అన్వేషించండి

AP High Court : గ్రానైట్ తవ్వకాల్లో ఎన్‌వోసీ, మంత్రి విడదల రజినికి హైకోర్టు నోటీసులు!

AP High Court : గ్రానైట్ తవ్వకాల్లో ఎన్‌వోసీ జారీ అంశంలో హైకోర్టు మంత్రి విడదల రజిని, ఎంపీ అవినాశ్ రెడ్డి, ప్రతాప్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది.

AP High Court : ఏపీ మంత్రి విడదల రజినికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. గ్రానైట్‌ తవ్వకాల్లో ఎన్‌వోసీ జారీ అంశంలో విడదల రజినికి కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంలోనే కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి, ఆయన మామ ప్రతాప్‌రెడ్డికి కూడా హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఎన్టీఆర్‌ జిల్లా మొరకపూడిలోని 91 ఎకరాల అసైన్డ్ భూమిలో తవ్వకాలకు అనుమతించడంలో మంత్రి విడదల రజిని హస్తం ఉందని హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు వివరణ ఇవ్వాలని మంత్రి విడదల రజినితో పాటు లోకల్ తహసీల్దార్‌కు నోటీసులు ఇచ్చింది. ఈ పిటిషన్ పై తదుపరి విచారణను 3 వారాల పాటు వాయిదా వేసింది. 

మూడు వారాల్లోగా వివరణ 

గ్రానైట్ తవ్వకాల్లో ఎన్వోసీ ఆరోపణలపై వివరణ ఇవ్వాల్సి  ఉంటుందని మంత్రి విడదల రజినికి హైకోర్టు నోటీసులను జారీ చేసింది. మంత్రితో పాటు మెరకపూడి తహసీల్దార్‌, సీఐ, ఎస్ఐలకు కూడా కోర్టు నోటీసులు ఇచ్చింది. ఈ పిటిషన్ పై తదుపరి విచారణను మూడు వారాల పాటు వాయిదా వేసింది. ఈ మూడు వారాల్లోగా మంత్రి విడదల రజిని హైకోర్టుకు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. అసైన్డ్ భూములను సాగు చేసుకుంటున్న రైతుల నుంచి చట్టవిరుద్ధంగా మైనింగ్‌కు ఎన్వోసీ ఇచ్చారనే ఆరోపణలకు కౌంటర్ దాఖలు చేయాల్సిఉంటుంది.  

చిలకలూరిపేటలో మంత్రి పర్యటన 

పల్నాడు జిల్లా చిలకలూరి పేటలో మంత్రి విడదల రజిని పర్యటించారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఏ కారణం చేతనైన సంక్షేమ పథకాలు అందని వారికి ఒక్కసారిగా నగదు పంపిణీ చేస్తారు. చిలకలూరిపేటలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విడదల రజిని పాల్గొన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో 5640 మందికి 9 కోట్ల 17 లక్షల రూపాయలు మంజూరు చేశామని తెలిపారు. మంత్రి విడదల రజిని, పల్నాడు జిల్లా కలెక్టర్ శివ శంకర్ లబ్ధిదారులకు చెక్కులు అందించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ నష్టపోకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. చిలకలూరిపేట పురపాలక సంఘ కార్యాలయంలో జరిగిన చెక్కులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను 99 శాతం అమలు చేశామని మంత్రి రజిని తెలిపారు. ఇన్ని సంక్షేమ పథకాలను అమలు చేసిన ఏకైక ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అన్నారు. ప్రభుత్వం నుంచి లబ్ధిదారులకు ఏ పథకం కావాలన్నా సంక్షేమ పథకాలను నేరుగా ఇంటికి చేరే విధంగా వ్యవస్థ అమలు చేస్తున్నామన్నారు. ఈ వ్యవస్థల ద్వారా సంక్షేమఫలాలు నేరుగా ప్రజలకు అందుతున్నాయన్నారు. సాంకేతిక లోపం కారణంగా నిలిచిపోయిన పథకాలను ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నామన్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Budget 2026:దేశంలో తొలిసారి ఆదివారం నాడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారా ? కొనసాగుతున్న సస్పెన్స్ !
దేశంలో తొలిసారి ఆదివారం నాడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారా ? కొనసాగుతున్న సస్పెన్స్ !
Ibomma Case: ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Budget 2026:దేశంలో తొలిసారి ఆదివారం నాడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారా ? కొనసాగుతున్న సస్పెన్స్ !
దేశంలో తొలిసారి ఆదివారం నాడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారా ? కొనసాగుతున్న సస్పెన్స్ !
Ibomma Case: ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
Gig Workers Strike : గిగ్ వర్కర్ల సమ్మె నివారణకు కేంద్రం కొత్త ఫార్ములా! ఈ షరతులు నెరవేర్చితేనే సామాజిక భద్రతా ప్రయోజనాలు!
గిగ్ వర్కర్ల సమ్మె నివారణకు కేంద్రం కొత్త ఫార్ములా! ఈ షరతులు నెరవేర్చితేనే సామాజిక భద్రతా ప్రయోజనాలు!
India Tour of Bangladesh 2026:బంగ్లాదేశ్‌లో హింసపై భారత్‌లో ఆందోళనలు కొనసాగుతున్న వేళ బీసీబీ కీలక ప్రకటన
బంగ్లాదేశ్‌లో హింసపై భారత్‌లో ఆందోళనలు కొనసాగుతున్న వేళ బీసీబీ కీలక ప్రకటన
Pariksha Pe Charcha 2026: పరీక్షా పే చర్చ 2026 కోసం ఎలా నమోదు చేసుకోవాలి? ఎవరు పాల్గొనవచ్చు?
పరీక్షా పే చర్చ 2026 కోసం ఎలా నమోదు చేసుకోవాలి? ఎవరు పాల్గొనవచ్చు?
CBSE Practical Examinations :సీబీఎస్ఈ 10వ, 12వ తరగతి ప్రాక్టికల్ పరీక్షలకు కొత్త మార్గదర్శకాలు! ఆ మార్పులేంటో తెలుసుకోండి!
సీబీఎస్ఈ 10వ, 12వ తరగతి ప్రాక్టికల్ పరీక్షలకు కొత్త మార్గదర్శకాలు! ఆ మార్పులేంటో తెలుసుకోండి!
Embed widget