అన్వేషించండి

CM Jagan : గృహ నిర్మాణాలపై రోజుకు రూ.43 కోట్ల ఖర్చు, సీఎం జగన్ కీలక నిర్ణయం

గృహ నిర్మాణాలపై రోజుకు 43 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో కేవలం 28 కోట్ల రూపాయల వరకు మాత్రమే ఉన్న ఖర్చును వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి భారీగా పెంచినట్లుగా అధికారులు ప్రకటించారు.

CM Jagan Review : గృహ నిర్మాణశాఖపై  తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో హౌసింగ్‌ పై పెట్టిన ఖర్చుకు సంబంధించిన వివరాలను అధికారులు జగన్ కు నివేదిక అందించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో చేయనున్న ఖర్చు వివరాలను కూడా అధికారులు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ముందు ఉంచారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో హౌసింగ్ కోసం రూ.10,203 కోట్లు ఖర్చు చేశామని, అంటే రోజుకు రూ.28 కోట్లు చొప్పున ఖర్చు చేయగా, 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.15,810 కోట్లు ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు. రోజుకు రూ.43 కోట్ల చొప్పున ఖర్చు చేయాలని నిర్ణయించారు. గృహ నిర్మాణశాఖపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ఖర్చు కొన్ని చిన్న రాష్ట్రాల బడ్జెట్ కన్నా అధికమని అధికారులు జగన్ కు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో కూడా ఇంత బడ్జెట్‌ లేదని వివరించిన అధికారులు, పేదలందరికీ ఇళ్లు పథకానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు ఇది నిదర్శనమని అధికారులు పేర్కొన్నారు.

పూర్తి అయిన ఇళ్లు ఎన్నంటే?  

రాష్ట్రంలో గృహ నిర్మాణాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవటంతో ఇప్పటి వరకూ 3,40,741 ఇళ్లు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. శ్లాబ్‌ పూర్తి చేసుకున్నవి, శ్లాబుకు సిద్ధం చేసిన ఇళ్ల సంఖ్య 4,67,551  అధికారులు ముఖ్యమంత్రి జగన్ కు వివరించారు. ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యత పాటించేలా అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని అధికారులు పేర్కొన్నారు. నిర్మాణాల్లో ఉపయోగించే రాయి, సిమెంటు, స్టీలు.. తదితర సామగ్రి పై పరీక్షలు నిర్వహిస్తున్నామని ఇప్పటి వరకు మొత్తంగా 4529 పరీక్షలు చేశామని,  2 శాతం మేర లోపాలు కనిపిస్తే వెంటనే తగిన చర్యలు తీసుకున్నామని వివరించారు.

జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలపై సీఎం సమీక్ష

కరెంటు, తాగునీరు సహా మౌలిక సదుపాయాలను గురించి ముఖ్యమంత్రి జగన్ ఆరా తీశారు. జగనన్న కాలనీల్లో డ్రైనేజీ వ్యవస్థపై దృష్టిపెట్టాలన్న సీఎం, భవిష్యత్తులో వాననీటిని భూమిలోకి ఇంకించేలా ప్రత్యేక వ్యవస్థను కూడా ప్రతి ఇంటికి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

టిడ్కో ఇళ్లపై అసత్య ప్రచారాలు 

టిడ్కో ఇళ్ల మీద జరుగుతున్న అసత్య ప్రచారం, విష ప్రచారాల వ్యవహరంపై ముఖ్యమంత్రి అధికారులు వద్ద ప్రస్తావించారు. ఎప్పటికప్పుడు అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలన్నారు. తమ ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని టీడీపీ పూర్తిగా పక్కన పెట్టిందని, టీడీపీ ఒక్క లబ్ధిదారునికి కూడా ఇళ్లు ఇవ్వలేకపోయిందన్నారు. వైఎస్ఆర్సీపీ  ప్రభుత్వ హయాంలో వాటిని పూర్తి చేస్తూ... మంచి మౌలిక సదుపాయాలుతో లబ్ధిదారులకు అప్పగిస్తున్నామని, టిడ్కో ఇళ్ల రూపంలో లబ్ధిదారులకు రూ.21 వేల కోట్ల విలువైన లబ్ధి చేకూర్చామన్న జగన్, ఈ వాస్తవాలను ప్రజలముందు ఉంచాలని అధికారులకు సూచించారు. టిడ్కో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలోనూ, ప్రస్తుత ప్రభుత్వంలో జరిగిన పనులు వివరాలను సీఎంకు తెలిపిన అధికారులు, గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఖర్చులు, నేడు చేస్తున్న ఖర్చులను కూడా ప్రస్తావించారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024:  బట్లర్‌ వీరోచిత శతకం , చివరి బంతికి  రాజస్థాన్‌  గెలుపు
బట్లర్‌ వీరోచిత శతకం , చివరి బంతికి రాజస్థాన్‌ గెలుపు
ABP CVoter Opinion poll Telangana  : లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్  పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్ పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
Raja Singh: శ్రీరామనవమి శోభాయాత్రకి పర్మిషన్ క్యాన్సిల్, కచ్చితంగా చేసి తీరతానన్న రాజా సింగ్
శ్రీరామనవమి శోభాయాత్రకి పర్మిషన్ క్యాన్సిల్, కచ్చితంగా చేసి తీరతానన్న రాజా సింగ్
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌‌ ఇంటికెళ్లిన మహారాష్ట్ర సీఎం - ఎవరినీ వదిలిపెట్టేదేలే అంటూ వార్నింగ్
సల్మాన్‌ ఖాన్‌‌ ఇంటికెళ్లిన మహారాష్ట్ర సీఎం - ఎవరినీ వదిలిపెట్టేదేలే అంటూ వార్నింగ్
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

KKR vs RR Match Highlights | లాస్ట్ ఓవర్ థ్రిల్లర్..KKR పై రాజస్థాన్ సూపర్ విక్టరీ | IPL 2024 | ABPCivils Ranker Sahana Interview | యూపీఎస్సీ ఫలితాల్లో కరీంనగర్ యువతి సత్తా | ABP DesamCivils Ranker Arpitha Khola Interview | IPS అవుతున్నారుగా.. ఏం మార్చగలరు..! | ABP DesamCivils Ranker Dheeraj Reddy Interview | ప్లాన్ 'B' నమ్ముకున్నా.. అందుకే సివిల్స్ సాధించా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024:  బట్లర్‌ వీరోచిత శతకం , చివరి బంతికి  రాజస్థాన్‌  గెలుపు
బట్లర్‌ వీరోచిత శతకం , చివరి బంతికి రాజస్థాన్‌ గెలుపు
ABP CVoter Opinion poll Telangana  : లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్  పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్ పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?
Raja Singh: శ్రీరామనవమి శోభాయాత్రకి పర్మిషన్ క్యాన్సిల్, కచ్చితంగా చేసి తీరతానన్న రాజా సింగ్
శ్రీరామనవమి శోభాయాత్రకి పర్మిషన్ క్యాన్సిల్, కచ్చితంగా చేసి తీరతానన్న రాజా సింగ్
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌‌ ఇంటికెళ్లిన మహారాష్ట్ర సీఎం - ఎవరినీ వదిలిపెట్టేదేలే అంటూ వార్నింగ్
సల్మాన్‌ ఖాన్‌‌ ఇంటికెళ్లిన మహారాష్ట్ర సీఎం - ఎవరినీ వదిలిపెట్టేదేలే అంటూ వార్నింగ్
CM Jagan: కార్లు మార్చినట్లు భార్యల్ని మార్చుతారు, నేనడిగితే తప్పా - పవన్‌పై జగన్ సంచలన వ్యాఖ్యలు
కార్లు మార్చినట్లు భార్యల్ని మార్చుతారు, నేనడిగితే తప్పా - పవన్‌పై జగన్ సంచలన వ్యాఖ్యలు
UPSC: సివిల్స్ ఫలితాల్లో పాల‌మూరు అమ్మాయికి మూడో ర్యాంకు, తెలుగు రాష్ట్రాల నుంచి 50 మందికి పైగా ఎంపిక
UPSC: సివిల్స్ ఫలితాల్లో పాల‌మూరు అమ్మాయికి మూడో ర్యాంకు, తెలుగు రాష్ట్రాల నుంచి 50 మందికి పైగా ఎంపిక
Nidhhi Agerwal: 'రాజా సాబ్' సెట్స్‌లో అడుగుపెట్టిన ఇస్మార్ట్ బ్యూటీ - షూటింగ్ ఎక్కడ జరుగుతుందో తెలుసా?
'రాజా సాబ్' సెట్స్‌లో అడుగుపెట్టిన ఇస్మార్ట్ బ్యూటీ - షూటింగ్ ఎక్కడ జరుగుతుందో తెలుసా?
Chhattisgarh Encounter: ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 18 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్, 18 మంది మావోయిస్టులు మృతి
Embed widget