 2022 : బంగారం, వెండి ధరలు పైపైకి, ప్రధాన నగరాల్లో ఇవాళ్టి రేట్స్ ఇలా
Rajiv Gandhi Death Anniversary : రాజీవ్ గాంధీ హత్యతో వైజాగ్ కు సంబంధం, ఆఖరి నిముషంలో విమానం రెడీ!
Pooja Hegde: ‘కేన్స్’లో పూజా హెగ్డేకు చేదు అనుభవం, ఆమె కోసం వారు నిద్రాహారాలు మానేశారట!
Hyderabad Honour Killing Case: మార్వాడీ అబ్బాయి, యాదవ్ అమ్మాయి లవ్ మ్యారేజీ, అంతలోనే పరువు హత్యపై పోలీసులు ఏమన్నారంటే !
Husband Murder : 'మీ భర్తను ఎలా చంపాలి' అనే పుస్తకం రాసిన రచయిత్రి, ఆపై పక్కా ప్లాన్ తో భర్త మర్డర్!