అన్వేషించండి

జనసైనికుల ‘పవన్ మాల’- కఠిన నియమాలతో దీక్ష!

పవన్ కల్యాణ్‌పై అభిమానంతో జనసైనికుల వినూత్న రీతిలో అభిమానాన్ని వ్యక్తీకరించేందుకు సిద్ధమయ్యారు. పవన్ మాల పేరుతో దీక్ష చేయనున్నారు. 

మండలం రోజుల పాటు కఠిన నియమాలు పాటిస్తూ.. దైవ చింతనతో గడపడం కోసం భక్తులు మాలధారణ చేస్తారు. దక్షిణాదిలో అయ్యప్ప మాలకు ఎంతో విశిష్టత ఉంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన లక్షల మంది భక్తులు ఏటా అయ్యప్పమాల వేసుకుంటారు. నలుపు రంగు వస్త్రాలు ధరించి.. 41 రోజులపాటు నిష్టగా పూజలు చేసి.. శబరిమల వెళ్లి హరిహరసుతుణ్ని దర్శించుకొని వస్తారు. అయ్యప్ప మాలతోపాటు.. భవానీ దీక్ష, శివమాల, వేంకటేశ్వర స్వామి మాల, హనుమాన్ దీక్షను కూడా చాలా మంది భక్తులు చేపడుతుంటారు. అదే తరహాలో పవన్‌ మాల. 

వినూత్న రీతిలో అభిమానం..

ఇప్పుడు తెలుగు నాట మరో ట్రెండ్ మొదలైంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానులు ‘పవన్ మాల’ పేరిట దీక్ష స్వీకరించారు. మెడలో ఎర్ర కండువా ధరించి 49 రోజుల దీక్షను మొదలు పెట్టారు. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు అనే సంగతి తెలిసిందే. ఇది ఆయన 49వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా పవన్ మాలధారణ చేసిన ఆయన అభిమానులు 49 రోజులపాటు దీక్ష చేస్తున్నారు. 2018 డిసెంబర్ నెలలో తొలిసారి పవన్ మాల అనే కాన్సెప్ట్‌ను అభిమానులు ప్రారంభించారు. పవన్ ఫ్యాన్స్ అప్పటి నుంచి ఈ మాల దీక్షను కొనసాగిస్తున్నారు.

అభిప్రాయాన్ని మార్చేలా..

పాలకొల్లుకు చెందిన యువకులు పవన్ మాల ధరించారు. వీరంతా మెడలో ఎర్ర కండువాలు ధరించారు. జనసేనాని ఆశయాలను జనాల్లోకి తీసుకెళ్లడం కోసం ఈ 49 రోజులు ప్రయత్నిస్తామని వారు తెలిపారు. పవన్ అభిమానులకు దూకుడు ఎక్కువ అనే పేరుంది. కానీ పవన్ మాలధారణ చేసిన వీళ్లంతా.. ఆ అభిప్రాయాన్ని మార్చే దిశగా ప్రయత్నిస్తున్నారు. తమ వల్ల పవన్ కళ్యాణ్‌కు మంచి పేరు వచ్చేలా చూస్తామని చెబుతున్నారు.

పవన్ మాలధారణ..

పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ మాల వేసుకోవడం ఇదే తొలిసారి కాదని అంటున్నారు. మూడు, నాలుగేళ్ల క్రితం కూడా ఆయన అభిమానులు మాలధారణ చేశారు. సంప్రదాయ వస్త్రధారణ, మెడలో ఎర్ర కండువా, మెడలో రుద్రాక్ష మాల, భుజాన జనసేన జెండాతో.. కాళ్లకు చెప్పులు లేకుండా.. వారు దీక్ష చేశారు. అన్ని మతాలకు చెందిన దేవుళ్ల ఫొటోల మధ్య పవన్ కల్యాణ్ ఫొటో ఉంచి జనసేనానిపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. అలా ఆ దీక్షను విరమించారు. 

పవన్‌కూ భక్తి ఎక్కువే!

ఇదిలా ఉంచితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు సైతం భక్తి ప్రతులు ఎక్కువనే సంగతి తెలిసిందే. 20 ఏళ్లుగా చాతుర్మాస్య దీక్ష చేపట్టిన పవన్ కళ్యాణ్.. ఈ ఏడాది కూడా గత నెలారంభంలో చాతుర్మాస్య దీక్షను ప్రారంభించారు. ఆషాడం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజ మాసాల్లో పవన్ ఈ దీక్ష చేపడుతున్నారు. ఈ దీక్షలో ఉన్నంత కాలం పవన్ ఒక్క పూట మాత్రమే ఆహారం తీసుకుంటారు. అది కూడా సాత్వికాహారమే తీసుకుంటారని పవన్ అభిమానులు పలు సందర్భాల్లో వెల్లడించారు.

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: రైతుల కోసం వెళ్లిన వైసీపీ నేతలపై దాడులు దారుణం, పోలీసులు సైతం కోఆర్డినేట్: వైఎస్ జగన్
రైతుల కోసం వెళ్లిన వైసీపీ నేతలపై దాడులు దారుణం, పోలీసులు సైతం కోఆర్డినేట్: వైఎస్ జగన్
Tirumala Devotees Rush: తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Breaking News: రేపు ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం
రేపు ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం
Made in Jonnagiri Gold Biscuits: బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indiramma Housing Scheme: ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
Afghanistan Earthquake: అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
Tirumala Devotees Rush: తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Made in Jonnagiri Gold Biscuits: బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
KTR Politics: కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
NRI Priest Arrest: పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
Vizag Land Scam: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
Jai Moondra Cricket Career: ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
Embed widget