అన్వేషించండి

AP Pensions News: సిబ్బంది ఉన్నా, ఇంటి వద్దే పెన్షన్ ఎందుకివ్వరు? ఈసీ ఆదేశాలు పట్టించుకోరా? చంద్రబాబు ఫైర్

Andhra Pradesh Pensions: ఏపీలో ఇంటి వద్దే పెన్షన్ ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని ఈసీ సూచిస్తున్నా, వైఎస్ జగన్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు.

TDP Chief Chandrababu About pensions not distributing at home- గూడూరు/కోడుమూరు: పెన్షన్ పంపిణీలో ఏపీ ప్రభుత్వం నిర్ణయంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ఇంటి వద్దే పెన్షన్ పంపిణీ చేసే సిబ్బంది ఉన్నప్పటికీ వైసీసీ ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదని చంద్రబాబు ప్రశ్నించారు. ఏపీ వ్యాప్తంగా 1.26 లక్షల సచివాలయం సిబ్బంది, 15 వేల మంది పంచాయతీ కార్యదర్శులు, 5 వేల మంది వెలుగు సిబ్బంది, 5 వేల మంది వ్యవసాయ సిబ్బంది, 3 వేల మంది హార్టికల్చర్ సిబ్బంది గ్రామ స్థాయిలో ఉన్నట్లు తెలిపారు. వీరితో పెన్షన్ పంపిణీ చేయిస్తే ఒక్కొక్కరు 45 మందికి మాత్రమే పెన్షన్ ఒక్కరోజులో ఇవ్వొచ్చని చంద్రబాబు స్పష్టం చేశారు. 

సీఎం జగన్ బాధ్యతలు విస్మరించి, శవ రాజకీయాలా? 
కర్నూలు జిల్లా గూడూరులో చంద్రబాబు క్యాంప్ సైట్ లో సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘ఏపీ సీఎం వైఎస్ జగన్ తన బాధ్యతలను విస్మరించారు. జవాబుదారీ తనానికి బదులుగా ఎం శవరాజకీయాలు చేస్తున్నాడు. ఇంటి వద్దే పెన్షన్లు పంపిణీ చేయాల్సి ఉన్నా, స్వార్థ ప్రయోజనాల కోసం అలా కుదరదని చెప్తున్నారు. వాలంటీర్లతో పెన్షన్ పంపిణీ చేయొద్దని ఎన్నికల సంఘం చెప్పింది. పెన్షన్ల పంపిణీని ఏపీ ప్రభుత్వం రాజకీయం చేస్తోంది.

ఏప్రిల్ 1వ తేదీన పెన్షన్లు ఇవ్వాల్సి ఉన్నా, డబ్బుల్లేక 3వ తేదీన పెన్షన్ ఇవ్వాలని మార్చి 28న సర్క్యలేషన్ విడుదల చేశారు. వాలంటీర్లతో పెన్షన్లు పంపిణీ చేయొద్దని మార్చి 29న ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. డబ్బులు లేక పెన్షన్లు వాలంటీర్లతో పంపిణీ చేయలేదు, అదే సమయంలో వైసీపీ నేతలు వృద్ధులను ఎండలో పదేపదే సచివాలయాల చుట్టూ తిప్పించారు. ఈ కుట్రల కారణంగా 33 మందిని చనిపోయారు. ఆ మరణాలు ప్రభుత్వ హత్యలే. వారు ఆత్మహత్య చేసుకోలేదు’ అని వివరించారు.

జగన్ కుట్రలో అధికారులు భాగమయ్యారు
ఏప్రిల్ నెలకు సంబంధించి వైసీపీ చేసిన కుట్ర, కుతంత్రం వల్ల 33 మంది ప్రాణాలు కోల్పోయారు. నెల రోజుల కిందటి కుట్రలను జగన్ మోచేతి నీళ్లు తాగే అధికారులు అమలు చేస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉంటే ప్రభుత్వ యంత్రాంగం ఎన్నికల కమిషన్ (EC) కింద పని చేయాలి. సీఎస్, గవర్నర్, ఎన్నికల కమిషన్ ను కలిసి పెన్షన్లు ఇంటి వద్దే పంపిణీ జరిగేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశాం. సచివాలయాల్లో ఇవ్వకుండా నేరుగా ఇంటి వద్దే ఇవ్వొచ్చు. ఈసీ మాట పెడచెవిన పెట్టి.. పెన్షనర్ల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని చెబుతున్నారు.

బ్యాంక్ అకౌంట్ లేని వాళ్లకు మాత్రమే ఇళ్లకు వెళ్లి పింఛన్ పంపిణీ చేసేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. 65,49,000 మంది లబ్ధిదారుల్లో 45.92 లక్షల మంది అకౌంట్లు దొరికాయని చెబుతున్నారు. ఏప్రిల్ నెల సమయంలో లేని బ్యాంక్ అకౌంట్లు...ఇప్పుడు ఎలా వచ్చాయని చంద్రబాబు ప్రశ్నించారు. 25 శాతం మందికి అకౌంట్లు లేవని ప్రభుత్వానికి ఇప్పుడెలా తెలిసిందని,భోగస్ రిపోర్టులతో కాలయాపన కాకుండా ఇంటి వద్దే పింఛన్లు పంపిణీ చేయాలని చంద్రబాబు సూచించారు. 

బ్యాంకు అకౌంట్లో పింఛన్ డబ్బులు వేస్తే.. వాళ్లు ఎండలో బ్యాంకులు, ఏటీఎంలకు క్యూ కట్టి ప్రాణాలు పోతే ఏపీ ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని చంద్రబాబు హెచ్చరించారు. ఓటర్ స్లిప్పులు ఇచ్చేందుకు 41,230 మంది బీఎల్వోలుగా పని చేస్తున్నారని.. వీరితో పెన్షన్లు పంపిణీ చేస్తే ప్రక్రియ ఈజీగా పూర్తవుతుందన్నారు. ఎన్నికల నాటికి స్లిప్పులు కూడా  ఇవ్వవచ్చని సూచించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Chittoor Crime News: రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
Breaking News: హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
Raw NTR Shot Down: రా ఎన్టీఆర్‌ పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ షట్‌డౌన్- నిర్వాహకుడి ప్రకటన! జూనియర్‌ కోప్పడ్డాడా! 
రా ఎన్టీఆర్‌ పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ షట్‌డౌన్- నిర్వాహకుడి ప్రకటన! జూనియర్‌ కోప్పడ్డాడా! 
Andhra Pradesh Latest News: ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు! వీలైనంత వరకు సమస్యల పరిష్కారానికి మంత్రుల బృందం హామీ!
ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు! వీలైనంత వరకు సమస్యల పరిష్కారానికి మంత్రుల బృందం హామీ!

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Modi video:
"స్పందించి సలహాలు ఇచ్చిన వారికి ధన్యవాదాలు" మరో సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ప్రధానమంత్రి
Revanth Reddy Indiramma Housing: హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
CJP Protest: సీజేపీ నిరసన ప్రదర్శన వాంటెడ్‌ నేరస్థులకు కొత్త స్వర్గధామంగా మారిందా? వచ్చిన 216 మందిలో 215 మంది గుర్తింపు!
సీజేపీ నిరసన ప్రదర్శన వాంటెడ్‌ నేరస్థులకు కొత్త స్వర్గధామంగా మారిందా? వచ్చిన 216 మందిలో 215 మంది గుర్తింపు!
Ashes Test In India:  షాకింగ్.. ఇండియాలో యాషెస్ టెస్ట్ మ్యాచ్ ? చెన్నై బిగ్ బాష్ లీగ్ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా క్రేజీ ప్లాన్!
షాకింగ్.. ఇండియాలో యాషెస్ టెస్ట్ మ్యాచ్ ? చెన్నై బిగ్ బాష్ లీగ్ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా క్రేజీ ప్లాన్!
Brezza Facelift: మారుతి బ్రెజ్జా నయా లుక్‌! టర్బో ఇంజిన్ నుంచి ADAS గమనించాల్సిన 5 ప్రధానాంశాలు ఇవే! 
మారుతి బ్రెజ్జా నయా లుక్‌! టర్బో ఇంజిన్ నుంచి ADAS గమనించాల్సిన 5 ప్రధానాంశాలు ఇవే! 
Ravneet Singh Bittu Resign: ప్రధానమంత్రి సలహా మేరకు రాజీనామా చేసిన మంత్రి- వెంటనే రాష్ట్రపతి ఆమోదం
ప్రధానమంత్రి సలహా మేరకు రాజీనామా చేసిన మంత్రి- వెంటనే రాష్ట్రపతి ఆమోదం
Raj Kundra Legal War: రాజస్థాన్ రాయల్స్ మాజీ, ప్ర‌స్తుత ఓన‌ర్ల మ‌ధ్య లీగ‌ల్ వార్.. బీసీసీఐకి కంప్లైంట్ ఇచ్చిన శిల్ఫా శెట్టి భ‌ర్త కుంద్రా
రాజస్థాన్ రాయల్స్ మాజీ, ప్ర‌స్తుత ఓన‌ర్ల మ‌ధ్య లీగ‌ల్ వార్.. బీసీసీఐకి కంప్లైంట్ ఇచ్చిన శిల్ఫా శెట్టి భ‌ర్త కుంద్రా
NTA 47 Officials Removed: నీట్ లీక్‌పై కేంద్రం ఉక్కుపాదం - నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో బిగ్ రీసెట్- 47 మంది అధికారుల తొలగింపు!
నీట్ లీక్‌పై కేంద్రం ఉక్కుపాదం - నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో బిగ్ రీసెట్- 47 మంది అధికారుల తొలగింపు!
Embed widget