అన్వేషించండి

జనసైనికుల ‘పవన్ మాల’- కఠిన నియమాలతో దీక్ష!

పవన్ కల్యాణ్‌పై అభిమానంతో జనసైనికుల వినూత్న రీతిలో అభిమానాన్ని వ్యక్తీకరించేందుకు సిద్ధమయ్యారు. పవన్ మాల పేరుతో దీక్ష చేయనున్నారు. 

మండలం రోజుల పాటు కఠిన నియమాలు పాటిస్తూ.. దైవ చింతనతో గడపడం కోసం భక్తులు మాలధారణ చేస్తారు. దక్షిణాదిలో అయ్యప్ప మాలకు ఎంతో విశిష్టత ఉంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన లక్షల మంది భక్తులు ఏటా అయ్యప్పమాల వేసుకుంటారు. నలుపు రంగు వస్త్రాలు ధరించి.. 41 రోజులపాటు నిష్టగా పూజలు చేసి.. శబరిమల వెళ్లి హరిహరసుతుణ్ని దర్శించుకొని వస్తారు. అయ్యప్ప మాలతోపాటు.. భవానీ దీక్ష, శివమాల, వేంకటేశ్వర స్వామి మాల, హనుమాన్ దీక్షను కూడా చాలా మంది భక్తులు చేపడుతుంటారు. అదే తరహాలో పవన్‌ మాల. 

వినూత్న రీతిలో అభిమానం..

ఇప్పుడు తెలుగు నాట మరో ట్రెండ్ మొదలైంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానులు ‘పవన్ మాల’ పేరిట దీక్ష స్వీకరించారు. మెడలో ఎర్ర కండువా ధరించి 49 రోజుల దీక్షను మొదలు పెట్టారు. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు అనే సంగతి తెలిసిందే. ఇది ఆయన 49వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా పవన్ మాలధారణ చేసిన ఆయన అభిమానులు 49 రోజులపాటు దీక్ష చేస్తున్నారు. 2018 డిసెంబర్ నెలలో తొలిసారి పవన్ మాల అనే కాన్సెప్ట్‌ను అభిమానులు ప్రారంభించారు. పవన్ ఫ్యాన్స్ అప్పటి నుంచి ఈ మాల దీక్షను కొనసాగిస్తున్నారు.

అభిప్రాయాన్ని మార్చేలా..

పాలకొల్లుకు చెందిన యువకులు పవన్ మాల ధరించారు. వీరంతా మెడలో ఎర్ర కండువాలు ధరించారు. జనసేనాని ఆశయాలను జనాల్లోకి తీసుకెళ్లడం కోసం ఈ 49 రోజులు ప్రయత్నిస్తామని వారు తెలిపారు. పవన్ అభిమానులకు దూకుడు ఎక్కువ అనే పేరుంది. కానీ పవన్ మాలధారణ చేసిన వీళ్లంతా.. ఆ అభిప్రాయాన్ని మార్చే దిశగా ప్రయత్నిస్తున్నారు. తమ వల్ల పవన్ కళ్యాణ్‌కు మంచి పేరు వచ్చేలా చూస్తామని చెబుతున్నారు.

పవన్ మాలధారణ..

పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ మాల వేసుకోవడం ఇదే తొలిసారి కాదని అంటున్నారు. మూడు, నాలుగేళ్ల క్రితం కూడా ఆయన అభిమానులు మాలధారణ చేశారు. సంప్రదాయ వస్త్రధారణ, మెడలో ఎర్ర కండువా, మెడలో రుద్రాక్ష మాల, భుజాన జనసేన జెండాతో.. కాళ్లకు చెప్పులు లేకుండా.. వారు దీక్ష చేశారు. అన్ని మతాలకు చెందిన దేవుళ్ల ఫొటోల మధ్య పవన్ కల్యాణ్ ఫొటో ఉంచి జనసేనానిపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. అలా ఆ దీక్షను విరమించారు. 

పవన్‌కూ భక్తి ఎక్కువే!

ఇదిలా ఉంచితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు సైతం భక్తి ప్రతులు ఎక్కువనే సంగతి తెలిసిందే. 20 ఏళ్లుగా చాతుర్మాస్య దీక్ష చేపట్టిన పవన్ కళ్యాణ్.. ఈ ఏడాది కూడా గత నెలారంభంలో చాతుర్మాస్య దీక్షను ప్రారంభించారు. ఆషాడం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజ మాసాల్లో పవన్ ఈ దీక్ష చేపడుతున్నారు. ఈ దీక్షలో ఉన్నంత కాలం పవన్ ఒక్క పూట మాత్రమే ఆహారం తీసుకుంటారు. అది కూడా సాత్వికాహారమే తీసుకుంటారని పవన్ అభిమానులు పలు సందర్భాల్లో వెల్లడించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
Embed widget