అన్వేషించండి

AP Elections 2024: అన్ని పార్టీల ప్రతినిధులతో ఏపీ సీఈవో మీనా సమావేశం, ఎందుకంటే?

Andhra Pradesh News: ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ సీఈవో మీనా ఇవాళ అన్ని పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఎన్నికల మార్గదర్శకాలను వివరించారు.

Parliament Elections 2024: పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. నాలుగైదు రోజుల్లో కేంద్ర ఎన్నికల సంఘం  షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో పార్టీలన్నీ రాజకీయాలను షురూ చేశాయి. బహిరంగ సభల ద్వారా ప్రజల్లోకి వెళుతున్నాయి. సభల్లో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల ప్రసంగాలు, విమర్శలతో షెడ్యూల్ రాకముందే ఏపీలో ఎన్నికల హీట్ తారాస్థాయికి చేరుకుంది. ప్రజలను ఆకట్టుకునేందకు పార్టీలు రకరకాల హామీలు ఇస్తున్నాయి. ఇటీవల మంగళగిరిలో జరిగిన జయహో బీసీ సభలో బీసీ డిక్లరేషన్‌ను టీడీపీ, జనసేన ప్రకటించాయి. ఇక వైసీపీ కూడా సిద్దం సభలతో ప్రజల్లోకి వెళుతుంంది.

ఎన్నికల నిర్వహణకు ఈసీ ఏర్పాట్లు

ఇక ఎన్నికలకు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల నిర్వహణలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో ఈసీ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తోంది. అలాగే పార్టీలతో కూడా భేటీ అవుతుంది. అందులో భాగంగా గురువారం విజయవాడలో రాష్ట్రంలో గుర్తింపు పొందిన పార్టీల ప్రతినిధులతో ఏపీ ఎన్నికల కమిషనర్ ముకేష్ కుమార్ మీనా సమావేశమయ్యారు. వైసీపీ, టీడీపీ, జనసేన, సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్, బీజేపీతో పాటు ఇతర పార్టీల నేతలు ఈ మీటింగ్‌లో పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల మార్గదర్శాలను పార్టీకి సీఈవో వివరించారు. ఎన్నికల నిబంధనలను పార్టీలకు వివరించారు. నిబంధనలు పాటించకుండా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ఎన్నికల్లో అక్రమాలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా నిర్వహించేందుకు పార్టీలన్నీ సహకరించాలని మీనా కోరారు.

చంద్రబాబు, పవన్‌తో భేటీ

గతంలో ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు విజయవాడలోని నోవాటెల్ హోటల్‌లో అన్ని పార్టీల నేతలతో విడివిడిగా సమావేశమై అభిప్రాయాలు సేకరించారు. వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఈసీ సభ్యులను కలిశారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈసీ ప్రతినిధులను కలిసి ఏపీలోని దొంగ ఓట్లపై ఫిర్యాదు చేశారు. వాలంటీర్లు ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడంపై కంప్లైంట్ ఇచ్చారు. అలాగే సచివాలయ సిబ్బందిని కూడా ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని, ఇతర ప్రాంతాల్లో నివసించే వారి ఓట్లను తొలగించకుండా చర్యలు తీసుకోవాలని సీఈసీని కోరారు. అప్పట్లో దాదాపు ఆరగంట పాటు సీఈసీ బృందంతో చంద్రబాబు, పవన్ భేటీ అయ్యారు. ఏపీలోని పరిస్థితులు, ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు, నేతలపై కేసులు పెట్టడంపై కూడా  ఫిర్యాదు చేశారు. పార్టీల ఫిర్యాదులను స్వీకరించిన సీఈసీ సభ్యులు.. చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఎన్నికల వేళ మరోసారి అన్ని పార్టీల ప్రతినిధులతో ఈసీ సమావేశం నిర్వహించింది.

ఈ నెల 13న షెడ్యూల్?

ఈ నెల 13న ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించేందుకు ఈసీ రెడీ అవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికలకు మార్చి 19న షెడ్యూల్ రిలీజ్ చేయగా.. ఏప్రిల్ 11 నుంచి 19వ తేదీ వరకు 7 విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. అనంతరం మే 23న ఫలితాలు రిలీజ్ చేశారు. ఈ సారి కూడా అటుఇటుగా షెడ్యూల్ ప్రకటించే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి.

టాప్ హెడ్ లైన్స్

Breaking News:ఏపి సంపర్క్ క్రాంతి ట్రైన్ లో పొగలు- టెన్షన్ పడ్డ ప్రయాణికులు 
ఏపి సంపర్క్ క్రాంతి ట్రైన్ లో పొగలు- టెన్షన్ పడ్డ ప్రయాణికులు 
YS Jagan Kurnool Tour: జగన్‌ చేస్తున్న ఆరోపణలు తోసిపుచ్చిన అధికారులు- అవమానించలేదని వివరణ!
జగన్‌ చేస్తున్న ఆరోపణలు తోసిపుచ్చిన అధికారులు- అవమానించలేదని వివరణ!
AP Group 1 SIT Report: డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
iPhone Sypware Alert: ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
Telangana Free Sewing Machine Scheme: తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
Embed widget