అన్వేషించండి

పోలవరానికి పెరుగుతున్న వరద, నాలుగేళ్ల తర్వాత పట్టిసీమతో పని - మంత్రి అంబటి వెల్లడి

పట్టిసీమ ద్వారా మళ్ళీ కృష్ణా డెల్టా కు నీళ్ళు ఇవ్వాలని నిర్ణయం నిర్ణయించినట్లు జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు.

పోలవరానికి వరద నీటి తాడికి పెరుగుతోంది. స్పిల్ వేపై ప్రస్తుతం ఐదు లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుండగా, ఇంకా పెరుగుతుందని మంత్రి అంబటి రాంబాబు ప్రకటించారు. వరద నీటి ప్రవాహం ఎనిమిది లక్షల క్యూసెక్కులకు  పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. పట్టిసీమ ద్వారా మళ్ళీ కృష్ణా డెల్టా కు నీళ్ళు ఇవ్వాలని నిర్ణయం నిర్ణయించినట్లు జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు. నాలుగేళ్ల తర్వాత మళ్లీ పట్టిసీమ ద్వారా నీళ్ళు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.  

పులిచింతలలో నీటిని భవిష్యత్ అవసరాల కోసం నిల్వ ఉంచుతామని మంత్రి అంబటి అన్నారు. నాగార్జున సాగర్ నుంచి కుడి కాలువ ద్వారా 5 టీఎంసీల నీరు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. డయాఫ్రం వాల్ కొన్ని చోట్ల దెబ్బ తిందని, అయితే కొత్తది నిర్మించాలా లేక పాత దానికే మరమ్మతులు చేయాలా అన్నది త్వరలోనే నిర్ణయిస్తామని చెప్పారు. కేంద్ర జల సంఘం కి నివేదిక ఇవ్వలేదని మంత్రి వెల్లడించారు.

విపత్తుల నిర్వహణ సంస్ద అలర్ట్..

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అధికారులు అలర్ట్ అయ్యారు. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల  నిర్వహణ సంస్థ వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తోంది. ఎగువ రాష్ట్రాల్లో  భారీ వర్షాలు వల్ల స్వల్పంగా పెరుగున్న గోదావరి వరద ఉధృతి ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ముందస్తుగా ప్రభావిత జిల్లాల యంత్రాంగం అప్రమత్తం చేస్తున్నామని అన్నారు. 

ఎప్పటికప్పుడు పరిస్థితులు పర్యవేక్షిస్తున్న విపత్తుల సంస్థ, ముంపు ప్రాంతాల్లో ప్రజానీకం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. ముందస్తు సహయక చర్యలకు అల్లూరి కు ఎన్డీఆర్ఎఫ్, ఏలూరుకు  రెండు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పంపిస్తున్నారు. ఇక విపత్తుల నిర్వహణ సంస్థలో స్టేట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అత్యవసర సహయం కోసం ఇరవై నాలుగు  గంటలు అందు బాటులో ఉండేందుకు  స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు 1070, 18004250101 ప్రకటించారు. 

జిల్లాల్లో మండల స్థాయిలో కూడా అధికారులు కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు అంటున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, బోట్లు, మోటర్ బోట్లు, స్టీమర్లలతో నదిలో ప్రయాణించడం చేయరాదని, వరద నీటిలో ఈతకు వెళ్ళడం, చేపలు పట్టటం వంటి చేయకూడదని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వాహణ సంస్థ  మేనేజింగ్ డైరెక్టర్, డా.బి.ఆర్ అంబేద్కర్ చెప్పారు.

విశాఖలో మరో భారీ సదస్సు - మంత్రి అంబటి వెల్లడి

విశాఖ పట్నంలో ఇంటర్నేషనల్ కమిషన్ అన్ ఇరిగేషన్, డ్రైనేజ్ సంస్థ ఆధ్వర్యంలో మరో భారీ సదస్సు నిర్వహిస్తున్నట్లు మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. నవంబర్ ఒకటి నుండి ఎమిదవ తేదీ వరకూ సమావేశం జరుగుతుందని మంత్రి అంబటి తెలిపారు. ఈ సమావేశానికి ప్రధాని, లేదా రాష్ట్రపతి వచ్చే అవకాశం ఉందని అంబటి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం కలిసి ఈ సమావేశం సంయుక్తం గా నిర్వహిస్తున్నాయిని మంత్రి వివరించారు. మూడేళ్లకు ఒక సారి జరిగే ఈ సంస్థ సమావేశాలు నిర్వహిస్తుందని చెప్పారు. కరోనాకు ముందు కూడా ఆస్ట్రేలియాలో ఈ సమావేశాలు జరిగాయని అన్నారు. ఈ ఏడాది విశాఖలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. నీటి నిర్వహణ యాజమాన్యం తదితర అంశాలపై ఎనిమిది రోజుల పాటు సదస్సు ఉంటుందని చెప్పారు.

టాప్ హెడ్ లైన్స్

BC Reservations: బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు
బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Embed widget