అన్వేషించండి

AP Elections 2024: అన్ని పార్టీల ప్రతినిధులతో ఏపీ సీఈవో మీనా సమావేశం, ఎందుకంటే?

Andhra Pradesh News: ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ సీఈవో మీనా ఇవాళ అన్ని పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఎన్నికల మార్గదర్శకాలను వివరించారు.

Parliament Elections 2024: పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. నాలుగైదు రోజుల్లో కేంద్ర ఎన్నికల సంఘం  షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో పార్టీలన్నీ రాజకీయాలను షురూ చేశాయి. బహిరంగ సభల ద్వారా ప్రజల్లోకి వెళుతున్నాయి. సభల్లో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల ప్రసంగాలు, విమర్శలతో షెడ్యూల్ రాకముందే ఏపీలో ఎన్నికల హీట్ తారాస్థాయికి చేరుకుంది. ప్రజలను ఆకట్టుకునేందకు పార్టీలు రకరకాల హామీలు ఇస్తున్నాయి. ఇటీవల మంగళగిరిలో జరిగిన జయహో బీసీ సభలో బీసీ డిక్లరేషన్‌ను టీడీపీ, జనసేన ప్రకటించాయి. ఇక వైసీపీ కూడా సిద్దం సభలతో ప్రజల్లోకి వెళుతుంంది.

ఎన్నికల నిర్వహణకు ఈసీ ఏర్పాట్లు

ఇక ఎన్నికలకు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల నిర్వహణలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో ఈసీ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తోంది. అలాగే పార్టీలతో కూడా భేటీ అవుతుంది. అందులో భాగంగా గురువారం విజయవాడలో రాష్ట్రంలో గుర్తింపు పొందిన పార్టీల ప్రతినిధులతో ఏపీ ఎన్నికల కమిషనర్ ముకేష్ కుమార్ మీనా సమావేశమయ్యారు. వైసీపీ, టీడీపీ, జనసేన, సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్, బీజేపీతో పాటు ఇతర పార్టీల నేతలు ఈ మీటింగ్‌లో పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల మార్గదర్శాలను పార్టీకి సీఈవో వివరించారు. ఎన్నికల నిబంధనలను పార్టీలకు వివరించారు. నిబంధనలు పాటించకుండా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ఎన్నికల్లో అక్రమాలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా నిర్వహించేందుకు పార్టీలన్నీ సహకరించాలని మీనా కోరారు.

చంద్రబాబు, పవన్‌తో భేటీ

గతంలో ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు విజయవాడలోని నోవాటెల్ హోటల్‌లో అన్ని పార్టీల నేతలతో విడివిడిగా సమావేశమై అభిప్రాయాలు సేకరించారు. వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఈసీ సభ్యులను కలిశారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈసీ ప్రతినిధులను కలిసి ఏపీలోని దొంగ ఓట్లపై ఫిర్యాదు చేశారు. వాలంటీర్లు ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడంపై కంప్లైంట్ ఇచ్చారు. అలాగే సచివాలయ సిబ్బందిని కూడా ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని, ఇతర ప్రాంతాల్లో నివసించే వారి ఓట్లను తొలగించకుండా చర్యలు తీసుకోవాలని సీఈసీని కోరారు. అప్పట్లో దాదాపు ఆరగంట పాటు సీఈసీ బృందంతో చంద్రబాబు, పవన్ భేటీ అయ్యారు. ఏపీలోని పరిస్థితులు, ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు, నేతలపై కేసులు పెట్టడంపై కూడా  ఫిర్యాదు చేశారు. పార్టీల ఫిర్యాదులను స్వీకరించిన సీఈసీ సభ్యులు.. చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఎన్నికల వేళ మరోసారి అన్ని పార్టీల ప్రతినిధులతో ఈసీ సమావేశం నిర్వహించింది.

ఈ నెల 13న షెడ్యూల్?

ఈ నెల 13న ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించేందుకు ఈసీ రెడీ అవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికలకు మార్చి 19న షెడ్యూల్ రిలీజ్ చేయగా.. ఏప్రిల్ 11 నుంచి 19వ తేదీ వరకు 7 విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. అనంతరం మే 23న ఫలితాలు రిలీజ్ చేశారు. ఈ సారి కూడా అటుఇటుగా షెడ్యూల్ ప్రకటించే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి.

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
AP Municipal Amendment Bill: మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
AP Municipal Elections 2026: మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. బీసీలకు కొత్త రిజర్వేషన్లు వర్తింపు
మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. బీసీలకు కొత్త రిజర్వేషన్లు వర్తింపు

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget