News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Botcha Wife Lawyer : హైకోర్టు లాయర్‌గా మంత్రి బొత్స సతీమణి - పేదలకు సేవలందించాలని సలహా !

మంత్రి బొత్స సత్యనారాయణ భార్య ఝాన్సీ హైకోర్టు లాయర్ గా పేరు నమోదు చేసుకున్నారు. ఈ విషయాన్ని మంత్రి ట్విట్టర్ ద్వారా తెలిపారు.

FOLLOW US: 
Share:


Botcha Wife Lawyer :  ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ పెద్దగా చదువుకోలేదు కానీ ఆయన విద్యాశాఖ మంత్రి అయ్యారు. ఇప్పుడు ఆయన భార్య  హైకోర్టు లాయర్ అయ్యారు.  చదువుపై ఉన్న ఆసక్తితో బొత్స ఝాన్సీ లా చదివారు.  రెండు పీహెచ్‌డీలు పూర్తి చేసినట్లుగాచెబుతున్నారు.  లా నుంచి పీహెచ్‌డీ ఉందని చెబుతున్నారు. అయితే ఆమె ఎప్పుడ బార్‌లో సభ్యత్వం తీసుకోలేదు. తాజాగా  హైకోర్టు బార్ అసోసియేషన్ సభ్యత్వాన్ని తీసుకున్నారు.   ఇప్పటికే తాజాగా ఆమె బార్ మెంబర్‌షిప్ పొందడంతో మంత్రి బొత్స ట్వీట్టర్ వేదికగా స్పందించారు.. ఆమెను అభినందించారు. 

బొత్స ఝాన్సీ గతంలో ఎంపీగా, జెడ్పీ ఛైర్‌పర్స్‌గా కూడా పనిచేశారు. ఇప్పటికీ ఝాన్సీ రాజకీయాల్లోనూ బాగా యాక్టివ్‌గా ఉన్నారు. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి, మాజీ ఎంపీ ఝాన్సీ చదువుల్లోనూ రాణిస్తున్నారు. తాజాగా ఏపీ హైకోర్టు న్యాయవాదిగా మారారు. ఎంఏ ఫిలాసఫీ, ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేశారు. అనంతరం ఫిలాసఫీ, లాలో రెండు పీహెచ్‌‌డీలు పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు న్యాయవాదిగా ఆంధ్రప్రదేశ్ బార్ అసోసియేషన్ సభ్యత్వం అందుకున్నారు. ఈ సందర్భంగా.. సతీమణి ఝాన్సీని మంత్రి బొత్స సత్యనారాయణ అభినందించారు. న్యాయం కోసం ఎదురు చూసే సామాన్యుని పక్షాన న్యాయ స్థానంలో నిలిచేందుకు ఈరోజు న్యాయవాదిగా ఆంధ్రప్రదేశ్ బార్ అసోసియేషియన్ సభ్యత్వం పొందారు అంటూ అభినందనలు తెలిపారు.                                          

విజయనగరం జిల్లా జెడ్పీ చైర్మన్ గా రెండుమార్లు, బొబ్బిలి ఎంపీగా, విజయనగరం ఎంపీగానూ ఝాన్సీ ప్రజాసేవ చేశారు. యాక్టివ్ పాలిటిక్స్‌లో బిజీగా ఉంటూనే చదువు కొనసాగించారు. చదువుకు వయస్సు అడ్డు కాదని ముందుకుసాగారు. రాజకీయాల్లో మహిళా సాధికారిత కోసం ప్రయత్నించిన ఝాన్సీ ఉన్నత విద్యలో కూడా అటు వైపే సాగారు. ఎంపీగా ఉన్న సమయంలోనే ఫిలాసఫీలో మహిళా సాధికారత, సామాజిక న్యాయశాస్త్రంపై పీహెచ్ డీ పూర్తిచేశారు.                                                               

ఓవైపు రాజకీయాల్లో ఉంటూ ప్రజాసేవ చేస్తూనే ఝాన్సీ ఉన్నత చదువులు పూర్తిచేశారు. రెండుమార్లు లోక్ సభకు ఎంపికైన ఝాన్సీ.. ఉత్తమ పార్లమెంటేరియన్ గా గుర్తింపు పొందారు.                         

Published at : 14 Aug 2023 07:00 PM (IST) Tags: Minister Botsa Botsa Satyanarayana Botsa Jhansi Lawyer

ఇవి కూడా చూడండి

Weather Latest Update: బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తనం - తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన!

Weather Latest Update: బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తనం - తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన!

Nara Bramhani : తెలుగుదేశానికి కష్టాల్లో కలసి వచ్చే యువనేత నారా బ్రాహ్మణి - అప్పుడే క్రేజ్ ! పాదయాత్ర చేసి రాత మారుస్తారా ?

Nara Bramhani :  తెలుగుదేశానికి కష్టాల్లో కలసి వచ్చే యువనేత  నారా బ్రాహ్మణి - అప్పుడే  క్రేజ్  !  పాదయాత్ర చేసి రాత మారుస్తారా ?

Bhimavaram News: భీమవరంలో దారుణం, పొదల్లో బాలిక డెడ్ బాడీ - ఒంటిపై గాయాలు?

Bhimavaram News: భీమవరంలో దారుణం, పొదల్లో బాలిక డెడ్ బాడీ - ఒంటిపై గాయాలు?

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

TDP News: బుర్రకథల మంత్రి అసెంబ్లీలో కాగ్ నివేదికలు మాట్లాడరా? - టీడీపీ ఎమ్మెల్సీ

TDP News: బుర్రకథల మంత్రి అసెంబ్లీలో కాగ్ నివేదికలు మాట్లాడరా? - టీడీపీ ఎమ్మెల్సీ

టాప్ స్టోరీస్

Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌ - దానం ఇలా కూడా చేయొచ్చు

Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌ - దానం ఇలా కూడా చేయొచ్చు

Mynampally Hanumantha Rao: కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మైనంపల్లి హనుమంతరావు, పార్టీ కండువా కప్పిన ఖర్గే

Mynampally Hanumantha Rao:  కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మైనంపల్లి హనుమంతరావు, పార్టీ కండువా కప్పిన ఖర్గే

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం