అన్వేషించండి

Rythu Bandhu: రైతుబంధు లబ్ధిదారులకు గుడ్ న్యూస్, నిధుల జమపై మంత్రి తుమ్మల ప్రకటన

Telangana News: రైతుబంధు నిధుల విడుదలపై క్లారిటీ వచ్చింది. పండుగ తర్వాత రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేయనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.

Thummala Nageswararao: రైతుబంధుపై మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. సంక్రాంతి (Sankranti 2024) పండుగ తర్వాత రైతుబంధు లబ్ధిదారులందరికీ అకౌంట్లలో నగదు జమ చేస్తామని ప్రటించారు. అర్హులందరికీ రైతుబంధు (Rythu Bandhu) అందుతుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. రైతుబంధుపై అపోహలు సృష్టించవద్దని సూచించారు. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొంతమంది రైతుల అకౌంట్లలో రైతుబంధు నిధులు జమ చేశారు. కానీ మరికొంతమంది అకౌంట్లలో ఇప్పటివరకు డబ్బులు పడలేదు. దీంతో నగదు జమవ్వని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో పండుగ తర్వాత లబ్ధిదారులందరికీ అకౌంట్లలో నగదు జమ అవుతుందని, దానికి సంబంధించిన ప్రక్రియ జరుగుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. 

రైతుబంధు నిధుల విడుదలపై మంత్రి క్లారిటీ 
బుధవారం ఖమ్మం జిల్లాలోని కూసుమంచిలో తుమ్మల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రైతుబంధు నిధుల విడుదలపై క్లారిటీ ఇచ్చారు. చాలామంది రైతుబంధు నిధుల విడుదల కోసం ఎదురుచూస్తున్నారని, వారందరికీ త్వరలోనే పడతాయని స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాలన్నీ ప్రజల్లోకి వెళుతున్నాయని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నో పథకాలు మాటల వరకే పరిమితం అయ్యేవని, కానీ రేవంత్ ప్రభుత్వంలో అందరికీ అందుతున్నాయని అన్నారు. ప్రజల కోసం రేవంత్ రెడ్డి బాగా కష్టపడుతున్నారని, ఆయన శ్రమ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. అర్హులకు మాత్రమే ప్రభుత్వ పథకాలు అందిస్తామన్నారు. తెలంగాణలో కబ్జాల ప్రభుత్వం పోవాలని ప్రజలు భావించారని, అందుకే కాంగ్రెస్ పార్టీని ఆదరించారని తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.

తనకు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి పాలేరు, ఖమ్మం ఒకటేనని, ఖమ్మం జిల్లా ప్రజలందరికీ రుణపడి ఉంటామని తుమ్మల తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులం ఉన్నామని, జిల్లా అభివృద్ది కోసం కృషి చేస్తామని అన్నారు. పాలేరుకు సీతారామ ప్రాజెక్టు జలాలు వచ్చేలా చూస్తామన్నారు. 

27 లక్షల మందికి రైతు బంధు జమ.. 
కాగా 40 శాతం మంది లబ్ధిదారులకు ఇప్పటివరకు రైతుబంధు నిధులు విడుదల చేశారు. దాదాపు 27 లక్షల మంది రైతుల అకౌంట్లలో ఇటీవల జమ చేశారు. మిగిలినవారికి నిధులు విడుదలపై ఇటీవల ఆర్థిక, వ్యవసాయ శాఖ అధికారులతో తుమ్మల సమీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా రైతుల పంటల సాగు జోరందుకుందని, వీలైనంత త్వరగా డబ్బులు విడుదల చేయాలని ఆదేశించారు. ప్రతిరోజు నిధులు విడుదల అయ్యేలా చూడాలని సూచించారు. రైతులకు సకాలంలో రైతుబంధు నిధులు విడుదల చేయాలన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగాలేకపోయినా సకాలంలో రైతుబంధు నిధులు విడుదల చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

అయితే ఆరు గ్యారెంటీల్లో భాగంగా తాము అధికారంలోకి వస్తే రైతుబంధు రూ.15 వేలు ఇస్తామని కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. కానీ ఈ సీజన్‌కు పాత విధానాన్నే అమలు చేయాలని సీఎం రేవంత్ నిర్ణయించారు. వచ్చే సీజన్ నుంచి రూ.15 వేలు జమ చేయనున్నారు. రైతుబంధు పథకాన్ని రైతు భరోసా పథకంగా మార్చారు. వచ్చే సీజన్ నుంచి విధి విధానాల్లో పలు మార్పులు తీసుకురానున్నారు. త్వరలోనే విధి విధానాలపై క్లారిటీ రానుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

LK Advani: అస్వస్థతతో అపోలోలో చేరిన బీజేపీ సీనియర్ నేత అద్వానీ
అస్వస్థతతో అపోలోలో చేరిన బీజేపీ సీనియర్ నేత అద్వానీ
APPSC Chairman: ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతం సవాంగ్ రాజీనామా, వెంటనే ఆమోదించిన రాష్ట్ర గవర్నర్!
ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతం సవాంగ్ రాజీనామా, వెంటనే ఆమోదించిన రాష్ట్ర గవర్నర్!
Prabhas: ఒక్క పూట ఫుడ్ కోసం ప్రభాస్ అంత ఖర్చు పెడతాడా?
ఒక్క పూట ఫుడ్ కోసం ప్రభాస్ అంత ఖర్చు పెడతాడా?
35 Chinna Katha Kaadu: ఇంతకి తొమ్మిది కంటే పది పెద్దది ఎలా అయ్యింది! - ఆసక్తి పెంచుతున్న '35- చిన్న క‌థ కాదు' టీజర్‌
ఇంతకి తొమ్మిది కంటే పది పెద్దది ఎలా అయ్యింది! - ఆసక్తి పెంచుతున్న '35- చిన్న క‌థ కాదు' టీజర్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rahul Drvaid Recalls Rohit Sharma Phone Call in November | ద్రావిడ్ కు ఫోన్ చేసి రోహిత్ ఏం చెప్పారు?T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
LK Advani: అస్వస్థతతో అపోలోలో చేరిన బీజేపీ సీనియర్ నేత అద్వానీ
అస్వస్థతతో అపోలోలో చేరిన బీజేపీ సీనియర్ నేత అద్వానీ
APPSC Chairman: ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతం సవాంగ్ రాజీనామా, వెంటనే ఆమోదించిన రాష్ట్ర గవర్నర్!
ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతం సవాంగ్ రాజీనామా, వెంటనే ఆమోదించిన రాష్ట్ర గవర్నర్!
Prabhas: ఒక్క పూట ఫుడ్ కోసం ప్రభాస్ అంత ఖర్చు పెడతాడా?
ఒక్క పూట ఫుడ్ కోసం ప్రభాస్ అంత ఖర్చు పెడతాడా?
35 Chinna Katha Kaadu: ఇంతకి తొమ్మిది కంటే పది పెద్దది ఎలా అయ్యింది! - ఆసక్తి పెంచుతున్న '35- చిన్న క‌థ కాదు' టీజర్‌
ఇంతకి తొమ్మిది కంటే పది పెద్దది ఎలా అయ్యింది! - ఆసక్తి పెంచుతున్న '35- చిన్న క‌థ కాదు' టీజర్‌
Chandrababu: ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు - రేపు ప్రధాని మోదీ, ఇతర కేంద్ర మంత్రులతో భేటీ!
ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు - రేపు ప్రధాని మోదీ, ఇతర కేంద్ర మంత్రులతో భేటీ!
Hemant Soren: మళ్లీ ఝార్ఖండ్‌ సీఎంగా హేమంత్ సోరెన్‌, రాజీనామా చేయనున్న చంపై సోరెన్
మళ్లీ ఝార్ఖండ్‌ సీఎంగా హేమంత్ సోరెన్‌, రాజీనామా చేయనున్న చంపై సోరెన్
Pawan Kalyan: నా స్థలంలో బైక్ రేస్‌లు చేస్కోండి, ఇలా మాత్రం చేయొద్దు - పవన్ కల్యాణ్ సరదా వ్యాఖ్యలు
నా స్థలంలో బైక్ రేస్‌లు చేస్కోండి, ఇలా మాత్రం చేయొద్దు - పవన్ కల్యాణ్ సరదా వ్యాఖ్యలు
White Paper on Amaravati :  ఇన్వెస్టర్లలో నమ్మకం పెంచుతాం - వెంటనే అమరావతి పనులు - శ్వేతపత్రం ప్రకటించిన చంద్రబాబు
ఇన్వెస్టర్లలో నమ్మకం పెంచుతాం - వెంటనే అమరావతి పనులు - శ్వేతపత్రం ప్రకటించిన చంద్రబాబు
Embed widget