అన్వేషించండి

Errabelli Dayakar Rao: అవార్డులతో పాటు డబ్బులు కూడా ఇవ్వండి - కేంద్రానికి మంత్రి ఎర్రబెల్లి రిక్వెస్ట్

Errabelli Dayakar Rao: అవార్డులతో పాటు రాష్ట్రానికి డబ్బులు కూడా ఇవ్వాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కేంద్రాన్ని కోరారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఏమీ తెలియదని ఎద్దేవా చేశారు.

Errabelli Dayakar Rao: కేంద్రం నుంచి వచ్చిన డబ్బులను తెలంగాణ ప్రభుత్వం మళ్లిస్తుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే ముందు వివరాలు తెలుసుకుని, అవగాహనతో మాట్లాడితే బాగుంటుందని సూచించారు. ఇక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కి అవగాహన లేదని ముక్కుకు, మూతికి తేడా తెలియదని ఎద్దేవా చేశారు. జనగామ జిల్లా కంటి వెలుగు రెండో దశ సన్నద్ధత కార్యక్రమంపై సమీక్ష నిర్వహించిన తర్వాత మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కేంద్రం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ 4 స్టార్ రేటింగ్ అవార్డుల్లో మొదటి మూడు తెలంగాణ రాష్ట్రానికి రావడం పట్ల అభినందనలు తెలిపారు. మొదటి మూడు స్థానాల్లో వచ్చిన రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల కలెక్టర్లు, పంచాయతీరాజ్ సిబ్బంది, ప్రజా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు.

రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చేయొద్దు..

3 స్టార్ రేటింగ్ అవార్డులలో మొదటి అవార్డు సిద్దిపేటకు, రెండవది జగిత్యాల జిల్లాకు రావడం విశేషం అన్నారు. 2 స్టార్ రేటింగ్ అవార్డులలో కూడా మొదటి స్థానం తెలంగాణకి రావడం ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుకు, పాలనాదక్షతకు నిదర్శనం అన్నారు. అవార్డులను ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం డబ్బులు కూడా ఇస్తే బాగుంటుంది అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం పైన కక్ష సాధింపు చేయవద్దని విజ్ఞప్తి చేశారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం పెట్టి కేంద్రం నిధులు మళ్లిస్తున్నారని చెప్పడం హాస్యాస్పదం అన్నారు. కేంద్రం నుంచి గ్రామీణ అభివృద్ధి, ఉపాధి హామీ అధికారులను హైదరాబాద్ కు తీసుకొస్తే హైదరాబాదులోని తమ శాఖ అధికారులను తీసుకొచ్చి మీరు ఇచ్చిన డబ్బులు మళ్లించామా లేదా అనే సమాధానం చెప్తామన్నారు. దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం ఇచ్చే నిధులకు సమానంగా గ్రామ పంచాయతీలకు నిధులు ఇస్తుందన్న విషయాన్ని గుర్తించాలన్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కల్లాల పేరు మీద 1100 కోట్ల రూపాయలను ఆపారని చెప్పారు. కల్లాలకు 150 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే... 1100 కోట్లు రూపాయలు ఎందుకు ఆపారని ప్రశ్నించారు. 

కల్లాలు కడుతున్నామని కేంద్రానికి లేఖ రాసినప్పుడే అనుమతి ఇవ్వకపోతే కట్టేవాళ్లం కాదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కట్టిన తర్వాత ఇప్పుడు వద్దు అనడం సమంజసం కాదన్నారు. కల్లాల కోసం ఖర్చు చేసిన 150 కోట్లు కేంద్రానికి కడతామని రాత పూర్వకంగా రాసిచ్చిన రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వడం లేదన్నారు. ఇది కేంద్రం పొరపాటు కాదా అని ప్రశ్నించారు. గ్రామ పంచాయతీలకు ఆరు నెలలుగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాక ఇబ్బందులు పడుతున్నాం అన్నారు. మేం చెప్పే దాంట్లో తప్పులు ఉంటే లెక్కలు తెప్పించుకొని అవగాహన చేసుకోవాలని సూచించారు. గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా బకాయి పడలేదన్నారు. కేంద్రం నుంచి సమయానికి నిధులు రాక ఇబ్బంది అవుతుందని తెలిపారు. కేంద్రం డబ్బులు ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు డబ్బులు వేస్తోందని.. కావాలంటే అధికారుల ద్వారా చెక్ చేసుకోవచ్చని చెప్పారు. 

బండి సంజయ్ కి అవగాహన లేకుండా మాట్లాడతారని మూతికి, ముక్కుకు తేడా తెలియదని అన్నారు. అందుకే ఆయనకు రిప్లై ఇవ్వాలనుకోవట్లేదని వివరించారు. బండిని గుండు అంటారని, గుండును బండి అంటారని.. ఆయనకేమీ తెలవదని ఎద్దేవా చేశారు. కానీ కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి దయచేసి అవగాహనతో మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రమే ఇన్ని అవార్డులు ఇచ్చారు. కానీ డబ్బులు ఇవ్వడం లేదన్నారు. గుజరాత్ కు ఏ అవార్డులు ఇవ్వకుండా డబ్బులు ఇస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించడం మానుకొని డబ్బులు వచ్చే విధంగా కనీస ప్రయత్నం చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరారు. ఈ సమావేశంలో మంత్రితోపాటు ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎడవల్లి కృష్ణారెడ్డి , జిల్లా కలెక్టర్ శివలింగయ్య తదితరులు ఉన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hinduja Group: ఆంధ్రప్రదేశ్‌లో హిందూజా గ్రూప్‌ రూ.20,000 కోట్ల పెట్టుబడి - లండన్‌లో చంద్రబాబు సమక్షంలో ఎంఓయూ
ఆంధ్రప్రదేశ్‌లో హిందూజా గ్రూప్‌ రూ.20,000 కోట్ల పెట్టుబడి - లండన్‌లో చంద్రబాబు సమక్షంలో ఎంఓయూ
Constable Suicide: తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ల వరుస ఆత్మహత్యలు - సంగారెడ్డిలో మరో కానిస్టేబుల్ బలవన్మరణం
తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ల వరుస ఆత్మహత్యలు - సంగారెడ్డిలో మరో కానిస్టేబుల్ బలవన్మరణం
Nara Lokesh: ఏపీ దశ మార్చనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ - ఎన్ని ఒప్పందాలు జరుగుతాయో ప్రకటించిన నారా లోకేష్
ఏపీ దశ మార్చనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ - ఎన్ని ఒప్పందాలు జరుగుతాయో ప్రకటించిన నారా లోకేష్
Accident Politics:   చేవెళ్ల బస్సు ప్రమాదంపై రాజకీయం - కారణం మీరంటే మీరని కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పర ఆరోపణలు!
చేవెళ్ల బస్సు ప్రమాదంపై రాజకీయం - కారణం మీరంటే మీరని కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పర ఆరోపణలు!
Advertisement

వీడియోలు

Kavitha Janambata Interview | ఆదిలాబాద్ జిల్లాలో కవిత జనం బాట వెనుక మతలబు ఇదేనా.? | ABP Desam
Smrithi Mandhana Jemimah Gesture | ఆడి వరల్డ్ కప్ సాధించారు..ప్రత్యర్థులను ఓదార్చి హృదయాలు గెలిచారు | ABP Desam
Tribute to Mithali Raj Jhulan Goswami | ప్రపంచకప్ గెలిచి మిథాలీ, ఝులన్ గోస్వామికి ట్రిబ్యూట్ | ABP Desam
India vs South Africa Final | Deepti Sharma | మ్యాచ్‌ని మలుపు తిప్పిన దీప్తి శర్మ
Women's ODI Final | Smriti Mandhana | చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hinduja Group: ఆంధ్రప్రదేశ్‌లో హిందూజా గ్రూప్‌ రూ.20,000 కోట్ల పెట్టుబడి - లండన్‌లో చంద్రబాబు సమక్షంలో ఎంఓయూ
ఆంధ్రప్రదేశ్‌లో హిందూజా గ్రూప్‌ రూ.20,000 కోట్ల పెట్టుబడి - లండన్‌లో చంద్రబాబు సమక్షంలో ఎంఓయూ
Constable Suicide: తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ల వరుస ఆత్మహత్యలు - సంగారెడ్డిలో మరో కానిస్టేబుల్ బలవన్మరణం
తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుళ్ల వరుస ఆత్మహత్యలు - సంగారెడ్డిలో మరో కానిస్టేబుల్ బలవన్మరణం
Nara Lokesh: ఏపీ దశ మార్చనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ - ఎన్ని ఒప్పందాలు జరుగుతాయో ప్రకటించిన నారా లోకేష్
ఏపీ దశ మార్చనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ - ఎన్ని ఒప్పందాలు జరుగుతాయో ప్రకటించిన నారా లోకేష్
Accident Politics:   చేవెళ్ల బస్సు ప్రమాదంపై రాజకీయం - కారణం మీరంటే మీరని కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పర ఆరోపణలు!
చేవెళ్ల బస్సు ప్రమాదంపై రాజకీయం - కారణం మీరంటే మీరని కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పర ఆరోపణలు!
Pawan Kalyan: ప్రముఖ ఆలయాల్లో కార్తీక మాసం రద్దీ తగ్గ ఏర్పాట్లు -భక్తుల భద్రత, సౌకర్యాల కల్పనపై పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
ప్రముఖ ఆలయాల్లో కార్తీక మాసం రద్దీ తగ్గ ఏర్పాట్లు -భక్తుల భద్రత, సౌకర్యాల కల్పనపై పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
Vidadala Rajani: ఉద్యోగాల పేరుతో రూ. రూ.5 కోట్లు మోసం - మాజీ మంత్రి విడదల రజని పీఏలు, అనుచరులపై ఆరోపణలు
ఉద్యోగాల పేరుతో రూ. రూ.5 కోట్లు మోసం - మాజీ మంత్రి విడదల రజని పీఏలు, అనుచరులపై ఆరోపణలు
ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో .. పత్తి రైతులతో కవిత
ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో .. పత్తి రైతులతో కవిత
Youngest Self Made Billionaires: ముగ్గురు స్నేహితులు ఏఐ కంపెనీ పెట్టి 20 ఏళ్లకే బిలియనీర్లు అయ్యారు - వారిలో ఇద్దరు ఇండియన్ కుర్రాళ్లు!
ముగ్గురు స్నేహితులు ఏఐ కంపెనీ పెట్టి 20 ఏళ్లకే బిలియనీర్లు అయ్యారు - వారిలో ఇద్దరు ఇండియన్ కుర్రాళ్లు!
Embed widget