అన్వేషించండి

Minister Vidadala Rajini : వైద్య ఆరోగ్యశాఖలో ఎలాంటి తప్పులు క్షమించం, ఉదయగిరి ఘటనపై స్పందించిన మంత్రి విడదల రజిని

Minister Vidadala Rajini : నెల్లూరు జిల్లాలో పోస్టుమార్టానికి లంచం అడిగిన వైద్యుడిపై తీవ్ర చర్యలుంటాయని మంత్రి విడదల రజిని తెలిపారు. ఇప్పటికి వైద్యుడిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారని మంత్రి వెల్లడించారు.

Minister Vidadala Rajini : నెల్లూరు జిల్లా ఉద‌య‌గిరి ఘ‌ట‌న‌పై మంత్రి విడ‌ద‌ల ర‌జిని స్పందించారు. ఉద‌య‌గిరి ఘ‌ట‌న‌పై నెల్లూరు జిల్లా ఉన్నతాధికారుల‌కు ప‌లు ఆదేశాలు జారీ చేశారు. నిరుపేద కుటుంబం నుంచి రూ.16 వేలు లంచం డిమాండ్ చేసిన‌ డాక్టర్ సంధాని బాషాపై తీవ్ర చ‌ర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోస్టుమార్టం కోసం డాక్టర్. సంధాని బాషా లంచం డిమాండ్ చేయ‌డం అమాన‌వీయం అని మంత్రి రజిని అన్నారు. విష‌యం తన దృష్టికి వ‌చ్చిన వెంట‌నే మెడిక‌ల్ ఆఫీస‌ర్ సంధాని బాషాను స‌స్పెండ్ చేశామన్నారు. పోస్టు మార్టం కోసం ఏ ప్రభుత్వ ఆస్పత్రిలోనూ ఏ వైద్యుడికి కూడా ఎవ‌రూ డ‌బ్బులు ఇవ్వొద్దని సూచించారు. ప్రజ‌ల‌కు మెరుగైన వైద్యం అందించ‌డం వైఎస్సార్సీపీ ప్రభుత్వం లక్ష్యమని తెలిపారు. 

'వైద్య ఆరోగ్యశాఖ‌లో ఎలాంటి త‌ప్పిదాల‌నూ క్షమించం. అధికారుల‌పై ఆరోప‌ణ‌లు వ‌స్తే ఉపేక్షించం. వెనువెంట‌నే చ‌ర్యలు తీసుకుంటున్నాం. త‌ల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవ‌లు ఇత‌ర రాష్ట్రాల‌కు ఆద‌ర్శంగా ఉన్నాయి. ఒక్క ఏప్రిల్ నెల‌లోనే త‌ల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహ‌నాల ద్వారా 18,450 మంది త‌ల్లులు, శిశువుల‌ను వారి గ‌మ్యస్థానాల‌కు చేర్చాం. ఇత‌ర రాష్ట్రాలు ఆద‌ర్శంగా తీసుకునేలా త‌ల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహ‌నాలు ప‌నిచేస్తున్నాయి' అని మంత్రి విడదల రజిని అన్నారు. 

అసలేం జరిగింది?  

నిరుపేద కుటుంబం నుంచి పోస్టుమార్టం కోసం డబ్బులు డిమాండ్ చేశాడో డాక్టర్. తనవద్ద అంత డబ్బు లేవని తగ్గించాలని వేడుకుంది మృతుడి భార్య. అయినా వైద్యుడు కనికరించలేదు. చేసేదేంలేక చివరకు వైద్యుడు అడిగిన రూ.15 వేలు ఇచ్చి ఆత్మహత్య చేసుకున్న తన భర్త మృతదేహానికి పోస్టుమార్టం చేయించింది. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై స్పందించిన మంత్రి వైద్యుడిపై సస్పెన్షన్‌ చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు మండలం రాయకుంట గ్రామానికి చెందిన ముదిరాజ్‌ (27) కొండారెడ్డిపల్లి పనుల నిమిత్తం వచ్చాడు. ఆర్థిక సమస్యలతో మంగళవారం రాత్రి ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. 

పోస్టుమార్టం చేసేందుకు ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రానికి ముదిరాజ్ మృతదేహాన్ని పోలీసులు తరలించారు. అక్కడి డాక్టర్ సంధాని బాషా ఫోన్‌పే నంబరు ఇచ్చి రూ.15 చెల్లించాలని మృతుడి భార్య మునీశ్వరి తెలిపారు. తగ్గించమని కోరగా అందుకు వైద్యుడు ఒప్పుకోలేదు. రూ.15 వేలు తాను చెప్పిన నంబరుకు ఫోన్ పే చేయాలని, వాచ్‌మన్‌కు రూ.వెయ్యి ఇవ్వాలని సూచించారు. తగ్గించే ప్రసక్తి లేదని తేల్చి చెప్పాడు. రూ.8వేలు ఇస్తామని బతిమిలాడినా పట్టించుకోలేదని ఆవేదన చెందింది. చివరికి డాక్టర్ అడిగినంత ఇచ్చి పోస్టుమార్టం చేయించానని వెల్లడించింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Blowout: గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Blowout: గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Embed widget