అన్వేషించండి

Cyclone Montha: మొంథా తుఫాన్ వల్ల ఏపీలో నష్టం ఎన్ని వేల కోట్లో తెలుసా.. రూ.901 కోట్ల త‌క్ష‌ణ సాయం కోరిన సర్కార్

6384 కోట్ల న‌ష్టం వాటిల్లిందని , రూ.901 కోట్ల త‌క్ష‌ణ సాయం చేయాలని కేంద్ర బృందాన్ని ఏపీ ప్ర‌భుత్వం కోరంది. మొంథా తుపాను న‌ష్టంపై ఆర్టీజీఎస్‌లో ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు.

మొంథా తుపాను రాష్ట్రంలో అంచ‌నాల‌కు మించి అపార న‌ష్టం క‌లిగించింద‌ని, కేంద్ర ప్ర‌భుత్వం ఉదార‌త చూపి ఆదుకోవాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం కేంద్ర బృందాన్ని కోరింది. మొంథా తుపాను వ‌ల్ల రూ.6384 కోట్ల న‌ష్టం వాటిల్లిందని, రూ.901.4 కోట్లు త‌క్ష‌ణ సాయం చేసి ఆద‌కోవాల‌ని కేంద్రానికి విజ్ఞ‌ప్తి చేసింది. మొంథా తుపాన్ వ‌ల్ల వాటిల్లిన  న‌ష్టం మ‌దింపు వేయ‌డానికి కేంద్ర బృందం రాష్ట్రానికి వ‌చ్చింది.

కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్ర‌ట‌రీ పాసుమీబ‌సు, కేంద్ర వ్య‌వ‌సాయ‌, రైతుల సంక్షేమ శాఖ సంచాల‌కులు డాక్ట‌ర్ కె. పొన్నుస్వామీల నేతృత్వంలోని 8 మంది స‌భ్యుల‌తో కూడిన  కేంద్ర బృందం  సోమ‌వారం ముందుగా అమ‌రావ‌తిలోని స‌చివాల‌యానికి వ‌చ్చింది. ఈ బృందానికి  స‌చివాల‌యంలోని ఆర్టీజీఎస్ లో అధికారులు స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం  మొంథా తుపాను క‌లిగించిన న‌ష్టం గురించి  రెవెన్యూ శాఖ చీఫ్ క‌మిష‌న‌ర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేష‌న్ స్పెష‌ల్ చీఫ్ సెక్ర‌ట‌రీ జి.జ‌య‌ల‌క్ష్మీ , ఆర్టీజీఎస్ సీఈఓ ప్ర‌ఖ‌ర్ జైన్‌లు ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జంటేష‌న్ ద్వారా వివ‌రించారు. మొంథా తుపాన్ రాష్ట్రంలోని 24 జిల్లాల్లో విధ్వంసం సృష్టించింద‌ని తెలిపారు.  అంచ‌నాల‌కు మించిన అపార న‌ష్టం క‌లిగించింద‌ని జ‌య‌ల‌క్ష్మీ చెప్పారు. వ్య‌వ‌సాయ‌రంగానికి మొంథా తుపాను తీవ్ర న‌ష్టం క‌లిగించింద‌న్నారు.

కోత ద‌శ‌కు వ‌చ్చిన పంట‌ల‌ను తుపాను ముంచెత్తింద‌ని దానివ‌ల్ల రైతుల‌కు జీవ‌నాధార‌మైన పంట‌లు నీట మునిగిపోయి కోలుకోలేని దెబ్బ‌తీసింద‌న్నారు. 1.61 ల‌క్ష‌ల ఎక‌రాల్లో వ‌రి, ప‌త్తి, మినుము, మొక్క‌జొన్న  పంట‌లు దెబ్బ‌తిన్న‌ట్లు చెప్పారు. అలాగే  6,250 హెక్టార్ల‌లో ఉద్యాన‌వ‌న పంట‌లు , 17.72 హెక్టార్ల‌లో మ‌ల్బ‌రీ తోట‌లకూ న‌ష్టం వాటిల్లింద‌ని తెలిపారు. ఈ తుపాన్ కార‌ణంగా మ‌త్స్య‌కారులు కూడా బాగా దెబ్బ‌తిన్నార‌న్నారు. 3063 హెక్టార్ల‌లో చేప‌ల చెరువులు ధ్వంస‌మ‌య్యాయ‌ని వివ‌రించారు. తుపాను కార‌ణంగా 4,566 ఇళ్లు దెబ్బ‌తిన్నాయ‌ని, 1853 పాఠ‌శాల‌ల‌కు కూడా న‌ష్టం వాటిల్లింద‌ని వెల్ల‌డించారు.

ఆర్ అండ్ బీ శాఖ‌కు సంబంధించి 4,794 కిలోమీట‌ర్ల రోడ్లు, 311 వంతెన‌లు, క‌ల్వ‌ర్టు దెబ్బ‌తిన్న‌యాన్నారు. జ‌ల‌వ‌న‌రుల శాఖ‌కు సంబంధించి 3437 మైన‌ర్ ఇరిగేష‌న్ ప‌నులు, 2417 మేజ‌ర్ మ‌రియు మీడియం ఇరిగేష‌న్ ప్రాజెక్టులకు న‌ష్టం వాటిల్లింద‌న్నారు. ఈ వ‌ర్షాల వ‌ల్ల 58 అర్బ‌న్ లోక‌ల్ బాడీస్‌కు కూడా న‌ష్టం వాటిల్లింద‌ని చెప్పారు. ఈ విప‌త్తు క‌లిగించిన విధ్వంసం నుంచి బాధితులు కోలుకోవ‌డానికి కేంద్ర ఉదారంగా వ్య‌వ‌హ‌రించాల‌ని కోరారు. తుపానుకు స‌ర్వం కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న బాధితులు మ‌ళ్లీ కోలుకోవ‌డానికి కేంద్రం అందించే స‌హాయం, స‌హ‌కారం ఎంతో కీల‌క‌మ‌ని అన్నారు. 

*680 డ్రోన్లు ఉప‌యోగించాం*

రాష్ట్ర ప్ర‌భుత్వం తుపాను ఎదుర్కోవ‌డానికి ఎంతో ముంద‌స్తు ప్ర‌ణాళిక‌తో వ్య‌వ‌హ‌రించ‌డం వ‌ల్ల పెద్ద‌గా ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌కుండా నివారించ‌గ‌లిగామ‌ని అధికారులు వివ‌రించారు. స‌హాయ‌క కార్య‌క్ర‌మాలు కూడా యుద్ధ‌ప్రాతిప‌దిక‌న చేప‌ట్టామ‌ని తెలిపారు. బుడ‌మేరు వ‌ర‌ద‌ల అనుభ‌వంతో ఈ సారి వ‌ర‌ద స‌హాయ‌క చ‌ర్య‌ల కోసం 680 డ్రోన్లు ఉప‌యోగించామ‌ని చెప్పారు. అక్టోబ‌రు 27-29 వ తేదీల మ‌ధ్య 82.3 మిల్లీ మీట‌ర్ల వ‌ర్ష‌పాతం న‌మోదైంద‌ని ఇది సాధార‌ణ వ‌ర్ష‌పాతం కంటే 9 రెట్టు ఎక్కువ‌న్నారు. 443 మండ‌లాల్లో ఈ తుపాన్ ప్ర‌భావం చూపించింద‌ని, ఈ విప‌త్తు కార‌ణంగా 3 మృతి చెందార‌ని, 9,960 ఇళ్లు నీట మునిగాయ‌ని, 1,11,402 మంది నిరాశ్ర‌యుల‌య్యార‌ని తెలిపారు. తుపాను స‌హాయ‌క చ‌ర్య‌ల్లో 12 ఎన్డీఆర్ ఎఫ్‌, 13 ఎస్డీఆర్ ఎఫ్ బృందాల‌ను, 1,702 వాహ‌నాల‌ను, 110 మంది ఈత‌గాళ్ల‌ను వినియోగించామ‌ని వెల్ల‌డించారు. 22 జిల్లాల్లో 2,471 పున‌రావాస కేంద్రాల‌ను ఏర్పాటు చేసి1,92,441 మందికి పున‌రావాసం క‌ల్పించామ‌న్నారు. అయితే రాష్ట్రం అడిగిన సాయం ఫై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kurnool Bus Tragedy: ఎమర్జెన్సీ డోర్ మూసేయడంతో 19 ప్రాణాలు పోయాయి. కర్నూలు బస్సు ప్రమాదంపై ASCI నివేదిక
ఎమర్జెన్సీ డోర్ మూసేయడంతో 19 ప్రాణాలు పోయాయి. కర్నూలు బస్సు ప్రమాదంపై ASCI నివేదిక
Amaravati Gazette: అమరావతి గెజిట్‌తోనే అన్నీ అయిపోవు - ప్రభుత్వం మూడేళ్లలో చేయాల్సింది చాలా ఉంది - లేకపోతే?
అమరావతి గెజిట్‌తోనే అన్నీ అయిపోవు - ప్రభుత్వం మూడేళ్లలో చేయాల్సింది చాలా ఉంది - లేకపోతే?
AP Weather Update: ఏపీ వెదర్ అలర్ట్.. మరో 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు! కొన్నిచోట్ల వడగాల్పులు
ఏపీ వెదర్ అలర్ట్.. మరో 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు! కొన్నిచోట్ల వడగాల్పులు
True Love: మచిలీపట్నంలో ఆదర్శ వివాహం.. ప్రేమికుడ్ని పెళ్లాడి నిజమైన ప్రేమకు అర్థం చెప్పిన యువతి
మచిలీపట్నంలో ఆదర్శ వివాహం.. ప్రేమికుడ్ని పెళ్లాడి నిజమైన ప్రేమకు అర్థం చెప్పిన యువతి

వీడియోలు

Delhi Capitals Mitchell Starc IPL 2026 | మరికొన్ని మ్యాచ్‌లకు స్టార్క్ దూరం | ABP Desam
Vaibhav Suryavamshi MI vs RR IPL 2026 | బుమ్రా బౌలింగ్ లో వైభవ్ మెరుపులు | ABP Desam
IPL 2026 Shubman Gill Back in Nets | గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఎంట్రీ | ABP Desam
IPL 2026 RR VS MI Result | రాజ‌స్థాన్ రాయ‌ల్స్ హ్యాట్రిక్ విజయం | ABP Desam
Bumrah vs Vaibhav Suryavanshi IPL 2026 | బుమ్రా యార్కర్ల ముందు వైభవ్ నిలబడగలడా?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
West Asia War Effect on Mango Exports: పశ్చిమాసియా యుద్దంతో మామిడి ఎగుమతిదారులకు కష్టం!కంటైనర్ల కొరతతో భారీగా పెరిగిన రవాణా ఛార్జీలు!
పశ్చిమాసియా యుద్దంతో మామిడి ఎగుమతిదారులకు కష్టం!కంటైనర్ల కొరతతో భారీగా పెరిగిన రవాణా ఛార్జీలు!
Constable Revathi: కానిస్టేబుల్ రేవతి సాహసంతోనే సాతంకుళం తీర్పు! ఎన్ని బెదిరింపులు వచ్చినా వెనక్కి తగ్గని పోలీసు కథ!
కానిస్టేబుల్ రేవతి సాహసంతోనే సాతంకుళం తీర్పు! ఎన్ని బెదిరింపులు వచ్చినా వెనక్కి తగ్గని పోలీసు కథ!
Kurnool Bus Tragedy: ఎమర్జెన్సీ డోర్ మూసేయడంతో 19 ప్రాణాలు పోయాయి. కర్నూలు బస్సు ప్రమాదంపై ASCI నివేదిక
ఎమర్జెన్సీ డోర్ మూసేయడంతో 19 ప్రాణాలు పోయాయి. కర్నూలు బస్సు ప్రమాదంపై ASCI నివేదిక
Share Market: ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటనతో స్టాక్ మార్కెట్లో వైల్డ్ ఫైర్.. సెన్సెక్స్ 2800, నిఫ్టీ 800 పాయింట్లు జంప్
ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటనతో స్టాక్ మార్కెట్లో వైల్డ్ ఫైర్.. సెన్సెక్స్ 2800, నిఫ్టీ 800 పాయింట్లు జంప్
Amaravati Gazette: అమరావతి గెజిట్‌తోనే అన్నీ అయిపోవు - ప్రభుత్వం మూడేళ్లలో చేయాల్సింది చాలా ఉంది - లేకపోతే?
అమరావతి గెజిట్‌తోనే అన్నీ అయిపోవు - ప్రభుత్వం మూడేళ్లలో చేయాల్సింది చాలా ఉంది - లేకపోతే?
Naga Vamsi : మాకు క్లాసులు పీకావ్... ప్రొడ్యూసర్ కష్టాలు తెలిశాయా! - సుప్రియపై నాగవంశీ, మైత్రీ రవి ఫన్ ర్యాగింగ్
మాకు క్లాసులు పీకావ్... ప్రొడ్యూసర్ కష్టాలు తెలిశాయా! - సుప్రియపై నాగవంశీ, మైత్రీ రవి ఫన్ ర్యాగింగ్
Congress guarantees: కారణాలు కాదు హామీల అమలు కావాలి - మాటల చాణక్యంతో ఆర్థిక నిస్సహాయతను రేవంత్ అధిగమిస్తారా?
కారణాలు కాదు హామీల అమలు కావాలి - మాటల చాణక్యంతో ఆర్థిక నిస్సహాయతను రేవంత్ అధిగమిస్తారా?
Toll Tax New Rule: టోల్ ప్లాజాల వద్ద కేవలం క్యాష్‌లెస్ పేమెంట్స్.. ఏప్రిల్ 10 నుంచి FASTAG, UPI ద్వారా చెల్లింపులు
టోల్ ప్లాజాల వద్ద కేవలం క్యాష్‌లెస్ పేమెంట్స్.. ఏప్రిల్ 10 నుంచి FASTAG, UPI ద్వారా చెల్లింపులు
Embed widget