అన్వేషించండి

Pawan Kalyan: పరువు నష్టం దావాతో జనసేనానికి మైలేజీ వస్తుందా! ఏపీలో హాట్ టాపిక్!

Defamation Case Against Pawan Kalyan: పరువు నష్టం దావా వేయటం వలన పవన్ కళ్యాణ్ కు మైలేజీ వస్తుందా, రాజకీయంగా అధికార పక్షానికి ఇది ఎంత వరకు మేలు కలిగిస్తుందనే అంశం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.

Defamation Case Against Pawan Kalyan: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యవహరంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైందేనా... పరువు నష్టం దావా వేయటం వలన జనసేనానికి మైలేజీ వస్తుందా, రాజకీయంగా అధికార పక్షానికి ఇది ఎంత వరకు మేలు కలిగిస్తుందనే అంశం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.

వాలంటీర్లను కేంద్రంగా చేసుకొని పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ పై రాష్ట్ర ప్రభుత్వం ఆచి తూచి వ్యవహరించి, చివరకు పరువు నష్టం దావా వేసేందుకు రెడీ అయ్యింది. అయితే ఈ వ్యవహరంపై  ఇప్పుడు పార్టీ వర్గాల్లో చర్చ మెదలైంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన పవన్ కే మరింత మైలేజీ పెరుగుతుందని పార్టీలోని పలువురు సీనియర్ల వాదన. అయితే ఇక్కడే మరో వాదన కూడా  వినిపిస్తోంది. వాలంటీర్ల సేవలపై చర్చ జరగాలన్నా, మహిళల అంశాన్ని కీలకంగా  చేసుకొని అధికార పక్షం మరింతగా దూకుడుగా వెళ్లాలన్నా, ఇలాంటి పరిస్దితులు అవసరం అని చెబుతున్నారు. వాలంటీర్లు చేసే సేవా కార్యక్రమాలు వలన రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు కలుగుతుంది, ప్రతి ఇంటికి వెళ్లి వాలంటీర్ పలకరించి, కుశల ప్రశ్నలు వేసి, ప్రభుత్వానికి వారధిగా నిలబడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో వాలంటీర్ల పట్ల ప్రజల్లో సానుభూతి నెలకొంది. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ వాలంటీర్లు మహిళల అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని కామెంట్స్ చేయటం సంచలనం రేకెత్తించింది. అంతే కాదు కేంద్ర నిఘా వర్గాల నుండి తనకు సమాచారం ఉందని పవన్ చెప్పటంతో మరింత ఆజ్యం పోసినట్లు అయ్యింది.

పవన్ పై పరువు నష్టం కేసు..
జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్  చేసిన కామెంట్స్ పై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. వాలంటీర్లు ఈ వ్యవహరంపై రెండు రోజులు పాటు  వరుసగా నిరసనలు తెలిపారు. ఇంకా అనేక చోట్ల నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ వ్యవహరం పైనే ప్రభుత్వం లోతుగా అదికారిక వర్గాలతో చర్చించినట్లు సమాచారం. న్యాయ పరంగా ఉన్న అంశాలను లోతుగా పరిశీలించిన తరువాత, హైకోర్ట్ మెట్లు ఎక్కి పరువు నష్టం కేసు వేయాలని ప్రభుత్వం జీవో నెంబర్ 16ను రిలీజ్ చేసింది.

Pawan Kalyan: పరువు నష్టం దావాతో జనసేనానికి మైలేజీ వస్తుందా! ఏపీలో హాట్ టాపిక్!

పవన్ కే మైలేజా...
వాలంటీర్ల పై పవన్ చేసినవి కేవలం రాజకీయ పరమయిన విమర్శలేనని, అయితే మహిళల అక్రమ రవాణా అంటూ చేసిన ఆరోపణల్ని మాత్రం సహించే ప్రసక్తి లేదని అంటున్నారు. మహిళల అక్రమ రవాణా అంటే ఆషా మాషీ వ్యవహరం కాదు. అలాంటిది రాజకీయ విమర్శల్లో భాగంగా పవన్ ఎలా నోరు పారేసుకుంటారంటూ ప్రభుత్వంతో పాటు పార్టీలోని సీనియర్ నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇప్పుడు పవన్ పై పరువు నష్టం కేసు దాఖలు చేయటంతో ప్రభుత్వానికన్నా పవన్ కే రాజకీయంగా మరింత మేలు కలుగుతుందన్న అభిప్రాయం సొంత పార్టీ నేతల్లోనే ఉంది. పరువు నష్టం కేసుపై పవన్ వ్యహహారాన్ని ప్రజల్లో మరింత చర్చకు దారితీస్తుందని చెబుతున్నారు.

మరోవైపున పరువునష్టం కేసు జీవో విడుదల వ్యవహరం సొంత పార్టీ నాయకుల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అసలు ప్రభుత్వ పెద్దలకు ఇలాంటి సలహా ఇచ్చిన వాడిని పట్టుకొని బాదాలంటూ ఒక మాజీ మంత్రి వ్యాఖ్యానించారు. రాజకీయంగా ప్రతిపక్ష పార్టికి మనమే అస్త్రం ఇచ్చినట్లు అయ్యిందని, ఆయన అభిప్రాయంగా చెబుతున్నారు.

మహిళ కోణంలో చూడాలి...
వాలంటీర్లు సేకరించే డేటా, వాలంటీర్లు ఒంటరి మహిళల సమాచారాన్ని సేకరించి వారిని ట్రాఫికింగ్ కు పాల్పడుతున్నారని పవన్ ప్రధాన ఆరోపణ. డేటా అంశం అటుంచితే, మహిళల ట్రాఫికింగ్ అనేది చాలా సీరియస్ వ్యహరం, అంతటి సీరియస్ కామెంట్స్ ను ఎందుకు లైట్ తీసుకోవాలన్న వాదన పార్టీతో పాటు ప్రభుత్వ వర్గాల నుంచి వస్తోంది. అంతే కాదు పరువు నష్టం కేసు వేయటంతో ప్రభుత్వం ఇలాంటి వ్యవహరాల, అసత్య ఆరోపణలపై ధీటుగా బదులిస్తుందనే సంకేతాలను కూడా పంపినట్లు ఉంటుందన్న అభిప్రాయం వెల్లడవుతోంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Amaravati YCP Strategy: పార్లమెంట్‌లో అమరావతిని వైసీపీ సమర్థిస్తుందా? వ్యతిరేకిస్తుందా?
పార్లమెంట్‌లో అమరావతిని వైసీపీ సమర్థిస్తుందా? వ్యతిరేకిస్తుందా?
AP Capital Amaravati: ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత.. రేపే పార్లమెంటులోకి కీలక బిల్లు.. సర్వత్రా ఉత్కంఠ
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత.. రేపే పార్లమెంటులోకి కీలక బిల్లు.. సర్వత్రా ఉత్కంఠ
Explosion at Challapalli Police Station: చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. నలుగురు పోలీసులకు తీవ్ర గాయాలు
చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. నలుగురు పోలీసులకు తీవ్ర గాయాలు
Hyderabad- Vijayawada Toll Charges: హైదరాబాద్‌- విజయవాడ హైవేపై తగ్గిన టోల్ టాక్స్.. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి
హైదరాబాద్‌- విజయవాడ హైవేపై తగ్గిన టోల్ టాక్స్.. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి

వీడియోలు

CSK Plays Without Dhoni in 17 Years IPL 2026 | ధోనీ, రైనా, జడేజా లేకుండా CSK మ్యాచ్ | ABP Desam
Jadeja Destroys CSK vs RR IPL 2026 | ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసిన జడేజా | ABP Desam
IPL 2026 RR VS CSK Highlights | చెన్నైపై రాజ‌స్థాన్ ఈజీ విక్ట‌రీ | ABP Desam
Vaibhav Suryavanshi RR vs CSK IPL 2026 | వైభవ్ కు సలహా ఇచ్చిన జైస్వాల్ | ABP Desam
Rohit Suggestions to Hardik IPL 2026 | హిట్ మ్యాన్ వ్యూహంతో ముంబై విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Vaidya Seva: ఏపీలో బుధవారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ బంద్ - ఆస్పత్రుల నిర్ణయం - బిల్లులు ఇవ్వలేదనే!
ఏపీలో బుధవారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ బంద్ - ఆస్పత్రుల నిర్ణయం - బిల్లులు ఇవ్వలేదనే!
BRS MLA Padi Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు.. వెనక్కి తగ్గేది లేదంటూనే ప్రభుత్వంపై ఆరోపణలు
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు.. వెనక్కి తగ్గేది లేదంటూనే ప్రభుత్వంపై ఆరోపణలు
AP handloom weavers: ఏపీలో చేనేతలకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ - అమల్లోకి ఉచిత విద్యుత్ పథకం
ఏపీలో చేనేతలకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ - అమల్లోకి ఉచిత విద్యుత్ పథకం
Bihar Stampede: ఆలయంలో తొక్కిసలాట, 8 మంది భక్తులు మృతి.. సీఎం నితీష్ కుమార్ దిగ్భ్రాంతి
ఆలయంలో తొక్కిసలాట, 8 మంది భక్తులు మృతి.. సీఎం నితీష్ కుమార్ దిగ్భ్రాంతి
Third Temple In Israel: ఇజ్రాయెల్‌లో మూడో టెంపుల్ గొడవేంటి..? మెస్సియా కోసం యూదుల ఎదురుచూపులు.. ఇరాన్‌తో యుద్ధంలో నెతన్యాహు మతం సెంటిమెంట్
ఇజ్రాయెల్‌లో మూడో టెంపుల్ గొడవేంటి..? మెస్సియా కోసం యూదుల ఎదురుచూపులు.. ఇరాన్‌తో యుద్ధంలో నెతన్యాహు మతం సెంటిమెంట్
Manisharma : హార్మోనియం దుమ్ము దులిపి మరీ ట్యూన్స్ - చెన్నై లవ్ స్టోరీ సాంగ్స్‌పై మణిశర్మ రియాక్షన్
హార్మోనియం దుమ్ము దులిపి మరీ ట్యూన్స్ - చెన్నై లవ్ స్టోరీ సాంగ్స్‌పై మణిశర్మ రియాక్షన్
Explosion at Challapalli Police Station: చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. నలుగురు పోలీసులకు తీవ్ర గాయాలు
చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. నలుగురు పోలీసులకు తీవ్ర గాయాలు
AP Capital Amaravati: ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత.. రేపే పార్లమెంటులోకి కీలక బిల్లు.. సర్వత్రా ఉత్కంఠ
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత.. రేపే పార్లమెంటులోకి కీలక బిల్లు.. సర్వత్రా ఉత్కంఠ
Embed widget