అన్వేషించండి

సుప్రీం కోర్టు తీర్పుతో వైసీపీలో జోష్‌- స్వాగతించిన నేతలు, మంత్రులు

అమరావతిపై సుప్రీం కోర్టు తీర్పు వైసీపీలో కొత్త ఉత్సాహం నింపింది. మనస్ఫూర్తిగా స్వాగతించిన నేతలు... ప్రతిపక్షాలపై విరుచుకు పడ్డారు.

రాజధాని అంశంలో సుప్రీంకోర్టు  చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వికేంద్రీకరణకు అనుకూలంగా  సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఉన్నాయంటున్నారు మంత్రులు. సుప్రీంకోర్టులో ఏపీ రాజధాని అమరావతి అంశం పై విచారణ జరిగింది. ఒకే  ప్రాంతాన్ని  అభివృద్ధి చెయ్యమని చెప్పలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆరు నెలల కాలవ్యవధి లోపల రాజధాని నిర్మాణం పూర్తి చేయాలన్న హైకోర్టు తీర్పుపై స్టే విధించింది సుప్రీంకోర్టు. హై కోర్టు ఇచ్చిన తీర్పులోని 3 నుంచి ఏడు ఆదేశాలపై స్టే ఇచ్చింది. సుప్రీంకోర్టు విచారణ జనవరి 31కి వాయిదా వేసింది ధర్మాసనం. ఇలాంటి అంశాలలో నైపుణ్యం లేకుండా ఇలాంటి ఆదేశిలిస్తారా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించినట్టు సమాచారం. రెండు నెలలలో నిర్మాణం చేయమంటారా అని ప్రశ్నించింది. కోర్టులు ఎప్పటికీ ప్రభుత్వాలు కాదు. అలాంటి ఆదేశాలు ఇవ్వొచ్చా? అని  సుప్రీం వ్యాఖ్యానించింది.

మంత్రుల స్పందన...
సుప్రీంకోర్టు  వ్యాఖ్యలుపై ఏపీ మంత్రులు స్పందించారు. చంద్రబాబు బినామీ రైతులను సృష్టించారన్నారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. అడ్డగోలుగా కొట్టేసిన భూముల్ని కాపాడే ప్రయత్నం బాబు చేస్తున్నారన్నారు. ఏపీ ప్రభుత్వం ఒక్కో అడ్డంకి తొలగిస్తోందని...  సుప్రీంకోర్టు  కొన్ని  అంశాలపై  స్టే ఇచ్చిందిన్నారు మంత్రి కాకాణి. అన్ని అడ్డంకులు తొలగిస్తామన్నారు. 

అమరావతి అంశంలో ఏపీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీం కోర్టు తీర్పును స్వాగతించారు మంత్రి అంబటి రాంబాబు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు వికేంద్రీకరణకు బలాన్నిస్తున్నాయని తెలిపారు. రాజధానిని 3 నెలలు లేదా 6 నెలల్లోనే నిర్మించాల్సిన అవసరం లేదని అంబటి స్పష్టం చేశారు. రాజధానుల నిర్ణయంలో న్యాయస్థానాల జోక్యం సరైంది కాదని దీన్ని బట్టి అర్థమవుతోందని అభిప్రాయపడ్డారు. ఇక అమరావతి యాత్రకు శాశ్వత విరామం ఇచ్చినట్టేనని పేర్కొన్నారు. గ్రాఫిక్స్ చూపించారు తప్ప అమరావతిలో నిర్మాణాలు చేయలేదని విమర్శించారు. రైతుల వేషాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకున్నారని ఆరోపించారు. అమరావతి ప్రాంతంలోని నిజమైన రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పుతోనైనా రాజధానులకు అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలను చంద్రబాబు ఆపాలన్నారు  అంబటి. 

వికేంద్రీకరణ పై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను  ప్రభుత్వ సలహాదారు  సజ్జల  స్వాగతించారు. సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో చంద్రబాబుకు కనువిప్పు కలగాలి అన్నారు  మాజీ మంత్రి కన్నబాబు. సుప్రీం కోర్టు తీర్పు న్యాయానికి ధర్మానికి అనుగుణంగా  ఉందన్నారు. అమరావతిలో  పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామంటే  చివరికి సి.పి.ఐ కూడా  అడ్డుకుందన్నారు  కన్నబాబు. రాజధాని ఎక్కడ ఉండాలో నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే అన్నారు. జగన్ కు షాక్ అంటూ అసత్య ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు కన్నబాబు. 

సుప్రీంకోర్టు  రాజధాని అంశంపై  విచారణ ను  వచ్చే  జనవరి  31 కు  వాయిదా  వేసింది.ప్రస్తుతం సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానికి అనుకూలంగా ఉండడంతో వైసీపీ మంత్రులు, నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని వారు అభిప్రాయపడ్డారు. కోర్టు తీర్పులను కూడా ఇష్టానుసారంగా ప్రచారం చేసుకోవటం దారుణమని వారు వ్యాఖ్యానించారు. ప్రభుత్వం రాజధాని విషయంలో స్పష్టమైన వైఖరితో ముందుకు వెళుతుందని అన్నారు. ఇలాంటి పరిణామాలను తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. అవసరం అయితే న్యాయ స్దానంలోనే ప్రతిపక్షాలకు తగిన బుద్ది చెబతామని అన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'సీఎం చంద్రబాబును కలిసి వినతులు ఇవ్వొచ్చు' - టోల్ ఫ్రీ నెంబర్ ఇదే!
'సీఎం చంద్రబాబును కలిసి వినతులు ఇవ్వొచ్చు' - టోల్ ఫ్రీ నెంబర్ ఇదే!
Virat Rohit: టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
Upendra Dwivedi: ఇండియన్ ఆర్మీ కొత్త బాస్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది, పాక్‌ చైనా ఆటలు కట్టించడంలో ఎక్స్‌పర్ట్
ఇండియన్ ఆర్మీ కొత్త బాస్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది, పాక్‌ చైనా ఆటలు కట్టించడంలో ఎక్స్‌పర్ట్
Kalki 2898 AD 3 Day Collection: బాక్సాఫీసు వద్ద 'కల్కి' కలెక్షన్ల సునామీ - మూడు రోజుల్లో ఎంత వసూళ్లు చేసిందంటే..!
బాక్సాఫీసు వద్ద 'కల్కి' కలెక్షన్ల సునామీ - మూడు రోజుల్లో ఎంత వసూళ్లు చేసిందంటే..!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jasprit Bumrah Player of the Tournament award | T20 World Cup 2024 లో బుమ్రానే మన బౌలింగ్ బలం | ABPVirat Kohli and Rohit Sharma Announces Retirement From T20I | వరల్డ్ కప్ గెలిచి రిటైరైన దిగ్గజాలుVirat Kohli 76 Runs in T20 World Cup Final | సిరీస్ అంతా ఫెయిలైనా ఫైనల్ లో విరాట్ విశ్వరూపం | ABPRohit Sharma Kisses Hardik Pandya | T20 World Cup 2024 విజయం తర్వాత రోహిత్, పాండ్యా వీడియో వైరల్|ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'సీఎం చంద్రబాబును కలిసి వినతులు ఇవ్వొచ్చు' - టోల్ ఫ్రీ నెంబర్ ఇదే!
'సీఎం చంద్రబాబును కలిసి వినతులు ఇవ్వొచ్చు' - టోల్ ఫ్రీ నెంబర్ ఇదే!
Virat Rohit: టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
Upendra Dwivedi: ఇండియన్ ఆర్మీ కొత్త బాస్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది, పాక్‌ చైనా ఆటలు కట్టించడంలో ఎక్స్‌పర్ట్
ఇండియన్ ఆర్మీ కొత్త బాస్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది, పాక్‌ చైనా ఆటలు కట్టించడంలో ఎక్స్‌పర్ట్
Kalki 2898 AD 3 Day Collection: బాక్సాఫీసు వద్ద 'కల్కి' కలెక్షన్ల సునామీ - మూడు రోజుల్లో ఎంత వసూళ్లు చేసిందంటే..!
బాక్సాఫీసు వద్ద 'కల్కి' కలెక్షన్ల సునామీ - మూడు రోజుల్లో ఎంత వసూళ్లు చేసిందంటే..!
IAS Karthikeya Mishra: సీఎం చంద్రబాబు అదనపు కార్యదర్శిగా కార్తికేయ మిశ్రా - సీఎస్ ఉత్తర్వులు
సీఎం చంద్రబాబు అదనపు కార్యదర్శిగా కార్తికేయ మిశ్రా - సీఎస్ ఉత్తర్వులు
Axar Patel: శ్రీలంకకు ఆ జయసూర్య, భారత్‌కు ఈ జయసూర్య - అక్షర్ పటేల్‌‌పై ప్రశంసలు
శ్రీలంకకు ఆ జయసూర్య, భారత్‌కు ఈ జయసూర్య - అక్షర్ పటేల్‌‌పై ప్రశంసలు
Mann Ki Baat: అరకు కాఫీ అద్భుతం, రుచి చూసిన క్షణం ఇంకా గుర్తుంది - మన్‌ కీ బాత్‌లో మోదీ ప్రశంసలు
అరకు కాఫీ అద్భుతం, రుచి చూసిన క్షణం ఇంకా గుర్తుంది - మన్‌ కీ బాత్‌లో మోదీ ప్రశంసలు
ICC T20 World Cup 2024: మ్యాచ్ విన్నింగ్ క్యాచ్ పై వివాదం, బౌండరీ లైన్ ను సూర్య తగిలాడా?
మ్యాచ్ విన్నింగ్ క్యాచ్ పై వివాదం, బౌండరీ లైన్ ను సూర్య తగిలాడా?
Embed widget