అన్వేషించండి

Nellore: అమర్ నాథ్‌లో నెల్లూరు యాత్రికులు! ఆ 34 మంది ఏపీ వాసుల పరిస్థితి ఏంటి?

అమర్ నాథ్ వరదల వల్ల ఏపీకి చెందిన 34మంది గల్లంతయ్యారని తెలుస్తోంది. వీరిలో నెల్లూరు నుంచి వెళ్లిన రెండు బృందాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఈమేరకు ఏపీ ప్రభుత్వానికి సమాచారం వచ్చింది.

Amarnath Yatra Tragedy: అమర్ నాథ్ లో ఆకస్మిక వరదల కారణంగా యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఏపీ నుంచి అమర్‌ నాథ్‌ కు వెళ్లినవారిలో 20 మంది ఆదివారం సురక్షితంగా సొంత రాష్ట్రానికి చేరుకున్నారు. వీరంతా విజయవాడకు వచ్చారు, అక్కడినుంచి సొంత ప్రాంతాలకు వెళ్లారు. మరో 18 మంది ఈరోజు ఉదయం రైలులో చండీగఢ్‌ నుంచి బయలుదేరి విజయవాడకు చేరుకునేలా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. 

34 మంది గల్లంతు.. 
అమర్ నాథ్ వరదల వల్ల ఏపీకి చెందిన 34 మంది గల్లంతయ్యారని తెలుస్తోంది. వీరిలో నెల్లూరు నుంచి వెళ్లిన రెండు బృందాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి సమాచారం వచ్చింది. నెల్లూరు నుంచి వెళ్లిన రెండు బృందాల్లో 29 మంది యాత్రికులు ఉన్నట్టు సమాచారం. వీరితోపాటు ఏలూరు, తణుకు, ఉండ్రాజవరం, రాజమండ్రికి చెందినవారు కూడా అమర్ నాథ్ లో చిక్కుకుపోయినట్టు తెలుస్తోంది. 

అమర్‌ నాథ్‌ యాత్రలో వరదల తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. తమ రాష్ట్రం నుంచి ఎవరెవరు యాత్రకు వెళ్లారు, ఎక్కడ ఉన్నారు, వారి క్షేమ సమాచారాలేంటి అనే విషయాలను అధికారులు ఆరా తీశారు. ఏపీకి సంబంధించి కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి అప్రమత్తంచేశారు సీఎం జగన్. అమర్ నాథ్ యాత్రకు వెళ్లినవారి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు రెవెన్యూ అధికారులు. వారి అడ్రస్ లు, ఫోన్ నెంబర్లకోసం ట్రై చేస్తున్నారు. కొంతమంది తమ బంధువులు క్షేమంగా ఉన్నారని చెబుతున్నారు. వరదలు రాకముందే వారంతా అక్కడినుంచి వెళ్లిపోయారని ప్రభుత్వ అధికారులకు సమాచారమిచ్చారు. మరికొందరు మాత్రం వరదల కారణంగా గల్లంతయ్యారని తెలుస్తోంది. బంధువులు ఫోన్ చేసినా రెస్పాన్స్ లేదు, కొంతమంది ఫోన్లు స్విచాఫ్ వస్తున్నాయి. దీంతో ఇక్కడివారు ఆదుర్దా పడుతున్నారు. 

గల్లంతయ్యారా..? లేక..?
సహజంగా ఇలాంటి సందర్భాల్లో సిగ్నల్స్ లేకపోవడం, చార్జింగ్ లేక ఫోన్ స్విచాప్ కావడంతో.. ఫోన్ కాంటాక్ట్ లు ఉండవు. అయితే ఇప్పుడు పరిస్థితి అదేనే లాక ప్రమాదం ఏదైనా జరిగిందా అని ఇక్కడి బంధువులు ఆందోళనగా ఉన్నారని తెలుస్తోంది. రాజమండ్రికి చెందినవారు గల్లంతయ్యారని అనుకున్నా.. ఆ తర్వాత వారు సురక్షితంగానే ఉన్నారని తేలింది. మరి ఇప్పుడు ఆచూకీ తెలియని 34 మంది సంగతేంటి..? వీరిలో అందరూ క్షేమమేనా..? లేక ఎవరికైనా ఇబ్బంది జరిగిందా అనేది తేలాల్సి ఉంది. 

నెల్లూరులో క్షణం క్షణం..
అమర్ నాథ్ లో చిక్కుకుపోయిన వారిలో నెల్లూరు జిల్లావారే ఎక్కువగా ఉండటంతో స్థానిక యంత్రాంగం అప్రమత్తమైంది. బంధువుల సమాచారం తెలియనివారు నెల్లూరులోని కలెక్టరేట్ కార్యాలయంలో సంప్రదించాలని సూచిస్తున్నారు అధికారులు. ఎవ్వరూ ఆందోళన చెందవద్దని, సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని, యాత్రికులంతా క్షేమంగా స్వస్థలాలకు వస్తారని భరోసా ఇస్తున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP Rains Alert: ఏపీలో 2 రోజులపాటు పలు జిల్లాల్లో పిడుగులతో వర్షాలు.. మరోవైపు నిప్పులు చెరిగే ఎండలు!
ఏపీలో 2 రోజులపాటు పలు జిల్లాల్లో పిడుగులతో వర్షాలు.. మరోవైపు నిప్పులు చెరిగే ఎండలు!
Telugu Desam Party:'గీత దాటితే సస్పెండ్ చేస్తా'' మరోసారి అధినేత వార్నింగ్‌'! మాకు నమ్మకం లేదు 'బాబు' అంటున్న తమ్ముళ్లు!
'గీత దాటితే సస్పెండ్ చేస్తా'' మరోసారి అధినేత వార్నింగ్‌'! మాకు నమ్మకం లేదు 'బాబు' అంటున్న తమ్ముళ్లు!
Amaravati: అమరావతి విషయంలో వైసీపీ లెక్క తప్పింది అక్కడే! టీడీపీని మెట్టు ఎక్కించింది అదే! 
అమరావతి విషయంలో వైసీపీ లెక్క తప్పింది అక్కడే! టీడీపీని మెట్టు ఎక్కించింది అదే! 
Amaravati Latest News: రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత బిల్లు! రామ్మోహన్ నాయుడు, రేణుకా చౌదరి కీలక వ్యాఖ్యలు!
రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత బిల్లు! రామ్మోహన్ నాయుడు, రేణుకా చౌదరి కీలక వ్యాఖ్యలు!

వీడియోలు

Rajasthan Royals vs Gujarat Titans IPL 2026 | రాజ‌స్థాన్ రాయల్స్ థ్రిల్లింగ్ విక్ట‌రీ
IPL 2026 Jofra Archer Death Overs RR vs GT | 19వ ఓవర్ లో జోఫ్రా ఆర్చర్ మ్యాజిక్
Siraj Catch Drop GT vs RR IPL 2026 | సిరాజ్ ఈజీ క్యాచ్‌ను సిక్సర్‌గా మార్చేశాడా
IPL 2026 Delhi Capitals vs Mumbai Indians | ఢిల్లీకి వ‌రుస‌గా రెండో విజ‌యం
Riyan Parag Credits Dhruv Jurel RR vs GT IPL 2026 | రియాన్ పరాగ్ ప్లాన్ వెనుక ఉన్నది అతనే

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains Alert: ఏపీలో 2 రోజులపాటు పలు జిల్లాల్లో పిడుగులతో వర్షాలు.. మరోవైపు నిప్పులు చెరిగే ఎండలు!
ఏపీలో 2 రోజులపాటు పలు జిల్లాల్లో పిడుగులతో వర్షాలు.. మరోవైపు నిప్పులు చెరిగే ఎండలు!
Basara Temple Master Plan: రూ.225 కోట్ల‌తో బాస‌ర స‌ర‌స్వ‌తి ఆల‌యం పునర్ నిర్మాణం.. 9 అంత‌స్తుల రాజ‌గోపురం, ఈశాన్యాన కోనేరు
రూ.225 కోట్ల‌తో బాస‌ర స‌ర‌స్వ‌తి ఆల‌యం పునర్ నిర్మాణం.. 9 అంత‌స్తుల రాజ‌గోపురం, ఈశాన్యాన కోనేరు
IPL 2026 RCB VS CSK Updates: ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ.. 2 వ‌రుస విజ‌యాలతో జోరు.. స‌త్తా చాటిన భువీ, 43 ర‌న్స్ తో సీఎస్కే చిత్తు
ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ.. 2 వ‌రుస విజ‌యాలతో జోరు.. స‌త్తా చాటిన భువీ, 43 ర‌న్స్ తో సీఎస్కే చిత్తు
Hyderabad Crime News: ఫేస్‌బుక్‌లో పరిచయంతో హైదరాబాద్ టెకీ నుంచి రూ.2.36 కోట్లు కొట్టేసిన కిలేడీ!
ఫేస్‌బుక్‌లో పరిచయంతో హైదరాబాద్ టెకీ నుంచి రూ.2.36 కోట్లు కొట్టేసిన కిలేడీ!
MAVIGUN : జగన్ MAVIGUN ట్రెండ్ - టైటిల్ రిజిస్టర్ చేయించిన ప్రొడ్యూసర్!... ఏ జానర్‌లో మూవీ తీస్తారో?
జగన్ MAVIGUN ట్రెండ్ - టైటిల్ రిజిస్టర్ చేయించిన ప్రొడ్యూసర్!... ఏ జానర్‌లో మూవీ తీస్తారో?
Khanapur Municipal Chairman: కాంగ్రెస్‌కు నిరాశే.. ఖానాపూర్ మున్సిపాలిటీ దక్కించుకున్న బీజేపీ, వైస్ చైర్మన్‌గా బీఆర్ఎస్
కాంగ్రెస్‌కు నిరాశే.. ఖానాపూర్ మున్సిపాలిటీ దక్కించుకున్న బీజేపీ, వైస్ చైర్మన్‌గా బీఆర్ఎస్
RTC Bus Catches Fire: హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి ఆర్టీసీ బస్సులో మంటలు.. కడప జిల్లాలో ప్రమాదం
హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి ఆర్టీసీ బస్సులో మంటలు.. కడప జిల్లాలో ప్రమాదం
IPL 2026 SRH VS LSG Result Update: పంత్ కెప్టెన్ ఇన్నింగ్స్.. బోణీ కొట్టిన ల‌క్నో.. బ్యాటింగ్ వైఫల్యంతో స‌న్ రైజ‌ర్స్ కు ప‌రాజ‌యం
పంత్ కెప్టెన్ ఇన్నింగ్స్.. బోణీ కొట్టిన ల‌క్నో.. బ్యాటింగ్ వైఫల్యంతో స‌న్ రైజ‌ర్స్ కు ప‌రాజ‌యం
Embed widget