అన్వేషించండి

Nellore: అమర్ నాథ్‌లో నెల్లూరు యాత్రికులు! ఆ 34 మంది ఏపీ వాసుల పరిస్థితి ఏంటి?

అమర్ నాథ్ వరదల వల్ల ఏపీకి చెందిన 34మంది గల్లంతయ్యారని తెలుస్తోంది. వీరిలో నెల్లూరు నుంచి వెళ్లిన రెండు బృందాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఈమేరకు ఏపీ ప్రభుత్వానికి సమాచారం వచ్చింది.

Amarnath Yatra Tragedy: అమర్ నాథ్ లో ఆకస్మిక వరదల కారణంగా యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఏపీ నుంచి అమర్‌ నాథ్‌ కు వెళ్లినవారిలో 20 మంది ఆదివారం సురక్షితంగా సొంత రాష్ట్రానికి చేరుకున్నారు. వీరంతా విజయవాడకు వచ్చారు, అక్కడినుంచి సొంత ప్రాంతాలకు వెళ్లారు. మరో 18 మంది ఈరోజు ఉదయం రైలులో చండీగఢ్‌ నుంచి బయలుదేరి విజయవాడకు చేరుకునేలా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. 

34 మంది గల్లంతు.. 
అమర్ నాథ్ వరదల వల్ల ఏపీకి చెందిన 34 మంది గల్లంతయ్యారని తెలుస్తోంది. వీరిలో నెల్లూరు నుంచి వెళ్లిన రెండు బృందాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి సమాచారం వచ్చింది. నెల్లూరు నుంచి వెళ్లిన రెండు బృందాల్లో 29 మంది యాత్రికులు ఉన్నట్టు సమాచారం. వీరితోపాటు ఏలూరు, తణుకు, ఉండ్రాజవరం, రాజమండ్రికి చెందినవారు కూడా అమర్ నాథ్ లో చిక్కుకుపోయినట్టు తెలుస్తోంది. 

అమర్‌ నాథ్‌ యాత్రలో వరదల తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. తమ రాష్ట్రం నుంచి ఎవరెవరు యాత్రకు వెళ్లారు, ఎక్కడ ఉన్నారు, వారి క్షేమ సమాచారాలేంటి అనే విషయాలను అధికారులు ఆరా తీశారు. ఏపీకి సంబంధించి కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి అప్రమత్తంచేశారు సీఎం జగన్. అమర్ నాథ్ యాత్రకు వెళ్లినవారి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు రెవెన్యూ అధికారులు. వారి అడ్రస్ లు, ఫోన్ నెంబర్లకోసం ట్రై చేస్తున్నారు. కొంతమంది తమ బంధువులు క్షేమంగా ఉన్నారని చెబుతున్నారు. వరదలు రాకముందే వారంతా అక్కడినుంచి వెళ్లిపోయారని ప్రభుత్వ అధికారులకు సమాచారమిచ్చారు. మరికొందరు మాత్రం వరదల కారణంగా గల్లంతయ్యారని తెలుస్తోంది. బంధువులు ఫోన్ చేసినా రెస్పాన్స్ లేదు, కొంతమంది ఫోన్లు స్విచాఫ్ వస్తున్నాయి. దీంతో ఇక్కడివారు ఆదుర్దా పడుతున్నారు. 

గల్లంతయ్యారా..? లేక..?
సహజంగా ఇలాంటి సందర్భాల్లో సిగ్నల్స్ లేకపోవడం, చార్జింగ్ లేక ఫోన్ స్విచాప్ కావడంతో.. ఫోన్ కాంటాక్ట్ లు ఉండవు. అయితే ఇప్పుడు పరిస్థితి అదేనే లాక ప్రమాదం ఏదైనా జరిగిందా అని ఇక్కడి బంధువులు ఆందోళనగా ఉన్నారని తెలుస్తోంది. రాజమండ్రికి చెందినవారు గల్లంతయ్యారని అనుకున్నా.. ఆ తర్వాత వారు సురక్షితంగానే ఉన్నారని తేలింది. మరి ఇప్పుడు ఆచూకీ తెలియని 34 మంది సంగతేంటి..? వీరిలో అందరూ క్షేమమేనా..? లేక ఎవరికైనా ఇబ్బంది జరిగిందా అనేది తేలాల్సి ఉంది. 

నెల్లూరులో క్షణం క్షణం..
అమర్ నాథ్ లో చిక్కుకుపోయిన వారిలో నెల్లూరు జిల్లావారే ఎక్కువగా ఉండటంతో స్థానిక యంత్రాంగం అప్రమత్తమైంది. బంధువుల సమాచారం తెలియనివారు నెల్లూరులోని కలెక్టరేట్ కార్యాలయంలో సంప్రదించాలని సూచిస్తున్నారు అధికారులు. ఎవ్వరూ ఆందోళన చెందవద్దని, సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని, యాత్రికులంతా క్షేమంగా స్వస్థలాలకు వస్తారని భరోసా ఇస్తున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ

వీడియోలు

పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Bhimavaram Beat Song : సంక్రాంతి స్పెషల్ 'భీమవరం బీట్' - సింగర్ స్మితతో RRR స్టెప్పులు... ట్రెండింగ్ లిరిక్స్
సంక్రాంతి స్పెషల్ 'భీమవరం బీట్' - సింగర్ స్మితతో RRR స్టెప్పులు... ట్రెండింగ్ లిరిక్స్
Mobile Bluetooth: ఫోన్ బ్లూటూత్ నిత్యం ఆన్‌లో ఉంటుందా? మీ బ్యాంక్ ఖాతా క్షణాల్లో ఖాళీ అవుతుంది జాగ్రత్త!
ఫోన్ బ్లూటూత్ నిత్యం ఆన్‌లో ఉంటుందా? మీ బ్యాంక్ ఖాతా క్షణాల్లో ఖాళీ అవుతుంది జాగ్రత్త!
Bharat Taxi App: భారత టాక్సీ యాప్ అంటే ఏంటి? రైడ్ బుకింగ్ విధానం, ప్రైస్‌ పూర్తి సమాచారం ఇదే!
భారత టాక్సీ యాప్ అంటే ఏంటి? రైడ్ బుకింగ్ విధానం, ప్రైస్‌ పూర్తి సమాచారం ఇదే!
China Corruption mayor: చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
Embed widget