అన్వేషించండి

Aided Sajjala : "ఎయిడెడ్"పై స్పష్టత ఉంది.. టీడీపీనే రాజకీయం చేస్తోందన్న సజ్జల !

ఎయిడెడ్ విద్యాసంస్థల విషయంలో ప్రభుత్వానికి స్పష్టత ఉందని ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. టీడీపీనే రాజకీయం చేస్తోందన్నారు.


ఆంధ్రప్రదేశ్‌లో ఎయిడెడ్ కాలేజీల విషయంలో ప్రభుత్వం స్పష్టతతో ఉందని ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎయిడెడ్ విద్యా సంస్థల విద్యార్థులు ఆందోళనకు దిగుతున్నారు.  అనంతపురం, కృష్ణా జిల్లా వంటి చోట్ల విద్యార్థులు రోడ్డెక్కడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీంతో  మీడియా ముందుకు వచ్చి ఎయిడెడ్ విషయంలో వివరణ ఇచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వానికి చాలా స్పష్టత ఉందని ప్రకటించారు. ఎయిడెడ్ విద్యా సంస్థలను ప్రభుత్వానికి స్వాధీనం చేయాలని ఎవరినీ ఒత్తిడి చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. 

Also Read : పీఆర్సీ నివేదికను ఎందుకు దాచిపెడుతున్నారో అర్థం కావడం లేదు.. అమలు చేస్తారా? లేదా?

స్వచ్ఛందంగా ముందుకొచ్చిన విద్యాసంస్థల బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని.. మిగిలిన విద్యా సంస్థలు వారు నడుపుకోవచ్చని ప్రకటించారు. తాము విద్యా సంస్థల్లో సంస్కరణలకు ప్రయత్నిస్తుంటే తెలుగుదేశం పార్టీ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. పేదలకు రూపాయి ఖర్చు లేకుండా.. చదువు చెప్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని ఆందోళనలు చేస్తున్న వారికి సజ్జల రామకృష్ణారెడ్డి భరోసా ఇచ్చారు. ప్రభుత్వం ఎయిడెడ్ విద్యా సంస్థల్ని ఆస్తులతో సహా ప్రభుత్వానికి స్వాధీనం చేయాలని లేకపోతే సొంతంగా నడుపుకోవాలని జీవో నెం.42 విడుదల చేసింది. ఎయిడ్ నిలిపివేసింది. 

Also Read : పంచ్ ప్రభాకర్‌ కోసం ఇంటర్‌పోల్ బ్లూ నోటీస్ ! ఆచూకీ తెలిసిన వెంటనే అరెస్ట్ ?

ఎయిడెడ్ విద్యా సంస్థల్లో ఉన్న స్టాఫ్‌ను ప్రభుత్వంలో సర్దుబాటు చేయడానికి నిర్ణయించారు. ఈ కారణంగా అనేక ఎయిడెడ్ విద్యా సంస్థలు ఫీజులు పెంచడమో.. లేకపోతే  విద్యా సంస్థను మూసి వేయడమో చేస్తున్నాయి. అందుకే విద్యార్థుల రోడ్డెక్కుతున్నారు. విశాఖ సహా అనేక చోట్ల నిరసనలు జరుగుతున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఎయిడ్ ఆపబోమని హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం తెలిపింది. అలాగే జీవో నెం.42పై వెనక్కి తగ్గతున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు మీడియాకు చెప్పాయి. 

Also Read : ఏం కావాలన్నా అడగండి.. బాధితులకు రూ.1000 చొప్పున ఖర్చులకు ఇవ్వండి

కానీ ప్రభుత్వం జీవో నెం.42 విషయం మాత్రం వెనక్కి తగ్గలేదని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. తమకు స్పష్టత ఉందని ప్రభుత్వ ముఖ్య సలహాదారు చెబుతున్నారు కానీ.. విద్యార్థుల ఆందోళలను తగ్గించే దిశగా ఎలాంటి చర్యలు ప్రకటించలేదు. అయితే ఆ ఆందోళనలపై టీడీపీ ముద్ర వేయడంతో రాజకీయంగా వ్యవహారం మారే అవకాశం కనిపిస్తోంది. 

Also Read: Nellore Heavy Rains: జోరు వానలో వైసీపీ ఎమ్మెల్యే అగచాట్లు.. కనీసం గొడుగు కూడా లేకుండా ఎందుకో తెలుసా?

 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bijapur Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
Road Safety Cess in Telangana : కారుపై రూ. 5000, బైక్‌పై రూ.2000 భారం - తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్లపై రోడ్‌ సేఫ్టీ సెస్‌
తెలంగాణలో కొత్త బండ్లకు భారీ షాక్‌ - బైక్‌ నుంచి కారు వరకు అదనపు బాదుడు
AP DSC 2026: ఫిబ్రవరిలో ఏపీలో డీఎస్సీ 2026 నోటిఫికేషన్, 2500 ఉద్యోగాల భర్తీకి కసరత్తు! సిలబస్‌లోకి ఇంగ్లీష్‌, కంప్యూటర్ సబ్జెక్ట్‌లు!
ఫిబ్రవరిలో ఏపీలో డీఎస్సీ 2026 నోటిఫికేషన్, 2500 ఉద్యోగాల భర్తీకి కసరత్తు! సిలబస్‌లోకి ఇంగ్లీష్‌, కంప్యూటర్ సబ్జెక్ట్‌లు!
Durgam Cheruvu Cable Bridge: నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bijapur Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
Road Safety Cess in Telangana : కారుపై రూ. 5000, బైక్‌పై రూ.2000 భారం - తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్లపై రోడ్‌ సేఫ్టీ సెస్‌
తెలంగాణలో కొత్త బండ్లకు భారీ షాక్‌ - బైక్‌ నుంచి కారు వరకు అదనపు బాదుడు
AP DSC 2026: ఫిబ్రవరిలో ఏపీలో డీఎస్సీ 2026 నోటిఫికేషన్, 2500 ఉద్యోగాల భర్తీకి కసరత్తు! సిలబస్‌లోకి ఇంగ్లీష్‌, కంప్యూటర్ సబ్జెక్ట్‌లు!
ఫిబ్రవరిలో ఏపీలో డీఎస్సీ 2026 నోటిఫికేషన్, 2500 ఉద్యోగాల భర్తీకి కసరత్తు! సిలబస్‌లోకి ఇంగ్లీష్‌, కంప్యూటర్ సబ్జెక్ట్‌లు!
Durgam Cheruvu Cable Bridge: నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
Akhanda 2 OTT : ఓటీటీలోకి బాలయ్య 'అఖండ 2' - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి బాలయ్య 'అఖండ 2' - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Amaravati Land Pooling: అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
అమరావతికి రెండో విడత భూసమీకరణ - రైతుల్లో అప్పటి ఉత్సాహం ఉందా?
Lenin Movie : 'లెనిన్' సరసన వెన్నెలంటి మా 'భారతి' - భాగ్యశ్రీ క్యూట్ లుక్
'లెనిన్' సరసన వెన్నెలంటి మా 'భారతి' - భాగ్యశ్రీ క్యూట్ లుక్
Warangal Viral News: లేగ దూడకు నామకరణ మహోత్సవం! అయ్యప్ప మాలధరణ స్వాముల సమక్షంలో పేరు పెట్టిన వరంగల్ జిల్లా రైతు 
లేగ దూడకు నామకరణ మహోత్సవం! అయ్యప్ప మాలధరణ స్వాముల సమక్షంలో పేరు పెట్టిన వరంగల్ జిల్లా రైతు 
Embed widget