అన్వేషించండి

AP Politics: ఏపీలో పెరిగిన పొలిటికల్ హీట్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అనర్హతపై నేడు ఫైనల్ విచారణ!

Rebel MLAs And MLCs: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ హీట్ పెరుగుతోంంది. ప్రధాన పార్టీలకు సంబంధించిన రెబల్‌ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల అనర్హతపై ఉత్కంఠ ఏర్పడింది. 

AP Speaker Summons Rebel MLAs: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ హీట్ (AP Politics) పెరుగుతోంంది. ప్రధాన పార్టీలకు సంబంధించిన రెబల్‌ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల (Rebel MLA's And MLC's) అనర్హతపై ఉత్కంఠ ఏర్పడింది. ఇప్పటికే పార్టీలు ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారం (Tammineni Sitaram), మండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌ (Koyye Mosenu Raju) నోటీసులు ఇచ్చారు. పార్టీ ఫిరాయింపులపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అయితే వాటిని పలువురు లెక్క చేయకుండా తమ పని తాము చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సోమవారం విచారణకు రావాల్సిందిగా అసెంబ్లీ స్పీకర్‌, మండలి చైర్మన్‌లు మరోసారి నోటీసులు ఇచ్చారు. 

ఫిరాయింపు ప్రజాప్రతినిధులు తమ వివరణ ఇవ్వాలని, ఇవే తుది విచారణ నోటీసులని పేర్కొన్నారు. హాజరుకాకుంటే అనర్హతపై తుది నిర్ణయం తీసుకుంటామని హెచ్చరించారు. ఈ క్రమంలో నేటి విచారణకు హాజరవుతారా? లేదా? అనే చర్చ నడుస్తోంది. అధికార వైసీపీ తరఫున గెలిచిన మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి టీడీపీలో చేరారు. అలాగే మండలిలో ఎమ్మెల్సీలు రామచంద్రయ్య టీడీపీలో చేరగా, వంశీకృష్ణ జనసేన కండువా కప్పుకున్నారు. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ అసెంబ్లీలో చీఫ్‌విప్‌ మదునూరి ప్రసాదరాజు అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాంకు, మండలిలో చీఫ్‌ విప్‌ మేరిగ మురళీధర్‌ మండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌లకు ఫిర్యాదులు చేశారు. 

ఎందుకు చర్యలు తీసుకోవద్దో చెప్పండి
దీంతో ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలంటూ.. స్పీకర్‌, మండలి చైర్మన్‌ ఆయా సభ్యుల్ని ప్రశ్నిస్తూ మూడు సార్లు నోటీసులు జారీ చేశారు. రకరకాల కారణాలతో కొందరు విచారణకు గైర్హాజరు అవగా, కొందరు అరకోరగా విచారణకు హాజరయ్యారు. సాంకేతిక, వ్యక్తిగత కారణాలతో విచారణలో పాల్గొనలేదు. ఈ క్రమంలో సోమవారం విచారణకు హాజరుకావాల్సిందేనని స్పీకర్‌ కార్యాలయం నోటీసులు జారీ చేసింది. వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆనం రామనారాయణ రెడ్డికి స్పీకర్ నోటీసులు పంపించారు. సాయంత్రం 4గం. విచారణ ఉంటుందని, రాకపోతే తుది నిర్ణయం ప్రకటిస్తామని స్పీకర్‌ స్పష్టం చేశారు. 

స్పీకర్ కార్యాలయంలో విచారణ
అసెంబ్లీ స్పీకర్‌ కార్యాలయంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ జరగనుంది. అనర్హత పిటిషన్లు వేసిన ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ప్రసాదరాజు, మేరిగ మురళీధర్‌(మండలి) సమక్షంలోనే విచారణ జరగాల్సి ఉంది. దీంతో వారికి కూడా స్పీకర్‌ కార్యాలయం నోటీసులు జారీ చేసింది. ఒకవేళ.. సదరు ఫిరాయింపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విచారణకు హాజరు కాకపోతే ఇప్పటిదాకా జరిగిన విచారణ ఆధారంగా నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని స్పీకర్‌, చైర్మన్‌లు ఇది వరకే నోటీసుల్లో స్పష్టం చేశారు.

టీడీపీ ఎమ్మెల్యేలకు సైతం నోటీసులు
తెలుగుదేశం పార్టీ రెబల్ ఎమ్మెల్యేల వ్యవహారంపై స్పీకర్ తమ్మినేని సీతారాం విచారణ చేపట్టారు. టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు కరణం బలరాం, మద్దాల గిరి, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్‌కు స్పీకర్ మూడు సార్లు నోటీసులు ఇచ్చారు. వారు కూడా ఇప్పటి వరకు స్పీకర్ ఎదుట విచారణకు హాజరు కాలేదు. మరో రెబల్‌ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ మాత్రం స్పీకర్ ఎదుట ఒకసారి విచారణకు హాజరై వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో.. టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు విచారణకు హాజరవుతారా.. లేదా అన్న అంశంపై సందిగ్ధం నెలకొంది. ముందుగా టీడీపీ ఎమ్మెల్యేల విచారణ జరిగిన తర్వాతే.. వైసీపీ నుంచి ఫిరాయించిన సభ్యుల విచారణ జరగనుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana liquor shops closed: జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో నాలుగు రోజులు లిక్కర్ షాప్స్ బంద్ - పోలింగ్, కౌంటింగే కారణం
జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో నాలుగు రోజులు లిక్కర్ షాప్స్ బంద్ - పోలింగ్, కౌంటింగే కారణం
Vizag News: అంతర్జాతీయ ఈవెంట్లతో మెరిసిపోనున్న విశాఖ -  వచ్చే మూడు, నాలుగు నెలల్లో ప్రతిష్టాత్మక కార్యక్రమాలు !
అంతర్జాతీయ ఈవెంట్లతో మెరిసిపోనున్న విశాఖ - వచ్చే మూడు, నాలుగు నెలల్లో ప్రతిష్టాత్మక కార్యక్రమాలు !
America shut down: అమెరికా గవర్నమెంట్ షట్‌డౌన్ -ఎంతకాలం కొనసాగుతుంది? ట్రంప్ ఎందుకు ఏమీ చేయలేకపోతున్నారు ?
అమెరికా గవర్నమెంట్ షట్‌డౌన్ -ఎంతకాలం కొనసాగుతుంది? ట్రంప్ ఎందుకు ఏమీ చేయలేకపోతున్నారు ?
Ration Card Download From Digilocker: రేషన్ కార్డును డిజిలాకర్ నుంచి నిమిషాల్లో డౌన్‌లోడ్ చేసే ప్రక్రియ ఏంటీ?
రేషన్ కార్డును డిజిలాకర్ నుంచి నిమిషాల్లో డౌన్‌లోడ్ చేసే ప్రక్రియ ఏంటీ?
Advertisement

వీడియోలు

వన్టే పోయే.. టీ20 అయినా..! ఈ బ్యాటింగ్‌తో డౌటే..
ఆసియా కప్ దొంగ బీసీసీఐకి భయపడి ఐసీసీ మీటింగ్‌కి డుమ్మా
సూపర్ స్టార్ హర్షిత్ రానా..  టీమ్‌లో లేకపోవటం ఏంటి గంభీర్ సార్..?
ప్రధాని మోదీకి మోదీకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన విమెన్స్ టీమ్
Ghazala Hashmi New Lieutenant Governor | వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ గా తొలి ముస్లిం మహిళ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana liquor shops closed: జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో నాలుగు రోజులు లిక్కర్ షాప్స్ బంద్ - పోలింగ్, కౌంటింగే కారణం
జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో నాలుగు రోజులు లిక్కర్ షాప్స్ బంద్ - పోలింగ్, కౌంటింగే కారణం
Vizag News: అంతర్జాతీయ ఈవెంట్లతో మెరిసిపోనున్న విశాఖ -  వచ్చే మూడు, నాలుగు నెలల్లో ప్రతిష్టాత్మక కార్యక్రమాలు !
అంతర్జాతీయ ఈవెంట్లతో మెరిసిపోనున్న విశాఖ - వచ్చే మూడు, నాలుగు నెలల్లో ప్రతిష్టాత్మక కార్యక్రమాలు !
America shut down: అమెరికా గవర్నమెంట్ షట్‌డౌన్ -ఎంతకాలం కొనసాగుతుంది? ట్రంప్ ఎందుకు ఏమీ చేయలేకపోతున్నారు ?
అమెరికా గవర్నమెంట్ షట్‌డౌన్ -ఎంతకాలం కొనసాగుతుంది? ట్రంప్ ఎందుకు ఏమీ చేయలేకపోతున్నారు ?
Ration Card Download From Digilocker: రేషన్ కార్డును డిజిలాకర్ నుంచి నిమిషాల్లో డౌన్‌లోడ్ చేసే ప్రక్రియ ఏంటీ?
రేషన్ కార్డును డిజిలాకర్ నుంచి నిమిషాల్లో డౌన్‌లోడ్ చేసే ప్రక్రియ ఏంటీ?
Brazil Model Issue: రాహుల్‌  గాంధీకి షాకిచ్చిన బ్రెజిల్ మోడల్  ఫేక్ ఓట్లపై  ఆరోపణలపై వీడియో రిలీజ్
రాహుల్‌ గాంధీకి షాకిచ్చిన బ్రెజిల్ మోడల్ - ఫేక్ ఓట్లపై ఆరోపణలపై వీడియో రిలీజ్
YS Jagan Padayatra: 2027లో జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర- రెండేళ్ల పాటు సాగనున్న నయా ప్రజాసంకల్ప యాత్ర  
2027లో జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర- రెండేళ్ల పాటు సాగనున్న నయా ప్రజాసంకల్ప యాత్ర  
Instagram or YouTube : ఇన్‌స్టాగ్రామ్ లేదా యూట్యూబ్ ఏ ప్లాట్‌ఫామ్‌లో ఎక్కువ సంపాదించవచ్చు? రెండింటి మధ్య తేడా ఏంటీ?
ఇన్‌స్టాగ్రామ్ లేదా యూట్యూబ్ ఏ ప్లాట్‌ఫామ్‌లో ఎక్కువ సంపాదించవచ్చు? రెండింటి మధ్య తేడా ఏంటీ?
Anasuya Bharadwaj : ప్రభుదేవాతో అనసూయ రొమాన్స్ - తమిళ మూవీలో ఐటెం సాంగ్ రిలీజ్
ప్రభుదేవాతో అనసూయ రొమాన్స్ - తమిళ మూవీలో ఐటెం సాంగ్ రిలీజ్
Embed widget