అన్వేషించండి

Free Bus in AP: ఆర్టీసీలో మహిళలకు ఫ్రీ ప్రయాణంపై కసరత్తు, రేపు చంద్రబాబుతో జరిగే మీటింగ్‌లో నిర్ణయం

RTC BUS: ఏపీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై సోమవారం నిర్ణయం తీసుకునే అవకాశం, కర్ణాటక, తెలంగాణ మాదిరిగానే అమలు, ఖజానాపై రూ.250 కోట్లు భారం పడే అవకాశం

RTC Free Service: ఎన్నికల హామీలు ఒకొక్కటీ అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం...మహిళలకు ఇచ్చిన మరో కీలక హామీ అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఆర్టీసీ(RTC) బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై ఇప్పటికే అధ్యయనం చేసిన అధికారులు...సోమవారం సీఎం చంద్రబాబు(Chandra Babu) నిర్వహించనున్నట్లు ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఉచిత ప్రయాణం అమలు చేస్తే ప్రభుత్వం నెలకు అదనంగా 250 కోట్ల రూపాయల భారం పడనుంది.

మహిళలకు ఉచిత ప్రయాణం
ఏపీఎస్‌ ఆర్టీసీ(APS RTC) బస్సుల్లో మహిళల(Womens)కు ఉచిత ప్రయాణంపై సోమవారం కీలక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandra Babu) అధ్యక్షతన  సోమవారం ఆర్టీసీ ఉన్నతాధికారులతో కీల సమీక్ష నిర్వహించనున్నారు. మహిళలకు ఉచిత బస్సు(Free Bus) ప్రయాణంపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ పథకం అమలు చేస్తున్న కర్ణాటక(Karnataka), తెలంగాణ(Telangana) రాష్ట్రాల్లో పర్యటించిన ఏపీఎస్‌ ఆర్టీసీ అధికారులు...రాష్ట్రంలో అమలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు.  ఉచిత బస్సు ప్రయాణం వల్ల రాష్ట్రానికి అదనంగా నెలకు 250 కోట్ల రూపాయల భారం పడనుంది. రాష్ట్రంలో నిత్యం సగటున35 నుంచి 37 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో 40 శాతం మంది మహిళలు ఉన్నారనుకున్న రోజుకు 15 లక్షల మంది మహిళలా ప్రయాణికులే ఉంటారు.

తెలంగాణ, కర్ణాటకలో ఇప్పటికే విజయవంతంగా  ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించారు.అక్కడ మహిళలకు జీరో టిక్కెట్‌లు(Zero Tickes) చేస్తున్నారు. అంటే టిమ్‌ మిషన్ నుంచి జారీ చేసే టిక్కెట్‌లో జీరో టికెట్‌ వచ్చినా...మెషిన్‌లో మాత్రం ఆ టిక్కెట్ ధర ఫీడ్‌ అవుతుంది. ఆ టిక్కెట్లన్నీ ప్రభుత్వాన్ని పంపించి ఆర్టీసీ(RTC) రియింబర్స్‌మెంట్‌ చేసుకుంటోంది. ఏపీలోనూ ఇదే విధానం అమలు చేయాలని భావిస్తున్నారు. అయితే గతంలో తెలంగాణ, కర్ణాటకలో మహిళల ఆక్యుపెన్సీ రేషియా 70 శాతం మాత్రమే ఉండగా...ఇప్పుడు 95శాతానికి పెరిగింది. ఏపీలోనూ ఇదే విధంగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.  దీన్ని బట్టి చూస్తే ఆర్టీసీపై నెలకు 250 కోట్లు భారం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.  ఆర్టీసీ ఉద్యోగులకు ఇప్పుడు ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తున్నందునా....ఆర్టీసీకి వచ్చే రాబడిలో 25శాతం అంటే 125 కోట్ల రూపాయలను ప్రభుత్వం తీసుకుంటోంది. కాబట్టి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తే ఆ 125 కోట్లకు తోడు మరో 125 కోట్లు కలిపి నెలనెలా ప్రభుత్వమే ఆర్టీసీకి చెల్లించాల్సి ఉంటుంది. 

ఏయే బస్సుల్లో అమలు అంటే..?
తెలంగాణ(Telangana)లో అయితే ఆ రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లినా మహిళలు ఉచితంగానే ప్రయాణిస్తున్నారు. కానీ ఏపీ(AP)లో ఉచిత ప్రయాణం ఎంత పరిధి వరకు అమలు చేయాలి, ఏయే సర్వీసుల్లో అమలు చేయాలన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. సీఎం(CM) వద్ద జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.  తెలంగాణలో పల్లెవెలుగు(Palle Velugu), అల్ట్రా పల్లెవెలుగు(Altra Pallevelugu), ఎక్స్‌ప్రెస్‌(Express)లు వరకు రాష్ట్రవ్యాప్తంగా రాయితీ ఇవ్వనున్నారు. హైదరాబాద్‌(Hyderabad)లో సిటీలో ఆర్డినరీతోపాటు మెట్రో ఎక్స్‌ప్రెస్‌లోనూ ఉచిత ప్రయాణమే అమలు అవుతోంది. కర్ణాటకలోనూ ఇదే విధానం కొనసాగుతుండగా...తమిళనాడు(Tamilanadu)లో మాత్రం చెన్నై, కోయంబత్తూరు నగరాల్లోనే మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నారు. ఏపీలోనూ పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుల్లో అమలు చేసే అవకాశం ఉంది. సిటీ బస్సుల విషయానికి వస్తే విజయవాడ(Vijayawada), విశాఖ(Visaka)లో మాత్రమే సిటీ బస్సులు తిరుగుతున్నాయి.  ఈ రెండు నగరాల్లోనూ ఉచిత ప్రయాణం అమలు చేసే అవకాశం ఉంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?

వీడియోలు

Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్
Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Hyderabad Old City: మద్యం మత్తులో ఆటోడ్రైవర్ వీరంగం.. పాము వదులుతా అని పోలీసులను భయపెట్టి పరార్
మద్యం మత్తులో ఆటోడ్రైవర్ వీరంగం.. పాము వదులుతా అని పోలీసులను భయపెట్టి పరార్
Bangladesh squad for T20 world cup: టీ20 వరల్డ్ కప్ కోసం బంగ్లాదేశ్ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా హిందువుకు ఛాన్స్
టీ20 వరల్డ్ కప్ కోసం బంగ్లాదేశ్ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా హిందువుకు ఛాన్స్
Embed widget