News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Amaravati Case : అమరావతి కేసు డిసెంబర్ కు వాయిదా - ప్రతి వాదులందరికీ నోటీసులివ్వాలన్న సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టులో అమరావతి కేసు విచారణ డిసెంబర్‌కు వాయిదా పడింది. ప్రతివాదులందరికీ నోటీసులు అందించాలని ఆదేశించింది.

FOLLOW US: 
Share:

Amaravati Case :  సుప్రీంకోర్టులో అమరావతి కేసులపై విచారణ డిసెంబర్‌కు వాయిదా పడింది.  ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బేలా ఎం. త్రివేది ధర్మాసనం ముందు..  వాదనలు వినిపించేందుకు 3 గంటల సమయం కావాలని కోరిన సీనియర్ న్యాయవాది కేకే వేణుగోపాల్ విజ్ఞప్తి చేశారు. ఆయన ప్రభుత్వం తరపున వాదిస్తున్నారు. అయితే ఈ సందర్భంలో  ప్రతివాదులందరికీ నోటీసులు పంపే ప్రక్రియ పూర్తయిందా అని  ధర్మాసనం ప్రశ్నించింది.  ప్రతివాదుల్లో ఇద్దరు చనిపోయారని వెల్లడించిన అమరావతి రైతుల తరఫు న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.  చనిపోయినవారిని జాబితా నుంచి తొలగించాలని కోరిన ఏపీ ప్రభుత్వం కోరింది.  

నవంబర్  వరకూ రాజ్యాంగ ధర్మాసనాలు ఉన్నాయన్న ధర్మాసనం                     

చనిపోయినవారిని జాబితా నుంచి తొలగించినట్టయితే మిగిలిన అందరికీ నోటీసులు అందినట్టేనని  తెలిపింది. అయితే  ఇంకా మరికొందరికి నోటీసులు అందలేదని చెప్పిన అమరావతి రైతుల తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నోటీసులు అందని ప్రతివాదులందరికీ నోటీసులు పంపాలని ఆదేశించిన ధర్మాసనం..   రాష్ట్ర ప్రభుత్వ అప్పీల్‌ను లీడ్ మ్యాటర్‌గా పరిగణిస్తూ తదుపరి విచారణ వాయిదా వేసింది.  తదుపరి విచారణ డిసెంబర్ నెలలో చేపడతామని అప్పుడే తేదీని ఖరారు చేస్తామని తెలిపింది. కేసు అత్యవసరంగా విచారణ చేపట్టాలని న  ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది మాజీ అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ ధర్మాసనాన్ని కోరారు.  అత్యవసరంగా విచారణ సాధ్యం కాదని  జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ బేలా ఎం త్రివేది ధర్మాసనం స్పష్టం చేసింది.  ఆగష్టు నుంచి నవంబర్‌ వరకు రాజ్యాంగ ధర్మాసనాలు ఉన్నందున అత్యవసర విచారణ సాధ్యపడదని  స్పష్టం చేసింది.  డిసెంబర్‌లోనే విచారణ తేదీలు ఖరారు చేస్తామని తెలిపింది. 

అమరావతిపై తదుపరి చట్టాలు చేయడానికి వీల్లేదని హైకోర్టు గతంలో తీర్పు

అమరావతిపై తదుపరి చట్టాలు చేయడానికి వీల్లేదని హైకోర్టు గతంలో తీర్పు ఇచ్చి రిట్ ఆఫ్ మాండమస్ ప్రకటించింది. అయితే చట్టాలు చేయడానికి వీల్లేదని ప్రకటించడం .. తమ అధికారాల్లో జోక్యం చేసుకోవడమేనని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది.  అయితే హైకోర్టు తీర్పు వచ్చిన వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించలేదు.ఆరు నెలల ఆలస్యంగా సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసింది. వేగంగా విచారణ చేయాలని పదే పదే ఏపీ ప్రభుత్వ లాయర్లు సుప్రంకోర్టును కోరారు.  అయితే విచారణ అంత కంటే ఎక్కువగా ఆలస్యమవుతోంది. గతంలోనే  జూలైకు వాయిదా పడటంతో ఏపీ ప్రభుత్వానికి నిరాశ ఎదురయింది. తీర్పుపై స్టే వస్తే రాజధానిని విశాఖ మార్చాలని సీఎం జగన్ అనుకున్నారు. కానీ ఇప్పుడు విచారణ కూడా జరగకుండా డిసెంబర్ కు వాయిదా  పడింది. 

మూడు రాజధానుల గురించి తమకు తెలియని కేంద్రం అఫిడవిట్ 
 
ఇంతకు ముందే కేంద్రం దాఖలు చేసిన అమరావతి విభజన చట్టం ప్రకారమే ఏర్పడిందంటూ అఫిడవిట్ దాఖలు చేసింది కేంద్ర ప్రభుత్వం.   మూడు రాజధానుల గురించి తమకు తెలియదని  కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది.  

Published at : 11 Jul 2023 12:59 PM (IST) Tags: Amaravati Farmers CM Jagan Supreme Court Amaravati case Amaravati case in Supreme Court

ఇవి కూడా చూడండి

Chandrababu :  తిరుమలకు చంద్రబాబు -  వరుసగా ఐదో తేదీ వరకూ ఆలయాల సందర్శన !

Chandrababu : తిరుమలకు చంద్రబాబు - వరుసగా ఐదో తేదీ వరకూ ఆలయాల సందర్శన !

CM Jagan Owk Tunnel: సీఎం చేతుల మీదుగా అవుకు రెండో టన్నెల్‌ ప్రారంభం

CM Jagan Owk Tunnel: సీఎం చేతుల మీదుగా అవుకు రెండో టన్నెల్‌ ప్రారంభం

Chandrababu Case : డిసెంబర్ 12వ తేదీకి చంద్రబాబు కేసు వాయిదా - క్వాష్ పిటిషన్‌పై తీర్పు ప్రాసెస్‌లో ఉందన్న సుప్రీంకోర్టు !

Chandrababu Case  :  డిసెంబర్ 12వ తేదీకి చంద్రబాబు కేసు వాయిదా - క్వాష్ పిటిషన్‌పై తీర్పు ప్రాసెస్‌లో ఉందన్న సుప్రీంకోర్టు !

Top Headlines Today: సాగర్ ప్రాజెక్టు నుంచి దౌర్జన్యంగా నీటి విడుదల! కవిత, రేవంత్‌లపై ఈసీకి ఫిర్యాదులు

Top Headlines Today: సాగర్ ప్రాజెక్టు నుంచి దౌర్జన్యంగా నీటి విడుదల! కవిత, రేవంత్‌లపై ఈసీకి ఫిర్యాదులు

Nagarjuna Sagar Issue : సాగర్ వద్ద తెలంగాణ వాహనాలకు నో ఎంట్రీ - బోర్డర్ వద్ద ఫుల్ సెక్యూరిటీ

Nagarjuna Sagar Issue :  సాగర్ వద్ద తెలంగాణ వాహనాలకు నో ఎంట్రీ - బోర్డర్ వద్ద ఫుల్ సెక్యూరిటీ

టాప్ స్టోరీస్

Telangana Assembly Election 2023: 3 గంటలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్‌ శాతం 51.89

Telangana Assembly Election 2023: 3 గంటలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్‌ శాతం 51.89

Telangana Elections Exit Polls: సాయంత్రం 5.30 నుంచే ABP CVoter ఎగ్జిట్‌ పోల్స్ ఫలితాలు

Telangana Elections Exit Polls: సాయంత్రం 5.30 నుంచే ABP CVoter ఎగ్జిట్‌ పోల్స్ ఫలితాలు

Salman Khan: టిక్కెట్ల ధరల తగ్గింపే కొంప ముంచింది, సల్మాన్ కవరింగ్ భలే ఉందిగా!

Salman Khan: టిక్కెట్ల ధరల తగ్గింపే కొంప ముంచింది, సల్మాన్ కవరింగ్ భలే ఉందిగా!

Telangana Elections: డబ్బులు పంచకుండా మోసం! మేం ఓటేసేది లేదు, తేల్చి చెప్పిన ఓటర్లు!

Telangana Elections: డబ్బులు పంచకుండా మోసం! మేం ఓటేసేది లేదు, తేల్చి చెప్పిన ఓటర్లు!