అన్వేషించండి

Andhra Pradesh: ఏపీ ఆర్థికశాఖలో ముగ్గురు అధికారులు సస్పెండ్… ఆర్ధిక విషయాలు లీక్ అవడమే కారణమా…!

ఏపీ ఆర్థికశాఖలో ముగ్గురి సస్పెన్షన్ అంశం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, జీతాల చెల్లింపుల్లో ఆలస్యం, ఇతరరా చెల్లింపుల వివరాలు మీడియాకు లీక్ చేశారన్న అనుమానంతో ఈ చర్యలు.

ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక విషయాల గుట్టు రట్టు చేశారంటూ రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు అధికారులపై సస్పెన్షన్‌ వేటు వేసింది. ఆర్థికశాఖలో పనిచేసేవారు మీడియాకు సమాచారం లీకు చేస్తున్నారనే అనుమానంతో సీఎఫ్‌ఎంఎస్‌లోనూ చర్యలు తీసుకుంది. ముగ్గురు అధికారులను ఖజానా శాఖకు తిప్పి పంపింది. అదే విభాగంలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న అయిదుగురిని హఠాత్తుగా తొలగించింది. ఆర్థికశాఖ అధికారుల సస్పెన్షన్‌కు ప్రభుత్వం కారణాలు చెప్పినా సీఎఫ్‌ఎంఎస్‌లో చర్యలకు ఎలాంటి కారణాలూ వెల్లడించలేదు. ఇతరత్రా ప్రభుత్వశాఖల నుంచి వచ్చి పనిచేసిన వారిని తిరిగి మాతృశాఖకు పంపడం మామూలేనని అధికారులు చెబుతున్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను ఎప్పుడైనా సాగనంపొచ్చునని పేర్కొంటున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, జీతాల చెల్లింపుల్లో ఆలస్యాలు, ఇతరత్రా చెల్లింపుల అంశాలు వెలుగులోకి వస్తున్నందున ఈ చర్యలన్నీ బుధవారం చేపట్టిందని చెబుతున్నారు.


Andhra Pradesh: ఏపీ ఆర్థికశాఖలో ముగ్గురు అధికారులు సస్పెండ్… ఆర్ధిక విషయాలు లీక్ అవడమే కారణమా…!

రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఈ మధ్య చర్చనీయాంశమయ్యాయి. రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌ ఏర్పాటుచేసి అదనపు ఎక్సైజ్‌ సుంకం విధించి ఆ మొత్తాన్ని బ్యాంకులకు ఎస్క్రో చేసి రూ.21,500 కోట్ల రుణం ప్రభుత్వం తీసుకుంది. అంతే మొత్తానికి ప్రభుత్వ గ్యారంటీలను బ్యాంకులకు సమర్పించింది. భవిష్యత్తు ఆదాయాలను ఎలా తాకట్టు పెడతారనే అంశం ఆర్థిక, రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఇది కేంద్రం దృష్టికి వెళ్లింది. కేంద్ర ఆర్థికశాఖ వ్యయ విభాగం నుంచి దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ అందింది. పైగా ఆ కార్పొరేషన్‌కు రూ.21,500 కోట్ల మేర ఇచ్చిన గ్యారంటీలు శాసనసభకు తెలియజేయలేదన్న అంశం రాజకీయంగా వివాదాస్పదంగా మారింది. ఈ గ్యారంటీల వల్ల 2020-21 ఆర్థిక సంవత్సరంలో కార్పొరేషన్ల నుంచి తెచ్చే రుణం పరిమితిని దాటిపోయిందనే అంశమూ వివాదంగా మారుతోంది. మరోవైపు ప్రతినెలా రూ.5,000 కోట్ల వరకు రుణం తీసుకువస్తే తప్ప రాష్ట్ర ఆర్థిక అవసరాలు తీరని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ విషయాలన్నీ బయటకు వచ్చి చర్చకు దారితీయడంతో ప్రభుత్వం ఆ గుట్టు రట్టు మూలాలపై దృష్టి సారించింది. ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ ఈ విషయాలపై రాష్ట్ర గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రధానికి ఫిర్యాదు చేయడంతో ఆ లేఖ ఆధారంగానే కేంద్ర ఆర్థికశాఖలోని వ్యయ విభాగమూ స్పందించింది.

విజిలెన్సు అధికారులు కిందటి వారంలో రాష్ట్ర సచివాలయంలోని ఆర్థికశాఖ అధికారులు అనేకమందిని కలిసి ప్రశ్నలు సంధించారు. విజిలెన్సు డైరెక్టర్‌ జనరల్‌ నుంచి ఆర్థికశాఖ ఉన్నతాధికారులకు నివేదిక అందింది. ఈ నేపథ్యంలోనే ఆర్థికంగా సున్నితమైన, కాన్ఫిడెన్షియల్‌ బయటకు లీకు చేస్తున్నారనే అనుమానంతో ముగ్గురు అధికారులపై ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ బుధవారం సస్పెన్షన్‌ వేటు వేశారు. ఆర్థికశాఖలో నగదు, రుణ నిర్వహణ విభాగం సహాయ కార్యదర్శి నాగులపాటి వెంకటేశ్వర్లు, అదే విభాగంలో సెక్షన్‌ ఆఫీసర్‌ కసిరెడ్డి వరప్రసాద్‌, మరో విభాగం సెక్షన్‌ ఆఫీసరు డి.శ్రీనుబాబులను సస్పెండు చేశారు. వీరు ఉన్నతాధికారుల అనుమతి లేకుండా అమరావతి దాటి వెళ్లకూడదని ఆదేశాల్లో పేర్కొన్నారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా పత్రికల్లో కథనాలు వస్తున్నాయని, ఈ సమాచారం వీరు బయట పెడుతున్నారనే ప్రాథమిక అనుమానం విజిలెన్స్ వ్యక్తం చేసింది. సున్నితమైన ఆర్థిక అంశాలు, రహస్య అంశాలు లీకు చేస్తుండటంతో ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టేలా, విషయాలను వక్రీకరించేలా కథనాలు వస్తున్నాయని అందులో పేర్కొంది. వెంకటేశ్వర్లు, వరప్రసాద్‌ల నుంచి సమాచారం శ్రీనుబాబుకు చేరి, ఆయన ద్వారా బయటకు లీకవుతోందని అభియోగాలు మోపారు. ఆ సమాచారం ఎంత సున్నితమైందో, ఎంత రహస్యంగా ఉంచాలో తెలిసినా, అనధికారికంగా బయటకు పంపారని ఉత్తర్వుల్లో ప్రస్తావించారు. గ్యారంటీల సమాచారమూ వరప్రసాద్‌ వెల్లడించారంటూ ఆ ఉత్తర్వుల్లో అభియోగం మోపారు.

రాష్ట్రంలో బిల్లుల చెల్లింపులన్నీ సీఎఫ్‌ఎంఎస్‌ వ్యవస్థ ద్వారానే జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఖజానాశాఖకు చెందిన ముగ్గురు అధికారులు వి.వి.రావు, అచ్యుతరామయ్య, నాగపట్టాభి తదితరులు తాత్కాలికంగా సీఎఫ్‌ఎంఎస్‌లో ఎప్పటినుంచో పనిచేస్తున్నారు. హఠాత్తుగా వారిని బుధవారం సొంత శాఖకు పంపుతూ సీఎఫ్‌ఎంఎస్‌ సీఈవో ఉత్తర్వులు ఇచ్చారు. వీరు కాకుండా ఇప్పటికే పదవీవిరమణ చేసి సీఎఫ్‌ఎంఎస్‌లో ముఖ్య స్థానాల్లో ఉన్న మరో అయిదుగురి కాంట్రాక్టును హఠాత్తుగా రద్దు చేసుకున్నారు. వారిలో ఒకరి కాంట్రాక్టు ఆగస్టు 31తో పూర్తవుతుందని, సమీపంలోనే ఆ గడువు ఉన్నా ముందే పంపేయడం చర్చనీయాంశమవుతోంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jagan: రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
Revanth Reddy comments: కార్పొరేట్ కంపెనీల కోసమే ఉపాధి హామీ పథకంలో మార్పులు- మోదీ ప్రభుత్వంపై రేవంత్ సంచలన ఆరోపణలు
కార్పొరేట్ కంపెనీల కోసమే ఉపాధి హామీ పథకంలో మార్పులు- మోదీ ప్రభుత్వంపై రేవంత్ సంచలన ఆరోపణలు
YS Jagan on Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు భూ సేకరణ చేసింది మేమే, కేసులు వాదించింది మేమే, అనుమతులు తెచ్చింది మేమే- మొదటి ఫ్లైట్‌ ఎప్పుడు ఎగురుతుందో చెప్పింది మేమే: జగన్
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు భూ సేకరణ చేసింది మేమే, కేసులు వాదించింది మేమే, అనుమతులు తెచ్చింది మేమే- మొదటి ఫ్లైట్‌ ఎప్పుడు ఎగురుతుందో చెప్పింది మేమే: జగన్
Hyderabad Crime News: సంక్రాంతి వేళ హైదరాబాద్‌లో చైనా మాంజాపై ఉక్కుపాదం; ఆ దారంతో పతంగులు ఎగరేసిన వారిపై కేసులు! పోలీసుల సంచలన నిర్ణయం
సంక్రాంతి వేళ హైదరాబాద్‌లో చైనా మాంజాపై ఉక్కుపాదం; ఆ దారంతో పతంగులు ఎగరేసిన వారిపై కేసులు! పోలీసుల సంచలన నిర్ణయం

వీడియోలు

India vs South Africa Vaibhav Suryavanshi | మూడో వన్డేలో 233 పరుగుల తేడాతో విజయం
Shreyas Iyer Fitness Update Ind vs NZ | టీమ్ ఇండియాకు గుడ్‌న్యూస్!
Robin Uthappa about Team India | ఉత‌ప్ప సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagan: రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
రెండో దశ భూసమీకరణకు వ్యతిరేకం - 2 లక్షల కోట్లతో రాజధాని సాధ్యమా? - అమరావతిపై జగన్ వ్యాఖ్యలు
Revanth Reddy comments: కార్పొరేట్ కంపెనీల కోసమే ఉపాధి హామీ పథకంలో మార్పులు- మోదీ ప్రభుత్వంపై రేవంత్ సంచలన ఆరోపణలు
కార్పొరేట్ కంపెనీల కోసమే ఉపాధి హామీ పథకంలో మార్పులు- మోదీ ప్రభుత్వంపై రేవంత్ సంచలన ఆరోపణలు
YS Jagan on Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు భూ సేకరణ చేసింది మేమే, కేసులు వాదించింది మేమే, అనుమతులు తెచ్చింది మేమే- మొదటి ఫ్లైట్‌ ఎప్పుడు ఎగురుతుందో చెప్పింది మేమే: జగన్
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు భూ సేకరణ చేసింది మేమే, కేసులు వాదించింది మేమే, అనుమతులు తెచ్చింది మేమే- మొదటి ఫ్లైట్‌ ఎప్పుడు ఎగురుతుందో చెప్పింది మేమే: జగన్
Hyderabad Crime News: సంక్రాంతి వేళ హైదరాబాద్‌లో చైనా మాంజాపై ఉక్కుపాదం; ఆ దారంతో పతంగులు ఎగరేసిన వారిపై కేసులు! పోలీసుల సంచలన నిర్ణయం
సంక్రాంతి వేళ హైదరాబాద్‌లో చైనా మాంజాపై ఉక్కుపాదం; ఆ దారంతో పతంగులు ఎగరేసిన వారిపై కేసులు! పోలీసుల సంచలన నిర్ణయం
ED Raids at IPAC Office: IPAC కార్యాలయంలో ED సోదాలు! ఫైల్స్‌తో రైడ్ జరిగే ప్రాంతానికి మమతా బెనర్జీ!
IPAC కార్యాలయంలో ED సోదాలు! ఫైల్స్‌తో రైడ్ జరిగే ప్రాంతానికి మమతా బెనర్జీ!
Gurram Papireddy OTT : ఓటీటీలోకి డార్క్ కామెడీ 'గుర్రం పాపిరెడ్డి' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి డార్క్ కామెడీ 'గుర్రం పాపిరెడ్డి' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Bank Of Bhagyalakshmi OTT : ఓటీటీలోకి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ 'బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి' - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ 'బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి' - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Telangana News: హిస్టరీ క్రియేట్ చేసిన తెలంగాణ లేడీ కానిస్టేబుల్! తొలిసారి తెలుగు భాషలో ఛార్జిషీట్‌
హిస్టరీ క్రియేట్ చేసిన తెలంగాణ లేడీ కానిస్టేబుల్! తొలిసారి తెలుగు భాషలో ఛార్జిషీట్‌
Embed widget