అన్వేషించండి

AP and TS Election 2024 Polling percentage: ఏపీ, తెలంగాణలో భారీగా ఓటింగ్ నమోదు - ఓటేసిన రెండున్నర కోట్ల ప్రజలు

AP and TS Election 2024 Voting Percentage Till: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఏపీలో 36 శాతం, తెలంగాణలో 40 శాతం ఓటింగ్ నమోదైంది.

AP and TS Election 2024 Voting Percentage Till : హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల నాలుగో విడత పోలింగ్ లో భారీగా ఓటింగ్ నమోదు కానుంది. తెలుగు రాష్ట్రాల్లో ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు. ఏపీ, తెలంగాణలో కలిపి దాదాపు రెండు కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెలంగాణలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు 40 శాతం పోలింగ్ నమోదైంది. ఏపీలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు 36 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.  ఏపీలో చెదురుమదురు ఘటనల మినహా ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగుతోంది. 36.84 శాతం మేర మహిళలు ఓటు వేయగా.. 35 శాతం మేర పురుషులు ఓటు వేశారు.

తెలంగాణలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు 40.38 శాతం నమోదు కాగా, పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఇలా
ఆదిలాబాద్  - 50.18 శాతం
భువనగిరి  - 46.49 శాతం
చేవెళ్ల  - 34.56 శాతం
హైదరాబాద్ - 19.37 శాతం
కరీంనగర్  - 45.11 శాతం
ఖమ్మం  - 50.63 శాతం
మహబూబాబాద్ -  48.81 శాతం
మల్కాజిగిరి -  27.69 శాతం
మెదక్  - 46.72 శాతం
నాగర్ కర్నూల్ - 45.72 శాతం
నల్గొండ  - 48.48 శాతం
నిజామాబాద్ - 45.67 శాతం
పెద్దపల్లి  - 44.87 శాతం
సికింద్రాబాద్ - 24.91 శాతం
వరంగల్  - 41.23 శాతం
జహీరాబాద్ - 50.71 శాతం 

డోన్ నియోజకవర్గం బేతంచెర్లలో స్వతంత్ర అభ్యర్థి పిఎన్ బాబుపై వైసీపీ కార్యకర్తల దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. మంత్రి బుగ్గన కారు వెనక వెళ్తుండగా ఘటన జరిగినట్లు సమాచారం. బేతంచర్ల పోలీస్ స్టేషన్లో పీఎం బాబు ఫిర్యాదు చేశారు. 

ఏపీలో ఇప్పటి వరకు (మధ్యాహ్నం 1 వరకు) 1.70 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అత్యధికంగా కడప జిల్లాలో 45.5 శాతం పోలింగ్ నమోదు కాగా, అత్యల్పంగా అల్లూరి జిల్లాలో 32.80 శాతం మేర పోలింగ్ నమోదు అయింది. సీఎం జగన్ పోటీ చేసిన పులివెందుల నియోజకవర్గంలో 50 శాతం పోలింగ్ అయింది. కడప తరువాత కృష్ణా, కోనసీమ, చిత్తూరు, బాపట్ల, నంద్యాల జిల్లాల్లోనూ భారీగా పోలింగ్ జరిగిందని అధికారులు తెలిపారు.

ఆదోని వైసీపీ అభ్యర్థి సాయిప్రసాద్ రెడ్డిపై కేసు 
ఆదోని వైసీపీ అభ్యర్థి సాయిప్రసాద్ రెడ్డిపై కేసు నమోదైంది. నింబంధనలకు విరుద్ధంగా ఓటర్ స్లిప్పులపై తన ఫోటో ముద్రించారు. దీంతో మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సాయిప్రసాద్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.

ఓటు కోసం వచ్చి హార్ట్ ఎటాక్ తో మహిళ మృతి
ఉప్పల్ లోని ఆంధ్ర యువత మండలి పోలింగ్ కేంద్రం లో విషాదం చోటుచేసుకుంది. ఓటు వేయడానికి వచ్చిన భరత్ నగర్ కి చెందిన గట్టు విజయలక్ష్మి పోలింగ్ స్టేషన్ లో అకస్మాత్తుగా పడిపోయారు. పోలింగ్ సిబ్బంది వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా.. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే హార్ట్ ఎటాక్ తో చనిపోయిందని నిర్దారించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu Naidu: సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం, డిప్యూటీ సర్వేయర్ నిర్వాకం..!
సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం, డిప్యూటీ సర్వేయర్ నిర్వాకం..!
Telangana News : తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల
తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల
Andhra Pradesh:  ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ పంపిణీ వేళ టీడీపీ కూటమి వైసీపీ మధ్య పొలిటికల్ వార్‌
ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ పంపిణీ వేళ టీడీపీ కూటమి వైసీపీ మధ్య పొలిటికల్ వార్‌
Electricity Bill Payment: మీ కరెంట్ బిల్లులను ఆన్‌లైన్‌లో ఎలా చెల్లించాలో తెలుసా, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదీ
మీ కరెంట్ బిల్లులను ఆన్‌లైన్‌లో ఎలా చెల్లించాలో తెలుసా, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Surya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABPJasprit Bumrah Player of the Tournament award | T20 World Cup 2024 లో బుమ్రానే మన బౌలింగ్ బలం | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu Naidu: సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం, డిప్యూటీ సర్వేయర్ నిర్వాకం..!
సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం, డిప్యూటీ సర్వేయర్ నిర్వాకం..!
Telangana News : తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల
తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల
Andhra Pradesh:  ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ పంపిణీ వేళ టీడీపీ కూటమి వైసీపీ మధ్య పొలిటికల్ వార్‌
ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ పంపిణీ వేళ టీడీపీ కూటమి వైసీపీ మధ్య పొలిటికల్ వార్‌
Electricity Bill Payment: మీ కరెంట్ బిల్లులను ఆన్‌లైన్‌లో ఎలా చెల్లించాలో తెలుసా, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదీ
మీ కరెంట్ బిల్లులను ఆన్‌లైన్‌లో ఎలా చెల్లించాలో తెలుసా, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదీ
Polavaram Project: పోలవరం ప్రాజెక్ట్‌ పరిశీలిస్తున్న అంతర్జాతీయ నిపుణుల బృందం- డయాఫ్రంవాల్‌ గురించి ఏం చెప్పారంటే?
పోలవరం ప్రాజెక్ట్‌ పరిశీలిస్తున్న అంతర్జాతీయ నిపుణుల బృందం- డయాఫ్రంవాల్‌ గురించి ఏం చెప్పారంటే?
Thangalaan : విక్ర‌మ్ 'తంగలాన్' ఫ‌స్ట్ రివ్యూ ఇచ్చేసిన జీ.వి. ప్ర‌కాశ్.. ఏమ‌న్నారంటే?
విక్ర‌మ్ 'తంగలాన్' ఫ‌స్ట్ రివ్యూ ఇచ్చేసిన జీ.వి. ప్ర‌కాశ్.. ఏమ‌న్నారంటే?
Andhra Pradesh: చెప్పాపెట్టకుండానే ఉద్యోగులకు షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
చెప్పాపెట్టకుండానే ఉద్యోగులకు షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
Pawan Kalyan: “ఆరోపిస్తారు.. ఆధారాలు అడిగితే సైలెంట్ అవుతారు”.. పవన్ పై వైసీపీ ఫైర్
“ఆరోపిస్తారు.. ఆధారాలు అడిగితే సైలెంట్ అవుతారు”.. పవన్ పై వైసీపీ ఫైర్
Embed widget