అన్వేషించండి

Law Nestham Scheme: లా నేస్తం నిధులు విడుదల, వారికి అకౌంట్లలో జమ చేసిన సీఎం జగన్

Law Nestham Scheme: గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న జూనియర్ లాయర్లకు నెలకు రూ.5వేలు ప్రభుత్వం స్టైఫండ్ గా అందిస్తుంది. దీనికి వయో పరిమితి ఉంది. మూడేళ్లపాటు ఇలా స్టైఫండ్ అందిస్తారు.

AP CM YS Jagan Mohan Reddy: ఏపీ సీఎం జగన్ ఈరోజు లా నేస్తం నిధులు విడుదల చేశారు. 2807మంది న్యాయవాదులకు 2023-24 సంవత్సరానికి సంబంధించి రెండో విడత లా నేస్తం నిధులు విడుదల చేశారు. ఆరు నెలలకు సంబంధించి వారికి ఆర్థిక సాయాన్ని అకౌంట్లలో జమ చేశారు. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 6069 మంది న్యాయవాదులకు మేలు జరిగిందని చెప్పారు జగన్. నాలుగున్నరేళ్ల కాల వ్యవధిలో వైసీపీ ప్రభుత్వం మొత్తం రూ.49.51 కోట్లు వారికి అందజేసిందని వివరించారు. 

జూనియర్ న్యాయవాదులకు అండగా..
న్యాయవాద వృత్తిలో స్థిరపడాలనుకునేవారికి, కెరీర్ ప్రారంభించేవారికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు సీఎం జగన్. అందుకే వారికోసం ఈ పథకం ప్రారంభించామన్నారు. జూనియర్ న్యాయవాదులు వారి కాళ్లపై వారు నిలబడేందుకు వీలుగా ఈ పథకం ఉపయోగపడుతుందన్నారు. ప్రభుత్వం లాయర్లకు ఏ రకంగా తోడుగా నిలబడుతోందో, పేద వాడి పక్షాన వారు కూడా అలాగే ఔదార్యం చూపిస్తూ, వారికి మంచి చేయాలని, మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. ఆ విధంగా మసలుకోవాలని ప్రతి అడ్వొకేట్ సోదరుడిని, చెల్లెమ్మను ప్రభుత్వం తరపున అర్థిస్తున్నానని చెప్పారు జగన్. 

లా నేస్తం ఇలా..
గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న జూనియర్ లాయర్లకు నెలకు రూ.5వేలు ప్రభుత్వం స్టైఫండ్ గా అందిస్తుంది. దీనికి వయో పరిమితి ఉంది. మూడేళ్లపాటు ఇలా స్టైఫండ్ అందిస్తారు. అంటే అర్హులైన జూనియర్ లాయర్లకు మూడేళ్లలో గరిష్టంగా 1.80 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తుంది. తాజాగా లా నేస్తం నిధులు విడుదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 2,807 మంది అర్హులైన జూనియర్‌ న్యాయవాదులకు నెలకు రూ.5వేలు స్టైఫండ్ విడుదల చేశారు. ఈ ఏడాది జులై నుంచి డిసెంబర్‌ వరకు 6 నెలల కాల వ్యవధికి ఒక్కొ­క్కరికి రూ.30 వేలు సాయం అందించారు. 

లాయర్లకోసం ఏమేం చేస్తున్నామంటే..?
రూ.100 కోట్లతో అడ్వకేట్స్‌ వెల్ఫేర్‌ ట్రస్ట్‌ ఏర్పాటు చేశామని చెప్పారు సీఎం జగన్. అడ్వొకేట్ జనరల్ ఆధ్వర్యంలో ఈ ట్రస్ట్ కార్యకలాపాలు నడుస్తాయని, లా సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ ఇద్దరూ ఇందులో సభ్యులుగా ఉంటారని చెప్పారు సీఎం జగన్. కొవిడ్ సమయంలో ఈ ట్రస్ట్ ద్వారా లాయర్లకు మేలు జరిగిందని, 643 మందికి కొవిడ్ టైమ్ లో.. రూ.52 లక్షల సాయం చేశామని వివరించారు. 7,733 మంది లాయర్లకు రూ.11.56 కోట్ల రుణాలు మంజూరు చేశామన్నారు. 14,848 మంది అడ్వొకేట్లకు మెడిక్లెయిమ్ పాలసీ ద్వారా రూ.11.41 కోట్లు చెల్లించామని చెప్పారు. 

లా నేస్తం లాంటి పథకాలు ఇతర రాష్ట్రాల్లో అమలులో లేకపోయినా.. సీఎం జగన్ గతంలో ఇచ్చిన హామీ మేరకు జూనియర్ లాయర్లకు అండగా నిలబడ్డారని చెబుతున్నారు వైసీపీ నేతలు. సమాజంలోని ప్రతి వర్గానికి తమ ప్రభుత్వ హయాంలో మంచి జరుగుతోందని వివరించారు. అన్ని వర్గాలకు అండగా నిలబడేందుకు సీఎం జగనన్ ఇలాంటి కార్యక్రమాలను రూపొందించారని, కరోనా కష్టకాలంలో కూడా ఎక్కడా ఆర్థిక సాయం విషయంలో వెనకడుగు వేయలేదని వివరిస్తున్నారు. సంక్షేమ పథకాల అమలులో మాత్రం వైసీపీ ప్రభుత్వం ఎక్కడా వెనకడుగు వేయడం లేదని చెబుతున్నారు ఆ పార్టీ నేతలు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Peddi Pre Release Event Live Updates - 'పెద్ది' ప్రీ రిలీజ్ లైవ్ అప్డేట్స్: మెగా ఈవెంట్‌లో ఏం జరుగుతుందో మినిట్ టు మినిట్ తెలుసుకోండి
'పెద్ది' ప్రీ రిలీజ్ లైవ్ అప్డేట్స్: మెగా ఈవెంట్‌లో ఏం జరుగుతుందో మినిట్ టు మినిట్ తెలుసుకోండి
Breaking News: తెలంగాణ ఏర్పాటైతే 11 రోజులు అన్నం తినని వెధవ పవన్ కళ్యాణ్: మంత్రి పొన్నం ఘాటు వ్యాఖ్యలు
తెలంగాణ ఏర్పాటైతే 11 రోజులు అన్నం తినని వెధవ పవన్ కళ్యాణ్: మంత్రి పొన్నం ఘాటు వ్యాఖ్యలు
Kavitha Politics: ఈసారి పళ్లు రాలగొడతాం, విగ్రహాలు పగలగొట్టి ఆంధ్రకు పార్సిల్ చేస్తాం: కవిత వార్నింగ్
ఈసారి పళ్లు రాలగొడతాం, విగ్రహాలు పగలగొట్టి ఆంధ్రకు పార్సిల్ చేస్తాం: కవిత వార్నింగ్
Kalvakuntla Kavitha: జగన్ MAVIGUN బాంబు! ఏపీ సీఎం సీటు కిందకు నీళ్లు రాకుండా చూసుకో: కవిత సంచలన వ్యాఖ్యలు
జగన్ MAVIGUN బాంబు! ఏపీ సీఎం సీటు కిందకు నీళ్లు రాకుండా చూసుకో: కవిత సంచలన వ్యాఖ్యలు

వీడియోలు

Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం
Masterplan Behind RCB's IPL 2026 Victory | ఆర్సీబీ విజయానికి కారణం ఇదే
Reason for GT Lost The IPL 2026 Final | గుజరాత్ పతనం వెనుక అసలు నిజాలు
RCB Celebrations With Family IPL 2026 | ఫ్యామిలీతో ఆర్సీబీ ప్లేయర్స్ సెలబ్రేషన్
RCB Wins IPL 2026 Final | రెండోసారి ఐపీఎల్ టైటిల్ సొంతం చేసుకున్న ఆర్సీబీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
JEE Advanced 2026 Result: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల.. జూన్ 2 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల.. జూన్ 2 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం
Mega DSC Scam allegations AP: డీఎస్సీ వార్ - వైసీపీ వర్సెస్ లోకేష్.. సీబీఐ విచారణ డిమాండ్‌పై ప్రభుత్వం ఏమంటోంది?
డీఎస్సీ వార్ - వైసీపీ వర్సెస్ లోకేష్.. సీబీఐ విచారణ డిమాండ్‌పై ప్రభుత్వం ఏమంటోంది?
LPG Cylinder Prices Hike: మళ్లీ పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు.. హైదరాబాద్‌లో లేటెస్ట్ రేట్లు చూశారా
మళ్లీ పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు.. హైదరాబాద్‌లో లేటెస్ట్ రేట్లు చూశారా
Blast Zone Collection : బ్లాస్ట్ జోన్ వీకెండ్ కలెక్షన్స్ - అర్జున్ ఖాతాలో హిట్... తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ రెస్పాన్స్
బ్లాస్ట్ జోన్ వీకెండ్ కలెక్షన్స్ - అర్జున్ ఖాతాలో హిట్... తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ రెస్పాన్స్
Gujarat Titans Bus Caught on Fire: ఐపీఎల్ ఫైనల్ తరువాత జీటీ బస్సులో మంటలు.. ప్లేయర్లకు తప్పిన ప్రమాదం, గంటసేపు రోడ్డుపైనే
ఐపీఎల్ ఫైనల్ తరువాత జీటీ బస్సులో మంటలు.. ప్లేయర్లకు తప్పిన ప్రమాదం, గంటసేపు రోడ్డుపైనే
Suriya : సూర్య సక్సెస్ జోష్ - మ్యూజిక్ డైరెక్టర్ To ఎడిటర్‌కు ఖరీదైన కార్లు... ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం
సూర్య సక్సెస్ జోష్ - మ్యూజిక్ డైరెక్టర్ To ఎడిటర్‌కు ఖరీదైన కార్లు... ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం
Pawan Kalyan Telangana meeting June 2: టార్గెట్ చేస్తున్న వారికి పవన్ షాక్ - తెలంగాణలో పార్టీ ఇక యాక్టివ్ - పార్టీ నేతలకు ప్రత్యేక రోడ్ మ్యాప్
టార్గెట్ చేస్తున్న వారికి పవన్ షాక్ - తెలంగాణలో పార్టీ ఇక యాక్టివ్ - పార్టీ నేతలకు ప్రత్యేక రోడ్ మ్యాప్
Indiramma Housing Scheme: లక్ష ఇండ్లకు సామూహిక గృహప్రవేశాలు.. నేడు ఆసిఫాబాద్ జిల్లాలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
లక్ష ఇండ్లకు సామూహిక గృహప్రవేశాలు.. నేడు ఆసిఫాబాద్ జిల్లాలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
Embed widget