అన్వేషించండి

ఏపీలో బీజేపీని ఎదగనీయకుండా చేస్తోంది అధిష్ఠానమేనా? అమిత్‌షా సభ తర్వాత కూడా ఎందుకు గ్రాఫ్‌ పెరగలేదు?

శ్రీకాళహస్త, విశాఖపట్టణం వేదికగా భారతీయ జనతా పార్టీ నేతలు భారీ సభలు నిర్వహించారు. అగ్రనేతలు వచ్చారు. జనసమీకరణ కూడా చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. కానీ ఆ ఊపు కంటిన్యూ కాలేదు.

వరుసగా భారీ సభలు, అవి చాలవన్నట్లుగా జిల్లాల వారీగా కూడా సభలు, అయినా స్పందన అంతంత మాత్రమే. ఈ పరిస్థితికి కారణం ఏంటీ అనే ప్రశ్న ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ పెద్దలను వెంటాడుతోంది. 

వరుసగా భారీ ఎత్తున సభలు నిర్వహించారు. కేవలం 18గంటల వ్యవధిలోనే ఇద్దరు కీలక నేతలు రాష్ట్రానికి వచ్చిమరీ ప్రసంగించారు. అధికారంలో ఉన్న వైఎఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిపై విమర్శలు గుప్పించారు.. అయినా పార్టీకి మాత్రం ఎటువంటి మైలేజ్‌ రాలేదు. చర్చా వేదికలకు మినహా ప్రజల్లోకి వెళ్ళేందుకు చేసిన ప్రయత్నాలు అంతగా ఫలించలేదని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పుంజుకోవాలని భారతీయ జనతా పార్టీ నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించటం లేదనే అభిప్రాయంలో నేతలు ఉన్నారని అంటున్నారు. 

శ్రీకాళహస్త, విశాఖపట్టణం వేదికగా భారతీయ జనతా పార్టీ నేతలు భారీ సభలు నిర్వహించారు. అగ్రనేతలు వచ్చారు. జనసమీకరణ కూడా చేశారు. కానీ ఆ ఊపు ఒకట్రెండు రోజులు కూడా కనిపించలేదు. అగ్రనేతలు ఇచ్చిన ఉత్సాహాన్ని రాష్ట్రంలో కంటిన్యూ చేయలేకపోయారనే అభిప్రాయం పార్టీ నేతల్లో ఉందని అంటున్నారు.

అధికార పక్షాన్ని టార్గెట్ చేయలేక...
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భారతీయ జనతా పార్టీ నాయకులు సరైన రీతిలో టార్గెట్ చేయలేకపోయారనే విమర్శలు లేకపోలేదు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా , కేంద్ర హోం మంత్రి స్థాయిలో సభలో పాల్గొన్న అమిత్ షా చేసిన కామెంట్స్ రాజకీయంగా సంచలనంగా మారాయి. ఇప్పటి వరకు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల తరఫున ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో భారతీయ జనతా పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయి. అయితే ఉన్నపళంగా ఏపీ సర్కారును బీజేపీ టార్గెట్ చేసింది. రాజకీయంగా విమర్శించుకోవటం కూడా చర్చకు దారితీసింది. అయితే కీలక నేతలు ఇచ్చిన స్టేట్ మెంట్‌లను ఆధారంగా చేసుకొని ప్రజల్లోకి వెళ్లడంలో రాష్ట్ర స్థాయి నాయకులు ఫెయిల్ అయ్యారనే విమర్శలు లేకపోలేదు. 

అక్కడ అలా ఉంటే ఇక్కడ ఇలానే ఉంది
భారతీయ జనతా పార్టీకి చెందిన రాష్ట్ర నేతలు అధినాయకత్వం వద్ద పలు కీలక అంశాలను ప్రస్తావిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, ఆంధ్రప్రదేశ్‌కు అవసరమైన నిధులు కేటాయించటం, పోలవరం పనులకు నిధులు ఇచ్చింది. వాటి గురించి తగిన సమాచారాన్ని కనీసం రాష్ట్ర స్థాయిలో ఉన్న నేతలకు కానీ, ఢిల్లీకి వెళ్ళిన సొంత పార్టీ నేతలకు కానీ  హై కమాండ్ నుంచి సమాచారం లేదు. దీంతో కేంద్రం నుంచి నిధులు వచ్చినా, వాటిని తీసుకువచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమనే భావన ప్రజల్లో ఏర్పడింది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి , భారతీయ జనతా పార్టీ మధ్య సత్సంబంధాలు ఉన్నాయనే అభిప్రాయం బలపడిందని అంటున్నారు. దీనంతటికీ కేంద్ర నాయకత్వమే కారణమని అంటున్నారు. 

ఇలాంటి పరిస్దితుల్లో ఉన్నఫళంగా ఢిల్లీ నుంచి ఇద్దరు కీలక నేతలు వచ్చి, రాష్ట్రంలో సభలు పెట్టి, అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించటం ద్వార ప్రజల్లో అనుకున్నంత స్థాయిలో స్పందన రాలేదంటున్నారు. దానికి రాష్ట్ర నాయకులను బాధ్యుతలను చేస్తే ఎలా అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.  భవిష్యత్ కార్యచరణ మరింత కీలకంగా ఉండాలని పార్టీ నేతలు తమ అభిప్రాయంగా పార్టీ పెద్దల వద్ద ప్రస్తావిస్తున్నారని అంటున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News:నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
Why YSRCP Fire Brands Silent: వైసీపీలో అసలైన ఫైర్ బ్రాండ్స్ సైలెంట్ - పార్ట్ టైమ్ పాలిటిక్స్‌కే మొగ్గు- ఫుల్ టైం ఎప్పటి నుంచి ?
వైసీపీలో అసలైన ఫైర్ బ్రాండ్స్ సైలెంట్ - పార్ట్ టైమ్ పాలిటిక్స్‌కే మొగ్గు- ఫుల్ టైం ఎప్పటి నుంచి ?
Amaravati Mega Metropolitan Region: అమరావతే మావిగన్ - చంద్రబాబు మెగా మెట్రో విజన్‌ వర్సెస్ వైసీపీ మైండ్ గేమ్‌!
అమరావతే మావిగన్ - చంద్రబాబు మెగా మెట్రో విజన్‌ వర్సెస్ వైసీపీ మైండ్ గేమ్‌!
Trainee IPS Uday Krishna Reddy Remand: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్ - ఉప్పరపల్లి కోర్టు తీర్పు, చంచల్‌గూడ జైలుకు తరలింపు!
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్ - ఉప్పరపల్లి కోర్టు తీర్పు, చంచల్‌గూడ జైలుకు తరలింపు!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Supreme Court Big Relief Telangana: తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
Pallaburusu Teaser Review : టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
Ramayana Trailer Review : రామాయణ ట్రైలర్ - శ్రీరాముడి శాంత స్వరూపం... రావణుడి ఉగ్ర రూపం... సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్
రామాయణ ట్రైలర్ - శ్రీరాముడి శాంత స్వరూపం... రావణుడి ఉగ్ర రూపం... సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్
US Iran War: ఇరాన్ దాడిపై అమెరికా తీవ్ర ఆగ్రహం, క్షిపణుల ప్రయోగం, తగిన సమాధానం ఇస్తామన్న ట్రంప్‌! 
ఇరాన్ దాడిపై అమెరికా తీవ్ర ఆగ్రహం, క్షిపణుల ప్రయోగం, తగిన సమాధానం ఇస్తామన్న ట్రంప్‌! 
Adilabad Rains News: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
Tamil Nadu Head Shaving Scam: ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
Commonwealth Games 2026: CWG 2026లో భారత్‌కు మూడో స్వర్ణ, బాక్సింగ్‌లో 10 పతకాలు ఖాయం!
CWG 2026లో భారత్‌కు మూడో స్వర్ణ, బాక్సింగ్‌లో 10 పతకాలు ఖాయం!
Embed widget