By: Harish | Updated at : 13 Apr 2023 07:26 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
సీఎం జగన్ సమీక్ష
CM Jagan Review : గృహ నిర్మాణశాఖపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో హౌసింగ్ పై పెట్టిన ఖర్చుకు సంబంధించిన వివరాలను అధికారులు జగన్ కు నివేదిక అందించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో చేయనున్న ఖర్చు వివరాలను కూడా అధికారులు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ముందు ఉంచారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో హౌసింగ్ కోసం రూ.10,203 కోట్లు ఖర్చు చేశామని, అంటే రోజుకు రూ.28 కోట్లు చొప్పున ఖర్చు చేయగా, 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.15,810 కోట్లు ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు. రోజుకు రూ.43 కోట్ల చొప్పున ఖర్చు చేయాలని నిర్ణయించారు. గృహ నిర్మాణశాఖపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ఖర్చు కొన్ని చిన్న రాష్ట్రాల బడ్జెట్ కన్నా అధికమని అధికారులు జగన్ కు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో కూడా ఇంత బడ్జెట్ లేదని వివరించిన అధికారులు, పేదలందరికీ ఇళ్లు పథకానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు ఇది నిదర్శనమని అధికారులు పేర్కొన్నారు.
పూర్తి అయిన ఇళ్లు ఎన్నంటే?
రాష్ట్రంలో గృహ నిర్మాణాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవటంతో ఇప్పటి వరకూ 3,40,741 ఇళ్లు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. శ్లాబ్ పూర్తి చేసుకున్నవి, శ్లాబుకు సిద్ధం చేసిన ఇళ్ల సంఖ్య 4,67,551 అధికారులు ముఖ్యమంత్రి జగన్ కు వివరించారు. ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యత పాటించేలా అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని అధికారులు పేర్కొన్నారు. నిర్మాణాల్లో ఉపయోగించే రాయి, సిమెంటు, స్టీలు.. తదితర సామగ్రి పై పరీక్షలు నిర్వహిస్తున్నామని ఇప్పటి వరకు మొత్తంగా 4529 పరీక్షలు చేశామని, 2 శాతం మేర లోపాలు కనిపిస్తే వెంటనే తగిన చర్యలు తీసుకున్నామని వివరించారు.
జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలపై సీఎం సమీక్ష
కరెంటు, తాగునీరు సహా మౌలిక సదుపాయాలను గురించి ముఖ్యమంత్రి జగన్ ఆరా తీశారు. జగనన్న కాలనీల్లో డ్రైనేజీ వ్యవస్థపై దృష్టిపెట్టాలన్న సీఎం, భవిష్యత్తులో వాననీటిని భూమిలోకి ఇంకించేలా ప్రత్యేక వ్యవస్థను కూడా ప్రతి ఇంటికి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
టిడ్కో ఇళ్లపై అసత్య ప్రచారాలు
టిడ్కో ఇళ్ల మీద జరుగుతున్న అసత్య ప్రచారం, విష ప్రచారాల వ్యవహరంపై ముఖ్యమంత్రి అధికారులు వద్ద ప్రస్తావించారు. ఎప్పటికప్పుడు అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలన్నారు. తమ ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని టీడీపీ పూర్తిగా పక్కన పెట్టిందని, టీడీపీ ఒక్క లబ్ధిదారునికి కూడా ఇళ్లు ఇవ్వలేకపోయిందన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో వాటిని పూర్తి చేస్తూ... మంచి మౌలిక సదుపాయాలుతో లబ్ధిదారులకు అప్పగిస్తున్నామని, టిడ్కో ఇళ్ల రూపంలో లబ్ధిదారులకు రూ.21 వేల కోట్ల విలువైన లబ్ధి చేకూర్చామన్న జగన్, ఈ వాస్తవాలను ప్రజలముందు ఉంచాలని అధికారులకు సూచించారు. టిడ్కో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలోనూ, ప్రస్తుత ప్రభుత్వంలో జరిగిన పనులు వివరాలను సీఎంకు తెలిపిన అధికారులు, గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఖర్చులు, నేడు చేస్తున్న ఖర్చులను కూడా ప్రస్తావించారు.
4 Years Of YSRCP: వైఎస్ జగన్ పాలనకు నాలుగేళ్లు పూర్తి- భారీగా బైక్ ర్యాలీలు, కార్యక్రమాలకు నేతలు శ్రీకారం
Bonda Uma: టీడీపీ సంక్షేమ మేనిఫెస్టోతో తాడేపల్లి పునాదులు కదులుతున్నాయి- బొండా ఉమా
Anakapalli Lovers: లాడ్జిలో రూం తీసుకొని లవర్స్ ఆత్మహత్యాయత్నం, యువతి మృతి, కొనఊపిరితో యువకుడు!
Guntur News: రెండేళ్ల కన్నకూతుర్ని బడకేసి కొట్టిన తండ్రి! స్పాట్లోనే చిన్నారి మృతి
CPI Narayana : సీఎం జగన్కు పదవిలో ఉండే అర్హత లేదు - రాజీనామా చేయాలన్న సీపీఐ నారాయణ !
Mahendra Singh Dhoni Retirement: రిటైర్మెంట్ ప్రకటించడానికి బెస్ట్ టైం ఇదే... కానీ - మహేంద్ర సింగ్ ధోని ఏమన్నాడంటే?
Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు
'యూత్ ను ఎంకరేజ్ చేయాలే, ధమ్ ధమ్ చేయొద్దు' - జక్కన్న ట్వీట్ వైరల్!
లవ్ బూత్లో మెహ్రీన్ - హలో హనీ హార్ట్ మిస్సాయే అంటున్న ఫ్యాన్స్!