అన్వేషించండి

YSRCP Offices: రాష్ట్రంలో వైసీపీ కార్యాలయాలకు కూల్చివేత నోటీసులు - హైకోర్టు కీలక నిర్ణయం

Andhrapradesh News: రాష్ట్రంలో వైసీపీ కార్యాలయాలకు కూల్చివేత నోటీసుల పిటిషన్‌కు సంబంధించి ఏపీ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ స్టేటస్ కో కొనసాగించాలని స్పష్టం చేసింది.

AP High Court Key Decision On Ysrcp Offices Demolition Notices: ఏపీలో వైసీపీ కార్యాలయాలకు ప్రభుత్వం కూల్చివేత నోటీసులు ఇవ్వడంపై.. వైసీపీ నేతలు వేసిన పిటిషన్‌ను హైకోర్టు (Ap High Court) గురువారం మధ్యాహ్నం విచారించింది. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ స్టేటస్ కో కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో వైసీపీకి కాస్త ఊరట లభించినట్లయింది. కాగా, రాష్ట్రంలోని 16 వైసీపీ కార్యాలయాలను అనుమతులు లేకుండా.. నిబంధనలకు విరుద్ధంగా కడుతున్నారని ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో అధికారులు స్పష్టం చేశారు. 

తాడేపల్లిలోని సీతానగరం వద్ద నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని సీఆర్డీఏ అధికారులు 5 రోజుల క్రితం కూల్చేశారు. నీటి పారుదల శాఖ స్థలంలో భవనం నిర్మించారని.. బోట్ యార్డుగా ఉపయోగించే స్థలాన్ని అధికారంలో ఉన్నప్పుడు పార్టీకి తక్కువ లీజుకే కట్టబెట్టారని అందుకే నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అలా అనుమతులు లేకుండా మరిన్ని కార్యాలయాలు సైతం నిర్మిస్తున్నారని.. వాటికి అధికారులు నోటీసులు జారీ చేశారు. సరైన వివరణ ఇవ్వాలని స్పష్టం చేశారు.

హైకోర్టులో వైసీపీ పిటిషన్

అయితే, ప్రభుత్వ ఉత్తర్వులపై వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన ధర్మాసనం స్టేటస్ కో విధిస్తూ నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాలను తమ ముందు ఉంచాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం గురువారం విచారణ సందర్భంగా.. ఇరు వర్గాల వాదనలను విన్న ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది. అంతవరకూ యథాతథ స్థితి కొనసాగుతోందని.. రాష్ట్రంలో 16 కార్యాలయాలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని స్పష్టం చేసింది.

Also Read: CS Neerabh Kumar: ఏపీ సీఎస్ నీరభ్ కుమార్ పదవీ కాలం పొడిగింపు - కేంద్రం కీలక ఉత్తర్వులు

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
మోదీకి ఆగష్టు అగ్నిపరీక్ష, పెరగనున్న అమిత్ షా పాత్ర! యువత ఉద్యమం, పరీక్షల సంస్కరణలు, ప్రతిపక్షాల వ్యూహాలు
మోదీకి ఆగష్టు అగ్నిపరీక్ష, పెరగనున్న అమిత్ షా పాత్ర! యువత ఉద్యమం, పరీక్షల సంస్కరణలు, ప్రతిపక్షాల వ్యూహాలు
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
Fruits Before or After Meals భోజనం తర్వాత పండ్లు తింటున్నారా? అయితే ఇది మీకోసమే.. తినాలో, వద్దో తెలుసుకోండిలా
భోజనం తర్వాత పండ్లు తింటున్నారా? అయితే ఇది మీకోసమే.. తినాలో, వద్దో తెలుసుకోండిలా
Embed widget