అన్వేషించండి

Rythu Bandhu: రైతుబంధు లబ్ధిదారులకు గుడ్ న్యూస్, నిధుల జమపై మంత్రి తుమ్మల ప్రకటన

Telangana News: రైతుబంధు నిధుల విడుదలపై క్లారిటీ వచ్చింది. పండుగ తర్వాత రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేయనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.

Thummala Nageswararao: రైతుబంధుపై మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. సంక్రాంతి (Sankranti 2024) పండుగ తర్వాత రైతుబంధు లబ్ధిదారులందరికీ అకౌంట్లలో నగదు జమ చేస్తామని ప్రటించారు. అర్హులందరికీ రైతుబంధు (Rythu Bandhu) అందుతుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. రైతుబంధుపై అపోహలు సృష్టించవద్దని సూచించారు. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొంతమంది రైతుల అకౌంట్లలో రైతుబంధు నిధులు జమ చేశారు. కానీ మరికొంతమంది అకౌంట్లలో ఇప్పటివరకు డబ్బులు పడలేదు. దీంతో నగదు జమవ్వని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో పండుగ తర్వాత లబ్ధిదారులందరికీ అకౌంట్లలో నగదు జమ అవుతుందని, దానికి సంబంధించిన ప్రక్రియ జరుగుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. 

రైతుబంధు నిధుల విడుదలపై మంత్రి క్లారిటీ 
బుధవారం ఖమ్మం జిల్లాలోని కూసుమంచిలో తుమ్మల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రైతుబంధు నిధుల విడుదలపై క్లారిటీ ఇచ్చారు. చాలామంది రైతుబంధు నిధుల విడుదల కోసం ఎదురుచూస్తున్నారని, వారందరికీ త్వరలోనే పడతాయని స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాలన్నీ ప్రజల్లోకి వెళుతున్నాయని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నో పథకాలు మాటల వరకే పరిమితం అయ్యేవని, కానీ రేవంత్ ప్రభుత్వంలో అందరికీ అందుతున్నాయని అన్నారు. ప్రజల కోసం రేవంత్ రెడ్డి బాగా కష్టపడుతున్నారని, ఆయన శ్రమ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. అర్హులకు మాత్రమే ప్రభుత్వ పథకాలు అందిస్తామన్నారు. తెలంగాణలో కబ్జాల ప్రభుత్వం పోవాలని ప్రజలు భావించారని, అందుకే కాంగ్రెస్ పార్టీని ఆదరించారని తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.

తనకు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి పాలేరు, ఖమ్మం ఒకటేనని, ఖమ్మం జిల్లా ప్రజలందరికీ రుణపడి ఉంటామని తుమ్మల తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులం ఉన్నామని, జిల్లా అభివృద్ది కోసం కృషి చేస్తామని అన్నారు. పాలేరుకు సీతారామ ప్రాజెక్టు జలాలు వచ్చేలా చూస్తామన్నారు. 

27 లక్షల మందికి రైతు బంధు జమ.. 
కాగా 40 శాతం మంది లబ్ధిదారులకు ఇప్పటివరకు రైతుబంధు నిధులు విడుదల చేశారు. దాదాపు 27 లక్షల మంది రైతుల అకౌంట్లలో ఇటీవల జమ చేశారు. మిగిలినవారికి నిధులు విడుదలపై ఇటీవల ఆర్థిక, వ్యవసాయ శాఖ అధికారులతో తుమ్మల సమీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా రైతుల పంటల సాగు జోరందుకుందని, వీలైనంత త్వరగా డబ్బులు విడుదల చేయాలని ఆదేశించారు. ప్రతిరోజు నిధులు విడుదల అయ్యేలా చూడాలని సూచించారు. రైతులకు సకాలంలో రైతుబంధు నిధులు విడుదల చేయాలన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగాలేకపోయినా సకాలంలో రైతుబంధు నిధులు విడుదల చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

అయితే ఆరు గ్యారెంటీల్లో భాగంగా తాము అధికారంలోకి వస్తే రైతుబంధు రూ.15 వేలు ఇస్తామని కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. కానీ ఈ సీజన్‌కు పాత విధానాన్నే అమలు చేయాలని సీఎం రేవంత్ నిర్ణయించారు. వచ్చే సీజన్ నుంచి రూ.15 వేలు జమ చేయనున్నారు. రైతుబంధు పథకాన్ని రైతు భరోసా పథకంగా మార్చారు. వచ్చే సీజన్ నుంచి విధి విధానాల్లో పలు మార్పులు తీసుకురానున్నారు. త్వరలోనే విధి విధానాలపై క్లారిటీ రానుంది.

టాప్ హెడ్ లైన్స్

Malkajgiri Police: రాత్రి పూట ఇడ్లీబండి పెట్టాడని జైలు - మల్కాజిగిరి పోలీసుల ఘనకార్యం - నెటిజన్లు సన్మానించేస్తున్నారు!
రాత్రి పూట ఇడ్లీబండి పెట్టాడని జైలు - మల్కాజిగిరి పోలీసుల ఘనకార్యం - నెటిజన్లు సన్మానించేస్తున్నారు!
Breaking News:నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
KTR ACB Court: నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR ACB Court: నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
CCS Meeting News: ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
Tamilnadu Politics: డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Venky Atluri: దీపికా పదుకోన్‌కు వెంకీ అట్లూరి కౌంటర్... స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా చెక్ పెట్టాడుగా
దీపికా పదుకోన్‌కు వెంకీ అట్లూరి కౌంటర్... స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా చెక్ పెట్టాడుగా
Supreme Court Big Relief Telangana: తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
Warangal Viral News: వరంగల్, ఖమ్మం జాతీయ రహదారి పై బోల్తా పడ్డ ఆపిల్ పండ్ల వ్యాన్- సంచులతో ఎగబడ్డ జనం!
వరంగల్, ఖమ్మం జాతీయ రహదారి పై బోల్తా పడ్డ ఆపిల్ పండ్ల వ్యాన్- సంచులతో ఎగబడ్డ జనం!
Embed widget