అన్వేషించండి

Chandrababu : జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్

Andhra News : రాప్తాడు ప్రజాగళం సభలో జగన్‌కు చంద్రబాబు ఏడు ప్రశ్నలు వేశారు. సమాధానాలు చెప్పాలని సవాల్ చేసారు.

Chandrababu asked seven questions to Jagan :  రాష్ట్రాన్ని సర్వనాశనం పట్టించిన ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌( CM Jagan) ను ఇంటికి పంపించే సమయం ఆసన్నమయ్యిందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు( Chandra Babu) అన్నారు. ఎన్నికల ప్రచారం(Election Campaign) లో భాగంగా అనంతపురం జిల్లా రాప్తాడులో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర భవిష్యత్‌ కోసం టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి పనిచేస్తున్నాయని వెల్లడించారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు కూటమికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా జగన్‌ ప్రభుత్వా్నికి ఏడు ప్రశ్నలకు సమాధానమివ్వాలని డిమాండ్‌ చేశారు.                             

ప్రత్యేక హోదా(Special Status) , సీపీఎస్‌ రద్దు, మద్య నిషేదం, ఏటా జాబ్‌ క్యాలెండర్(Job Calander) ‌, మెగా డీఎస్సీ(Mega DSC) , కరెంటు చార్జీల తగ్గింపు, పోలవరం పూర్తి ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. అవినీతిపరులు, అసమర్ధత ముఖ్యమంత్రి ఒక్క నోటిఫికేషన్‌ ఇవ్వకుండా మోసం చేశారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే గోదావరి జలాలను రాయలసీమకు తీసుకొచ్చే బాధ్యత టీడీపీ తీసుకుంటుందని అన్నారు. వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి అత్యంత కీలకమని..   రాష్ట్ర భవిష్యత్ కోసం మూడు పార్టీలు కలిశామని ప్రజలకు తెలిపారు.   విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు టీడీపీకి మద్దతివ్వాలని పిలుపునిచ్చారు.   ప్రజా ప్రభుత్వం కోసం ప్రతిఒక్కరూ ముందుకురావాల్నారు.  

 

అక్రమ కేసులు, బెదిరింపులకు ఎవరూ భయపడవద్దు  ..జగన్ ను ఇంటికి పంపడమే అందరి లక్ష్యం కావాలన్నారు.  విధ్వంసంతో రాష్ట్రాన్ని జగన్ లూటీ చేశారు  విద్యుత్ ఛార్జీలను అమాంతం పెంచేశారు ..  నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి   అన్నింటి ధరలను పెంచుకుంటూ పోయారని మండిపడ్డారు.  అసమర్థుడు, అవినీతిపరుడిని ఇంటికి పంపాలన్నారు.  మద్యం ధరలు కూడా విపరీతంగా పెంచేశారు ,  నాసిరకం మద్యంతో అనారోగ్యం పాలయ్యే పరిస్థితికి తెచ్చారన్నారు.  నాసిరకం మద్యం తాగి కొంతమంది చనిపోయారు .. ఆఖరికి ఇసుకపైనా దోపిడీ చేశారని గుర్తు చేశారు.   భవన నిర్మాణ కార్మికులను నాశనం చేశారు  ఇసుక దొరక్క భవన నిర్మాణ రంగం కుదేలైందన్నారు.         

రాప్తాడులో ఇసుక దొరకదు.. ఇక్కడి ఇసుక బెంగళూరులో దొరుకుతుందన్నారు.  నిరుద్యోగులను నిలువునా ముంచేశారు   ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా మోసం చేశారన్నారు. తాను సీఎం కాగానే మొదటి సంతకం  డీఎస్సీ మీద పెడతాన్నారు.  సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.68 వేల కోట్లు ఖర్చు పెట్టామని..  రాయలసీమకు రూ.12 వేల కోట్లు ఖర్చు పెట్టామన్నారు.   జగన్ ఐదేళ్లలో రూ.2 వేల కోట్లు కూడా ఖర్చు పెట్టలేదని  రాయలసీమ ద్రోహి జగన్ అని మండిపడ్డారు.  రాయలసీమకు జగన్ రాజకీయ హింస తెచ్చారని..   వైసీపీ మాఫియా, సైకో రాజ్యంగా మార్చేశారని ఆరోపించారు.  వైసీపీ ప్రభుత్వం పోలవరాన్ని గోదావరిలో ముంచేసింది .  గోదావరి నీళ్లు రాయలసీమకు తీసుకొచ్చే బాధ్యత మాది .. ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే బాధ్యత కూడా తీసుకుంటామన్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?

వీడియోలు

Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్
Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Hyderabad Old City: మద్యం మత్తులో ఆటోడ్రైవర్ వీరంగం.. పాము వదులుతా అని పోలీసులను భయపెట్టి పరార్
మద్యం మత్తులో ఆటోడ్రైవర్ వీరంగం.. పాము వదులుతా అని పోలీసులను భయపెట్టి పరార్
Bangladesh squad for T20 world cup: టీ20 వరల్డ్ కప్ కోసం బంగ్లాదేశ్ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా హిందువుకు ఛాన్స్
టీ20 వరల్డ్ కప్ కోసం బంగ్లాదేశ్ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా హిందువుకు ఛాన్స్
Embed widget