అన్వేషించండి

Jagtial Politics: జగిత్యాల ఎమ్మెల్యే పద్మవ్యూహంలో చిక్కుకున్నారా ? కేడర్‌ను తనవైపు తిప్పుకోవడం సాధ్యమేనా!

Telangana News | జగిత్యాల జిల్లాలో సంజయ్ కుమార్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరాక పాలిటిక్స్ మారిపోయాయి. జగిత్యాల ఎమ్మెల్యే అయితే పద్మవ్యూహాన్ని ఛేదించారని సన్నిహితులు చెబుతున్నారు.

Jagtial MLA Sanjay Kumar | జగిత్యాల జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారుతుంది. లోకల్ పాలిటిక్స్ ట్విస్ట్ హీట్ పెంచుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ (BRS Party)లో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ శ్రేణులను మచ్చిగ చేసుకునే పనిలో పడ్డారు. అటు బీఆర్ఎస్ కేడర్ తనకు దూరమవ్వకుండా జాగ్రత్త పడేందుకు ప్రయత్నిస్తున్నారు. వరుసగా రెండుసార్లు గెలిచిన ఎమ్మెల్యే కాంగ్రెస్‌లో చేరడం గులాబీ దళానికి షాక్ ఇస్తే ఆయన రాకను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ వర్గీయులు చేస్తున్న హడావుడితో కాక పుట్టిస్తుంది. ఈ పరిస్థితుల్లో అందరూ సంజయ్ పద్మ వ్యూహంలో చిక్కుకున్నాడని అనుకున్నారు. అయితే ఎవరు ఊహించని విధంగా తనదైన శైలిలో సంజయ్ చేస్తున్న రాజకీయ చాణిక్యం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.

కాంగ్రెస్ పార్టీ చేసిన ఆపరేషన్ ఆకర్ష్ (Operation Akarsh of Congress) తో హస్తం గూటికి చేరిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ రాజకీయ భవిష్యత్ ఆసక్తికరంగా మారింది. జగిత్యాల నియోజకవర్గం అభివృద్ధి కోసం అధికార పార్టీలో చేరిన సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ స్థానిక లీడర్లు వ్యతిరేకించడంతో ఆ పార్టీలో సంజయ్ కొనసాగడం అంత ఈజీ కాదు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా గత రెండు ఎన్నికల్లో డాక్టర్ సంజయ్‌ను ఢీకొట్టి ఓడిపోయిన కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి రాజీనామా హెచ్చరిక కాంగ్రెస్ లో కాక పుట్టించింది. పార్టీ బుజ్జగింపులతో మెత్తబడ్డ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి కాంగ్రెస్ లో పెద్దపీట వేయనన్నారని, కేంద్రం పెద్దలు సైతం అందుకు మద్దతుగా నిలిచారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గాన్ని గందరగోళానికి గురిచేసింది. నియోజకవర్గ అభివృద్ధి కోణంలో పార్టీ మారిన మళ్లీ జీవన్ రెడ్డి డామినేషన్ చేసే స్థితిలో ఉంటే తమ నాయకుడి ప్రభావం తగ్గింపు అయ్యే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు సంజయ్ వర్గీయులు.

రెండుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన సంజయ్ కుమార్ 
ఇదే సమయంలో బీఆర్ఎస్ లో వీడిన ఎమ్మెల్యేపై ఆ పార్టీ నాయకులతోపాటు ఆ పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సంజయ్ కుమార్ ను కష్టపడి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఇప్పుడు ప్లేటు ఫిరాయించడాన్ని గులాబీ క్యాడర్ జీర్ణించుకోలేక పోతోంది. పైగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (BRS MLC Kavitha) కోసం తన ఎమ్మెల్యే పదవిని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ గతంలో ప్రకటించిన సంజయ్ ఇంత సడెన్‌గా పార్టీ మారడాన్ని బీఆర్ఎస్ పార్టీ ఊహించలేదు. కానీ ఎమ్మెల్యే ఆకస్మిక నిర్ణయంతో బరిలోకి దిగిన బీఆర్ఎస్  హై కమాండ్ ఎమ్మెల్యే వెంట కార్యకర్తలు వెళ్లకుండా ప్రయత్నాలు చేశారు. గమనించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తన మార్క్ పాలిటిక్స్ తో జగిత్యాలలో ఎంట్రీ ఇవ్వడం మొత్తం హైలెట్ గా మారింది. ఎమ్మెల్యే రాకను వ్యతిరేకించిన కాంగ్రెస్ క్యాడర్ను పార్టీ వీడిన సంజయ్ను ఆగ్రహంతో  ఉన్న గులాబీ దళాన్ని చాకచక్యంగా తన దారిలోకి తెచ్చుకున్నారు సంజయ్.

బండి సంజయ్‌కు అపూర్వ స్వాగతం 
పార్టీ మారిన తరువాత మొదటిసారిగా జగిత్యాలలో అడుగుపెట్టిన సంజయ్ కుమార్ కు ఎవరు ఊహించని విధంగా అపూర్వ స్వాగతం లభించింది. రెండు పార్టీల నుంచి భారీగా చేరుకున్న కార్యకర్తలు ఎమ్మెల్యేకు రెడ్ కార్పెట్ స్వాగతం పలకడం జగిత్యాల జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. వారం రోజుల కిందట పార్టీ మారిన సంజయ్ రెండు పార్టీల క్యాడర్ను ఆకర్షించి తన దారికి తెచ్చుకోవడంలో సక్సెస్ అయినట్లే అనుకోవచ్చు. సంజయ్ కుమార్ పార్టీని వీడడంతో కార్యకర్తలకు భరోసా ఇచ్చేందుకు జగిత్యాలను పర్యటించారు బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్. 
ఎమ్మెల్యే వెళ్లినా నష్టం లేదని పార్టీ క్యాడర్‌ను ఎమ్మెల్యే టచ్ చేయలేరని కేటీఆర్ వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే కేటీఆర్ మీటింగ్ కు కేవలం ఇద్దరే బీఆర్ఎస్ కౌన్సిలర్లు హాజరు కావడం మిగిలిన 20 మందికి పైగా కౌన్సిలర్లు జగిత్యాలలో అడుగుపెట్టిన డాక్టర్ సంజయ్ కి స్వాగతం పలకడం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. అంతేకాకుండా మాజీ సర్పంచులు ప్రజా ప్రతినిధులు పార్టీలను పక్కనపెట్టి సంజయ్ పక్కన చేరడంతో టిఆర్ఎస్ వర్గాలు షాక్ తిన్నాయి. అదే సమయంలో కాంగ్రెస్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వైఖరితో ఎమ్మెల్యే సంజయ్ను జగిత్యాలలో ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే ఉత్కంఠ విడిపోయింది. 

ఆ పార్టీ క్యాడర్ సైతం భారీ సంఖ్యలో తరలిరావడం రాజకీయంగా హాట్ టాపిక్ అయింది. మొత్తానికి ఇటు జీవన్ రెడ్డి అటు బీఆర్ఎస్ అధినాయకత్వం ఉక్కిరిబిక్కిరి చేయాలని చూడడంతో పద్మ వ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడిలా ఎమ్మెల్యే ఇబ్బందులు పడతారని అంతా అనుకున్నారు. కానీ ఎమ్మెల్యే సంజయ్ చాకచక్యం ముఖ్యంగా పరిస్థితులను సమన్వయం చేసుకొని పద్మ వ్యూహాన్ని ఛేదించారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. ఇక జగిత్యాల కాంగ్రెస్ వ్యూహాలు ఎలా ఉంటాయో అన్నది ఆసక్తికరంగా మారింది. 

టాప్ హెడ్ లైన్స్

Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
Breaking News:ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది--కళ్లు నెత్తికెక్కే ఓడిపోయాం- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది--కళ్లు నెత్తికెక్కే ఓడిపోయాం- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Kaleshwaram Project: కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం
కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం
Telangana Latest News: 9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 
9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Embed widget