అన్వేషించండి

Pawan Kalyan: పరువు నష్టం దావాతో జనసేనానికి మైలేజీ వస్తుందా! ఏపీలో హాట్ టాపిక్!

Defamation Case Against Pawan Kalyan: పరువు నష్టం దావా వేయటం వలన పవన్ కళ్యాణ్ కు మైలేజీ వస్తుందా, రాజకీయంగా అధికార పక్షానికి ఇది ఎంత వరకు మేలు కలిగిస్తుందనే అంశం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.

Defamation Case Against Pawan Kalyan: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యవహరంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైందేనా... పరువు నష్టం దావా వేయటం వలన జనసేనానికి మైలేజీ వస్తుందా, రాజకీయంగా అధికార పక్షానికి ఇది ఎంత వరకు మేలు కలిగిస్తుందనే అంశం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.

వాలంటీర్లను కేంద్రంగా చేసుకొని పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ పై రాష్ట్ర ప్రభుత్వం ఆచి తూచి వ్యవహరించి, చివరకు పరువు నష్టం దావా వేసేందుకు రెడీ అయ్యింది. అయితే ఈ వ్యవహరంపై  ఇప్పుడు పార్టీ వర్గాల్లో చర్చ మెదలైంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన పవన్ కే మరింత మైలేజీ పెరుగుతుందని పార్టీలోని పలువురు సీనియర్ల వాదన. అయితే ఇక్కడే మరో వాదన కూడా  వినిపిస్తోంది. వాలంటీర్ల సేవలపై చర్చ జరగాలన్నా, మహిళల అంశాన్ని కీలకంగా  చేసుకొని అధికార పక్షం మరింతగా దూకుడుగా వెళ్లాలన్నా, ఇలాంటి పరిస్దితులు అవసరం అని చెబుతున్నారు. వాలంటీర్లు చేసే సేవా కార్యక్రమాలు వలన రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు కలుగుతుంది, ప్రతి ఇంటికి వెళ్లి వాలంటీర్ పలకరించి, కుశల ప్రశ్నలు వేసి, ప్రభుత్వానికి వారధిగా నిలబడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో వాలంటీర్ల పట్ల ప్రజల్లో సానుభూతి నెలకొంది. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ వాలంటీర్లు మహిళల అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని కామెంట్స్ చేయటం సంచలనం రేకెత్తించింది. అంతే కాదు కేంద్ర నిఘా వర్గాల నుండి తనకు సమాచారం ఉందని పవన్ చెప్పటంతో మరింత ఆజ్యం పోసినట్లు అయ్యింది.

పవన్ పై పరువు నష్టం కేసు..
జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్  చేసిన కామెంట్స్ పై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. వాలంటీర్లు ఈ వ్యవహరంపై రెండు రోజులు పాటు  వరుసగా నిరసనలు తెలిపారు. ఇంకా అనేక చోట్ల నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ వ్యవహరం పైనే ప్రభుత్వం లోతుగా అదికారిక వర్గాలతో చర్చించినట్లు సమాచారం. న్యాయ పరంగా ఉన్న అంశాలను లోతుగా పరిశీలించిన తరువాత, హైకోర్ట్ మెట్లు ఎక్కి పరువు నష్టం కేసు వేయాలని ప్రభుత్వం జీవో నెంబర్ 16ను రిలీజ్ చేసింది.

Pawan Kalyan: పరువు నష్టం దావాతో జనసేనానికి మైలేజీ వస్తుందా! ఏపీలో హాట్ టాపిక్!

పవన్ కే మైలేజా...
వాలంటీర్ల పై పవన్ చేసినవి కేవలం రాజకీయ పరమయిన విమర్శలేనని, అయితే మహిళల అక్రమ రవాణా అంటూ చేసిన ఆరోపణల్ని మాత్రం సహించే ప్రసక్తి లేదని అంటున్నారు. మహిళల అక్రమ రవాణా అంటే ఆషా మాషీ వ్యవహరం కాదు. అలాంటిది రాజకీయ విమర్శల్లో భాగంగా పవన్ ఎలా నోరు పారేసుకుంటారంటూ ప్రభుత్వంతో పాటు పార్టీలోని సీనియర్ నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇప్పుడు పవన్ పై పరువు నష్టం కేసు దాఖలు చేయటంతో ప్రభుత్వానికన్నా పవన్ కే రాజకీయంగా మరింత మేలు కలుగుతుందన్న అభిప్రాయం సొంత పార్టీ నేతల్లోనే ఉంది. పరువు నష్టం కేసుపై పవన్ వ్యహహారాన్ని ప్రజల్లో మరింత చర్చకు దారితీస్తుందని చెబుతున్నారు.

మరోవైపున పరువునష్టం కేసు జీవో విడుదల వ్యవహరం సొంత పార్టీ నాయకుల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అసలు ప్రభుత్వ పెద్దలకు ఇలాంటి సలహా ఇచ్చిన వాడిని పట్టుకొని బాదాలంటూ ఒక మాజీ మంత్రి వ్యాఖ్యానించారు. రాజకీయంగా ప్రతిపక్ష పార్టికి మనమే అస్త్రం ఇచ్చినట్లు అయ్యిందని, ఆయన అభిప్రాయంగా చెబుతున్నారు.

మహిళ కోణంలో చూడాలి...
వాలంటీర్లు సేకరించే డేటా, వాలంటీర్లు ఒంటరి మహిళల సమాచారాన్ని సేకరించి వారిని ట్రాఫికింగ్ కు పాల్పడుతున్నారని పవన్ ప్రధాన ఆరోపణ. డేటా అంశం అటుంచితే, మహిళల ట్రాఫికింగ్ అనేది చాలా సీరియస్ వ్యహరం, అంతటి సీరియస్ కామెంట్స్ ను ఎందుకు లైట్ తీసుకోవాలన్న వాదన పార్టీతో పాటు ప్రభుత్వ వర్గాల నుంచి వస్తోంది. అంతే కాదు పరువు నష్టం కేసు వేయటంతో ప్రభుత్వం ఇలాంటి వ్యవహరాల, అసత్య ఆరోపణలపై ధీటుగా బదులిస్తుందనే సంకేతాలను కూడా పంపినట్లు ఉంటుందన్న అభిప్రాయం వెల్లడవుతోంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Press Meet:
"నా గుండెల్లో తెలంగాణ ఉంది! మీ అయ్య జాగీరా అడ్డుకుంటామని బెదిరించడానికి?" పవన్ సంచలన కామెంట్స్
Pawan Kalyan Press Meet: పవన్ కల్యాణ్‌ ప్రెస్‌మీట్‌కు ముందే హైవోల్టేజ్ డ్రామా! జనసేనానిపై కాంగ్రెస్ చేస్తున్న ప్రచారమేంటీ? 
పవన్ కల్యాణ్‌ ప్రెస్‌మీట్‌కు ముందే హైవోల్టేజ్ డ్రామా! జనసేనానిపై కాంగ్రెస్ చేస్తున్న ప్రచారమేంటీ? 
India Monsoon Delay 2026:వాన కోసం ఎదురు చూడాల్సిందే! నైరుతి రుతుపవనాల రాక ఎప్పుడు? వాతావరణ శాఖ ఏమంటోంది? 
వాన కోసం ఎదురు చూడాల్సిందే! నైరుతి రుతుపవనాల రాక ఎప్పుడు? వాతావరణ శాఖ ఏమంటోంది? 
Nara Lokesh Slams Jagan: జనం ఛీకొట్టినా జగన్ డ్రామాలు మానడం లేదు- నంద్యాలలో YSR విగ్రహం ధ్వంసంపై నారా లోకేష్
జనం ఛీకొట్టినా జగన్ డ్రామాలు మానడం లేదు- నంద్యాలలో YSR విగ్రహం ధ్వంసంపై నారా లోకేష్

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Sports Quota Controversy: ఏపీ డీఎస్సీలో పేకాటలో నైపుణ్యం సాధించిన వారికి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలిచ్చారా? - ఇవిగో సంచలన నిజాలు
ఏపీ డీఎస్సీలో పేకాటలో నైపుణ్యం సాధించిన వారికి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలిచ్చారా? - ఇవిగో సంచలన నిజాలు
Annamalai Resigns BJP Tamil Nadu: బీజేపీకి సింగం అన్నామలై గుడ్‌బై! ఐదు పేజీల లేఖతో షాక్.. సొంత పార్టీతో ఉపఎన్నికల్లో పోటీ
బీజేపీకి సింగం అన్నామలై గుడ్‌బై! ఐదు పేజీల లేఖతో షాక్.. సొంత పార్టీతో ఉపఎన్నికల్లో పోటీ
Kanpur Petrol Pump Scam: ట్యాంక్ 45 లీటర్ల కెపాసిటీ అయితే 52 లీటర్ల పెట్రోల్ కొట్టేశారట - ఆ కార్ ఓనర్‌కు అడ్డంగా దొరికిపోయిన బంకు శీను
ట్యాంక్ 45 లీటర్ల కెపాసిటీ అయితే 52 లీటర్ల పెట్రోల్ కొట్టేశారట - ఆ కార్ ఓనర్‌కు అడ్డంగా దొరికిపోయిన బంకు శీను
Tamil Nadu Politics | రజనీ ఆశీస్సులతో అన్నామలై కొత్త పార్టీ?
రజనీ ఆశీస్సులతో అన్నామలై కొత్త పార్టీ?.. తమిళనాడులో రాజకీయ భూకంపానికి రంగం సిద్ధం!
Telangana Formation Day: నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్.. నిరుపేదలకు సొంతింటి కల సాకారంపై భరోసా
నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్.. నిరుపేదలకు సొంతింటి కల సాకారంపై భరోసా
Trisha Krishnan : రిలేషన్ షిప్ రూమర్స్ - పెంపుడు కుక్క ఫోటోకు క్యాప్షన్... త్రిష స్ట్రాంగ్ కౌంటర్
రిలేషన్ షిప్ రూమర్స్ - పెంపుడు కుక్క ఫోటోకు క్యాప్షన్... త్రిష స్ట్రాంగ్ కౌంటర్
Tim David Banned: ఆర్సీబీ స్టార్ బ్యాటర్ టిమ్ డేవిడ్‌కు బిగ్ షాక్.. జరిమానాతో పాటు ఓ మ్యాచ్ నిషేధం
ఆర్సీబీ స్టార్ బ్యాటర్ టిమ్ డేవిడ్‌కు బిగ్ షాక్.. జరిమానాతో పాటు ఓ మ్యాచ్ నిషేధం
TDP Rajya Sabha Members List History: టీడీపీకి కలసి రాని రాజ్యసభ సభ్యులు - ఎక్కువ మంది షాకిచ్చిన వాళ్లే - ఈ సారి ఈక్వేషన్స్ మారుస్తారా?
టీడీపీకి కలసి రాని రాజ్యసభ సభ్యులు - ఎక్కువ మంది షాకిచ్చిన వాళ్లే - ఈ సారి ఈక్వేషన్స్ మారుస్తారా?
Embed widget