అన్వేషించండి

Srisailam: శ్రీశైలం ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారానికి బ్రేక్, మూడు వారాలు స్టే విధించిన హైకోర్టు

శ్రీశైలం ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారంపై హైకోర్టు స్టే ఇచ్చింది. దీంతో ఈ నెల 14న జరగాల్సిన ప్రమాణస్వీకారోత్సవం వాయిదా పడింది.

ఈ నెల 14న జరగాల్సిన శ్రీశైలం ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారంపై హైకోర్టు స్టే ఇచ్చింది. ట్రస్ట్ బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకారాన్ని వాయిదా వేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. 15 మంది ట్రస్ట్ బోర్డు సభ్యులను నియమిస్తూ ఈ నెల 3న ప్రభుత్వం జీవో 84ను జారీ చేసింది.  శ్రీశైలం ట్రస్ట్ బోర్డు నియామకాన్ని సవాల్ చేస్తూ కొర్రా శ్రీనివాసులు నాయక్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. సభ్యుల నియామకాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని పిటిషనర్ తరపు న్యాయవాది వేణుగోపాల్ రావు హైకోర్టులో వాదనలు వినిపించారు. ట్రైబల్ చరిత్ర కలిగిన దేవాలయంలో గిరిజనులకు ప్రాతినిథ్యం లేకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం ఇద్దరు హిందూ ధార్మిక తాత్వికవేత్తలు ఉండాలని, కానీ ప్రస్తుత ట్రస్ట్ బోర్డులో అలా లేరని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు.

మూడు వారాల పాటు నిలిపివేస్తూ ఆదేశాలు 

ఆలయంపై అవగాహన లేనివారు బోర్డులో సభ్యులుగా ఉన్నారని కోర్టుకు తెలిపారు. వాదనల అనంతరం మూడు వారాల వరకు బోర్డు సభ్యుల ప్రమాణస్వీకారంపై కోర్టు స్టే విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది. పిటిషనర్​ వాదనలతో ఏకీభవించిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఈనెల 14న జరుగనున్న ట్రస్ట్ బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేసింది. 

ఛైర్మన్ ఎంపికపై వైసీపీలో వైరం 

శ్రీశైలం ఆలయ పాలకమండలి నియామకం అధికార వైసీపీలో వర్గవిభేదాలు మరోసారి బయటపడ్డాయి. బోర్డ్ ఛైర్మన్ గా ఎమ్మెల్యే రోజా ప్రత్యర్థివర్గానికి చెందిన చెంగారెడ్డి చక్రపాణిరెడ్డిని ప్రభుత్వం నియమించింది. దీంతో రోజా పార్టీ అధినాయకత్వం, ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నట్లు సమచారం. తనను ఓడించడానికి ప్రయత్నించడమే కాకుండా స్థానిక ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా చక్రపాణి రెడ్డి వ్యవహరించారని ఎమ్మెల్యే రోజా ఆరోపిస్తున్నారు. పలుమార్లు ఇరువురు బాహాటంగా విమర్శలు చేసుకున్నారు. అలాంటిది చక్రపాణిరెడ్డికి పదవి ఇవ్వడంపై రోజా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని రోజా అంటున్నారు. ఈ విషయంలో అధిష్టానం ఆదేశిస్తే రాజీనామాకు కూడా సిద్ధమేనని రోజా ఇప్పటికే తెలిపారు. 2021 జులైలో ఎమ్మెల్యే రోజాను ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌గా తొలగించారు. అప్పటి నుంచి పార్టీలో రోజాకు గడ్డుకాలం నడుస్తోంది. ఆమె ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఆమెకు ఎలాంటి పదవీ లేకపోవటంతో రోజా ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. ఆమె స్థానంలో మెట్టు గోవిందారెడ్డిని ఏపీఐఐసీ ఛైర్మన్‌గా సీఎం జగన్ నియమించారు. రోజాకు ఇప్పటి వరకు కేబినెట్ లో స్థానం దక్కలేదు. 

Also Read: ఏపీలో పెరగనున్న భూముల ధరలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు!

టాప్ హెడ్ లైన్స్

జాబ్ ఫ్రాడ్.. మయన్మార్‌లో చిక్కుకున్న ఏపీ యువతకు మంత్రి నారా లోకేష్ భరోసా
జాబ్ ఫ్రాడ్.. మయన్మార్‌లో చిక్కుకున్న ఏపీ యువతకు మంత్రి నారా లోకేష్ భరోసా
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
YSRCP Assembly March: అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?
అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget