అన్వేషించండి

Cyclone Montha: మొంథా తుఫాన్ వల్ల ఏపీలో నష్టం ఎన్ని వేల కోట్లో తెలుసా.. రూ.901 కోట్ల త‌క్ష‌ణ సాయం కోరిన సర్కార్

6384 కోట్ల న‌ష్టం వాటిల్లిందని , రూ.901 కోట్ల త‌క్ష‌ణ సాయం చేయాలని కేంద్ర బృందాన్ని ఏపీ ప్ర‌భుత్వం కోరంది. మొంథా తుపాను న‌ష్టంపై ఆర్టీజీఎస్‌లో ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు.

మొంథా తుపాను రాష్ట్రంలో అంచ‌నాల‌కు మించి అపార న‌ష్టం క‌లిగించింద‌ని, కేంద్ర ప్ర‌భుత్వం ఉదార‌త చూపి ఆదుకోవాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం కేంద్ర బృందాన్ని కోరింది. మొంథా తుపాను వ‌ల్ల రూ.6384 కోట్ల న‌ష్టం వాటిల్లిందని, రూ.901.4 కోట్లు త‌క్ష‌ణ సాయం చేసి ఆద‌కోవాల‌ని కేంద్రానికి విజ్ఞ‌ప్తి చేసింది. మొంథా తుపాన్ వ‌ల్ల వాటిల్లిన  న‌ష్టం మ‌దింపు వేయ‌డానికి కేంద్ర బృందం రాష్ట్రానికి వ‌చ్చింది.

కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్ర‌ట‌రీ పాసుమీబ‌సు, కేంద్ర వ్య‌వ‌సాయ‌, రైతుల సంక్షేమ శాఖ సంచాల‌కులు డాక్ట‌ర్ కె. పొన్నుస్వామీల నేతృత్వంలోని 8 మంది స‌భ్యుల‌తో కూడిన  కేంద్ర బృందం  సోమ‌వారం ముందుగా అమ‌రావ‌తిలోని స‌చివాల‌యానికి వ‌చ్చింది. ఈ బృందానికి  స‌చివాల‌యంలోని ఆర్టీజీఎస్ లో అధికారులు స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం  మొంథా తుపాను క‌లిగించిన న‌ష్టం గురించి  రెవెన్యూ శాఖ చీఫ్ క‌మిష‌న‌ర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేష‌న్ స్పెష‌ల్ చీఫ్ సెక్ర‌ట‌రీ జి.జ‌య‌ల‌క్ష్మీ , ఆర్టీజీఎస్ సీఈఓ ప్ర‌ఖ‌ర్ జైన్‌లు ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జంటేష‌న్ ద్వారా వివ‌రించారు. మొంథా తుపాన్ రాష్ట్రంలోని 24 జిల్లాల్లో విధ్వంసం సృష్టించింద‌ని తెలిపారు.  అంచ‌నాల‌కు మించిన అపార న‌ష్టం క‌లిగించింద‌ని జ‌య‌ల‌క్ష్మీ చెప్పారు. వ్య‌వ‌సాయ‌రంగానికి మొంథా తుపాను తీవ్ర న‌ష్టం క‌లిగించింద‌న్నారు.

కోత ద‌శ‌కు వ‌చ్చిన పంట‌ల‌ను తుపాను ముంచెత్తింద‌ని దానివ‌ల్ల రైతుల‌కు జీవ‌నాధార‌మైన పంట‌లు నీట మునిగిపోయి కోలుకోలేని దెబ్బ‌తీసింద‌న్నారు. 1.61 ల‌క్ష‌ల ఎక‌రాల్లో వ‌రి, ప‌త్తి, మినుము, మొక్క‌జొన్న  పంట‌లు దెబ్బ‌తిన్న‌ట్లు చెప్పారు. అలాగే  6,250 హెక్టార్ల‌లో ఉద్యాన‌వ‌న పంట‌లు , 17.72 హెక్టార్ల‌లో మ‌ల్బ‌రీ తోట‌లకూ న‌ష్టం వాటిల్లింద‌ని తెలిపారు. ఈ తుపాన్ కార‌ణంగా మ‌త్స్య‌కారులు కూడా బాగా దెబ్బ‌తిన్నార‌న్నారు. 3063 హెక్టార్ల‌లో చేప‌ల చెరువులు ధ్వంస‌మ‌య్యాయ‌ని వివ‌రించారు. తుపాను కార‌ణంగా 4,566 ఇళ్లు దెబ్బ‌తిన్నాయ‌ని, 1853 పాఠ‌శాల‌ల‌కు కూడా న‌ష్టం వాటిల్లింద‌ని వెల్ల‌డించారు.

ఆర్ అండ్ బీ శాఖ‌కు సంబంధించి 4,794 కిలోమీట‌ర్ల రోడ్లు, 311 వంతెన‌లు, క‌ల్వ‌ర్టు దెబ్బ‌తిన్న‌యాన్నారు. జ‌ల‌వ‌న‌రుల శాఖ‌కు సంబంధించి 3437 మైన‌ర్ ఇరిగేష‌న్ ప‌నులు, 2417 మేజ‌ర్ మ‌రియు మీడియం ఇరిగేష‌న్ ప్రాజెక్టులకు న‌ష్టం వాటిల్లింద‌న్నారు. ఈ వ‌ర్షాల వ‌ల్ల 58 అర్బ‌న్ లోక‌ల్ బాడీస్‌కు కూడా న‌ష్టం వాటిల్లింద‌ని చెప్పారు. ఈ విప‌త్తు క‌లిగించిన విధ్వంసం నుంచి బాధితులు కోలుకోవ‌డానికి కేంద్ర ఉదారంగా వ్య‌వ‌హ‌రించాల‌ని కోరారు. తుపానుకు స‌ర్వం కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న బాధితులు మ‌ళ్లీ కోలుకోవ‌డానికి కేంద్రం అందించే స‌హాయం, స‌హ‌కారం ఎంతో కీల‌క‌మ‌ని అన్నారు. 

*680 డ్రోన్లు ఉప‌యోగించాం*

రాష్ట్ర ప్ర‌భుత్వం తుపాను ఎదుర్కోవ‌డానికి ఎంతో ముంద‌స్తు ప్ర‌ణాళిక‌తో వ్య‌వ‌హ‌రించ‌డం వ‌ల్ల పెద్ద‌గా ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌కుండా నివారించ‌గ‌లిగామ‌ని అధికారులు వివ‌రించారు. స‌హాయ‌క కార్య‌క్ర‌మాలు కూడా యుద్ధ‌ప్రాతిప‌దిక‌న చేప‌ట్టామ‌ని తెలిపారు. బుడ‌మేరు వ‌ర‌ద‌ల అనుభ‌వంతో ఈ సారి వ‌ర‌ద స‌హాయ‌క చ‌ర్య‌ల కోసం 680 డ్రోన్లు ఉప‌యోగించామ‌ని చెప్పారు. అక్టోబ‌రు 27-29 వ తేదీల మ‌ధ్య 82.3 మిల్లీ మీట‌ర్ల వ‌ర్ష‌పాతం న‌మోదైంద‌ని ఇది సాధార‌ణ వ‌ర్ష‌పాతం కంటే 9 రెట్టు ఎక్కువ‌న్నారు. 443 మండ‌లాల్లో ఈ తుపాన్ ప్ర‌భావం చూపించింద‌ని, ఈ విప‌త్తు కార‌ణంగా 3 మృతి చెందార‌ని, 9,960 ఇళ్లు నీట మునిగాయ‌ని, 1,11,402 మంది నిరాశ్ర‌యుల‌య్యార‌ని తెలిపారు. తుపాను స‌హాయ‌క చ‌ర్య‌ల్లో 12 ఎన్డీఆర్ ఎఫ్‌, 13 ఎస్డీఆర్ ఎఫ్ బృందాల‌ను, 1,702 వాహ‌నాల‌ను, 110 మంది ఈత‌గాళ్ల‌ను వినియోగించామ‌ని వెల్ల‌డించారు. 22 జిల్లాల్లో 2,471 పున‌రావాస కేంద్రాల‌ను ఏర్పాటు చేసి1,92,441 మందికి పున‌రావాసం క‌ల్పించామ‌న్నారు. అయితే రాష్ట్రం అడిగిన సాయం ఫై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TDP MP Putta Mahesh Kumar: డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబు చిత్తశుద్ధిపై షర్మిల ప్రశ్నలు
డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబుకు షర్మిల సూటి ప్రశ్న
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
IntrCity SmartBus: భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
TDP MP Putta Mahesh Kumar: డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబు చిత్తశుద్ధిపై షర్మిల ప్రశ్నలు
డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబుకు షర్మిల సూటి ప్రశ్న
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Embed widget