అన్వేషించండి

AP Politics: ఏపీలో పెరిగిన పొలిటికల్ హీట్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అనర్హతపై నేడు ఫైనల్ విచారణ!

Rebel MLAs And MLCs: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ హీట్ పెరుగుతోంంది. ప్రధాన పార్టీలకు సంబంధించిన రెబల్‌ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల అనర్హతపై ఉత్కంఠ ఏర్పడింది. 

AP Speaker Summons Rebel MLAs: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ హీట్ (AP Politics) పెరుగుతోంంది. ప్రధాన పార్టీలకు సంబంధించిన రెబల్‌ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల (Rebel MLA's And MLC's) అనర్హతపై ఉత్కంఠ ఏర్పడింది. ఇప్పటికే పార్టీలు ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారం (Tammineni Sitaram), మండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌ (Koyye Mosenu Raju) నోటీసులు ఇచ్చారు. పార్టీ ఫిరాయింపులపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అయితే వాటిని పలువురు లెక్క చేయకుండా తమ పని తాము చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సోమవారం విచారణకు రావాల్సిందిగా అసెంబ్లీ స్పీకర్‌, మండలి చైర్మన్‌లు మరోసారి నోటీసులు ఇచ్చారు. 

ఫిరాయింపు ప్రజాప్రతినిధులు తమ వివరణ ఇవ్వాలని, ఇవే తుది విచారణ నోటీసులని పేర్కొన్నారు. హాజరుకాకుంటే అనర్హతపై తుది నిర్ణయం తీసుకుంటామని హెచ్చరించారు. ఈ క్రమంలో నేటి విచారణకు హాజరవుతారా? లేదా? అనే చర్చ నడుస్తోంది. అధికార వైసీపీ తరఫున గెలిచిన మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి టీడీపీలో చేరారు. అలాగే మండలిలో ఎమ్మెల్సీలు రామచంద్రయ్య టీడీపీలో చేరగా, వంశీకృష్ణ జనసేన కండువా కప్పుకున్నారు. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ అసెంబ్లీలో చీఫ్‌విప్‌ మదునూరి ప్రసాదరాజు అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాంకు, మండలిలో చీఫ్‌ విప్‌ మేరిగ మురళీధర్‌ మండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌లకు ఫిర్యాదులు చేశారు. 

ఎందుకు చర్యలు తీసుకోవద్దో చెప్పండి
దీంతో ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలంటూ.. స్పీకర్‌, మండలి చైర్మన్‌ ఆయా సభ్యుల్ని ప్రశ్నిస్తూ మూడు సార్లు నోటీసులు జారీ చేశారు. రకరకాల కారణాలతో కొందరు విచారణకు గైర్హాజరు అవగా, కొందరు అరకోరగా విచారణకు హాజరయ్యారు. సాంకేతిక, వ్యక్తిగత కారణాలతో విచారణలో పాల్గొనలేదు. ఈ క్రమంలో సోమవారం విచారణకు హాజరుకావాల్సిందేనని స్పీకర్‌ కార్యాలయం నోటీసులు జారీ చేసింది. వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆనం రామనారాయణ రెడ్డికి స్పీకర్ నోటీసులు పంపించారు. సాయంత్రం 4గం. విచారణ ఉంటుందని, రాకపోతే తుది నిర్ణయం ప్రకటిస్తామని స్పీకర్‌ స్పష్టం చేశారు. 

స్పీకర్ కార్యాలయంలో విచారణ
అసెంబ్లీ స్పీకర్‌ కార్యాలయంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ జరగనుంది. అనర్హత పిటిషన్లు వేసిన ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ప్రసాదరాజు, మేరిగ మురళీధర్‌(మండలి) సమక్షంలోనే విచారణ జరగాల్సి ఉంది. దీంతో వారికి కూడా స్పీకర్‌ కార్యాలయం నోటీసులు జారీ చేసింది. ఒకవేళ.. సదరు ఫిరాయింపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విచారణకు హాజరు కాకపోతే ఇప్పటిదాకా జరిగిన విచారణ ఆధారంగా నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని స్పీకర్‌, చైర్మన్‌లు ఇది వరకే నోటీసుల్లో స్పష్టం చేశారు.

టీడీపీ ఎమ్మెల్యేలకు సైతం నోటీసులు
తెలుగుదేశం పార్టీ రెబల్ ఎమ్మెల్యేల వ్యవహారంపై స్పీకర్ తమ్మినేని సీతారాం విచారణ చేపట్టారు. టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు కరణం బలరాం, మద్దాల గిరి, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్‌కు స్పీకర్ మూడు సార్లు నోటీసులు ఇచ్చారు. వారు కూడా ఇప్పటి వరకు స్పీకర్ ఎదుట విచారణకు హాజరు కాలేదు. మరో రెబల్‌ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ మాత్రం స్పీకర్ ఎదుట ఒకసారి విచారణకు హాజరై వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో.. టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు విచారణకు హాజరవుతారా.. లేదా అన్న అంశంపై సందిగ్ధం నెలకొంది. ముందుగా టీడీపీ ఎమ్మెల్యేల విచారణ జరిగిన తర్వాతే.. వైసీపీ నుంచి ఫిరాయించిన సభ్యుల విచారణ జరగనుంది.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: టాటాగ్రూప్‌లో కీలక పరిణామం- ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌ రాజీనామా 
టాటాగ్రూప్‌లో కీలక పరిణామం- ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌ రాజీనామా 
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి భారత్ జన వికాస్ పార్టీ - బీజేపీ నో.. వైసీపీ క్లోజ్! మళ్లీ రీ-ఎంట్రీ వెనుక మర్మమేంటి?
విజయసాయిరెడ్డి భారత్ జన వికాస్ పార్టీ - బీజేపీ నో.. వైసీపీ క్లోజ్! మళ్లీ రీ-ఎంట్రీ వెనుక మర్మమేంటి?
SIR Enumeration Uncollectable Votes: తెలుగు రాష్ట్రాల రాజకీయాలను కుదిపేస్తున్న SIR ప్రక్షాళన - లక్షల్లో ఓట్ల గల్లంతు - వాళ్లంతా ఏమయ్యారు?
తెలుగు రాష్ట్రాల రాజకీయాలను కుదిపేస్తున్న SIR ప్రక్షాళన - లక్షల్లో ఓట్ల గల్లంతు - వాళ్లంతా ఏమయ్యారు?
Tirumala News: శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
Chemical Signaling: మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
Microsoft Alert: హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Embed widget