అన్వేషించండి

Talliki Vandanam : "తల్లికి వందనం" స్కీమ్‌పై బిగ్ అప్‌డేట్- ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందీ అర్హులే

Nara Lokesh: తల్లికి వందనం స్కీమ్‌కు సంబంధించిన విధవిధానాలు రూపొందిస్తున్నట్టు మంత్రి నారాలోకేష్‌ మండలిలో వెల్లడించారు. సోషల్ మీడియా వస్తున్న ఆరోపణలు, ప్రతిపక్షాలు విమర్శలపై కూడా స్పందించారు.

Andhra Pradesh: ఏపీలో కూటమి ప్రభుత్వం ప్లాగ్‌షిప్‌ ప్రోగ్రామ్స్‌లో ఒకటైన తల్లికి వందనం పథకానికి సంబంధించిన కీలక అప్‌డేట్ ఇచ్చింది. దీనిపై శాసనమండలిలో ప్రకటన చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ కీలక విషయాలు వెల్లడించారు. 

తల్లికి వందనం పథకానికి సంబంధించిన విధివిధానాలను రూపొందిస్తున్నామని లోకేష్‌ ప్రకటించారు. తాము ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పథకం వర్తిస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఎక్కడ చదివినా పథకానికి అర్హులేనన్నారు. 

" తల్లికి వందనం పథకం ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇస్తామని ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి హామీ ఇచ్చింది. దానికి మేం కట్టుబడి ఉన్నాం. గైడ్‌లైన్స్ రూపొందించడానికి టైం కావాలని అడిగాం. నేను కూడా సీరియస్‌గా తీసుకుంటున్నాను. మంత్రులందరితో కూడా చర్చిస్తున్నాం. గతంలో జరిగిన లోటుపాట్లు జరగకూడదనేది మా లక్ష్యం. గతంలో మొదట్లో 15 వేలు అని తర్వాత సంవత్సరం నుంచి 14 వేలు అని అది చివరకు 13 వేలకు వచ్చింది. ఒక వెయ్యిరూపాయలు టీఎంఎఫ్ అన్నారు. ఇంకో వెయ్యిరూపాయలు ఎస్‌ఎంఎఫ్‌ అని అన్నారు. ఎలిజిబిలిటి క్రైటీరియా కూడా మార్చడం జరిగింది. గ్రామాల్లో నెలకు ఐదు వేల కంటే తక్కువ ఆదాయం వచ్చిన వాళ్లే అర్హులని చెప్పారు. తర్వాత దాన్ని మార్చారు. భూమి విషయంలో కొన్ని షరతులు పెట్టారు. తర్వాత దాన్ని కూడా మార్చారు. తర్వాత విద్యుత్ వినియోగంలో కూడా మార్పులు చేర్పులు చేశారు. "

"నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు చాలా మంది ఇదే విషయంపై ఫిర్యాదులు చేశారు. మేం అప్పు చేసి స్కార్పియో కొనుక్కొని అద్దెలకు తిప్పుకుంటే రేషన్ కార్డు తీసేశారని. దీని వల్ల ప్రభుత్వ పథకాలు కోల్పోతున్నామని చాలా మంది చెప్పారు. దీనిపై కూడా మేమే చర్చిస్తున్నాం. గ్రామ, వార్డు సచివాలయాలు మంత్రి స్వామి వద్ద ఉన్నాయి. ఆర్టీజీ నా దగ్గర ఉంది. మేం ఇద్దరం కూర్చొని డేటాను కూడా ప్యూరిఫైర్ చేయాలి. పకడ్బంధీగా అమలుచేయాలన్న లక్ష్యంతో ఉన్నాం. 
ఈ పథకం విషయంలో ఎవరికి ఎలాంటి సందేహలు అవసరం లేదు. ఎంతమంది ఉన్నా ఇవ్వాలన్నదే ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం. అది మేం సాధిస్తాం. ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు వర్తిస్తుంది" అని లోకేష్ శాసనమండలిలో వివరించారు. 

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల తగ్గుదల, సిలబస్‌తోపాటు నాడు నేడు అంశంపై కూడా విస్తృతంగా చర్చ జరగాల్సి ఉందన్నారు నారా లోకేష్‌. 2019 తో పోల్చుకుంటే 2024లో 72 వేల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గారని తెలిపారు. దీనిపై తాము కూడా చర్చిస్తున్నామని పేర్కొన్నారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని, గత ప్రభుత్వం వేర్వేరు సిలబస్‌లు అమలు చేశామని చెప్పిందని ఇన్ని చేస్తున్నప్పటికీ విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గుతుందో మాట్లాడుకోవాలన్నారు లోకేష్. ఇది ఒకరిద్దురు కూర్చొని తీసుకోవాల్సిన నిర్ణయం కాదని అన్ని సంఘలు, అన్ని వర్గాల ప్రజలు, సీనియర్లు, విద్యావేత్తలతో చర్చించి విద్యార్థులకు ఎలాంటి సిలబస్ అవసరం, ఎలాంటి విధానాలతో విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలకు రప్పించాలనే ఆలోచన చేస్తున్నామని వివరించారు. నాకు నచ్చిందని ఒకటి పెట్టడం నచ్చలేదని ఇంకొకటి తీసే పరిస్థితి రాకూడదన్నారు. ఇతర్రాష్ట్రాల్లో విద్యారంగంలో తీసుకుంటున్న చర్యలు కూడా గమనిస్తున్నట్టు లోకేష్ వెల్లడించారు. వచ్చే సంవత్సరం ఏం చేయబోతున్నామో చర్చించి నిర్ణయం తీసుకుందామన్నారు. చర్చించి నిర్ణయం తీసుకొని వచ్చే ఏడాది నుంచే వాటిని అమలు చేద్దామన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: టాటాగ్రూప్‌లో కీలక పరిణామం- ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌ రాజీనామా 
టాటాగ్రూప్‌లో కీలక పరిణామం- ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌ రాజీనామా 
AP NDA Alliance: వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
Chemical Signaling: మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
Microsoft Alert: హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Embed widget