By: ABP Desam | Updated at : 13 Mar 2023 10:10 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
గబ్బర్ సింగ్ టీమ్
Janasena 10th Formation Day : జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభకు గబ్బర్ సింగ్ ఫేమ్ హాస్యనటులు తరలివచ్చారు. సభ ప్రాంగణానికి వచ్చిన వీరు జనసైనికులతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అయి తీరుతారని ధీమా వ్యక్తం చేశారు. వారాహిని ఆపే దమ్ము ఎవరికీ లేదని స్పష్టం చేశారు. తాము సభ పూర్తయ్యే వరకు ఇక్కడే ఉంటామని, ఎవరు ఆపుతారో చూస్తామని స్పష్టం చేశారు.
పదేళ్ల పండుగ
"మా అన్న పార్టీ పెట్టి 10 ఏళ్లు అయింది. రేపు పదేళ్ల పండుగ చేసుకోబోతున్నాం. పవన్ అన్నను త్వరలో సీఎంగా చూస్తాం. పవన్ కల్యాణ్ సీఎం కావాలని మా గబ్బర్ సింగ్ టీమ్ మొత్తం కోరుకుంటున్నాం. పవన్ కల్యాణ్ సర్ కు మా అవసరం అంతగా ఉండదు. అయినా మేం ఆయన వెంట నడుస్తాం. కౌలు రైతులు కుటుంబాలకు పవన్ కల్యాణ్ రూ. లక్ష రూపాయిలు ఇస్తున్నారు. గత ఎన్నికల్లో కూడా ప్రచారం చేశాం. వచ్చే ఎన్నికల్లో కూడా ప్రచారం చేస్తాం. జనసేన మ్యానిఫెస్టోను గడపగడపకూ వెళ్లి ప్రచారం చేస్తాం. పవన్ విమర్శించే వాళ్లకు ప్రజలే సమాధానం చెబుతారు. ప్రజల ఓపిక నశించింది. ఓటుతోనే వాళ్లు సమాధానం చెబుతారు. వైసీపీ ఎమ్మెల్యేలు పవన్ కల్యాణ్ తిడితే పదవి వస్తుందని అనుకుంటున్నారు. బురదలో రాళ్లు వేయడం ఇష్టం లేక మేంవదిలేశాం. అందుకే గబ్బర్ సింగ్ టీం కూడా మీడియాలో మాట్లాడడంలేదు. వారాహి ఏపీకి ఎప్పుడో వచ్చింది. దాన్నెంటి అడ్డుకునేది. వారాహిని ఎవరు అడ్డుకుంటారో మేము చూస్తాం. విశాఖలో కూడా అలానే పర్మిషన్ లేదని అడ్డుకున్నారు. తర్వాత వాళ్లే గ్రీన్ మ్యాట్ చేసి తీసుకెళ్లారు. వారాహిని కూడా వాళ్లే భద్రత ఇచ్చి తీసుకువెళ్తారు. 25 వేల మంది ర్యాలీగా సభ వస్తున్నారు. అభిమానులు, జనసైనికుల కలిసి రేపటి సభను గ్రాండ్ సక్సెస్ చేస్తాం" -గబ్బర్ సింగ్ టీమ్.
జనసేన షాకిచ్చిన పోలీసులు
జనసేన పదో ఆవిర్భావ సభకు ముందే కృష్ణా జిల్లా పోలీసులు షాకిచ్చారు. ఈనెల 14న కృష్ణా జిల్లా వ్యాప్తంగా పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ జాషువా ఓ ప్రకటనలో తెలిపారు. జాతీయ రహదారిపై ఎటువంటి ర్యాలీలు, సభలకు అనుమతి లేదన్నారు. ఒకవేళ అనుమతి లేకుండా సభలు, ర్యాలీలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. జనసేన ఆవిర్భావ సభ వేళ పోలీసుల ఆంక్షలపై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. జనసేన సభ దృష్ట్యా ఆంక్షలు విధించిందని ఆరోపించారు. ఎన్ని ఆంక్షలు పెట్టిన రేపటి సభను విజయవంతం చేస్తామని జనసేన నేతలు అంటున్నారు. ఇప్పటికే ఏపీకి చేరుకున్న వారాహి రథంలో పవన్ రేపు మచిలీపట్నం సభకు హాజరుకానున్నారని తెలిపారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పవన్ ప్రజల్లో ఉండాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో జనసేన ఆవిర్భావ సభ ద్వారా ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు.
MP R Krishnaiah : ప్రైవేటు రంగంలో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలి- ఎంపీ ఆర్ కృష్ణయ్య
Undavalli Sridevi: అనూహ్యంగా రాజకీయాల్లోకి - ఇసుక రీచ్ ల నుంచి క్రాస్ ఓటింగ్ వరకు, వివాదాల శ్రీదేవి ప్రస్థానం ఇలా!
Four MLAS : ఆ నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు - ఆధారాలెలా ?
మత మార్పిడి రిజర్వేషన్ల తీర్మానం ఉపసంహరించకపోతే ఉద్యమం తప్పదు: సోము వీర్రాజు
MP GVL On Rahul Gandhi : ఎస్సీ జాబితాలో దళిత క్రైస్తవులను చేర్చే తీర్మానం, ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే- ఎంపీ జీవీఎల్
Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్
KTR Inaugurates LB Nagar Flyover : ఎల్బీనగర్ ఫ్లైఓవర్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్, ఇకపై ట్రాఫిక్ కష్టాలకు విముక్తి!
Nani On His Struggles : నాని డబ్బులు కొట్టేసిన కో డైరెక్టర్లు - ఆ స్కామ్స్ బయట పెట్టిన నేచురల్ స్టార్
Bandi Sanjay Son : బండి భగీరథ్ సస్పెన్షన్ పై హైకోర్టు స్టే, కోర్టు ఆదేశాలతో పరీక్షలకు హాజరు!