అన్వేషించండి

AP Budget Session 2024 Live: ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ ప్రవేశ పెడుతున్న బుగ్గన

AP Budget Live: ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఉదయం 10 గంటలకు ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అంతకుముందు నేడు ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్ సమావేశం కానుంది.

LIVE

Key Events
AP Budget Session 2024 Live: ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ ప్రవేశ పెడుతున్న బుగ్గన

Background

AP Budget 2024 News Live: ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా నేడు (ఫిబ్రవరి 7) తాత్కాలిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఉదయం 11 గంటలకు నేడు ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అంతకుముందు నేడు ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన భేటీ అయ్యే ఈ సమావేశంలో బడ్జెట్ కు ఆమోదం తెలపనున్నారు. ఉదయం 8 గంటలకు సమయంలో సచివాలయం మొదటి బ్లాక్‌లో ఈ భేటీ జరగనుంది. 

ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత ఉదయం 9 గంటలకు అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను బుగ్గన రాజేంద్రనాథ్‌ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.

సోమవారం (ఫిబ్రవరి 5) నుంచి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు  ప్రారంభం అయ్యాయి. ఆ రోజు ఉదయం 10 గంటలకు గవర్నర్‌ ఎస్‌. అబ్దుల్‌ నజీర్‌ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. అనంతరం ఉభయసభలూ మంగళవారానికి వాయిదా పడ్డాయి. 

మంగళవారం ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్ గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై సుదీర్ఘంగా మాట్లాడారు. గత ప్రభుత్వ విధానాల వల్ల విద్య, వ్యవసాయం, మహిళా సాధికారత లాంటి రంగాలు కుదేలయ్యాయని సీఎం జగన్ అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. ఐదేళ్లలో చంద్రబాబు రైతులకు రూ.15వేలకోట్లు కూడా ఇవ్వలేదని..  పొదుపు సంఘాల వడ్డీ కూడా మాఫీ చేయలేదన్నారు. ప్రతీ రాష్ట్రానికి ఒక ఎకనామిక్‌ పవర్‌ హౌజ్‌ ఉండాలిఅలాంటి పవర్‌హౌజ్‌ లేకపోతే  రాష్ట్ర ఆదాయాలు ఎప్పటికీ పెరగవన్నారు. ఉమ్మడి ఆస్తిగా నిర్మించుకున్న హైదరాబాద్‌ను కోల్పోయాం ..  రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటికీ రెవెన్యూ లోటు వెంటాడుతోందన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయం తగ్గిపోయింది ..అందుకే విశాఖ గురించి పదే పదే చెబుతున్నానన్నారు. రాష్ట్రం ఆర్థికంగా ఎదగడానికి పెద్ద పెద్ద నగరాలు అవసరం .. ఓ హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై లాంటి నగరాలు ఉండాలి ఇలాంటి పరిస్థితిని ఎవరూ ఊహించలేదని వ్యాఖ్యానించారు. 

13:27 PM (IST)  •  07 Feb 2024

అన్నపూర్ణ ఆంధ్ర లక్ష్యంలో వినూత్న కార్యక్రమాలు చేపట్టాం: బుగ్గన

రైతుల జీవనోపాధిని బలోపేతం చేయడానికి వ్యవసాయంలో గణనీయమైన ఉత్పత్తి సాధించి రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వ సమగ్ర వ్యూహాన్ని రూపందించింది. దీనిలో భాగంగా ధరల స్థిరీకరణ నిధి, పంట భీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీ మొదలైన చర్యల ద్వారా రైతులకు ఆర్థిక సహాయం లభించింది. వైఎస్‌ఆర్‌ రైతు భరోసా పథకం కింద లక్షా 60 కౌలుదారులకు, 93 వేల అటవీ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు 53 లక్షల 53 వేల మంది ఖాతాల్లో 33,300 కోట్ల రూపాయలు జమ చేసింది. 

వైఎస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా ద్వారా 54 లక్షల 55 వేల మంది రైతుల ఖాతాల్లో 7, 802 కోట్ల రూపాయల బీమా అందిస్తోంది. వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ పంట రుణాల ద్వారా 2019 నుంచి 73 లక్షల 88 వేల మంది రైతులకు 1,835 కోట్ల రూపాయలు అందించింది. 
10,778 రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతు ఇంటి వద్దే సేవలు అందిస్తోంది. 19 లక్షలకుపైగా ఉన్న వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్‌లకు కోతలు లేని రోజువారీ 9 గంటల నిరంతర ఉచిత విద్యుత్ అందిస్తోంది. 2019 నుంచి ఈ పథకం ద్వారా 37,374 కోట్ల రూపాయల సబ్సిడీ అందిస్తోంది. కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరకు పంటలు విక్రయించే వారి కోసం 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద 22 లక్షల 85 వేల మంది రైతులకు 1,977 కోట్ల రూపాయలు అందించింది. మరో 1200 కోట్ల రూపాయలు ఈ నెలలో ఇయ్యబోతోంది. 

127కొత్త వైఎస్‌ఆర్‌ వ్యవసాయ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి ద్వారా పంట కోత అనంతర మౌలిక సదుపయాలు కల్పించింది. వైఎస్‌ఆర్‌ యంత్రసేవా పథకం ద్వారా వ్యవసాయ యంత్రాలను అందిచేయడమే కాకుండా గ్రామ యువతకు డ్రోన్ పైలట్ శిక్షణ అందించారు. 

ఉద్యనవన రంగం అభివృద్ధి కోసం 17 లక్షల 27 వేల మంది రైతులకు లబ్ధి చేకూరేలా వివిధ పథకాల ద్వారా 4,363 కోట్ల రూపాయలు అందించాం. 2,356 మంది గ్రామస్థాయి ఉద్యానవన సహాయకులను నియమించింది. ంట నిల్వ కోసం 462 వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ కేంద్రాలు 84 సౌర శీతల గిడ్డంగులు, 2,905 ప్యాక్ హౌస్‌లును ఏర్పాటు చేసింది. 

జగన్న పాల వెల్లువ పథకం ద్వారా రైతులకు లబ్ధి కలిగేలా అమూల్‌ సంస్థతో చిత్తూరు డెయిరీ పునరుద్ధరణ చేశాం. దీని వల్ల ప్రత్యక్షంగా 5 వేల మందికి, పరోక్షంగా 2 లక్షల మందికి ఉపాధి కలుగుతోంది.

వైఎస్‌ఆర్‌ పశు బీమా పథకం ద్వారా పశువులకు బీమా సౌకర్యం కల్పించాం. వైఎస్‌ఆర్‌ సంచార పశు ఆరోగ్య సేవ ద్వారా 340 సంచార పశు వైద్యశాలల సేవలను రైతలకు ఇంటి వద్దే అందిస్తున్నాం. 

వైఎస్‌ఆర్‌ మత్స్యకార భరోసా కింద 2 లక్షల 43 వేల మంది మత్స్యకార కుటుంబాలకు చేపల వేట నిషేధ కాలంలో 4 వేల నుంచి పది వేల వరకు  ఆర్థిక సాయం చేస్తున్నాం. 20,034 మత్స్యకారుల పడవలకు వాడే డీజిల్‌ ఆయిల్‌పై లీటర్‌కు 6 రూపాయల 3 పైసల నుంచి 9 రూపాయల సబ్సిడీ పెంచడం జరిగింది. అకాల మరణానికి గురైన వారికి ఐదు లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయల పరిహారం ఇస్తున్నాం. 

అంతర్జాతీయ ప్రమాణాలతో 10 ఫిషింగ్ హార్బర్‌లు నిర్మించాం. గ్రామస్థాయిలో ఆక్వా రైతులు ఉపయోగించే పనిముట్లు పరీక్షించే సౌకర్యాలను అందించడానికి 35 సమీకృత మత్స్య సంపద ప్రయోగ శాలలు ఏర్పాటు చేసింది. 2000 ఫిష్‌ ఆంధ్రా రిటైల్‌ దుకాణాలు స్థాపించాం. 

మత్స్య సంపద ఉత్పత్తిని ప్రోత్సహించి దాని నియంత్రణ పర్యవేక్షణ కోసం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మత్స్య సంపద అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేశాం. పశ్చిమగోదావరి జిల్లాలో ఏర్పాటు చేసిన ఫిషరీ సైన్సెస్‌ విశ్వవిద్యాలయం ఏప్రిల్‌ 1, 2022 నుంచి పని చేస్తోంది. 

13:00 PM (IST)  •  07 Feb 2024

ఈ పథకాలతో మహిళలను మహారాణులను చేస్తున్నాం: బుగ్గన  

జనాభాలో సగం మంది సంక్షేమ సాధికరాతకు నోచుకోని ఏ రాష్ట్రమైనా పురోగతి సాధించలేదు. దీనిని గుర్తించి మహిళలకు సాధికారతపై దృష్టి సారించి భారీ స్థాయిలో అనేక వినూత్న కార్యక్రమాలు ప్రారంభించింది. అందులో భాగంగా 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి జెండర్‌ చైల్డ్ బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్నాం. జగనన్న అమ్మ ఒడి పథకం ప్రవేశ పెట్టి అందరికీ విద్య అందేలా చేస్తున్నాం. దీని కింద 43 లక్షల 61 వేల మంది మహిళలకు 26, 067 కోట్ల రూపాయలు అందించాం. ఈ పథకం ద్వారా 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 83 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి కలుగుతుంది. దీని ఫలితంగా ప్రాథమిక విద్యలో బడిలో చేరే విద్యార్థుల సంఖ్య 2019 87.8 శాతం ఉంటే.. 2023 నాటికి అది 98.73శాతానికి పెరిగింది. ఉన్నత మాధ్యమిక విద్యలో స్థూల నమోదు నిష్పత్తి 2019లో 46.88 ఉంటే... 2023 నాటికి 79.69కి పెరిగింది. 

మహిళా సంఘాల బకాయిలు చెల్లించేందుకు వైఎస్‌ఆర్‌ ఆసరా పథకాన్ని ప్రవేశ పెట్టాం. 2019 నుంచి 7 లక్షల 98 వేల స్వయం సహాయ సంఘాలలోని 78 లక్షల 94 వేల మంది మహిళలు ఉపశమనం కల్పించాం. వారికి 25, 571 కోట్ల రూపాయలు తిరిగి చెల్లించాం. వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ పథకం కింద 4,969 కోట్ల రూపాయలను పంపిణీ చేశాం. 18.36 శాతం గా ఉన్న బకాయిలు దేశంలోనే అతి తక్కువ స్థాయి అయిన 0.17 శాతానికి చేరాయి. 

వైఎస్‌ఆర్‌ చేయూత పథకం ద్వారా 26 లక్షల మంది మహిళలకు 14,129 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. జగనన్న పాలవెల్లువ పథకం కింద 3 లక్షల 60 వేల మంది మహిళలకు డెయిరీ ద్వారా లబ్ధి చేకూర్చేందుకు 2,697 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. స్త్రీల, పిల్లల భద్రత కోసం దిశా మొబైల్ యాప్‌ను, దిశా పెట్రోల్‌ వాహనాలను, 26 దిశా పోలీస్‌ స్టేషన్‌లను ప్రారంభించాం. 

12:43 PM (IST)  •  07 Feb 2024

సంవరించిన అంచనాలు 2025-24

2023-24 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ వ్యయం కోస సంవరించిన అంనచాలు 2,28,237,77 కోట్లు అయితే మూల ధన వ్యయం కోసం 27,308.12 కోట్లు, రెవెన్యూ లోటు దాదాపు 31,534.94 కోట్లు, అదే కాలానికి ద్రవ్య లోటు దాదాపు 60,153.59 కోట్లు, ఇది జీఎస్‌డీపీలో వరుసగా 2.19 , 4.18 శాతంగా ఉన్నాయి. 

12:38 PM (IST)  •  07 Feb 2024

నాణ్యమైన వైద్యం అందిస్తున్నాం: బుగ్గన

రాష్ట్రంలోని ప్రజలందరికీ ఆరోగ్య సంరక్షణా సేవలను సమర్థవంతంగా అందించడంలో ప్రజారోగ్య మౌలిక సదుపాయాలు కీలక పాత్రను పోషిస్తాయని భావించి... ఆరోగ్య రంగంలో నాడు నేడు పథకాన్ని అమలు చేయటం చేస్తున్నాం. ఆరోగ్య కేంద్రం మొదలు కొని బోధనాసుపత్రుల వరకు 16,852 కోట్ల రూపాయలను ఖర్చు చేసి ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందిస్తున్నాం. 1142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను 24X7 పని చేసేలా రోజూ రెండు షిప్టుల్లో పనిచేసేలా పునరుద్దరించాం. 

ప్రజలకు ఇంటి వద్దే ఆరోగ్య సేవలు అందించేందుకు ఫ్యామిలీ డాక్టర్‌ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 2,284 మంది వైద్యులతో 14 రకాల వైద్య పరీక్షలను 105 రకాల మందను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాం. 

మండలానికి కనీసం ఒక యూనిట్ చొప్పున 108 అంబులెన్స్‌ సర్వీసును, 104 సంచార ఆరోగ్య వాహన బృంాలను ఏర్పాటు చేశాం. 
ఆరోగ్య శ్రీ పథకాన్ని మరింత ఎక్కువ మందికి చేరువ చేసే ఆలోచనతో కుటుంబ ఆదాయ అర్హత పరిమితిని 2 లక్షల 50 వేల రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు పెంచాం. సంవత్సరానికి 25 లక్షల రూపాయల వరకు నగదు రహిత వైద్య సేవలను అందిస్తున్నాం. ఆరోగ్య శ్రీ వ్యాధుల పరిధిని కూడా 1,059 నుంచి 3,257కి పెంచాం. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి నగరాల్లో కూడా చికిత్స తీసుకునేలా చేస్తున్నాం. కిడ్నీ రోగులకు కార్పొరేట్‌ స్థాయి చికిత్స ఉచితంగా చేస్తున్నాం. 200 పడకల కిడ్నీ రీసెర్చ్‌ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పలాసలో ఏర్పాటు చేశాం. 

జగనన్న ఆరోగ్య సురక్ష పథకం ద్వారా 10, 574 ఆరోగ్య సురక్ష శిబిరాలు నిర్వహించి రాష్ట్రంలో కోటీ 67 లక్షల కుటుంబాలకు ఉచితంగా ఆరోగ్య సేవలు మందులు అందించడం జరిగింది. 

నాణ్యమైన వైద్యాన్ని అందించే దిశగా 53, 126 మంది ఆరోగ్య సంరక్షణ సిబ్బందిని నియమించడం జరిగింది. జాతీయ స్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్పషలిస్టు వైద్యుల పోస్టుల ఖాలీలు సగట 61 శాతం ఉంటే.. ఏపీలో నాలుగు శాతమే ఉందన్నారు. 
పరిశ్రమల అవసరాలకు సరిపోయే విధంగా స్థిరమైన వృద్ధిని సాధించేందుకు యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పటి వరకు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో 192 స్కిల్ హ్‌లు, పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయిలో 27 స్కిల్‌ కాలేజీలు స్థాపించాం. దీని ద్వారా 2023-24 ఆర్థిక సంవత్సరంలో 21 రంగాల్లో లక్షా 6 మంది అభ్యర్థులు శిక్షణఇవ్వగా వీరిలో 95 శాతం మంది ఉద్యోగావకశాలు పొందారు. 

విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి 201 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో వర్చువల్‌ ల్యాబ్‌లు, క్లాస్‌ రూమ్‌లు ఏర్పాటు చేయడంతోపాటు 14 పారిశ్రామిక శిక్షణా కేంద్రాల్లో కియా మోటార్స్, మారుతీ, టయోటా, ఇసుజు, హిటాచీ, సామ్సంగ్‌ సంస్థల సాయంతో అధునాతన యంత్రాలు యంత్ర పరికరాలు ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తున్నాం 

12:23 PM (IST)  •  07 Feb 2024

ఉన్నత విద్యలోనూ అద్భుతాలు చేస్తున్నాం: బుగ్గన

అర్హులైన వారందరికీ ఉచిత ఉన్నత విద్య అందిస్తున్న రాష్ట్రం ఏపీ మాత్రమే. జగనన్న విద్యా దీవెన ద్వారా 11,901 కోట్ల రూపాయలు, జగనన్న వసతి దీవెన ద్వారా 4,276 కోట్లరూపాయలు ఖర్చు చేస్తున్నాం. ఇప్పటి వరకు 52 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరింది. ఉన్న విద్యలో డ్రాప్ అవుట్ శాతం 2018-19లో 20.37 శాతం ఉంటే... 2022-23 లో 6.62 శాతంగా ఉంది. 

ప్రపంచవ్యాప్తంగా 50 యూనివర్శిటీల్లో చదువుకోవలనుకునే వాళ్లకు జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ద్వారా కోటీ 25 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. ఇప్పటి వరకు 1858 మంది విద్యార్థులు లబ్ధి పొందారు. 

రాష్ట్రంలో లక్షా 95 వేల కంటే ఎక్కువ మంది గ్రాడ్యుయేట్లు స్వల్పకాలిక ఇంటర్న్‌ షిప్‌ను పూర్తి చేయగా వీరిలో చాలా మంది మైక్రోసాఫ్ట్‌, సేల్స్‌ఫోర్స్‌ లాంటి కంపెనీల్లో పని చేస్తున్నారు. దేశంలోనే తొలిసారిగా ఏపీలో ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో వైద్య, దంత వైద్య కోర్సుల్లో 50 శాతం కోటా, మిగతా అన్ని కోర్సుల్లో 35 శాతం కోటాను ప్రభుత్వ కోటోగా అమలు చేస్తోంది. దీని ఫలితంగా 2,118 మంది విద్యార్థులకు ఈ చదువులు లభిస్తున్నాంయ. 

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana DSC: తెలంగాణ డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌ విడుదల, ఏ రోజు ఏ పరీక్ష అంటే?
తెలంగాణ డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌ విడుదల, ఏ రోజు ఏ పరీక్ష అంటే?
Chandrababu Revanth Reddy: త్వరలో ఒకే స్టేజ్‌ మీదికి చంద్రబాబు, రేవంత్‌! స్పెషల్ ఏంటో తెలుసా?
త్వరలో ఒకే స్టేజ్‌ మీదికి చంద్రబాబు, రేవంత్‌! స్పెషల్ ఏంటో తెలుసా?
Actor Ali: వైసీపీకి అలీ రాజీనామా, ఇక నా దారి ఇదే - వీడియో విడుదల
వైసీపీకి అలీ రాజీనామా, ఇక నా దారి ఇదే - వీడియో విడుదల
Actress Hema: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి హేమ - తన అరెస్ట్‌పై స్పందిస్తూ సెటైరికల్‌ కామెంట్స్‌
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి హేమ - తన అరెస్ట్‌పై స్పందిస్తూ సెటైరికల్‌ కామెంట్స్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

India vs south Africa T20 World Cup Final | టీ20 వరల్డ్ కప్ ఫైనల్ లో ప్రత్యర్థులుగా పోటా పోటీ జట్లుRohit Sharma on Virat Kohli | T20 World Cup 2024 సెమీఫైనల్ లోనూ ఫెయిల్ అయిన కింగ్ విరాట్ కొహ్లీ |ABPAxar Patel MoM Award Ind vs Eng Semi Final | T20 World Cup 2024లో భారత్ ను ఫైనల్ కి చేర్చిన బాపు|ABPIndia vs England T20 World Cup 2024 Semis 2 | రెండేళ్ల గ్యాప్ లో ఇంగ్లండ్ కు ఇవ్వాల్సింది ఇచ్చేశాం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana DSC: తెలంగాణ డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌ విడుదల, ఏ రోజు ఏ పరీక్ష అంటే?
తెలంగాణ డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌ విడుదల, ఏ రోజు ఏ పరీక్ష అంటే?
Chandrababu Revanth Reddy: త్వరలో ఒకే స్టేజ్‌ మీదికి చంద్రబాబు, రేవంత్‌! స్పెషల్ ఏంటో తెలుసా?
త్వరలో ఒకే స్టేజ్‌ మీదికి చంద్రబాబు, రేవంత్‌! స్పెషల్ ఏంటో తెలుసా?
Actor Ali: వైసీపీకి అలీ రాజీనామా, ఇక నా దారి ఇదే - వీడియో విడుదల
వైసీపీకి అలీ రాజీనామా, ఇక నా దారి ఇదే - వీడియో విడుదల
Actress Hema: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి హేమ - తన అరెస్ట్‌పై స్పందిస్తూ సెటైరికల్‌ కామెంట్స్‌
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి హేమ - తన అరెస్ట్‌పై స్పందిస్తూ సెటైరికల్‌ కామెంట్స్‌
Fire Accident: షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం - ఆరుగురు మృతి
షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం - ఆరుగురు మృతి
Chandrababu White Paper On Polavaram : రివర్స్ టెండర్ల డ్రామానే పోలవరానికి శాపం - శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు
రివర్స్ టెండర్ల డ్రామానే పోలవరానికి శాపం - శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు
Chevella MLA: బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్! కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యే కాలె యాదయ్య
బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్! కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యే కాలె యాదయ్య
Harish Rao Meets Kavitha : తీహార్ జైల్లో కవితతో  హరీష్ రావు ములాఖత్ - లిక్కర్ కేసు తాజా పరిణామాలపై చర్చ
తీహార్ జైల్లో కవితతో హరీష్ రావు ములాఖత్ - లిక్కర్ కేసు తాజా పరిణామాలపై చర్చ
Embed widget