అన్వేషించండి

AP Govt Employees : సమస్యలు పరిష్కరించకపోతే మలిదశ ఉద్యమం, 5న తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాం - బొప్పరాజు వెంకటేశ్వర్లు

AP Govt Employees : ఇప్పటి వరకు ప్రభుత్వంతో రెండుసార్లు సమావేశాలు జరిపినా ఎలాంటి ఫలితాలు లేవని ఏపీ అమరావతి జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు అన్నారు.

AP Govt Employees : ఏపీ అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యమం కొనసాగుతోంది. అన్ని ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలను ఏపీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, రాష్ట్ర సెక్రెటరీ దామోదర్, రాష్ట్ర సెక్రెటరీ జనరల్ సెక్రటరీ పేర్రాజు, జిల్లా అధ్యక్షుడు సంగీతరావులు సందర్శించారు. ఈ నెల 5వ తారీఖున ఈసీ మీటింగ్ విజయవాడలో నిర్వహించి తదుపరి కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామని అమరావతి జేఏసీ నేతలు తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఉద్యోగ ఉపాధ్యాయ,పెన్షనర్లు, కాంట్రాక్టు ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వంతో రెండుసార్లు సమావేశాలు జరిపినా ఎలాంటి ఫలితాలు లేవన్నారు. కేవలం ఉద్యోగులు దాచుకున్న మూడు వేల కోట్ల రూపాయల మూలనిధిని మాత్రమే ప్రభుత్వం  విడుదల చేసిందన్నారు. ఇంతవరకు లిఖిత పూర్వకంగా ఉద్యోగులకు ఎలాంటి హామీ లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం 3 వేల కోట్లు ఇచ్చామని, మెడికల్ రీ ఎంబర్స్మెంట్స్ 50 కోట్లు ఇచ్చామని చెప్పుతున్నా  స్పష్టత లేదని తెలిపారు. కేంద్రం ప్రకటించిన మూడు డీఏలు రూ.222 కోట్ల నిధికి లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. 

మలిదశ ఉద్యమం ఉద్ధృతం 

ఉద్యోగులకు ఇవ్వాల్సిన కొత్త డీఏలు ఇవ్వకుండా ప్రభుత్వం జాప్యం చేస్తుందని బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆరోపించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పీఆర్సీ, అరియర్స్ ఒప్పందం ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతుందన్నారు. తక్షణమే పీఆర్సీపై జాప్యం చేయడం మాని, కొత్త పే స్కేల్ ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 12వ పీఆర్సీ నిధులు విడుదల చేసి అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇచ్చిన ఎన్నికల హామీని తక్షణమే అమలు చేయాలని కోరారు. లిఖిత పూర్వకంగా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయాలని, కొత్తగా అమలు చేసిన 13 జిల్లాల ప్రధాన కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. మిగతా ఉద్యోగ సంఘాలు కూడా రాబోయే మలిదశ ఉద్యమానికి సహకరించాలని కోరారు. 10 వేల కోట్ల అరియర్స్ ఉద్యోగులకు ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుందని, మా సమస్యలను పరిష్కరించకపోతే మలిదశ ఉద్యమం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.  

ఇటీవల సీఎస్ ను కలిసిన బొప్పరాజు వెంకటేశ్వర్లు

పోరుబాట పట్టిన ఏపీ ప్రభుత్వ  ఉద్యోగ సంఘ నేతలు ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డితో సమావేశం అయ్యారు. ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం సీఎస్ జవహర్ రెడ్డితో సమావేశం అయింది.  విజయవాడలోని సీఎస్  క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో  ఉద్యోగుల ఆర్ధిక, ఆర్థికేతర అంశాలపై చర్చించారు. చర్చలు జరుగుతున్నప్పటికీ.. గురువారం నుంచి తాము ప్రకటించిన  ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందని  ఏపీ జేఏసీ అమరావతి నేతలు ప్రకటించారు.  ఉద్యోగుల సమస్యలపై లిఖిత పూర్వక హామీ ఇచ్చే వరకూ ఉద్యమం కొనసాగుతుందని బొప్పరాజు స్పష్టం చేసారు.  సీఎస్ జవహర్ రెడ్డిని కలిసిన ఏపీ జేఏసీ అమరావతి బృందం తమ వైఖరిని స్పష్టం చేసింది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kakinada AM Green Energy: గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
TTD Darshan Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. దర్శన, సేవా టికెట్ల విడుదల షెడ్యూల్ వచ్చేసింది
తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. దర్శన, సేవా టికెట్ల విడుదల షెడ్యూల్ వచ్చేసింది
Telangana News: దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదు రూ.2 లక్షలకు పెంపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదు రూ.2 లక్షలకు పెంపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
Manaswini Balabommala: శాస్త్రీయ నృత్యం, సంగీతం నుంచి సినిమాల్లోకి... 'కొక్కోరోకో'లో మనస్విని బాలబొమ్మల
శాస్త్రీయ నృత్యం, సంగీతం నుంచి సినిమాల్లోకి... 'కొక్కోరోకో'లో మనస్విని బాలబొమ్మల

వీడియోలు

Vande Bharat Sleeper Train Started | పచ్చ జెండా ఊపి వందేభారత్ స్లీపర్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ | ABP Desam
WPL 2026 RCB vs GG Highlights | హ్యాట్రిక్ కొట్టిన బెంగళూరు!
Ashwin about India vs New Zealand | టీమ్ సెలక్షన్ పై అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Manoj Tiwari about Rohit Sharma Captaincy | రోహిత్ కెప్టెన్సీపై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
Ind vs NZ Rohit Sharma Records | మరో రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada AM Green Energy: గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
TTD Darshan Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. దర్శన, సేవా టికెట్ల విడుదల షెడ్యూల్ వచ్చేసింది
తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. దర్శన, సేవా టికెట్ల విడుదల షెడ్యూల్ వచ్చేసింది
Telangana News: దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదు రూ.2 లక్షలకు పెంపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదు రూ.2 లక్షలకు పెంపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
Manaswini Balabommala: శాస్త్రీయ నృత్యం, సంగీతం నుంచి సినిమాల్లోకి... 'కొక్కోరోకో'లో మనస్విని బాలబొమ్మల
శాస్త్రీయ నృత్యం, సంగీతం నుంచి సినిమాల్లోకి... 'కొక్కోరోకో'లో మనస్విని బాలబొమ్మల
World largest Shiva lingam: ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం ప్రతిష్ఠాపన - బీహార్‌లో సనాతన వారసత్వానికి చారిత్రాత్మక ఘట్టం
ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం ప్రతిష్ఠాపన - బీహార్‌లో సనాతన వారసత్వానికి చారిత్రాత్మక ఘట్టం
Tata Punch Facelift ఏ వేరియంట్ మీ మనీకి విలువైన ఎంపిక.. ధర, ఫీచర్లు ఇవే
Tata Punch Facelift ఏ వేరియంట్ మీ మనీకి విలువైన ఎంపిక.. ధర, ఫీచర్లు ఇవే
Sankranti Feast: కొత్త అల్లుడికి ఏకంగా 1574 రకాల వంటకాలతో భారీ విందు.. గోదారోళ్లా మజాకానా..
కొత్త అల్లుడికి ఏకంగా 1574 రకాల వంటకాలతో భారీ విందు.. గోదారోళ్లా మజాకానా..
Rahul Gandhi On Rohit Vemula Act:
"రోహిత్ వేముల చట్టం కోసం ఊరూవాడా, విద్యార్థులంతా కదలాలి" సంచలన ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ
Embed widget