అన్వేషించండి

Nara Lokesh: మణిపూర్‌లో తెలుగు విద్యార్థుల్ని స‌ర్కారే ర‌క్షించాలి - నారా లోకేష్ డిమాండ్‌

మణిపూర్ రాష్ట్రంలో ఏర్పడిన ఘర్షణల‌తో అత్యవ‌స‌ర ప‌రిస్థితి విధించారు. ఇప్పటికే ప‌ర‌స్పర దాడుల్లో 54 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు.

మణిపూర్‌లో క‌నిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ అయిన నేప‌థ్యంలో అక్కడ ఎన్ఐటీలో చ‌దువుతున్న ఏపీ విద్యార్థులు ప్రాణాలు అర‌చేతిలో ప‌ట్టుకుని బిక్కుబిక్కుమంటున్నార‌ని, వారిని త‌క్షణ‌మే రాష్ట్రానికి తీసుకురావాల‌ని టిడిపి జాతీయ ప్రధాన కార్యద‌ర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు. మణిపూర్ రాష్ట్రంలో ఏర్పడిన ఘర్షణల‌తో అత్యవ‌స‌ర ప‌రిస్థితి విధించారు. ఇప్పటికే ప‌ర‌స్పర దాడుల్లో 54 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. చాలా జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. హింసాత్మక ఘటనలను నియంత్రించడానికి కనిపిస్తే కాల్చివేతకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేప‌థ్యంలో అక్కడున్న తెలుగు విద్యార్థుల ప‌రిస్థితి ఆందోళ‌న‌లో ప‌డింది.

వివిధ యూనివ‌ర్సిటీలు, ఎన్ఐటీల్లో వంద‌లాది మంది ఏపీకి చెందిన విద్యార్థులు ఉన్నారు. వీరి భ‌ద్రత విష‌య‌మై ఆందోళ‌న నెల‌కొన్న నేప‌థ్యంలో వారిని త‌క్షణ‌మే రాష్ట్రానికి త‌ర‌లించేందుకు ఏర్పాట్లు చేయాల‌ని డిమాండ్ చేస్తూ ఆదివారం టిడిపి జాతీయ ప్రధాన కార్యద‌ర్శి నారా లోకేష్ ఒక ప్రక‌ట‌న విడుద‌ల చేశారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థుల‌ను ప్రత్యేక విమానంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం సుర‌క్షితంగా స్వరాష్ట్రానికి తీసుకొచ్చింద‌ని, ఏపీకి చెందిన విద్యార్థులు వేర్వేరు క్యాంప‌స్‌ల‌లో బిక్కుబిక్కుమంటూ ప్రాణ‌భ‌యంతో ఉన్నార‌ని ఆందోళ‌న వ్యక్తం చేశారు. 

బ‌య‌ట క‌ర్ఫ్యూ, క‌నిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు, ఇంట‌ర్నెట్ సేవ‌లకి అంత‌రాయం ఉన్న నేప‌థ్యంలో ఏపీ స‌ర్కారు ఏర్పాటు చేసిన కాల్ సెంట‌ర్లని విద్యార్థులు ఎలా సంప్రదించగ‌ల‌ర‌ని నారా లోకేష్ ప్రశ్నించారు. త‌క్షణ‌మే సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి జోక్యం చేసుకుని ఉన్నతాధికారులు మ‌ణిపూర్ ప్రభుత్వంతో మాట్లాడి ప్రత్యేక విమానంలో మ‌న రాష్ట్ర విద్యార్థులు అంద‌రినీ త‌ర‌లించేందుకు త‌క్షణ‌మే ఏర్పాట్లు చేయాల‌ని డిమాండ్ చేశారు.

91వ రోజు కొనసాగుతున్న లోకేశ్ పాతయాత్ర

మరోవైపు, నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 91వ రోజు కొనసాగుతోంది. నేడు కర్నూలు శివారులోని రేడియో స్టేషన్ విడిది కేంద్రం నుంచి ప్రారంభించారు. క‌ర్నూలు న‌గ‌రవాసులు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. వార్డుల్లో తాగునీటి సమస్య, డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్లు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని కొంత మంది ప్రజలు లోకేశ్ దృష్టికి తీసుకొచ్చారు. కర్నూలు 48వ డివిజన్ రోజా దర్గా వద్ద  మతపెద్దలు షాయా కప్పి ఫాతియా అందజేశారు. నిరుద్యోగ యువకులు, దివ్యాంగులు, క్రిస్టియన్, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, వివిధ బస్తీల వాసులు కలిసి వారి సమస్యలను లోకేశ్ దృష్టికి తీసుకొచ్చారు. టిడిపి ప్రభుత్వం వ‌చ్చాక అంద‌రి స‌మ‌స్యలు ప‌రిష్కరిస్తామ‌ని హామీ ఇచ్చారు. కర్నూలు శ్రీనివాస నగర్ లోని స్టాంటన్ స్మారక తెలుగు బాప్టిస్ట్ చర్చిలో ప్రత్యేక ప్రార్థన‌ల్లో నారా లోకేశ్ పాల్గొన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Embed widget