అన్వేషించండి

Nellore: అమర్ నాథ్‌లో నెల్లూరు యాత్రికులు! ఆ 34 మంది ఏపీ వాసుల పరిస్థితి ఏంటి?

అమర్ నాథ్ వరదల వల్ల ఏపీకి చెందిన 34మంది గల్లంతయ్యారని తెలుస్తోంది. వీరిలో నెల్లూరు నుంచి వెళ్లిన రెండు బృందాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఈమేరకు ఏపీ ప్రభుత్వానికి సమాచారం వచ్చింది.

Amarnath Yatra Tragedy: అమర్ నాథ్ లో ఆకస్మిక వరదల కారణంగా యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఏపీ నుంచి అమర్‌ నాథ్‌ కు వెళ్లినవారిలో 20 మంది ఆదివారం సురక్షితంగా సొంత రాష్ట్రానికి చేరుకున్నారు. వీరంతా విజయవాడకు వచ్చారు, అక్కడినుంచి సొంత ప్రాంతాలకు వెళ్లారు. మరో 18 మంది ఈరోజు ఉదయం రైలులో చండీగఢ్‌ నుంచి బయలుదేరి విజయవాడకు చేరుకునేలా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. 

34 మంది గల్లంతు.. 
అమర్ నాథ్ వరదల వల్ల ఏపీకి చెందిన 34 మంది గల్లంతయ్యారని తెలుస్తోంది. వీరిలో నెల్లూరు నుంచి వెళ్లిన రెండు బృందాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి సమాచారం వచ్చింది. నెల్లూరు నుంచి వెళ్లిన రెండు బృందాల్లో 29 మంది యాత్రికులు ఉన్నట్టు సమాచారం. వీరితోపాటు ఏలూరు, తణుకు, ఉండ్రాజవరం, రాజమండ్రికి చెందినవారు కూడా అమర్ నాథ్ లో చిక్కుకుపోయినట్టు తెలుస్తోంది. 

అమర్‌ నాథ్‌ యాత్రలో వరదల తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. తమ రాష్ట్రం నుంచి ఎవరెవరు యాత్రకు వెళ్లారు, ఎక్కడ ఉన్నారు, వారి క్షేమ సమాచారాలేంటి అనే విషయాలను అధికారులు ఆరా తీశారు. ఏపీకి సంబంధించి కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి అప్రమత్తంచేశారు సీఎం జగన్. అమర్ నాథ్ యాత్రకు వెళ్లినవారి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు రెవెన్యూ అధికారులు. వారి అడ్రస్ లు, ఫోన్ నెంబర్లకోసం ట్రై చేస్తున్నారు. కొంతమంది తమ బంధువులు క్షేమంగా ఉన్నారని చెబుతున్నారు. వరదలు రాకముందే వారంతా అక్కడినుంచి వెళ్లిపోయారని ప్రభుత్వ అధికారులకు సమాచారమిచ్చారు. మరికొందరు మాత్రం వరదల కారణంగా గల్లంతయ్యారని తెలుస్తోంది. బంధువులు ఫోన్ చేసినా రెస్పాన్స్ లేదు, కొంతమంది ఫోన్లు స్విచాఫ్ వస్తున్నాయి. దీంతో ఇక్కడివారు ఆదుర్దా పడుతున్నారు. 

గల్లంతయ్యారా..? లేక..?
సహజంగా ఇలాంటి సందర్భాల్లో సిగ్నల్స్ లేకపోవడం, చార్జింగ్ లేక ఫోన్ స్విచాప్ కావడంతో.. ఫోన్ కాంటాక్ట్ లు ఉండవు. అయితే ఇప్పుడు పరిస్థితి అదేనే లాక ప్రమాదం ఏదైనా జరిగిందా అని ఇక్కడి బంధువులు ఆందోళనగా ఉన్నారని తెలుస్తోంది. రాజమండ్రికి చెందినవారు గల్లంతయ్యారని అనుకున్నా.. ఆ తర్వాత వారు సురక్షితంగానే ఉన్నారని తేలింది. మరి ఇప్పుడు ఆచూకీ తెలియని 34 మంది సంగతేంటి..? వీరిలో అందరూ క్షేమమేనా..? లేక ఎవరికైనా ఇబ్బంది జరిగిందా అనేది తేలాల్సి ఉంది. 

నెల్లూరులో క్షణం క్షణం..
అమర్ నాథ్ లో చిక్కుకుపోయిన వారిలో నెల్లూరు జిల్లావారే ఎక్కువగా ఉండటంతో స్థానిక యంత్రాంగం అప్రమత్తమైంది. బంధువుల సమాచారం తెలియనివారు నెల్లూరులోని కలెక్టరేట్ కార్యాలయంలో సంప్రదించాలని సూచిస్తున్నారు అధికారులు. ఎవ్వరూ ఆందోళన చెందవద్దని, సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని, యాత్రికులంతా క్షేమంగా స్వస్థలాలకు వస్తారని భరోసా ఇస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: మాజీ మావోయిస్టు గాదె ఇన్నయ్యకి బెయిల్‌!
మాజీ మావోయిస్టు గాదె ఇన్నయ్యకి బెయిల్‌!
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Vijaya Sai Reddy New Political Party: కొత్త పార్టీ పెడుతున్నా! తిరుమలలో విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! 
కొత్త పార్టీ పెడుతున్నా! తిరుమలలో విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! 
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
Embed widget