అన్వేషించండి

Janasena: గోదావరి జిల్లాల నుంచే వైసీపీ పతనం ప్రారంభం- వారాహి విజయయాత్ర కమిటీలతో భేటీలో పవన్ కళ్యాణ్

Janasena Chief Pawan Kalyan: జులై తొమ్మిదో తేదీ సాయంత్రం ఏలూరులో బహిరంగ సభలో పవన్ పాల్గొంటారు. 10వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు జనవాణి కార్యక్రమంలో పవన్ పాల్గొంటారు.

Janasena Chief Pawan Kalyan: రేపటి నుంచి వారాహి విజయ యాత్ర రెండో విడత ప్రారంభం కానుంది. ఆదివారం నుంచి 12వ తేదీ వరకు రెండో విడత షెడ్యూల్ ను ఇప్పటికే జనసేనాని పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. 

రేపటి నుంచి పవన్ షెడ్యూల్ ఇదే..
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర షెడ్యూల్ ను అధికారికంగా ప్రకటించారు. జులై తొమ్మిదో తేదీ సాయంత్రం ఏలూరులో బహిరంగ సభలో పవన్ పాల్గొంటారు. 10వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు జనవాణి కార్యక్రమంలో పవన్ పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు ఏలూరు నియోజక వర్గం ముఖ్య నాయకులు, వీర మహిళలతో సమావేశం అవుతారు. ఇక పదకొండో తేదీన మధ్యాహ్నం 12 గంటలకు  దెందులూరు నియోజక వర్గం ముఖ్య నాయకులు, వీర మహిళలతో సమావేశం జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు  తాడేపల్లిగూడెం చేరుకుంటారు. ఇక 12వ తేదీ సాయంత్రం 5 గంటలకు తాడేపల్లిగూడెంలో బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ఈ మేరకు పార్టి కేంద్ర కార్యాలయం నుండి ప్రకటన చేశారు. 

వారాహి విజయ యాత్ర కమిటీలతో పవన్ భేటీ..
ఆదివారం నుంచి వారాహి విజయ యాత్ర రెండో విడత ప్రారంభం కానున్న సందర్భంగా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నాయకులతో సమావేశం అయ్యారు. మంగళగిరిలోని పార్టి కేంద్ర కార్యాలయంలో వారాహి విజయ యాత్ర కమిటీ సభ్యులతో పవన్ భేటీ అయ్యారు. తొలి విడతలో జరిగిన వారాహి యాత్రలో కమిటి పని తీరును పవన్ అభినందించారు. 

మిమ్మల్ని మర్చిపోను...
వారాహి విజయ యాత్రలో తనతో కలసి నడిచిన పార్టి శ్రేణులకు పవన్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. మీ సేవ మర్చపోలేనని, అన్ని విధాలుగా అండగా ఉంటానన్నారు. మీరు పడిన కష్టం వృథా కాదని పవన్ నాయకులకు భరోసా కల్పించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన బలమయిన ముద్ర వేస్తుందని పవన్ ఆకాంక్షించారు. 

గోదావరి జిల్లాల నుంచే వైసీపీ పతనం ప్రారంభం..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విముక్త ఆంధ్రప్రదేశ్ ను చూడాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. గోదావరి జిల్లాల నుంచే అధికార వైసీపీ పతనం ప్రారంభం అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టి పతనం ప్రారంభం అయితే, అది రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తుందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. జనసేన శ్రేణులు ఎంత బలంగా పని చేస్తే అంత త్వరగా రాష్ట్రం నుంచి వైసీపీని తరిమి కొట్టగలమని పవన్ అన్నారు. 

సాగునీటి కోసం రైతులు పోరాటం చేయాల్సి రావడం దారుణం... నాదెండ్ల
రైతులు నీటి కోసం పోరాటం చేసే పరిస్థితులు రావడం దారుణమని  జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్  నాదెండ్ల మనోహర్ అన్నారు. ప్రభుత్వానికి వ్యవసాయం, నీటి పారుదల రంగాల పట్ల చిత్తశుద్ధి లేదన్నారు. రైతులు కష్టాల్లో ఉన్నా ఈ ప్రభుత్వానికి స్పందన లేదనీ, స్పందించే గుణం లేని ప్రభుత్వం స్పందన కార్యక్రమం నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం రైతాంగం కలసి రావాలని కోరారు. జనసేన పార్టీ ప్రభుత్వంలో గుంటూరు ఛానల్ ను పర్చూరు వరకు తీసుకువస్తామని హామీ ఇచ్చారు. గుంటూరు ఛానల్ పర్చూరు వరకు పొడిగించాలని డిమాండ్ చేస్తూ నల్లమడ రైతు సంఘం ఆధ్వర్యంలో గుంటూరు కలెక్టరేట్ ఎదుట గత 11 రోజులుగా నిర్వహిస్తున్న నిరసన దీక్షలో పాల్గొని జనసేన పార్టీ తరపున  నాదెండ్ల సంఘీభావం  తెలిపారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?

వీడియోలు

Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్
Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Hyderabad Old City: మద్యం మత్తులో ఆటోడ్రైవర్ వీరంగం.. పాము వదులుతా అని పోలీసులను భయపెట్టి పరార్
మద్యం మత్తులో ఆటోడ్రైవర్ వీరంగం.. పాము వదులుతా అని పోలీసులను భయపెట్టి పరార్
Bangladesh squad for T20 world cup: టీ20 వరల్డ్ కప్ కోసం బంగ్లాదేశ్ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా హిందువుకు ఛాన్స్
టీ20 వరల్డ్ కప్ కోసం బంగ్లాదేశ్ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా హిందువుకు ఛాన్స్
Embed widget