అన్వేషించండి

Breaking News Live Telugu Updates: ఆ హోం గార్డులను విధుల్లోకి తీసుకోండి - సీఎం KCRకు జగ్గారెడ్డి లేఖ

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

Key Events
AP Telangana Breaking News Telugu Live Updates 8 March 2023 CRDA Lands sale Breaking News Live Telugu Updates: ఆ హోం గార్డులను విధుల్లోకి తీసుకోండి - సీఎం KCRకు జగ్గారెడ్డి లేఖ
ప్రతీకాత్మక చిత్రం

Background

వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, నైరుతి రాజస్థాన్, దాని సమీప ప్రాంతాల్లో పశ్చిమ డిస్ట్రబెన్స్ పాక్షికంగా చురుకుగా ఉంటుంది. దీనితో పాటు, దక్షిణ కొంకణ్ మరియు మధ్య ఛత్తీస్‌గఢ్‌లో ద్రోణి అంటే అల్పపీడనం ఏర్పడింది. దీని కారణంగా, మార్చి 6 నుండి 8 వరకు మధ్య భారతదేశంలో తేలికపాటి, మోస్తరు మరియు ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. మరోవైపు మార్చి 6 నుంచి 9 వరకు మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో మార్చి 6 నుంచి 7 వరకు ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

తెలంగాణలో ఇలా..

ఇక తెలంగాణలో ఉష్ణోగ్రతలు భగ్గుమంటున్నాయి. నిన్న మొన్నటి వరకూ చలి విషయంలో ఎల్లో అలర్ట్ జారీ చేయగా, ఇక నుంచి అధిక ఉష్ణోగ్రతల విషయంలో ఎల్లో అలర్ట్ జారీ చేస్తూ వస్తోంది. తెలంగాణలో వచ్చే 5 రోజుల పాటు నాలుగైదు జిల్లాలు మినహా రాష్ట్రమంతా ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 

మామూలుగా 45 డిగ్రీల కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైతే రెడ్ అలర్ట్ జారీ చేస్తారు. 41 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత ఉంటే ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తారు. 36 నుంచి 40 మధ్య అయితే, ఎల్లో అలర్ట్ జారీ చేస్తారు.

 

తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమురం భీం-ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, నిజామాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ బులెటిన్‌లో తెలిపారు. 

ఏపీలో ఇలా

ఆంధ్రప్రదేశ్‌ వాతావరణ విభాగం తెలిపిన వివరాల మేరకు ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపోస్ఫిరిక్ స్థాయిల్లో ఆగ్నేయ, నైరుతి దిశలలో గాలులు వీస్తున్నాయని వెదర్ బులెటిన్ లో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఒకటి లేదా రెండు చోట్ల పగటిపూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు సగటు ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.

ఈ వాతావరణ పరిస్థితుల వల్ల ఏపీలోని ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటనలో తెలిపింది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో కూడా పొడి వాతావరణమే ఉండనుంది. రాయలసీమలో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉండనుంది. రాయలసీమలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సగటు ఉష్ణోగ్రత కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకూ తక్కువగా ఒకటి లేదా రెండు చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది.

ఢిల్లీలో వడగళ్ల వాన

మంగళవారం (మార్చి 7) ఢిల్లీలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ ప్రాంతాల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండగా, తూర్పు రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్, గుజరాత్, మరాఠ్వాడా, మధ్య మహారాష్ట్రల్లో భారీ వర్షాలు, వడగళ్ల వాన కురిసింది. వాతావరణ శాఖ ప్రకారం, రాబోయే 5 రోజుల్లో దేశంలోని వాతావరణంలో గణనీయమైన తేడాలు ఉండవు. మధ్య భారతం, మహారాష్ట్ర, గుజరాత్ మినహా దేశం మొత్తం మీద గరిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం లేదు. ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో, మార్చి 8 బుధవారం కూడా ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని అంచనా. గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్ , కనిష్ట ఉష్ణోగ్రత 14 డిగ్రీల సెల్సియస్ గా ఉండి ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు కురిసే అవకాశం ఉంటుంది.

20:07 PM (IST)  •  08 Mar 2023

చోరీలకు పాల్పడుతున్న బైక్ దొంగలను అరెస్టు చేసిన రాచకొండ పోలీసులు

హైదరాబాద్ , రాచకొండ కమీషనరేట్ల పరిధి ఉప్పల్ , మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ల లిమిట్స్ వేర్వేరుగా చోరీలకు పాల్పడుతున్న బైక్ దొంగలను అరెస్టు చేసిన రాచకొండ పోలీసులు ... ఉప్పల్ పీఎస్ లో వివరాలను వెల్లడించిన మల్కాజిగిరి డిసిపి ధరావత్ జానకి...

వివరాల్లోకి వెళితే ... ఉప్పల్ పీఎస్ కేసు వివరాలు : 

ఉప్పల్ విజయపురి కాలనీకి చెందిన గంటపంగి జయరాజు (26) వృత్తిరీత్యా ఫ్లవర్ డెకరేషన్ వర్క్ చేస్తుంటాడు ... విలాసవంతమైన రైడ్ లకు అలవాటు పడ్డ జయరాజు పెద్ద సంఖ్యలో వాహనాలు పార్కింగ్ చేసే ప్రాంతాలైన ఉప్పల్ , రామంతాపూర్ , భరత్ నగర్ , నాగోల్ మెట్రో స్టేషన్ లలో వాహనాలను చోరీ చేసి పెట్రోల్ అయిపోయేంత వరకూ తిప్పి వదిలేస్తుంటాడు ... కాగా ఉప్పల్ లో రాజ్యలక్ష్మి థియేటర్ ప్రాంతంలో తనిఖీలు చేస్తున్న పోలీసులకు అనుమానాస్పద రీతిలో ఉన్న జయరాజు ను అదుపులోకి తీసుకుని విచారించగా , ఉప్పల్ పీఎస్ పరిధిలో ఏడు వాహనాలను దొంగిలించినట్లు దర్యాప్తు లో తేలిందనీ ... దీంతో జయరాజు వద్ద  నాలుగు లక్షల ఇరవై వేల రూపాయలు విలువ జేసే ఏడు బైకులను స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించినట్లు మల్కాజిగిరి డిసిపి ధరావత్ జానకి తెలిపారు ...

కాగా జయరాజు పై 2017 లో సెల్ ఫోన్ దొంగతనం కేసు , 2019 లో ఉప్పల్ పీఎస్ పరిధిలో జయరాజు పై పోక్సోచట్టం కింద అరెస్టు అయి జైలుకు వెళ్లినా కూడా పద్దతి మార్చుకోలేదని డిసిపి అన్నారు . 


మల్కాజిగిరి పీఎస్ పరిధి కేసు వివరాలు : 

కుషాయిగూడ పీఎస్ పరిధి హనుమాన్ నగర్ కు చెందిన పంబాల నాగరాజు (30) వృత్తిరీత్యా ఆటో డ్రైవర్ ... చెడు వ్యసనాలకు అలవాటు పడిన నాగరాజు ఆర్ధిక సమస్యలు చుట్టుముట్టడంతో వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్నాడు . 

హైదరాబాద్ , రాచకొండ పోలీస్ కమీషనరేట్ల పరిధిలోని మల్కాజిగిరి , కుషాయిగూడ , నేరేడుమెట్‌ , బోయినపల్లి పీఎస్ ల పరిధిలో దొంగతనాలకు పాల్పడ్డాడు ... 

సిసిటివి కెమెరాల సాయంతో కాకుండా టెక్నికల్ ఎవిడెన్స్ తో హ్యూమన్ ఇంటెలిజెన్స్ తో కూడా వర్కవుట్ చేయడం వల్ల నిందితుడిని పట్టుకోవడం జరిగిందని డిసిపి తెలిపారు. 

నిందితుడు నాగరాజు వద్ద నాలుగున్నర లక్షల విలువ జేసే రెండు ఆటోలు , అయిదు బైకులను స్వాధీనం చేసుకుని రిమాండ్ కు పంపినట్లు మల్కాజిగిరి డిసిపి ధరావత్ జానకి తెలిపారు..

బైట్ :- ధరావత్ జానకి డిసిపి మల్కాజిగిరి.

18:18 PM (IST)  •  08 Mar 2023

ఆ హోం గార్డులను విధుల్లోకి తీసుకోండి - సీఎం KCRకు జగ్గారెడ్డి లేఖ

250 మంది హోం గార్డులను విధుల్లోకి తీసుకోవాలని సిఎం కేసీఆర్ కు లేఖ రాసిన ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి.

*ఉమ్మడి రాష్ట్రంలో ఆర్డర్ కాపీ లేదని 250 మంది హోం గార్డు లను విధుల్లో నుండి తొలిగించడం జరిగింది.

*అప్పటికే వారు 10 సంవత్సరాలు వివిధ జిల్లాలో హోం గార్డు గా విధులు నిర్వహించారు.

*ఈ 250మంది  హోం గార్డు లకు ఐడీ, కార్డ్స్, బ్యాంకు అకౌంట్స్,హెల్త్ కార్డ్స్ అన్ని ఉన్నాయి.

* కానీ ఆర్డర్ కాపీ లేదని వారిని విధుల్లో నుండి తొలిగించడం జరిగింది.

* 10 సంవత్సరాల నుండి ఉద్యోగాలు లేక వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు.

*ఐతే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిఎం కేసీఆర్ గారు ఈ  250మందిని విధులోకి తీసుకుంటామని అసెంబ్లీ లో హామీ ఇచ్చారు.

*కానీ ఎందుకో వారిని విధులోకి తీసుకోవడంలో జాప్యం జరిగింది.

* ఉమ్మడి రాష్ట్రంలో తొలిగించిన 250 హోం గార్డులను విధులోకి తీసుకుంటానని కేసిఆర్ గారు మాట ఇచ్చారు...తీసుకోండి..


* ఇప్పటికే రాష్ట్రం ఏర్పడి 8 ఏళ్లు అవుతున్న వారిని డ్యూటీ లోకి తీసుకోలేదు.

*అందుకే మీ దృష్టికి మరోసారి తీసుకొస్తూ గుర్తు చేస్తూ లేఖ రాస్తున్న.

* ఈ 250మందిని వెంటనే విధులోకి తీసుకోవాలని కోరుతున్న.

*రేపు జరుగనున్న కాబినెట్ సమావేశాల్లో నిర్ణయం తీసుకోవాలని కోరుతున్న

Load More
New Update
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?

వీడియోలు

Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!
Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
Reliance Foundation: రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
Nita Ambani: అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
Chandrababu on water dispute: నీళ్లపై రాజకీయాలు సరి కాదు - పోటాపోటీగా మాట్లాడొద్దు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
నీళ్లపై రాజకీయాలు సరి కాదు - పోటాపోటీగా మాట్లాడొద్దు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Embed widget