అన్వేషించండి

Nara Lokesh : వాళ్లందర్నీ చెప్పులతో తరిమికొట్టే రోజులు దగ్గర్లో ఉన్నాయి - నారా లోకేష్ ఆగ్రహం

టీడీపీ కార్యకర్తపై వైసీపీ దాడుల్ని నారా లోకేష్ ఖండించారు. అలాంటి వాళ్లందర్నీ ప్రజలు చెప్పుతో కొట్టి తరిమేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు.


Nara Lokesh :  టీడీపీ నేతలపై వివిధ  ప్రాంతాల్లో  జరుగుతున్న దాడులపై నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా  నంద్యాల జిల్లా కొలిమిగండ్లలో తెలుగు యువత అధికార ప్రతినిధి మంద విజయ్ గోపాల్ పై వైఎస్ఆర్‌సీపీ నేతలు  చేసిన దాడిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఖండించారు. విజయ్ గోపాల్‌ను వైసీపీ సైకోలు చెప్పులతో కొట్టి అవమానించారని… అవే చెప్పులతో ప్రజలే వారిని తరిమితరిమి కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చ‌రించారు. అధికార పార్టీ నాయకులు ఫ్యాక్షనిస్టుల కంటే దారుణంగా దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు.      

18 ఏళ్లు దాటిన మహిళలందరికి 18వేలు ఆర్థికసాయం, నేడు టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ 

మంద విజయ్ గోపాల్ పై  వైఎస్ఆర్‌సీపీ నేతలు దాడులు చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.                        

 

 
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే వేలాది మందిపై వైసీపీ సైకోలు దాడులకు పాల్పడ్డారని  లోకేష్ ఆరోపించారు. ప్రతిపక్ష నేతలపై దాడికి పాల్పడుతున్న ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదని లోకేశ్ హెచ్చరించారు. రాజకీయ కక్షసాధింపులో అధికార పార్టీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష టీడీపీ నాయకులపై వైసీపీ నాయకులు వరుసగా దాడులు చేస్తుంటే శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులు ఏం చేస్తున్నట్లు? అని లోకేశ్ ట్విటర్ వేదికగా ప్రశ్నించారు.           

చంద్రబాబు నాయుడుపై నమోదైన కేసుల వివరాలేంటీ? అవి ఏ పొజిషన్‌లో ఉన్నాయి?                                              

న్యాయం చేయాల్సిన పోలీసులు చివరకు దాడికి గురైన బాధితులపైనే రివర్స్‌ కేసులు పెట్టి వేధించడం దురదృష్టకరమన్నారు. మరోవైపు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం భీమవరం గ్రామ టీడీపీ అధ్యక్షుడు మునిరత్నం నాయుడిపై స్థానిక వైసీపీ నాయకుడు కొటాల చంద్రశేఖర్ రెడ్డి అనుచరులతో కలిసి రాళ్లదాడికి పాల్పడటాన్ని లోకేశ్ ఖండించారు. వైసీపీ ఫ్యాక్షన్ పాలనలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని మండిపడ్డారు.                                                       
 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

HCU Students: కంచ గచ్చిబౌలి భూవివాదంలో హెచ్సీయూ విద్యార్థులపై కేసులు ఎత్తివేత!
HCU Students: కంచ గచ్చిబౌలి భూవివాదంలో హెచ్సీయూ విద్యార్థులపై కేసులు ఎత్తివేత!
YS Sharmila: పులిబిడ్డ పులిబిడ్డే - జగన్‌కో మరోసారి షర్మిల స్ట్రాంగ్ కౌంటర్
పులిబిడ్డ పులిబిడ్డే - జగన్‌కో మరోసారి షర్మిల స్ట్రాంగ్ కౌంటర్
Andhra Health:  టెన్షన్ ఆడవారికి - షుగర్ మగవాళ్లకి - ఏపీలో ప్రజల ఆరోగ్య పరిస్థితులపై సంచలన రిపోర్టు
టెన్షన్ ఆడవారికి - షుగర్ మగవాళ్లకి - ఏపీలో ప్రజల ఆరోగ్య పరిస్థితులపై సంచలన రిపోర్టు
LPG Cylinder Price: దేశవ్యాప్తంగా గ్యాస్‌ వినియోగదారులకు షాక్ - సిలిండర్‌పై రూ. 50 పెంపు 
దేశవ్యాప్తంగా గ్యాస్‌ వినియోగదారులకు షాక్ - సిలిండర్‌పై రూ. 50 పెంపు 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Tilakvarma removed Mumbai Indians Name | ముంబై ఇండియన్స్ పేరును తొలగించిన తిలక్ వర్మ | ABP DesamJasprit Bumrah Re Entry | బుమ్రాను గాల్లోకి ఎత్తి మరీ ప్రకటించిన పొలార్డ్ | ABP DesamMI vs RCB Match preview IPL 2025 | పదేళ్ల గడిచిపోయాయి..ఇప్పటికైనా దక్కేనా.? | ABP DesamSiraj Bowling in IPL 2025 | ఐపీఎల్ లో వంద వికెట్ల క్లబ్ లోకి దూసుకొచ్చిన హైదరాబాదీ సిరాజ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
HCU Students: కంచ గచ్చిబౌలి భూవివాదంలో హెచ్సీయూ విద్యార్థులపై కేసులు ఎత్తివేత!
HCU Students: కంచ గచ్చిబౌలి భూవివాదంలో హెచ్సీయూ విద్యార్థులపై కేసులు ఎత్తివేత!
YS Sharmila: పులిబిడ్డ పులిబిడ్డే - జగన్‌కో మరోసారి షర్మిల స్ట్రాంగ్ కౌంటర్
పులిబిడ్డ పులిబిడ్డే - జగన్‌కో మరోసారి షర్మిల స్ట్రాంగ్ కౌంటర్
Andhra Health:  టెన్షన్ ఆడవారికి - షుగర్ మగవాళ్లకి - ఏపీలో ప్రజల ఆరోగ్య పరిస్థితులపై సంచలన రిపోర్టు
టెన్షన్ ఆడవారికి - షుగర్ మగవాళ్లకి - ఏపీలో ప్రజల ఆరోగ్య పరిస్థితులపై సంచలన రిపోర్టు
LPG Cylinder Price: దేశవ్యాప్తంగా గ్యాస్‌ వినియోగదారులకు షాక్ - సిలిండర్‌పై రూ. 50 పెంపు 
దేశవ్యాప్తంగా గ్యాస్‌ వినియోగదారులకు షాక్ - సిలిండర్‌పై రూ. 50 పెంపు 
Petrol Diesel Price: ఎక్సైజ్ సుంకం భారం ప్రజలపై కాదు కంపెనీలపైనే- పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం క్లారిటీ
ఎక్సైజ్ సుంకం భారం ప్రజలపై కాదు కంపెనీలపైనే- పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం క్లారిటీ
AI Engineers: ‘ఎమర్జింగ్ టెక్నాలజీస్’ హబ్‌గా తెలంగాణ, రాష్ట్రంలో 2 లక్షల మంది ఏఐ ఇంజినీర్లు - మంత్రి శ్రీధర్ బాబు
 ‘ఎమర్జింగ్ టెక్నాలజీస్’ హబ్‌గా తెలంగాణ, రాష్ట్రంలో 2 లక్షల మంది ఏఐ ఇంజినీర్లు - మంత్రి శ్రీధర్ బాబు
Viral Video: సారీ గాయ్స్, మీకు హెల్ప్ చేయలేకపోతున్నాను.. నారా లోకేష్ ఫన్నీ రియాక్షన్ ట్రెండింగ్
సారీ గాయ్స్, మీకు హెల్ప్ చేయలేకపోతున్నాను.. నారా లోకేష్ ఫన్నీ రియాక్షన్ ట్రెండింగ్
Trump Tariffs Effect: ట్రంప్ టారిఫ్‌ బాంబ్‌ పేలేది భారతీయ కుటుంబాల్లో, ప్రతి ఫ్యామిలీకి వేలల్లో నష్టం!
ట్రంప్ టారిఫ్‌ బాంబ్‌ పేలేది భారతీయ కుటుంబాల్లో, ప్రతి ఫ్యామిలీకి వేలల్లో నష్టం!
Embed widget