అన్వేషించండి

Anantapur News: ఉమ్మడి అనంతపురంపై చంద్రబాబు ఫోకస్, నియోజకవర్గాల వారీగా ప్రత్యేక నిఘా

TDP News: రాయలసీమలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న అనంతపురం జిల్లా పై చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

Chandrababu focuses on Anantapur District: రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాయలసీమపై ప్రత్యేక దృష్టి సారించారు. రాయలసీమ జిల్లాల్లో రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా ఉండటంతో వైసీపీకి అధికంగా రాయలసీమ నుంచే ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో కూడా రాయలసీమ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హిందూపురం నుంచి బాలకృష్ణ, ఉరవకొండ నియోజకవర్గం పయ్యావుల కేశవ్ మాత్రమే గెలుపొందారు. 

రాయలసీమలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న అనంతపురం జిల్లా పై చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాలపై ప్రత్యేక నిఘా ఉంచారు. వచ్చే ఎన్నికల్లో సర్వేల ఆధారంగా గెలిచే నేతలకే టికెట్లు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. ప్రస్తుతం ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్న నియోజకవర్గ ఇన్చార్జిలను చంద్రబాబు అలర్ట్ చేశారు. మీ పనితీరు బాగుంటేనే ఈసారి టికెట్ దక్కుతుందని జిల్లా నేతలకు సంకేతాలు ఇచ్చారు. దీంతో జిల్లాలో ఉన్న నేతలందరూ తమ నియోజకవర్గాల్లో బాబు షూరిటి భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటున్నారు. 
            
ఇప్పటికే చంద్రబాబు బస్సు యాత్రలో కదిరి నియోజకవర్గం నుంచి కందికుంట వెంకటప్రసాద్ ఆశీర్వదించాలని బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ పోటీలో ఉండటం ఖాయంగా కనిపిస్తుంది. తాడిపత్రి నుంచి జేసీ అస్మిత్ రెడ్డి ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ నియోజకవర్గం ఇన్చార్జిగా కొనసాగిస్తున్నారు. అనంతపురం అర్బన్ లో వైకుంఠం ప్రభాకర్ చౌదరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. రాప్తాడు నుంచి మాజీ మంత్రి పరిటాల సునీత నియోజకవర్గం ఇన్చార్జి గా కొనసాగుతున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో అంతర్గతంగా విభేదాలు కొనసాగుతూ వస్తున్నాయి.

ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా సగం నియోజకవర్గాలలో వర్గపోరు సమస్యలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా శింగనమల నియోజకవర్గంలో వర్గపోరు తారా స్థాయిలో కొనసాగుతోంది. టీడీపీ నియోజవర్గ ఇంచార్జ్ ఎవరన్నది సందిగ్దత నెలకోంది. ఇక్కడ బండారు శ్రావణశ్రీ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం చోటు చేసుకున్న పరిణామాలతో ఇంచార్జ్ బాద్యతల నుంచి తప్పించి.. టూమ్యాన్ కమిటీని పార్టీ నియమించింది. అప్పటి నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా బండారు శ్రావణిశ్రీ పర్యటిస్తున్నారు. గుంతకల్లు నియోజకవర్గంలోనూ టికెట్ ఆశిస్తున్న నాయకులు ఎక్కువగానే కనిపిస్తున్నారు. ప్రస్తుతం నియోజకవర్గ ఇంచార్జ్ గా మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ కొనసాగుతున్నారు. 

మడకశిర ఎస్సీ నియోజకవర్గం అయినప్పటికీ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఈరన్న కి టీడీపీ నేత గుండుమల తిప్పే స్వామికి వర్గపోరు నడుస్తుంది. పెనుగొండ నియోజకవర్గ ఇన్చార్జిగా మాజీ ఎమ్మెల్యే పార్థసారథి ఉన్నప్పటికీ.. పార్థసారథి సామాజిక వర్గానికి చెందిన కురుభ సవితమ్మ టికెట్ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా సమస్యలు ఉన్న నియోజకవర్గాలపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
AP NDA Alliance: వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget