అన్వేషించండి

Nizamabad News : బీజేపీ, టీఆర్ఎస్ నాటకాలకు త్వరలోనే తెర తొలగిపోతుంది - మహేష్ కుమార్ గౌడ్

టీఆర్ఎస్, బీజేపీ రెండు తోడుదొంగల పార్టీలే, తెలంగాణ సాయుధ పోరాటంలో ఆ పార్టీల పాత్రే లేదని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు.

తెలంగాణ సాయుధ పోరాటంలో భాగస్వామ్యం లేని బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు వారి రాజకీయ లబ్ది కోసం ప్రభుత్వ సంపదతో తెలంగాణకు స్వాతంత్ర్యం తామే తెచ్చినట్టు వజ్రోత్సవాలు చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్.  తెలంగాణ విలీన పోరాటంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ పాత్ర లేదని, నెహ్రూ నాయకత్వంలో కేబినెట్ లో తీసుకున్న నిర్ణయంతో సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ కు వచ్చి భారతదేశంలో విలీనం చేశారని అన్నారు. ఆఖరి నిజాం రాజు సెక్యులర్ తత్వంతో ఉన్నాడని, దక్షిణ భారతదేశానికి మొట్టమొదటిగా కరెంటు తెచ్చిన వ్యక్తి  అన్నారు. బీజేపీ  హిందూ ముస్లింల మధ్య చిచ్చుపెట్టి రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు. 8 సంవత్సరాలుగా బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు అధికారంలో ఉండి ఎందుకు ఇన్ని రోజులు తెలంగాణ స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించలేదని ప్రశ్నించారు. కేవలం ఎన్నికలు వస్తున్నాయనే కారణంతో ఇప్పుడు తెలంగాణ స్వాతంత్ర్య దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. 

చివరి నిజాం రాజు రాష్ట్రంలో ఐదు లక్షల ఎకరాల భూమిని ప్రభుత్వ అవసరాల కోసం ఉంచితే సీఎం కేసీఆర్ ఆ భూములను తన అనుచరులకు పంచిపెడుతున్నారని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. ఒక్కొక్క టీఆర్ఎస్ ఎమ్మెల్యే వజ్రోత్సవాల పేరుతో దాదాపు రూ. 35 లక్షలు ఖర్చు పెట్టారని, ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు.  అంబేడ్కర్ ఆశయాలను 75 సంవత్సరాలుగా ప్రజలలోకి తీసుకువెళ్లిన పార్టీ కాంగ్రెస్ అన్నారు. సెక్రటేరియట్ కు అంబేడ్కర్ పేరు పెట్టగానే దళితులకు మంచి చేసినట్టు కాదని, కేసీఆర్ దళితులకు మోసం చేశారని మండిపడ్డారు. దళితులను సీఎం చేస్తానని చేయలేదన్నారు.  మూడు ఎకరాల భూమి ఇస్తానని ఇవ్వలేదన్నారు. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం కట్టలేదని ఆరోపించారు. దళిత బంధుకు లక్షల్లో అప్లికేషన్లు వస్తే వేలల్లో కూడా ఇవ్వడం లేదన్నారు. దళితులపైన, గిరిజనులపై మైనారిటీలపై బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలకు ప్రేమలేదన్నారు. కేవలం ఎన్నికల కోసమే నటిస్తున్నారని దీనిని ప్రజలు గమనించాలని  అన్నారు.


"కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వ ఆస్తులను అదానీ, అంబానీలకు కట్టబెడుతున్నాడని, సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలను అని చెప్పి మోసం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రాజెక్టులన్నింటినీ తన అనుచరులకు ఇస్తున్నారు. భూములను అమ్మేస్తున్నారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటే. అమిత్ షాకు, కేసీఆర్ కు చీకటి ఒప్పందాలు ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఎనిమిది సంవత్సరాలుగా చెబుతున్న బీజేపీ నాయకులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. కాళేశ్వరం అవినీతిలో రాష్ట్ర బీజేపీ నాయకుల వాటా ఎంత?  కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ తో పొత్తు ఉంటుందని అబద్ధపు ప్రచారం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ స్వతంత్రంగానే పోటీ చేస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. రైతులకు నష్టం  జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదు.  బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అన్యాయం చేస్తుందని, ఆచరణలో సాధ్యం కాని వాగ్దానాలు ఇచ్చి కేసీఆర్ అధికారంలోకి వచ్చారు.  కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చి తప్పదని సోనియా గాంధీ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఇచ్చినట్టుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను నెరవేరుస్తుంది. బీజేపీ, టీఆర్ఎస్ నాటకాలకు త్వరలోనే తెర తొలగిపోతుంది.  ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 మంది శాసనసభ్యులు, ఇద్దరు ఎంపీలు ఉండి ఇప్పటివరకు జిల్లాలో ఒక్క ఫ్యాక్టరీని కూడా నిర్మించలేదు. కొత్త ప్రాజెక్టులు గాని, కాలేజీలు గాని కట్టలేదు. మాధవ్ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మించలేదు. టీఆర్ఎస్ పార్టీ జిల్లాలో చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఎటు చూసినా కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కనబడుతుంది" అని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. 

 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget