అన్వేషించండి

Krishna Dispute : కేసీఆర్ వర్సెస్ సజ్జల.. కృష్ణా జలాలపై "దాదాగిరి" రాజకీయం.. మళ్లీ నిప్పు రాజుకున్నట్లేనా!

కృష్ణా జలాలపై మళ్లీ మాటల మంటలు రేగుతున్నాయి. ఏపీ ప్రభుత్వం దాదాగిరీ చేస్తోందని కేసీఆర్ ఆరోపించారు. ఆ పని చేస్తోంది తెలంగాణయేనని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల ప్రతి విమర్శ చేశారు.

తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ కృష్ణా జలాల వివాదం మాటకు మాటకు దారి తీస్తోంది. కేంద్రం జోక్యం చేసుకుని నదీ బోర్డును నోటిఫై చేయడంతో సమస్య సద్దుమణిగిందని అనుకున్నారు. ఇక ఏమైనా ఉన్నా కేంద్రమే చూసుకుంటుందని.. ఇరు రాష్ట్రాలు కేంద్రం వద్దకే వెళ్తాయని అనుకున్నారు. అయితే రాజకీయంగా మాత్రం... రెండు ప్రభుత్వల మధ్య మళ్లీ మాటల మంటలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ నాగార్జునసాగర్‌లో పర్యటించారు. ఉపఎన్నికలో గెలిపించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు చెప్పి.. అభివృద్ధి పనులు ప్రారంభించడానికి ఆయన వెళ్లారు.. అక్కడ జరిగినసభలో కృష్ణా జలాల వివాదంపై మాట్లాడారు. ఏపీ సర్కార్‌పై విమర్శలు చేశారు. నీటి విషయంలో ఏపీ ప్రభుత్వం దాదాగిరి చేస్తోందని మండిపడ్డారు. అయితే న్యాయంగా రావాల్సిన నీటిని దక్కించుకుని సాగర్ ఆయుకట్టు పరిధిలోని పొలాలకు రెండు పంటలకు నీరిస్తామని కేసీఆర్ ప్రజలకు హామీ ఇచ్చారు. 

తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై వెంటనే ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాస్త ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. కృష్ణా జలాల విషయంలో ఎవరు దాదాగిరి చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. చట్టాలకు వ్యతిరేకంగా జీవోలు ఇచ్చి మరీ...  విద్యుత్ ఉత్పాదన చేశారని, దాదాపుగా 30 టీఎంసీల నీరు సముద్రం పాలయ్యేలా చేశారని విమర్శలు గుప్పించారు. విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని వాడుకోకూడదన్న నిబంధనలను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఏపీకి న్యాయంగా రావాల్సిన నీటి  కోసమే సీఎం జగన్ పోరాడుతున్నారని కౌంటర్ ఇచ్చారు. 

కేసీఆర్ విమర్శలు.. సజ్జల కౌంటర్‌తో... కృష్ణా జలాల అంశం మరో రాజకీయ వివాదంగా మారే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నదీ బోర్డులను నోటిఫై చేయనంత వరకూ.. తెలంగాణ రాష్ట్ర మంత్రులు.. ఏపీ సర్కార్ పెద్దలపై విరుచుకుపడేవారు. ముఖ్యంగా సీఎం జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై విమర్శలు గుప్పించేవారు. అయితే.. వైసీపీ నేతలు పెద్దగా స్పందించేవారు కాదు. కానీ సమస్య ను పరిష్కరించాలంటూ సీఎం జగన్ కేంద్రానికి లేఖలు రాశారు. ఆ లేఖలకు ప్రతిస్పందనగా కేంద్రం స్పందించి... నదీబోర్డులను నోటిఫై చేస్తున్నట్లు తెలిపింది. ఆ తర్వాత రెండు రాష్ట్రాల నేతల మధ్య పెద్దగా విమర్శలు.. ప్రతి విమర్శలు లేవు. మొత్తం సద్దుమణిగిపోయిందని అనుకున్నారు. 

కానీ నాగార్జునసాగర్ పర్యటనలో కేసీఆర్ మళ్లీ ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో.. ఏపీ ప్రభుత్వ సలహాదారు కూడా కౌంటర్ ఇవ్వడంతో మళ్లీ వివాదం ప్రారంభమయింది. సజ్జల వ్యాఖ్యలపై టీఆర్ఎస్ మంత్రులు సైలెంట్‌గా ఉండే అవకాశం లేదు.  దీంతో ఏపీ, తెలంగాణల మద్య మళ్లీ రాజకీయ వేడి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే.. విపక్షాలు మాత్రం మొదటి నుంచి రెండు రాష్ట్రాల అధికార పార్టీలు సెంటిమెంట్‌ను రెచ్చగొట్టడానికి కృష్ణా జలాల వివాదాన్ని తెరపైకి తెచ్చారని విమర్శలు చేస్తూనే ఉన్నాయి. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: బహిరంగ విమర్శలు చేసే కాంగ్రెస్ నేతలపై కఠిన చర్యలు: టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్
బహిరంగ విమర్శలు చేసే కాంగ్రెస్ నేతలపై కఠిన చర్యలు: టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్
Karumuri Nageswara Rao Arrest: హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
Kesineni Nani: విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
Anagani Satya Prasad: అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karumuri Nageswara Rao Arrest: హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
NITI Aayog Report: 8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
CM Revanth Reddy: కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
Kesineni Nani: విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
IND VS SL Gill Historic Milestone: గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
Zombie Reddy 2 : జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
Embed widget