అన్వేషించండి

Nupur Sharma Issue: వాళ్లపై దేశ ద్రోహం కేసు పెట్టాల్సిందే, వైసీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు

మత సామరస్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ పై నామమాత్రపు చర్యలు తీసకోవడం కాకుండా, దేశద్రోహం నేరం క్రింద కేసులు నమోదు చేయాలని వైసీపీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.

మత సామరస్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ పై నామమాత్రపు చర్యలు తీసుకోవడం కాకుండా, దేశద్రోహం నేరం క్రింద కేసులు నమోదు చేసి, జైలుకి పంపించాలని డిమాండ్ చేశారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. హిందు, ముస్లిం, క్రిస్టియన్, సిక్కు.. ఇలా ఏ మత మనోభావాల పట్ల, ఆచారాల పట్ల సంకుచిత, అనుచిత వ్యాఖ్యలు చేసే వ్యక్తులకు.. టెర్రరిస్ట్ లకు వేసే శిక్ష వేయాలని కోరారు. అలా చేస్తేనే.. ఇలాంటి ఘటనలు పునరావృతం కావని అన్నారు. 

మహమ్మద్ ప్రవక్త, ఇస్లాం ధర్మంపై బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ చేసిన అనుచిత వ్యాఖ్యలని ముస్లిం సమాజంపై దాడి, భారతీయ సమాజాన్ని విచ్చిన్నం చేసే ప్రయత్నంగా భావిస్తున్నామని అన్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ మహమ్మద్ ప్రవక్త, ఇస్లాంపై చేసిన వ్యాఖ్యలు అనుచితమే కాకుండా.. దారుణం, దుర్మార్గం అని కూడా అన్నారాయన. ఆ వ్యాఖ్యల్ని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తన్నానని, ఖండిస్తున్నానని చెప్పారు. నెల్లూరులోని తన కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించిన రూరల్ ఎమ్మెల్యే.. నుపుర్ శర్మ వ్యాఖ్యలను సమాజం హర్షించదని చెప్పారు. 

విభిన్న కులాలు, విభిన్న మతాలు, విభిన్న జాతులు కలిసి వసుదైక కుటుంబంగా భారత దేశం విరాజిల్లుతోందని చెప్పారు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి. భారతీయ సమాజంలో ఇలాంటి వ్యాఖ్యలు ప్రజల మధ్య  చిచ్చు పెడతాయని చెప్పారు ప్రజా జీవానికి విఘాతం కలిగించేలా పనిచేస్తాయని అన్నారు. మత సామారస్యాన్ని దెబ్బతీస్తాయని చెప్పారు. 

ఇప్పటికే నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ పై బీజేపీ సస్పెన్షన్ వేటు వేసింది. అయితే ఇది కేవలం సస్పెన్షన్ తో సరిపెట్టేది కాదని, వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి. జాతి విచ్ఛిన్నం, దేశద్రోహం, మత సామరస్యానికి విఘాతం కలిగించే చర్యలుగా వారి వ్యాఖ్యలను భావించాల్సి ఉంటుందని చెప్పారు. దేశద్రోహం నేరం క్రింద కేసులు నమోదు చేసి జైలుకి పంపించాలని కోరారు. 

మత విద్వేష వ్యాఖ్యలు చేసే వారికి, టెర్రరిస్ట్ లకు తేడా లేదని అన్నారు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి. టెర్రరిస్టులమీద ఎలాంటి చట్టాలు ప్రయోగిస్తున్నామో.. అలాంటి చట్టాలనే మత విద్వేష వ్యాఖ్యలు చేసే వారిపై ప్రయోగించాలని, అలాంటి చట్టాల ఆధారంగా వారిని శిక్షించాలని చెప్పారు. అప్పుడే ఇలాంటి ఘటనలు పునరావృతం కావని అన్నారు. 

ఇప్పటికే పలువురు నాయకులు నుపుర్ శ్రమ వివాదంపై స్పందించారు. ముఖ్యంగా తెలంగాణలో మైనార్టీ ప్రజలు కూడా వీధుల్లోకి వచ్చి తమ నిరసన తెలియజేశారు. కాంగ్రెస్ నేతలు పలువురు తీవ్రంగా స్పందించారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న టీఆర్ఎస్ కూడా ఈ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించింది. ఇప్పుడు ఏపీ నుంచు వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ఈ విషయంపై స్పందించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Embed widget