అన్వేషించండి

Vizag Sai Priya Issue: ఆర్కే బీచ్‌లో మిస్ అయి బెంగళూరుకు, వయా నెల్లూరు - ఇక్కడ ఏం జరిగిందంటే

Nellore: నెల్లూరు జిల్లా పోలీసులు తమని పట్టుకుంటారేమోనన్న అనుమానంతో వెంటనే సాయిప్రియ, రవి ఇద్దరూ బెంగళూరు వెళ్లిపోయారు.

విశాఖ ఆర్కేబీచ్ లో మాయమైపోయిన సాయిప్రియ ఎట్టకేలకు బెంగళూరులో తేలింది. అయితే మధ్యలో ఆమె నెల్లూరులో రెస్ట్ తీసుకోవడంతో కాసేపు జిల్లాలో కలకలం రేగింది. నెల్లూరు పోలీసులు కూడా హడావిడి పడ్డారు. అప్పటికే విశాఖ పోలీసులు ఆమెకోసం గాలింపు ముమ్మరం చేశారు. నేవీ అధికారులు హెలికాప్టర్లతో గాలించారు. గజ ఈతగాళ్లతో సముద్ర తీరంలో వెదుకులాట కూడా అయిపోయింది. అధికారులు హడావిడి పడ్డారు, పోలీసులు కూడా ఆమె జాడ తెలుసుకోడానికి కష్టపడ్డారు. తీరా ఆమె సముద్రంలో గల్లంతు కాలేదని, నెల్లూరులో ఉందనే సమాచారంతో నెల్లూరు జిల్లా పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. తీరా ఆమె గురించి సమాచారం తెలిసే లోపే నెల్లూరు నుంచి బెంగళూరు వెళ్లిపోయిందని తెలిసింది. 

నెల్లూరు జిల్లా కావలికి చెందిన రవి అనే వ్యక్తితో సాయిప్రియకు పరిచయం ఉంది. అతనితోపాటు ఆరోజు ఆమె విశాఖ బీచ్ నుంచి వెళ్లిపోయింది. నేరుగా నెల్లూరు జిల్లా కావలికి వచ్చింది. కావలిలో ఆమె ఉన్నట్టు ఎవరికీ సమాచారం లేదు. రవి కుటుంబం కూడా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచింది. మీడియా ద్వారా ఈ విషయం పోలీసులకు తెలిసినా సాయిప్రియ ఎక్కడుంది, ఎవరి సంరక్షణలో ఉంది అనే విషయం మాత్రం కనిపెట్టలేకపోయారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ కేసు సంచలనంగా మారడంతో పోలీసులు కూడా కాస్త టెన్షన్ పడ్డారు. సాయిప్రియను వెదుకులాడేందుకు టీమ్స్ రెడీ చేశారు. కానీ అంతలోనే ఆమె మకాం మార్చేసింది. 

నెల్లూరు జిల్లా పోలీసులు తమని పట్టుకుంటారేమోనన్న అనుమానంతో వెంటనే సాయిప్రియ, రవి ఇద్దరూ బెంగళూరు వెళ్లిపోయారు. విశాఖ నుంచి  కావలి వచ్చిన వారు, కావలి నుంచి బెంగళూరు వెళ్లారు. అక్కడ రవి, సాయిప్రియ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి ఫొటోలను కూడా ఆమె తల్లిదండ్రులకు వాట్సప్ చేశారు. వాట్సప్ లోనే ఆడియో సందేశాలు కూడా పంపించారు. తాను బతకాలని అనుకుంటున్నానని, తమకోసం వెతకొద్దని వేడుకుంది. ఇప్పటికే పరిగెత్తి అలసిపోయామని, ఇక ఎక్కడికీ వెళ్లలేమని తెలిపింది. 

వైజాగ్ నుంచి వచ్చిన సాయిప్రియ బెంగళూరుని సేఫ్ ప్లేస్ గా ఎంచుకుంది. రవితో కలసి పారిపోయిన ఆమె.. రాష్ట్రంలో ఉంటే ఏపీ పోలీసులు జల్లెడ పడతారని భావించి ముందుగానే బెంగళూరు వెళ్లినట్టు తెలుస్తోంది. బెంగళూరు నుంచి తల్లిదండ్రులకు మెసేజ్ లు పంపిస్తున్న సాయి ప్రియ, విశాఖ అధికారులను ఇబ్బంది పెట్టినందుకు క్షమించమని అడిగింది. అధికారులను ఆమె కావాలని తప్పుదోవ పట్టించలేదు కానీ, అధికారులు మాత్రం ఆమెను వెదికే క్రమంలో ప్రజాధనం వృథా చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో సాయిప్రియ వైజాగ్ కి వస్తే ఆమెపై చర్యలు తీసుకుంటారా, లేక కుటుంబ గొడవలుగా ఆ వ్యవహారాన్ని వదిలేస్తారా అనేది చూడాల్సి ఉంది. ఇప్పటికే తమ కుమార్తె మిస్సింగ్ అంటూ తండ్రి కేసు పెట్టారు, మరి ఆమెతో కలసి వెళ్లిన రవిపై చర్యలేమైనా తీసుకుంటారేమో చూడాలి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Blowout: గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Blowout: గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Embed widget